ధ్రువీకరణ పత్రాలపైఅవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ధ్రువీకరణ పత్రాలపైఅవగాహన కల్పించాలి

Published Wed, Mar 26 2025 1:41 AM | Last Updated on Wed, Mar 26 2025 1:37 AM

డీఆర్వో పద్మాలత

పాడేరు : ధ్రువీకరణ పత్రాల ఉపయోగం, పొందే విధానం, వినియోగంపై గిరిజనులకు అవగాహన కల్పించాలని డీఆర్వో పద్మాలత తెలిపారు. ఐటీడీఏ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశ మందిరంలో జిల్లా న్యాయసేవల సంస్థ ఆధ్వర్యంలో నెలవారీ అవగాహన సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమా వేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా గిరిజనులే ఉండటం, వారిలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండటంవల్ల అవగాహ న క్యాంపులు, సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. కుల,ఆదాయ,జనన, మరణ ధ్రువీ కరణ పత్రాలజారీలో నిర్లక్ష్యం, జాప్యం లేకుండా సేవలు అందించాలన్నారు.ధ్రువీకరణపత్రాల జారీలో ఏ విధమైన కోర్టు కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపా రు. ఈ పత్రాల జారీ విషయంలో పంచాయ తీ కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లలకు, గ్రా మ రెవెన్యూ అధికారులకు మార్గదర్శకాలతో కూడిన సర్క్యులర్‌ జారీ చేయాలని జిల్లా పంచాయతీ, డివిజనల్‌ పంచాయతీ అధికారులను ఆదేశించారు. డీపీవో లవరాజు, డివిజనల్‌ పంచాయతీ అధికారి పి.ఎస్‌.కుమార్‌, డివిజనల్‌ అభివృద్ధి అధికారి తేజ్‌ రతన్‌, ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ కె.రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement