ఫలించిన మూడు దశాబ్దాల న్యాయ పోరాటం  | The bench set aside the judgment of the single judge | Sakshi
Sakshi News home page

ఫలించిన మూడు దశాబ్దాల న్యాయ పోరాటం 

Published Tue, May 30 2023 2:10 AM | Last Updated on Tue, May 30 2023 8:15 AM

The bench set aside the judgment of the single judge - Sakshi

సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో స్వామి హథీరాంజీ మఠానికి చెంది­న 25.36 ఎకరాలపై రక్షిత కౌలుదారులు మూడు దశాబ్దాలుగా చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది. ఈ కేసులు పెండింగ్‌లో ఉండగానే తల్లిదండ్రులు మరణించడంతో వారి పిల్లలు చట్టబద్ధ వారసులుగా న్యాయ పోరాటాన్ని కొనసాగించారు. ఫలితం అందుకున్నారు.

ఈ భూమిని సాగు చేసుకుంటున్న రక్షిత కౌలుదారులకే విక్రయించేందుకు మఠం సంరక్షకునికి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1990లో జారీ చేసిన జీవో 751ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చి న తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. వేలంలో కాకుండా, మఠానికి పూర్తిస్థాయి సంరక్షకుడు లేకుండా భూములను విక్రయించడానికి వీల్లేదన్న సింగిల్‌ జడ్జి తీర్పును ధర్మాసనం తప్పుపట్టింది. ఆ భూముల విక్రయం ప్రతిపాదనను మ­ఠాధిపతి సర్జుదాస్‌ 1979లోనే తీసుకొచ్చారని గుర్తు చేసింది.

1957 నుంచి ఆ భూములు రక్షిత కౌలుదారుల సాగులోనే ఉన్నాయని, వాటిని వారి నుంచి స్వాదీనం చేసుకోవడం న్యాయపరంగా చాలా కష్టమని భావించడం, వివాదాలకు ఆ­స్కారం ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఆ భూములను వారికే విక్రయించడం మే­ల­ని మఠం సంరక్షకుడు చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ మే­రకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 

ఇదీ నేపథ్యం: హథీరాంజీ మఠానికి తిరుపతిలోని సర్వే నంబర్లు 51/1, 54/2లో ఉన్న 25.36 ఎకరాలను ఎం.చెంగమ్మ, టి.మునుస్వామి నాయుడు 1957 నుంచి రక్షిత కౌలుదారులుగా సాగు చేస్తున్నారు. ఆ తరువాత వారికి మఠం మహంత్‌ శాశ్వత లీజు మంజూరు చేశారు. మహంత్‌ మరణం తరువాత 1966లో ఆ లీజు రద్దయింది. అయినా వారు లీజు డీడ్‌ల ద్వారా కొనసాగుతున్నారు. 1980లో అప్పటి మహంత్‌ సస్పెండ్‌ అయ్యారు. మఠానికి సంరక్షకుడు నియమితులయ్యారు.

అనంతరం ఆ భూమిని కౌలుదారులకే విక్రయించాలని మఠం నిర్ణయించింది. దీనిపై వి.నాగమణి, డి.కుప్పుస్వామి నాయుడు మరికొందరు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఈ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ రక్షిత కౌలుదారులకే భూమిని విక్రయించేందుకు అనుమతిస్తూ 1990లో జీవో 751 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ నాగమణి తదితరులు హైకోర్టులో అదే ఏడాది పిటిషన్‌ వేశారు.

విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. జీవో 751ని రద్దు చేస్తూ 2002లో తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చెంగమ్మ తదితరులు హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. అనంతరం చెంగమ్మ, ఆమె భర్త వెంకట్రామనాయుడు మరణించడంతో వారి పిల్లలు ఈ వ్యాజ్యంలో చట్టబద్ధ వారసులుగా చేరారు. ఈ అప్పీల్‌పై జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తుది విచారణ జరిపి ఇటీవల తీర్పునిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement