venkateswara swamy temple
-
కరీంనగర్ : కనుల పండువగా శ్రీవారి శోభాయాత్ర (ఫొటోలు)
-
విద్యుత్ కాంతులతో కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం (ఫొటోలు)
-
తిరుపతి తొక్కిసలాట : హృదయ విదారక దృశ్యాలు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలులో ఆకట్టుకుంటున్న ప్రదర్శన శాల (ఫొటోలు)
-
కాకినాడలో మాజీ MLA ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పూజలు
-
నిలువెత్తు నిదర్శనం
పూనా పట్టణం నుంచి ఓ పత్రికా విలేఖరి స్వామిని చూడాలని తిరుమల కొండకు బయలుదేరాడు. స్వామి వారి దర్శన సమయానికి వైకుంఠం వద్దకు చేరాడు. అక్కడి శ్రీవారి సేవకులు దర్శన టికెట్ చూసి ‘క్యూ’ లోకి పంపుతున్నారు. విలేఖరి ముందు ఓ ఆరు పదులు పైబడిన వృద్ధురాలు నిలబడి ఉంది. ఆమెకు తోడుగా పన్నెండేళ్ళ మనవడు కూడా వచ్చి ఉన్నాడు. ఆమె తన సంచిలోని టికెట్ చూపడానికి చాలా అవస్థలు పడుతూ ఉంది. పత్రికా విలేఖరి ఆమెకు సహాయం చేశాడు. ముగ్గురూ క్యూలోకి ప్రవేశించారు. ఆ రిటైర్డ్ టీచర్ కి మోకాలి నొప్పులు ఎక్కువగా ఉండటంతో కష్టంగా నడుస్తోంది. మాటల్లో ఆమె రిటైర్డ్ టీచర్ అని, వారిది తమిళనాడు ఈరోడ్ అని తెలిసింది.‘‘నడవటానికి ఇంత కష్ట పడుతున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా?’’ అని అడిగాడు విలేఖరి. ‘‘మోకాలి చిప్పలు బాగా అరిగి పోయాయి. రెండు కాళ్ళకూ ఆపరేషన్ అవసరమన్నారు డాక్టర్లు. ఇంటి వ్యవహారాల వల్ల కుదరక ఆపరేషన్ చేయించుకోలేదు’’ అని చెప్పింది. కొద్దిదూరం నడిచాక, సెక్యూరిటీ వారు చెకింగ్ చేయసాగారు. అక్కడ ఆమె చక్కగా నిలబడలేక తూలి పడబోయింది. పక్కనే ఉన్న మనవడు ఆమెను కింద పడనీయకుండా పట్టుకున్నాడు. అందర్నీ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లో కూర్చోమన్నారు. మంచి గాలి, వెలుతురు వచ్చే ప్రదేశం చూసి కూర్చున్నాడు విలేఖరి. కుంటుకుంటూ వస్తున్న రిటైర్డ్ టీచర్ కి, ఆమె మనవడికి కూడా స్థలం పెట్టి పెట్టాడు. అభిమానంగా కూర్చోమని స్థలం చూపాడు. ఆమె కూర్చోలేదు. మనవడు మాత్రం కూర్చున్నాడు.‘‘కొద్దిసేపు కూర్చుంటే అలసట తగ్గుతుంది, మీ మోకాలి నొప్పులు కూడా తగ్గుతాయి’’ అని చె΄్పాడు. ‘‘ఫర్లేదు!’’ అని చెప్పి నిలబడే ఉంది. గంట గడిచింది. కంపార్ట్ మెంట్ గేటు తీయలేదు. మరో గంట గడిచింది. అప్పుడు తీశారు. జనం పోలో’మని పరుగులు తీశారు. ఆ రెండు గంటలూ మోకాలి నొప్పులకి ఆమె బాధ పడుతూనే నిలబడి ఉంది. చిన్నగా మోకాళ్ళను అప్పుడప్పుడూ అదుముకుంటూ నడుస్తోంది.ఆమె తను చెప్పినట్లు కూర్చోక పోవడం విలేఖరికి నచ్చలేదు. ‘రెండు గంటలు నిలబడుకోవాల్సిన అవసరం ఏముంది. కూర్చుని ఉండవచ్చు కదా!’ అనుకున్నాడు. వాళ్ళకి దూరంగా జరిగి జనంతో పాటు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎందుకో మనస్కరించలేదు. వారితో పాటే నడవసాగాడు. తిరుమల నంబి ఆలయం వద్ద ఉండే మూవింగ్ బ్రిడ్జి దగ్గరికి వచ్చింది క్యూ లైను. తట్టుకోలేని నొప్పితో బాధ పడుతోంది ఆ రిటైర్డ్ టీచర్. ధైర్యం చెబుతున్నాడు మనవడు. అక్కడ కొద్దిసేపు కూర్చునే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఆమె కూర్చోలేదు. అలా ఇబ్బందిగా నడుస్తూనే మహా ద్వారం దాటి, ధ్వజ స్తంభానికి నమస్కరించి బంగారు వాకిలి గుండా లోపలికి ప్రవేశించి దర్శనం చేసుకున్నారు.ఉచిత లడ్డూ ప్రసాదం తీసుకుని గుడి బయటికి వచ్చాక పుష్కరిణి వద్ద కూర్చుని అవ్వా మనవడు లడ్డు తింటూ ఉన్నారు. వారితో పాటు ఉన్న విలేఖరి ‘‘వైకుంఠం నుంచి, దర్శనం పూర్తయ్యేంతవరకు మీరు ఎందుకుకూర్చోలేదు?’’ అని అడిగాడు ఆమె గుడివైపు తిరిగి చేతులెత్తి నమస్కరిస్తూ ‘‘పెరుమాళ్ళు వేంకటేశ్వర స్వామి కొన్ని వేల సంవత్సరాలుగా అలా గర్భగుడిలో మన కోసం నిలబడే ఉన్నాడు. స్వామి వారి దర్శనం కోసం వచ్చినప్పుడు మనం కూర్చోవడం భావ్యం కాదు కదా’’ అని సమాధానమిచ్చింది. ఆమెకు స్వామి వారి పట్ల ఉన్న భక్తి, గౌరవం, నమ్మకానికి విలేఖరి కళ్ళు తడి అయ్యాయి. ‘స్వామీ... ఎన్ని బాధలో మనిషికి. లిప్తకాలం నిన్ను చూస్తే... ఎంత ఉపశమనమో కదా’ అనుకుంటూ అక్కడినుంచి కదిలాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
పిట్స్ బర్గ్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో వైభవంగా శ్రీ లక్ష్మీ నారాయణ హోమం
-
మారిషస్ : 108 అడుగుల వేంకటేశ్వర స్వామి విగ్రహం (ఫొటోలు)
-
శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు అందుబాటులో ఆర్జిత సేవ
-
శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
తిరుపతి: తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్లలో భక్తలు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న 83,825 మంది భక్తులు వెంకన్నను దర్శించుకోగా.. 25,690 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.57 కోట్లుగా లెక్క లేలిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. -
పిట్స్ బర్గ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
-
సిద్దిపేటలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
-
నేడు కోనాయిపల్లికి కేసీఆర్
సాక్షి, సిద్దిపేట/నంగునూరు: ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఈ ఆలయం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు సెంటిమెంట్. ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నాకే మొదలుపెడతారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్రావు ఇద్దరూ తమ నామినేషన్ పత్రాలతో శనివారం ఈ ఆలయానికి వస్తున్నారు. వేంకటేశ్వరస్వామి వద్ద ఆ పత్రాలను ఉంచి పూజలు చేశాక వాటిపై సంతకాలు చేయనున్నారు. వారు ఈ నెల 9న ఆలయానికి రానున్నట్టు ప్రకటించినా ముందుగానే వస్తున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్లో చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శుక్రవారంతో ముగిసింది. దీంతో ముందుగానే కోనాయిపల్లి వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నెల 9న కేసీఆర్ తన నామినేషన్లను దాఖలు చేయనున్నారు. వెంకన్న ఆశీస్సులతోనే ఉద్యమంలోకి.. 2001లో డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ టీడీపీతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగారు. ఆ సమయంలోనూ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడేదాకా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచీ ప్రారంభించారు. 1985 నుంచీ సంప్రదాయంగా.. కేసీఆర్ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆ ఎన్నికల్లో గెలవడంతో కోనాయిపల్లి ఆల యం ఆయనకు సెంటిమెంట్గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ వేస్తూ వచ్చారు. మంత్రి టి.హరీశ్రావు నామినేషన్కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశాకే నామినేషన్ వేస్తున్నారు. -
కమనీయంగా శ్రీ వెంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు
-
బ్రహ్మోత్సవాల్లో పుష్పాలంకరణ మరింత ప్రత్యేకం
-
శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక నిజాలు..!
-
వాడపల్లి వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి
-
ఋషికొండపై వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
నామాలగుండు వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
-
ఆధ్యాత్మిక కేంద్రంగా కాకినాడ.. సీఎం జగన్ కీలక నిర్ణయం
-
Kushaiguda: గుడిలో చోరీకి యత్నించి ప్రాణాలు కోల్పోయిన దొంగ
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గుడిలో చోరీకి యత్నించిన దొంగపై వాచ్మెన్ దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రంగయ్య (60) అనే వ్యక్తి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఓ యువకుడు చోరీ కోసం గుడిలోకి ప్రవేశించాడు. ఆలయంలోకి వచ్చిన దుండగుడు గర్భగుడిలోని హుండీ దగ్గరకు వెళ్లి దానిని పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన రంగయ్య వెంటనే అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతను వాచ్మెన్పై రాళ్లతో దాడికి దిగాడు. దొంగను అడ్డుకునేందుకు వాచ్మెన్ కూడా దగ్గర ఉన్న కర్రతో బలంగా కొట్టాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో దొంగ తలకు బలంగా దెబ్బ తగలడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించాడు. ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు, పోలీసులు మృతదేహం చూసి భయాందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటహుటిన ఆలయానికి చేరుకున్న పోలీసులు మృతుడిని పరిశీలించగా.. అతని ఫోన్ దొరికింది. ఫోన్లోని ఆధారాలను బట్టి దొంగతనానికి వచ్చిన యువకుడు గండం రాజు (23)గా గుర్తించారు. రాజు స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లిగా తెలిపారు. పోలీసులు యువకుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. -
కాళ్లకూరులో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులు
కాళ్ల(పశ్చిమగోదావరి): కాళ్లకూరులో వేంచేసియున్న స్వయంభూః శ్రీ వేంకటేశ్వరస్వామిని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణరాజు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చదవండి: శింబు మంచి నటుడు.. కానీ..: డైరెక్టర్ ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ గురుపౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఎంతో మహిమగల కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వరస్వామిని ఏటా దర్శించుకునేందుకు వస్తుంటానన్నారు. అనంతరం త్రివిక్రమ్ దంపతులను ఘనంగా సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. -
కృష్ణా తీరంలో కొలువైన తిరుమలేశుడు.. (ఫోటోలు)
-
కృష్ణా తీరంలో తిరుమలేశుడు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, అమరావతి/తాడికొండ: కృష్ణాతీరంలో తిరుమలేశుడు కొలువయ్యాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేశస్థానం నిర్మించిన ఆలయంలో భక్తులకు శ్రీవేంకటేశుడు దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయంలో గురువారం ఉదయం మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ట, మహాసంప్రోక్షణ జరిగింది. ఉదయం 7.50 నుంచి 8.10 గంటల నడుమ టీటీడీ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. అంతకు ముందు ఉదయం 4.30 నుంచి 6.30 గంటల వరకు పుణ్యాహవచనం, కుంభారాధన, నివేదన, హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 6.30 నుంచి 7.15 గంటల వరకు విమాన గోపుర కలశ ఆవాహన చేశారు. అనంతరం ఆగమోక్తంగా ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం బ్రహ్మఘోష, వేదశాత్తుమొర జరిగాయి. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహించారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 25 ఎకరాల స్థలంలో టీటీడీ రూ.31 కోట్లతో ఈ ఆలయం నిర్మించింది. ఆలయం శిల్పకళ అద్భుతం : స్వరూపానందేంద్ర సరస్వతి ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరిక మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలో వేంకటేశ్వరస్వామి వారి ఆలయం నిర్మించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణంతో రాజధాని అమరావతిలో మరింతగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని అన్నారు. వైఖానస ఆగమానుసారం అద్భుతమైన శిల్ప కళతో ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఆలయంలో మూలమూర్తి సాక్షాత్తు తిరుమల వెంకన్నే వచ్చాడా అన్నట్లుగా ఉందని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం ప్రత్యేకంగా ఉన్నదని చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలని ప్రార్థించినట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రాంతాల్లో 1,300 ఆలయాలు : వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇటీవల విశాఖ, ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో శ్రీవారి ఆలయాలు ప్రారంభించినట్లు చెప్పారు. జమ్మూలో 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో 500 ఆలయాలు పూర్తి చేసినట్లు చెప్పారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మత్స్యకార, బడుగు బలహీనవర్గాల ప్రాంతాలలో రాబోయే రెండేళ్లలో 1,300 ఆలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అమరావతిలోనే స్వామి వారి దర్శనం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మనందరినీ ఆశీర్వదించడానికి స్వామివారు తిరుమల నుండి ఇక్కడికి వచ్చారన్నారు. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వెళ్లే భక్తులకు అమరావతిలోనే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. స్వామి వారి అనుగ్రహంతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, ఎంపీ నందిగం సురేష్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్లాల్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ హెనీ క్రిస్టినా, బోర్డు సభ్యులు బుర్రా మధుసూదన్యాదవ్, మల్లాడి కృష్ణారావు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి శాలువతో సన్మానించి, స్వామివారి చిత్రపటం అందజేశారు. ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా వైదిక క్రతువుల్లో పాల్గొన్న అర్చకులు, వేద పారాయణదారులను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి దంపతులు సన్మానించారు. సాయంత్రం కార్యక్రమాలు.. ఆలయంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, అనంతరం 5.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగాయి. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ నిర్వహించారు. చదవండి: (చిన్నవయసులోనే గుండెపోట్లు.. కారణాలేంటి..? జాగ్రత్తలేంటి..?) -
వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి సీఎం జగన్కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం కలిశారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రారంభోత్సవానికి సీఎంను ఆహ్వానించారు. ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రికి టీటీడీ ఛైర్మన్ అందజేశారు. చదవండి: సీఎం జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న విక్రమ్రెడ్డి ఈ సందర్భంగా సీఎంకు స్వామివారి ప్రసాదాలు అందజేసిన టీటీడీ వేద పండితులు.. వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ వెంట జేఈవో వి.వీరబ్రహ్మం, సీఎస్వో నరసింహ కిశోర్, చీఫ్ ఇంజనీర్ డి.నాగేశ్వరరావు ఉన్నారు. ఈ నెల 4 నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
వైకుంఠ ఏకాదశికు సర్వం సిద్ధం
-
టీటీడీ చరిత్రలో అరుదైన దృశ్యం..
టీటీడీ చరిత్రలో అరుదైన దృశ్యం మరో పర్యాయం ఆవిష్కృతం కానుంది. ఒకే కుటుంబంలో ఇద్దరికి ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే మహద్భాగ్యం దక్కింది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఐదుసార్లు పట్టువస్త్రాలు అందించారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం మూడోసారి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాక్షి, తిరుమల: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి 1953లో టీటీడీకి వచ్చినప్పటి నుంచి శ్రీవారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలను సమర్పించే సంప్రదాయం మొదలైంది. తొలినాళ్లలో పట్టు వస్త్రాలను ఎండోమెంట్ అధికారులు, తర్వాత దేవదాయశాఖ మంత్రులు సమర్పించేవారు. ఎన్టీఆర్ హయాం నుంచి ముఖ్యమంత్రి స్వయంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించే సంప్రదాయం మొదలైంది. ఈ క్రమంలో ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో పర్యాయం శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. తండ్రీతనయులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే రెండు సమయాల్లోనూ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి టీటీడీలో విధులు నిర్వర్తిస్తుండడం మరో విశేషం. -
శ్రీవారికి శుభలేఖ పంపండి.. పెళ్లి కానుక అందుకోండి
తిరుమల: తెలుగు లోగిళ్లలో పెళ్లి శుభకార్యాలు జరుపుకునే సమయంలో విఘ్నేశ్వరుడిని మొదట పూజించి పనులు మొదలు పెడతారు. ఇక వివాహం జరిగే ఇంట్లోని మొదటి శుభలేఖ గుడిలో దేవుని పాదాల చెంత పెట్టి పూజించి బంధువులు, స్నేహితులకు పంచుతుంటారు. చాలామంది కలియుగదైవం తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని కోరుకుంటారు. తిరుపతికి దగ్గర వారైతే.. స్వయంగా పెండ్లి శుభలేఖను ఇస్తారు. మరి దూరపు భక్తులు స్వామివారికి శుభలేఖను పంపించడమెలా? దీనికి టీటీడీ మహదవకాశం కల్పిస్తోంది. అదెలాగో తెలుసుకోండి.. మొదటి శుభలేఖ పంపవచ్చు.. ఇంట్లో వివాహం నిశ్చయమైతే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి పంపించవచ్చు. వెంటనే తిరుమల నుంచి విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులకు చేతి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్లి జరిగే రోజు తలంబ్రాల్లో కలుపుతారు) వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు. తిరుమల శ్రీవారి నుంచి పెళ్లి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇందుకోసం ‘శ్రీ లార్డ్ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి’ చిరునామాకు మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక కొరియర్ చేయవచ్చు. కరోనా వేళలోనూ నూతన వధూవరులకు టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది. -
జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయింపు
తిరుమల: జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీకి 62 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఆ రాష్ట్ర లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ గురువారం నిర్ణయం తీసుకుంది. సదరు స్థలాన్ని 40 ఏళ్లపాటు టీటీడీకి లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో వేద పాఠశాల, ధ్యాన కేంద్రం, యాత్రికుల కోసం వసతి సముదాయాలు, పార్కింగ్ వసతులను ఏర్పాటు చేయనుంది. జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు, మూడు స్థలాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, గతంలో ఈవోగా ఉన్న అనిల్కుమార్ సింఘాల్ పరిశీలించిన విషయం తెలిసిందే. -
పరంజ్యోతి రూపంలో దర్శనమిచ్చే..
శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఓ అపురూప క్షేత్రం తంటికొండ. తూర్పు గోదావరి జిల్లా గోకవరం పట్టణానికి సుమారు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉందీ ఆలయం. ఓ అద్వితీయమైన ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేసే ఈ క్షేత్రంలో స్వామి వారి ఆవిర్భావం వెనుక పురాణ గా«థ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ కొండ మీద అనేక మంది మునులు, ఋషులు తపస్సు చేసినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. ఆ కాలంలో ఆ పుణ్య పురుషులంతా తమ తపశ్శక్తిని ఈ కొండపై ధార పోశారట. అనంతరం వారు ఇక్కడ అపూర్వమైన జ్ఞానాన్ని అందుకున్నారట. తర్వాత నేతాజీ కళా సమితి అనే నాటక సమాజం వారు ఈ కొండపై ఏకాహాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో ఇక్కడ ఓ దివ్యమైన తేజస్సు సాకారమైందట. ఆ కాంతి పుంజాన్ని శ్రీనివాసుని స్వరూపంగా భక్తులు భావించి ఈ కొండపై ఆలయాన్ని నిర్మించారు. తంటికొండ గ్రామానికి దక్షిణ దిశలో సుమారు 200 అడుగుల ఎత్తులో ఈ ఆలయం విలసిల్లుతోంది.1961 సంవత్సరంలో ఈ కొండపై స్వామివారి అర్చావతార మూర్తిని ప్రతిష్టించి అప్పటి నుంచి స్వామి వారిని సేవించుకుంటున్నారు. గర్భాలయంలో సంపూర్ణ రజత కవచాలంకృతంగా స్వామి వారు దర్శనమిస్తారు. స్థానక భంగిమలో ఉన్న స్వామి వారిని మాఘ శుద్ధ పంచమి నాడు ప్రతిష్టించారు. బద్దిరేద్ది శేషామణి అనే భక్తురాలికి స్వామి కలలో కనిపించి తాను పరంజ్యోతి రూపంలో సాకారమవుతానని చెప్పారట. అనంతరం నేతాజీనాటక సమితి నిర్వహించిన ఏకాహం తరువాత స్వామి జ్యోతిగా సాకారమిచ్చారట. అనంతరం మరో భక్తురాలికి తన అర్చావతార మూర్తుల గురించి వివరాలు చెప్పినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. ఏటా మాఘ మాసంలో స్వామి వారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఓ విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతులను ఇచ్చే మహత్తర క్షేత్రమిది. ఎలా చేరుకోవాలి? ఈ ఆలయానికి చేరుకోవడానికి రాజ మహేన్ద్రవరం వరకు వచ్చి అక్కడ నుంచి 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న గోకవరం చేరుకోవాలి. గోకవరం నుంచి ఏదైనా వాహనంలో ఆలయానికి చేరుకోవచ్చు . – దాసరి దుర్గా ప్రసాద్, పర్యాటక రంగ నిపుణులు -
'బాబు జీవితం మొత్తం వెన్నుపోట్లు, శవరాజకీయాలే'
సాక్షి, తిరుమల: చంద్రబాబు నాయుడి జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలకే సరిపోయిందని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 'కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం. వెయ్యికాళ్ల మండపం త్వరలో ప్రారంభించేందుకు టీటీడీ చైర్మన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పారదర్శకంగా రాజకీయాలు నడుపుతున్నారు. తిరుపతి ఎంపీ కరోనాతో మృతి చెందితే, హడావిడిగా అభ్యర్థిని ప్రకటించి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతన్న సమయంలో కూడా 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ప్రజలకు కనీసం భరోసా కూడా కల్పించలేని పరిస్థితి చంద్రబాబుది. కరోనా సమయంలో ప్రజల గురించి ఆలోచించకుండా చంద్రబాబు హైదరాబాద్లో దాక్కున్నారు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి మరణం సంభవించిన కుటుంబంలో పోటీపెట్టకుండా ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గం వారిని నిలబెట్టేందుకు లోకల్ బాడీ ఎన్నికల కోసం హడావిడి చేస్తున్నారు. ('ఇలాంటిదెప్పుడైనా ఊహించారా.. దటీజ్ సీఎం జగన్') స్థానిక సంస్థల ఫండ్స్ రాకపోతే అభివృద్ధి కుంటుపడుతుందిని ఎన్నికలు పెడితే కరోనా కుంటిసాకు చూపించి ఎన్నికలు వాయిదా పడేలా చేశారు. ఇప్పుడేమో రాష్ట్రంలో కరోనా లేదని పెద్దమనుషులు ఆరాట పడుతూ ఎన్నికలు పెట్టాలని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మార్చి లోపల ఎన్నికలు పెడితే టీడీపీ అన్ని స్థానాలు గెలుచుకుంటామనే భ్రమలో ఉంది. రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు మూడున్నర కోట్ల అప్పులో ముంచేసారు. రాష్ట్రంలో పదహారు నెలల కాలంలో నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చేశారు. కరోనా సమయంలోనూ ప్రజలను ఆదుకున్న సీఎం వైఎస్ జగన్ మాత్రమే' అని కొనియాడారు. (అనంతపురంలో భారీ డ్రోన్ సిటీ) -
ఏడు కొండలని, ఎర్రచందనాన్ని కాపాడాలి
సాక్షి, తిరుమల: బీజేపీ నేషనల్ సెక్రటరీ సునీల్ ధియోదర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడాలని, త్వరగా వ్యాక్సిన్ రావాలని కలియుగ దైవం వేంకటేశ్వరున్ని కోరుకున్నాను. ప్రజలకు సేవలందిస్తున్న ప్రధాని, హోమ్ మంత్రి ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నాను. (ఏపీలో కొత్త చరిత్ర) సహజసిద్ధంగా శేషాచలం అటవీ ప్రాంతంలో మాత్రమే ఎర్రచందనం మొక్కలు పెరుగుతాయి. ఎర్రచందనం స్వామి వారి సంపద, కానీ కొందరు స్మగ్లర్లు శతాబ్ధాలుగా వాటి ద్వారా అక్రమంగా ధనార్జన చేస్తున్నారు. ఎర్రచందనం రక్షణ కోసం సెంట్రల్ ఫోర్స్ ఇవ్వాలని ఏపీ సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి. ఏడు కొండలని, ఎర్రచందనంను కాపాడాలని పీఎం నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు' సునీల్ ధియోదర్ తెలిపారు. -
సర్వభూపాల వాహనంపై సర్వాంతర్యామి
-
ముత్యపు పందిరి వాహనంపై శ్రీనివాసుడు ఫొటోలు
-
సింహవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు
-
చినవెంకన్న గుడిలో ఏసీబీ తనిఖీలు
సాక్షి, ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆలయంలోని పలు విభాగాల్లో జరుగుతున్న అవకతవకలపై అందిన ఫిర్యాదులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏలూరు ఏసీబీ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ దాడులను జరిపారు. ఏకకాలంలో డీఎస్పీతో సహా ఇద్దరు సీఐలు రవీంద్ర, శ్రీనివాసరావు, మరో 9 మంది ఏసీబీ సిబ్బంది, అలాగే వివిధ శాఖలకు చెందిన మరో పది మంది (సహాయకులు) ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. వీరంతా ఏడు బృందాలుగా విడిపోయి ఒకే సమయంలో అన్ని విభాగాల్లోనూ సోదాలను చేపట్టారు. ప్రధానంగా ప్రసాదాల తయారీ కేంద్రం (అంబరుఖానా), సెంట్రల్ స్టోర్, టోల్ప్లాజా, అలాగే ప్రసాదాలు, టికెట్ విక్రయాల కౌంటర్లు, అన్నదానం, ఇంజినీరింగ్, లీజియస్ ఇలా అన్ని పరిపాలనా విభాగాల్లోనూ తనిఖీలను నిర్వహించారు. అలాగే స్వామి దర్శనార్థం ఆలయంలోకి వెళ్లే భక్తుల టికెట్లను పరిశీలించారు. ప్రసాదాల తయారీలో దిట్టంను సరిగ్గా అనుసరిస్తున్నారా? లేక ఏవైనా అవకతవకలకు పాల్పడుతున్నారా? అన్నదానిపై స్వయంగా ప్రసాదాలను తూకం వేసి తనిఖీ చేశారు. సెంట్రల్ స్టోర్లో నిల్వ ఉన్న స్టాకును, సంబంధిత రికార్డులను పరిశీలించారు. స్టోర్లో ఉండాల్సిన వాటికంటే ఏమైనా సరుకులు ఎక్కువ, తక్కువలు ఉన్నాయా అన్న కోణంలోనూ సోదాలు జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా ఈ తనిఖీలు జరిగాయి. గుర్తించిన అవకతవకలకు సంబంధించిన పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. గుర్తించిన అవకతవకలు ప్రభుత్వ ఉత్తర్వులు, జీఓలను తుంగలోకి తొక్కి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరును రికార్డుల ద్వారా ఏసీబీ అధికారులు గుర్తించారు. కొండపైన, దిగువన దేవస్థానం షాపుల అద్దెల వసూలు విషయంలో సంబంధిత ఆలయ అధికారులు నిబంధనలను కాలరాసినట్లు గుర్తించారు. దుకాణదారుల నుంచి ముందే వసూలు చేయాల్సిన ఏడాది లీజు సొమ్మును నెలసరి వాయిదాల పద్ధతిలో కట్టించుకుంటూ, షాపుల యజమానులతో కుమ్మక్కై శ్రీవారి ఆదాయానికి అధికారులు గండి కొడుతున్నట్లు తెలుసుకున్నారు. భక్తుల తలనీలాల కాంట్రాక్టరుకు వెసులుబాటు కల్పిస్తూ పాట మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తూ.. కోట్లాది రూపాయలు పక్కదారి పట్టడానికి కారణమవుతున్నట్లు గుర్తించారు. అంబరుఖానాలో ఇటీవల మాయమైన 11 వందల కేజీల నెయ్యి కుంభకోణంపై ఆలయ అధికారులు పోలీసు కేసు పెట్టకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ప్రసాదాల తయారీని టెండర్ పద్ధతిన కాకుండా, ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు కట్టబెట్టడాన్ని గుర్తించారు. దేవస్థానంలో ఉపయోగిస్తున్న వాహనాల ఇంధన వినియోగం, అద్దెకు తీసుకున్న ప్రైవేటు వాహనాలకు అధికంగా చెల్లింపులు జరుపుతున్నట్టు గుర్తించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అతి తక్కువ అద్దెకు షాపును పొందిన వ్యక్తి, మరో వ్యక్తికి ఆ షాపును అధిక లీజుకు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి గతంలో ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) సొమ్ము విషయంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఇటీవల బదిలీ అయిన ఆలయ ఈఓ ఇంకా దేవస్థానం గెస్ట్ హౌస్ను, సెక్యురిటీ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలనూ ఆరా తీశారు. -
తిరుమల శ్రీవారికి అభిషేకం..
సాక్షి, తిరుమల: సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం గురువారం నుంచి ప్రారంభం కాగా, నిన్న స్వామివారిని 6,998 మంది భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. మొదటిరోజు దర్శనానికి ఎనిమిది రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేశారు. తెలంగాణ నుండి 143, తమిళనాడు నుండి 141, కర్ణాటక నుండి 151 మందితోపాటు మహారాష్ట్ర, న్యూఢిల్లీ, అరుణాచల్ప్రదేశ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల నుండి భక్తులు దర్శించుకున్నారు. ఉదయం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి దర్శనం కొనసాగుతుంది. గంటకు 500 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దర్శనానికి భౌతిక దూరం తో పాటు, మాస్కులు తప్పనిసరిగా ధరించేవిధంగా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. అలిపిరి వద్ద భక్తులకు కరోనా ర్యాండమ్ పరీక్షలు.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అవకాశాన్ని బట్టి దర్శనాల టికెట్ల సంఖ్య పెంచుతామని తెలిపారు. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని ఆయన స్పష్టం చేశారు. అలిపిరి వద్ద భక్తులకు కరోనా ర్యాండమ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సన్నిధి గొల్లలకు వంశపారంపర్యం కొనసాగిస్తూ తీర్మానం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.(తిరుమల శ్రీవారి దర్శనం ప్రారంభం) -
తిరుమలలో పట్టుబడ్డ నకిలీ ఐపీఎస్
సాక్షి, తిరుమల : శ్రీవారి దర్శనం కోసం నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తి పోలీసులకు చిక్కాడు ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఖమ్మం జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. శ్రీవారి దర్శనం కోసం బుధవారం తిరుమలకు వెళ్లిన అరుణ్ కుమార్... తాను ఐపీఎస్ నంటూ జేఈవో కార్యాలయానికి వచ్చి ప్రోటోకాల్ దర్శనం అడిగాడు. అధికారుల విచారణలో అతను ఐపీఎస్ అధికారి కాదని తేలింది. దీంతో జేఈఓ కార్యాలయం అధికారులు విజులెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దర్శనానికి వెళ్తున్న అరుణ్కుమార్ను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తిరుమల పోలీసులు.. అరుణ్కుమార్ను అరెస్ట్ చేశారు. అరుణ్కుమార్ గతంలో పలువురు రాష్ట్ర మంత్రుల వద్ద ఓయస్డిగా పనిచేశాడు. -
స్వర్ణరథంపై తిరుమలేశుని విహారం
-
ముక్కోటి ఏకాదశి.. భక్తకోటి పరవశించి!
తిరుమల/ సింహాచలం (విశాఖపట్నం)/ శ్రీశైలం(కర్నూలు)/ కదిరి(అనంతపురం)/ నెల్లిమర్ల రూరల్ (విజయనగరం)/ మంగళగిరి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని భక్తకోటి పరవశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తుల కోలాహలం మొదలైంది. తిరుమలలో వైకుంఠ మహాద్వార దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమాడ వీధుల్లో, నారాయణగిరి తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేనివిధంగా క్యూల్లోనూ, తాత్కాలిక షెడ్లలోనూ చలి తీవ్రత తట్టుకొనేందు దుప్పట్లను పంపిణీ చేశారు. ఒకసారి 80 వేల మందికిపైగా అన్న పానీయాలు వితరణ చేసేలా టీటీడీ అన్నదాన విభాగం కృషి చేసింది. వీఐపీలు తరలి వచ్చారు. అదనపు ఈవో ధర్మారెడ్డి ఆదేశాలతో భారీగా వచ్చిన దరఖాస్తులను కుదించి 3,500 టికెట్లు జారీ చేశారు. వారికి 1.30 గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పించి ముగించేసి సామాన్య భక్తులకు దర్శనం కల్పించారు. సప్తగిరీశుడు స్వర్ణ రథంపై ఊరేగింపు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణకాంతులతో భక్తులకు అభయ ప్రదానం చేశారు. కలియుగంలో రాజాధిరాజులకు కూడా రాజును తానే అంటూ భక్తులకు తెలియచెప్పడానికి స్వర్ణరథంపై అధిరోహించి తిరువీధుల్లో ఊరేగారు. ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన మల్లన్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైలంలో సోమవారం మల్లికార్జునస్వామి దేవేరి భ్రామరితో కలిసి ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. ప్రాతఃకాల పూజలనంతరం స్వామివార్ల గర్భాలయ ఉత్తరద్వారంలో ఉత్సవమూర్తులను వేంచేయింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. మల్లన్న ఆర్జిత కల్యాణాలు రద్దు కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 12 నుంచి 18 వరకు జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్ల ఆర్జిత, శాశ్వత కల్యాణాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. పోటెత్తిన కదిరి అనంతపురం జిల్లా కదిరిలో కొలువైన ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సోమవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు తమ ఇలవేల్పు దేవుడు లక్ష్మీ నారసింహుని ఉత్తర గోపురం ద్వారా దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక సిరి.. రామగిరి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి ఉత్తర ద్వారదర్శనం, గిరి ప్రదక్షిణలకు ఉత్తరాంధ్ర జిల్లాల భక్తులు పోటెత్తారు. మంగళగిరిలో పోటెత్తిన భక్తులు మంగళగిరిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని సోమవారం దాదాపు లక్ష మందికి పైగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామి వారు బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, శివక్షేత్ర శివస్వామి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. సింహగిరిపై ముక్కోటి ఏకాదశి సింహాచలంలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఘనంగా జరిగింది. సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడై ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠవాసుడిగా శేషతల్పంపై భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4.45 గంటల నుంచి ఉదయం 11.15 గంటల వరకు ఉత్తరద్వారంలో స్వామివారి దర్శనం కల్పించారు. సింహాచలం క్షేత్రం మహా పుణ్యక్షేత్రమని, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉత్తరద్వారంలో దర్శించుకోవడం ఆనందంగా ఉందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే.మహేశ్వరి తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన శ్రీకాళహస్తి చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ శ్యాంప్రసాద్, జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ వెంకటరమణలు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. చెంగాళమ్మ సేవలో హైకోర్టు చీఫ్ జస్టిస్ సూళ్లూరుపేట: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి దంపతులు, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జీవీ కృష్ణయ్య, హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ ఎస్వీఎస్ఆర్ మూర్తి సోమవారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. -
ఆలయాలే టార్గెట్గా..
ఆలయాలే టార్గెట్గా దొంగలు రెచ్చిపోయారు. ఒక్కరోజే మూడు దేవాలయాలను కొల్లగొట్టారు. ధర్పల్లి మండలంలోని రెండు గుళ్లతో పాటు ఇందల్వాయి మండలంలో ఓ గుడిలోకి చొరబడ్డారు. దేవుళ్ల నగలతో పాటు హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలతో స్థానికంగా కలకలం రేగింది. సాక్షి,ధర్పల్లి(నిజామాబాద్) : మండలంలోని గోవింద్పల్లి గ్రామ శివారులో గల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు ఆలయంలోని గర్భగుడి తాళం పగులగొట్టి లోనికి చొరబడ్డారు. స్వామివారి మీద గల బంగారు, వెండి ఆభరణాలు, హుండీలోని నగదును దొంగిలించారు. భక్తులు గత ఏడాది నుంచి డబ్బులను కానుకలుగా హుండీలో సమర్పిస్తున్నారు. దీంతో హుండీలో సుమారు రూ.50 వేలకు పైగానే డబ్బు ఉంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై పాండేరావు చోరీ జరిగిన ఆలయాన్ని మంగళవారం పరిశీలించారు. దొంగల కోసం చుట్టుపక్కల గ్రామాల్లోని సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్దుల్ ఆలయంలోనూ.. మండల కేంద్ర శివారులోని మద్దుల్ అటవీ ప్రాంతంలో గల శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున దొంగలు పడ్డారు. చానల్ గేట్ తలుపులను పగులగొట్టి స్వామివారి మీద గల వెండి ఆభరణాలు, హుండీ పగులగొట్టి రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారమందుకున్న ఎస్సై పాండేరావు చోరీ జరిగిన శ్రీలక్ష్మినర్సింహాస్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. లోలం పెద్దమ్మ ఆలయంలో.. ఇందల్వాయి: మండలంలోని లోలం గ్రామ శివారులో గల పెద్దమ్మ ఆలయంలోకి సొమవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. హుండీ పగలగొట్టి దాదాపు రూ.7 వేల నగదు, అమ్మవారి పుస్తెమట్టెలు, పట్టగొలుసులు ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయం గేటుకు వేసిన తీళం పగలగొట్టి, బీరువాను ధ్వంసం చేశారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు కేసు నమోదు చేసుకున్నారని సర్పంచ్ మమత చెప్పారు. -
వారి వెనుకే మనం కూడా నడుస్తున్నాం
పూర్వం తిరుమలలో వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాలంటే...చింతచెట్టు, సంపెంగచెట్ల మార్గం అని పెద్ద పెద్ద మానులతోఉన్న ఓ మార్గం గుండా వెళ్ళేవారట. పంచవన్నెల చిలకల్ని అక్కడ పంజరాల్లో పెట్టి ఉంచేవారట. ‘కోనేటిరాయుడు లోపల ఉన్నాడు, వెళ్ళి దర్శించుకోండి, కానుకలు సమర్పించుకోండి, మీ కోరికలు తీర్చుకోండి’ అని అవి అరుస్తుండేవట. అవి విన్నారు అన్నమాచార్యులవారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చి కోనేటి దగ్గర కూర్చున్నారు.గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు కొద్దిసేపు గుడిమెట్ల మీద తప్పనిసరిగా కూర్చోవాలంటారు. ఎందుకంటే.. మీరు లోపల దర్శనం చేసుకున్న మూర్తిని మళ్ళీ ఒకసారి మనసులోకి ప్రతిబింబింప చేసుకుని, ధారణ చేసుకోవాలి. అన్నమాచార్యుల వారికి కూడా అలా స్వామివారి సౌందర్యం జ్ఞాపకానికొచ్చింది. చిలకపలుకులు గుర్తుకొచ్చాయి. ఆ క్షణాల్లో చేసిన కీర్తనే...‘‘కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు...’’. అన్నమయ్య ఆ కొండమీదే ఉండిపోయాడు. తల్లిదండ్రులు పిల్లవాడిమీది బెంగతో ఉపవాసాలు చేస్తూ వెతుక్కుంటూ బయల్దేరారు. అక్కడ ప్రవర చెబుతున్న అన్నమాచార్యులును చూసి ఘన విష్ణుయతి అనే వైష్ణవయతి ఆయనకు పంచసంస్కారాలు చేసాడు. అన్నమాచార్యులవారు పాపనాశనం వెళ్ళి స్నానం చేసి తడిబట్ట ఆరేసుకుంటే.. అది ఆరిపోయేలోపల వేంకటేశ్వర స్వామి వారి మీద శతకం చెప్పేసారు. వేంకటేశ్వర స్వామివారు దర్శనమిచ్చి ‘నీవు సంకీర్తనా యజ్ఞం చేయాలి’ అని ఆదేశించినట్లు ఆయనకు అనిపించింది. అప్పటినుంచి ప్రతిరోజూ ఎక్కడికెళ్ళినా తప్పనిసరిగా ఒక కీర్తన చేసేవారు. ‘నీ కీర్తనలతో వైరాగ్యం వచ్చేసి స్వామి నాకేసి చూడడం మానేసాడు’ అని అమ్మవారు చెప్పినట్లనిపించి..‘‘పలుకు తేనెల తల్లి పవ్వళించెను..’’ అని పాడి స్వామివారిలో కదలిక తీసుకు వచ్చాడట. ఆయన ‘జో అచ్యుతానంద జోజో ముకుందా..’ అని పాడితే నిద్రఎరుగని వేంకటాచలపతి హాయిగా కన్నుమూసి నిద్రపోయాడట.ఈరోజుకు కూడా ఉదయం సుప్రభాతం జరిగితే అన్నమాచార్య వంశీయులు వస్తారు. తాంబూలంలో వెన్నపెట్టి ఇస్తారు వారికి. రాత్రి మళ్ళీ ఊయల సేవ జరిగేటప్పడు కూడా వారు వచ్చి కీర్తనలు చేస్తారు. 95 సంవత్సరాల నిండు జీవితం గడిపిన అన్నమయ్య 90వ సంవత్సరం వచ్చిన తరువాత కూడా తంబుర పట్టుకుని శరీరం వణుకుతున్నా గుడి మెట్లమీద కూర్చుని ధ్వజస్తంభం కనబడుతుంటే..‘‘శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీపతి వల్లభ/శరణు రాక్షసగర్వ సంహార శరణు వేంకట నాయకా. ’’ అని శరణాగతి చేస్తుంటే–పురంధరదాసు గారు ఎదురొచ్చి‘‘శరణు శరణు సురేంద్ర సన్నుత శ్రీపతి సేవిత శరణు పార్వతీ తనయ శరణు సిద్ధి వినాయక...’’ అని ఆయన కీర్తన చేసారు. ‘మహానుభావా, మీ కీర్తన వింటేనే గానీ వేంకటేశ్వరుడు నిద్రపోడు. మీ పాట వింటేనే గానీ నిద్రలేవడు’’ అని పురంధర దాసు అంటే..దానికి ‘‘నీవేం తక్కువ వాడివా ! వేన్నీళ్ళు తీసుకు రాలేదని పండరీపురంలో నీవు సేవకుడి రూపంలో వచ్చిన స్వామివారి వీపుమీద చరిస్తే పాండురంగడి వీపు వాచిపోయింది. అంతగా భగవంతుడిని వశం చేసుకున్నవాడివి’’ అని అన్నమాచార్యుల వారంటూ ‘నీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అంటూ ఆశీర్వదించారట.ఇద్దరు మహాపురుషులు, ఇద్దరు వాగ్గేయకారులు రాజద్వారం దగ్గర కలుసుకున్న మహత్తర క్షణాలవి. వారు నడిచిన చోట, ఆది శంకరులు నడిచిన చోట, భగవద్ రామానుజులు నడిచిన చోట మనం నడుస్తున్నాం. -
తమిళనాడు: కన్యాకుమారిలో శీవారి ఆలయం
-
ప్రత్యేక పూజలు చేయనున్న కేసీఆర్
-
ఆపద 'మొక్క'లవాడు!
జగిత్యాల అగ్రికల్చర్: ఆ గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలంటే, ఆలయ పరిసరాల్లో ఓ మొక్క నాటాల్సిందే. పూజకు తీసుకువచ్చే తాంబూలంలో కొబ్బరికాయకు బదులు ఓ మొక్క పెట్టుకురావాల్సిందే.కొబ్బరికాయ కొడితే మనలోని అహంకారం దూరమవుతుందని పెద్దలు చెబుతుంటే.. ఆ దేవాలయ కమిటీ మాత్రం కొబ్బరికాయకు బదులు ఓ మొక్క నాటితే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని చెబుతుంది. దీంతో, దేవాలయానికి వచ్చే భక్తులు ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటుతున్నారు. ఫలితంగా ఆలయ పరిసరాలంతా పచ్చని చెట్లతో కళకళలాడుతూ ప్రకృతి ఆనందం పరవశిస్తోంది. ఆ దేవాలయమే జగిత్యాల జిల్లా కేంద్రానికి 5 కి.మీ దూరంలో ఉన్న లక్ష్మీపూర్ శ్రీలక్ష్మీవేంకటేశ్వర ఆలయం. గుట్టపై నిర్మించిన దేవాలయం లక్ష్మీపూర్ గ్రామస్తులు ప్రభుత్వ సహాయం లేకుండా 2005లో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దాదాపు రూ.20 లక్షల వ్యయంతో ఆధునిక హంగులతో నిర్మించుకున్నారు. ఆలయంలో జరిగే రోజువారీ పూజా కార్యక్రమాల కోసం చందాలు పోగు చేసి రూ.12 లక్షలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీని ద్వారా ఏటా వచ్చే వడ్డీతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఏటా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర కల్యాణం వైభవంగా జరిపిస్తున్నారు. కార్యక్రమంలో భక్తులు అన్నదానంతోపాటు, మరో రూ.2 లక్షల వరకు స్వామివారి కల్యాణానికి కానుకలుగా వస్తుంటాయి. ఆలయ కమిటీని రెండేళ్లకోమారు అన్నికులాల నుంచి ఎన్నుకుంటారు. ఆలయ కమిటీ ప్రతీ శనివారం ఆలయ ఆవరణలో భజన చేయడమే కాకుండా, దేవాలయ అభివృద్ధిపై చర్చిస్తారు. ఈ కమిటీ సమావేశానికి ఒక్క నిమిషం ఆలస్యమైన రూ 100 జరిమానా విధించుకుని, ఆ జరిమానాను సైతం దేవుడి హుండీలో వేస్తుండటం విశేషం. పచ్చని చెట్ల మధ్య భక్తుల ధ్యానం ఆ దేవాలయానికి వచ్చిన భక్తుల్లో కొందరు ఉదయం, సాయంత్రం వేళల్లో పచ్చని చెట్ల మధ్య యోగాతో పాటు ధ్యానం చేస్తుంటారు. ఓ వైపు గుట్టపైన ఉండటం, మరో వైపు చల్లని గాలులు వీస్తుండటంతో, రక రకాల దీక్షలు తీసుకునే స్వాములు సైతం ఇక్కడే సేద తీరుతుంటారు. గుట్ట చుట్టూ పచ్చని పొలాలు, పంటలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. అందుకే దేవాలయానికి వచ్చే భక్తులు ఒక్క మొక్క నాటితే, ప్రతీసారి దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడి కంటే ముందు తను నాటిన మొక్కనే ఎలా ఉందో చూసుకుంటున్నారని దేవాలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. పూజారి ప్రోద్బలంతో పచ్చని చెట్లు రిటైర్డ్ వ్యవసాయ విస్తీరణాదికారి, దేవాలయ పూజారి అయిన కూర్మాచలం రంగాచార్యులు ప్రోద్బలంతో దేవాలయ కమిటీ ఆలయ పరిసరాల్లో పచ్చదనానికి కృషి చేస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హారితహారంతో సంబంధం లేకుండా, ప్రతి ఏటా ఆలయం పరిసరాల్లో కనీసం 200–300 రకాల మొక్కలు నాటుతుంటారు. దీనివల్ల దేవాలయమంతా మామిడి, జామ, ఉసిరి, మేడిచెట్టు, అల్లనేరడి, పత్రి పండు, మారేడుకాయ వంటి పండ్లు, గులాబీ, చేమంతి, మల్లె, మందారం వంటి పూలతోపాటు, వేప, టేకు వంటి నీడనీచ్చె చెట్లు అలంకరణ మొక్కలు కూడా భక్తులకు కనువిందు చేస్తుంటాయి. చెట్లు ఎండిపోకుండా డ్రిప్తో నీటి సౌకర్యం కూడా కల్పించడం గమనార్హం. -
ఒకే కార్యక్రమంలో చంద్రబాబు, పవన్
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో శ్రీ భూసేమత దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది. గణపతి సచ్చిదానంద స్వామిజీ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఏకశిలా విగ్రహంలో ఏకాదశ రూపాలు కలిగిన 11 అడుగుల ఎత్తున్న వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్వామివారకి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట సందర్బంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్లు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత తొలిసారి వీరిద్దరూ ఎదురుపడటంతో ఏం మాట్లాడుకున్నారన్న ఆసక్తి అంతటా నెలకొంది. చంద్రబాబు, పవన్ రాకతో వారిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. -
విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్
-
తమిళనాడు: వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సింగర్ మనో
-
ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి
సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రస్తుత కాలంలో మానవునికి ఆధ్యాత్మిక చింతన అవసరమని, మనశ్శాంతి కోరుకునే వారు ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు వినోద్కుమార్ అన్నారు. కరీంనగర్లో జరుగుతున్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ అర్చుకులు, పాలకవర్గం పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పురాతన ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తీరును చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. తొమ్మిది రోజుల పాటు హాజరయ్యే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులను కోరారు. 23, 24, 25 తేదీల్లో జరుగనున్న కళ్యాణం, శోభాయాత్ర కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అన్నీ తానై వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే గంగులను ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఎంపీపీ వాసాల రమేశ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేశ్, కార్పొరేటర్లు వై. సునీల్రావు, ఏవీ రమణ, పిట్టల శ్రీనివాస్, శ్రీకాంత్, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు. అలరించిన సాంసృతిక కార్యక్రమాలు.. శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు అబ్బుర పరిచాయి. భక్తీ రసాన్ని పండించే విధంగా విద్యార్థులు, చిన్నారులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కట్ట సిస్టర్స్ మంజుల, సంగీత, పెందోట బాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తీ సంగీతం, జవహర్ బాల కేంద్రం ఆధ్వర్యంలో సాంసృతిక కార్యక్రమాలు, కనపర్తి శ్రీనివాస్, సౌజన్య, రాసమల్ల రవి, రాధిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. -
31న తిరుమల ఆలయం మూసివేత
తిరుపతి : చంద్రగహణం కారణంగా జనవరి 31న తేదీన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి 31న సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుందన్నారు. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నట్టు చెప్పారు.. రాత్రి 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, రాత్రి కైంకర్యాలను అధికారులు నిర్వహించనున్నారు. రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుందన్నారు. చంద్రగ్రహణం కారణంగా అన్నప్రసాదాల వితరణను కూడా టీటీడీ నిలిపివేస్తుంది. వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసింది. 300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు కూడా టీటీడీ తెలిపింది. ఆర్జితసేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. అదే రోజున(జనవరి 31న) రామకృష్ణ తీర్థ ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. శేషాచలగిరుల్లో నెలవైన పుణ్యతీర్థాల్లో శ్రీరామకృష్ణ తీర్థం ఒకటి. రామకృష్ణ తీర్థానికి భక్తులు భారీగా తరలిరానున్నట్టు తెలుస్తోంది. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత మహేష్రెడ్డి ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మంత్రాలయం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ స్వామిజీ, మహాత్మగాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ దంపతులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ప్రముఖులకు టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. -
నేత్రపర్వం.. సహస్రదీపాలంకరణ
భీమవరం : భీమవరం రెండో పట్టణ æపరిధి జువ్వలపాలెం రోడ్డులోని శ్రీ పద్మావతి వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వాడపల్లి ఆదినారాయణాచార్యుల ఆధ్వర్యంలో ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో సహస్ర దీపాలంకరణ జరిపారు. ఈ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహ«ణాధికారిణి ఆర్.గంగాశ్రీదేవి, ఆలయ వంశపారంపర ్య ధర్మకర్త మంతెన రామ్కుమార్ రాజు పర్యవేక్షించారు. -
ద్వేషించిన దేవుణ్ణే ఆరాధిస్తున్నా!
ఆంధ్రులు ఎక్కువగా ఉండే మోల్మిన్... బర్మా ఆంధ్రప్రదేశ్గా ప్రసిద్ధి. అక్కడ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. తెలుగువారు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలుగులోనే మాట్లాడుకుంటారు. వాళ్లలో మాంగ్తిన్ ఒకరు. తిరుమలేశునికీ ఆయనకూ ఉన్న అనుబంధం ఏమిటి? మీ పూర్వీకులు ఎక్కడివారు? మా తాత లండా సింహాచలం పూర్వం ఇక్కడి నుంచి బర్మాకు వచ్చి స్థిరపడ్డారు. అప్పట్లో మా తండ్రి లండా గంగరాజు వైజాగ్లో పుట్టారు. ఆయన కూడా తాతతోనే బర్మాలో స్థిరపడ్డారు. ఆయన అక్కడే పెళ్లి చేసుకున్నారు. మేము రంగూన్లోనే పుట్టాము. ఐదుగురం సంతానం. నా పేరు సుబ్రహ్మణ్యం (మాంగ్తిన్), నా భార్య కళావతి. మాకు చో చో తిన్, ప్యూప్యూ తిన్ ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె చో చో తిన్కు తెలుగు సంప్రదాయంలోనే రంగూన్లో పెళ్లి చేశాను. తిరుమల గురించి ఎలా తెలుసు? మా తమ్ముడు భూ కైలాష్కు స్వామి అంటే ఎనలేని భక్తి. వాడు చెప్పిన మీదట 1999లో మొదటిసారిగా నేను, నా భార్య కళావతి, చెన్నయ్ నుంచి మరో ముగ్గురం వచ్చాం. ఎక్కడ చూసినా జనమే. గది దొరక లేదు. దర్శనానికీ టికెట్లు దొరకలేదు. దాంతో తిరిగి వెళ్లిపోదామని నిశ్చయించుకున్నా. ఇంతలోనే మాపై స్వామికి అనుగ్రహం కలిగినట్లుంది... అనుకోకుండానే కల్యాణం టికెట్టు దొరికింది. గది దొరికింది. ఒకేరోజు మూడు సార్లు దర్శనం లభించింది. అదంతా స్వామి లీలగానే అనుకున్నాం. సంతోషంగా తిరుగుప్రయాణం అయ్యాను. ఇక వీలుదొరికినపుడు కచ్చితంగా రావాలని నిశ్చయించుకున్నాం. ఆ ప్రకారం 15 ఏళ్లుగా వస్తున్నా. నా కుమార్తె పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన వారం రోజుల్లోపే తిరుమలకు వచ్చి స్వామికి కల్యాణం జరిపించాను. స్వామి మొక్కులు పెండింగ్ లేకుండా జాగ్రత్త పడుతుంటాను. అప్పుడే నా మనసు కూడా హాయిగా ఉంటుంది. శ్రీవారిని నమ్ముకున్న మీకు ఎలాంటి కష్టాలు తొలగాయి? స్వామిని నమ్ముకుని ఎన్నో వ్యాపారాలు ప్రారంభించాను. పైకొచ్చాను. మళ్లీ దివాలా తీసాను. స్వామికి చెప్పుకునేందుకు ఫైల్స్తోనే కొండెక్కాను. నా వద్ద ప్రాణం తప్ప మరేమీ లేదని ఏడుస్తూ వేడుకున్నాను. తిరిగి బర్మా వెళ్లాను. తర్వాత వెనక్కు తిరిగి చూడలేదు. స్వామి దయతో చల్లగా ఉన్నాను. అందుకే స్వామిపేరుతో ఆసుపత్రి, గోశాల, కిడ్నీ ఫౌండేషన్ వంటి కార్యక్రమాలు చేయాలని సంకల్పించాను. ఊపిరి ఉన్నంత వరకు ఆ స్వామిని దర్శించుకుంటూనే ఉంటాను. ఆ స్వామికి వినమ్రుడిగా ఉంటాను. -
తవ్వేకొద్దీ అవినీతి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వేంకటేశ్వరస్వామి ఎక్కడ కొలువున్నా నిత్య కల్యాణం.. పచ్చతోరణంగా వైభవోపేతమైన ఉత్సవాలు జరుగుతుంటాయి. కానీ.. ఏలూరు ఆర్ఆర్ పేటలోని స్వామి ఉత్సవాలు కేవలం ఓ అధికారి భోజ్యం కోసమే జరిగాయంటే నమ్మశక్యం కాకపోయినా వాస్తవం. ఉత్సవాల పేరిట భారీగా విరాళాలు వసూలు చేయడం, తూతూమంత్రంగా వేడుకలు జరి పించి లక్షలాది రూపాయలు దిగమింగేయడం రెండేళ్లుగా ఆనవాయితీగా మారింది. అరుునా ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. స్వామివారి వజ్ర కిరీట వ్యవహారం ఎటుతిరిగి ఎటొస్తుందోనని భయపడిన అధికారులు ఇటీవల సదరు అధికారిని గుట్టుచప్పుడు కాకుండా బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో గడచిన రెండేళ్లలో ఆయన ఇష్టారాజ్యంగా సాగించిన అవినీతి, అక్రమాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఏడాదికి దాదాపు కోటి రూపాయల ఆదాయంతో కళకళలాడిన ఈ ఆలయం రెండేళ్ల కిందట మేనేజర్గా తల్లాప్రగడ విశ్వేశ్వరరావు వచ్చినప్పటి నుంచి ఖర్చులెక్కువ.. ఆదాయం తక్కువ అనే పరిస్థితికి చేరింది. భక్తుల నుంచి వచ్చే విరాళాలు పెరిగినా ఈయన లెక్కాపత్రం లేకుండా సాగించిన ఖర్చులతో చివరకు 8 నెల లుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి నెల కొందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు ఆలయానికి వచ్చిన ఆదాయంలో 30 శాతానికి మించకూడదు. ఈయన మేనేజర్గా వచ్చిన తర్వాత ఆ ఖర్చులు 60శాతానికి పెరిగిపోయాయి. గుడి ఆదాయం, ఖర్చులతో నిమిత్తం లేకుండా ఇష్టమొచ్చిన రీతిలో ఎన్ఎంఆర్లను తీసుకోవడం, అవసరం లేకున్నా ఓ మహిళా ఉద్యోగిని స్కేల్ పరిధిలోకి తీసుకురావడం, కారుణ్య నియామకంలో భాగంగా అటెండర్గా 6బి ఆలయం లో ఉన్న మహిళా ఉద్యోగిని 6ఎ పరిధిలోని ఈ ఆలయానికి తీసుకువచ్చి జీతం పెంచేయడం వంటి నిర్వాకాలతో ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. భక్తుల నుంచి వచ్చే విరాళాలకు లెక్కాపత్రం లేకపోవడం, ఉత్సవాలు మొదలుకుని ఆలయ నిర్వహణకు అయ్యే ప్రతి ఖర్చులోనూ సగానికి సగం మిగుల్చుకున్న ఈయన ధోరణితో ఓ దశలో ఆలయానికి వచ్చే ఆదాయం కంటే ఈయన ఆదాయమే ఎక్కువన్న విమర్శలనూ మూటగట్టుకున్నారు. ఈయన హయాంలోనే జరిగిన సీసీ కెమెరాలు, జనరేటర్ కొనుగోళ్లలోనూ డబ్బులు మిగుల్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. శాశ్వత పరిచారకుల ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇద్దరు యువకుల నుంచి చెరో రూ.70వేలు తీసుకుని వారిని కొన్నాళ్లపాటు కొనసాగించిన సదరు అధికారి తాను బదిలీపై వెళ్లే ముందు నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించేశారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఆలయ ప్రాకారాన్ని పగుల గొట్టించి చేపల మందు దుకాణానికి అద్దెకిచ్చిన ఈయన నిర్వాకం గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తంగా రెండేళ్లలో లక్షలాది రూపాయలు ఎగరేసుకుపోయి ఉంటాడని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆలయ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారంటే వెంకన్న గుడిలో విశ్వేశ్వరరావు లీలలు అర్థం చేసుకోవచ్చు. ‘వజ్ర కిరీటం’పై విచారణ సాక్షి ప్రతినిధి, ఏలూరు : నగరంలోని ఆర్ఆర్ పేటలో కొలువైన వేంకటేశ్వరస్వామి వజ్రకిరీటం పేరిట జరిగిన అవినీతి బాగోతంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్టు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ వెల్లడిం చారు. ‘వెంకన్నకు శఠగోపం.. వజ్ర కిరీటం పేరిట లక్షలు కైంకర్యం’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం దేవాలయ, దేవాదాయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. పత్రికలో కథనం ప్రచురితమైన విషయూన్ని కాకినాడలోని డెప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. వెంటనే స్పందించిన ఆయన జ్యూవెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్(జేవీవో)ను ఈనెల 21న ఏలూరు వెళ్లి విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాతే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. -
మరోమారు దొంగల బీభత్సం
విజయనగరం క్రైం, న్యూస్లైన్ : పట్టణంలో దొంగతనాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల బాలాజీనగర్లో జరిగిన దొంగతనం ఘటన మరువక ముందే.. తాజాగా స్థానిక మయూరి హొటల్ సమీపాన సుజ ఇన్ఫో టెక్ షాపులో చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని మయూరి హొటల్ సమీపాన ఉన్న శ్రీనివాసా నర్సరీ కాంప్లెక్స్లో సుజ ఇన్ఫోటెక్ షాపు ఉంది. గురువారం రాత్రి దొంగలు షట్టర్కు ఉన్న తాళాన్ని విరగ్గొట్టి, లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న సుమారు మూడు లక్షల విలువైన సెల్ఫోన్ రీఛార్జ్ ఓచర్లు, టాపప్ కూపన్లను దొంగిలించారు. కప్బోర్డులో ఉన్న కంప్యూటర్ విడివస్తువులు, ఐదు విలువైన సెల్ఫోన్లను అపహరించారు. యజమాని జి.లోకేష్ బాబు శుక్రవారం ఉదయం యథావిధిగా షాపు తెరిచేందుకు వచ్చారు. దొంగతనం జరిగినట్లు గుర్తించి ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్టీం కూడా సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా... సుజ ఇన్ఫోటెక్ పక్కనున్న మరో కార్యాలయంలోనూ దొంగలు ప్రవేశించి, చోరీకి యత్నించారు. బీరువాను తెరిచేందుకు ప్రయత్నించారు. రాకపోవడంతో వెనుదిరిగారు. వేంకటేశ్వరుని ఆలయంలో చోరీ చీపురుపల్లి : పట్టణంలోని శివరాం రోడ్డులో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆలయం ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు. ప్రధాన హుండీలో ఉన్న సుమారు రూ.25 వేల కానుకలను అపహరించారు. శుక్రవారం ఉదయం ఆలయ అర్చకుడు మురళి వచ్చి చూసేసరికి తలుపులు తెరచి ఉండడంతో ఆలయ కమిటీకి సమాచారం అందించారు. దుండగులు ఆలయంలో ఉన్న బీరువాను కూడా తెరచి అందులో ఉన్న వస్తువులు, స్వామి వారి వస్త్రాలు చిందర వందరగా పడేసినట్లు గుర్తించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు ఏఎస్సై ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.