judgment
-
‘‘ఎలా చూసినా కులగణనే కీలకం’’
ఎన్నికల వేళ సందడి చేసిన కులగణన వాదం ఆ తర్వాత కూడా చర్చనీయాంశంగా కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు దేశంలోని ఉపకులాలకు న్యాయం జరిగేలా ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను విభజించవచ్చని వెలువరించిన తీర్పు ఇప్పుడు ఎంతో కీలకంగా మారింది. అయితే ఈ తీర్పును అమలుపరచడానికి రాష్ట్రాలు వేటికవి తమ ప్రాంతాల్లో కులగణన చేస్తే కుదరదు. కేంద్రం మాత్రమే జనాభా లెక్కల్లో భాగంగా ఈ పని చేయాలి. లేదంటే కోర్టులో కొత్త వివాదాలు తలెత్తుతాయి. అయితే రిజర్వేషన్ల వల్ల అత్యధిక ప్రయోజనం పొందుతున్న కులాలవారూ, అలాగే స్థానికంగా బలంగా ఉన్న రిజర్వేషన్ వెలుపల ఉన్న శూద్ర కులాలవారూ కులగణనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు.దేశంలోని ఉపకులాలకు న్యాయం జరిగేలా ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను విభజించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పోతే ఆ విభజన న్యాయబద్ధ ఆబ్జెక్టివ్గా తేల్చిన జనాభా లెక్కల ప్రకారమే చెయ్యాలని కూడా తేల్చి చెప్పింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం ఇటువంటి లెక్కలు రాష్ట్రాలు కమిషన్ల ద్వారానో, లేదా స్వంత రాష్ట్రస్థాయి జనాభా గణన చేపట్టి చెయ్యలేరు. ఏ కేంద్ర ప్రభుత్వమైతే సుప్రీంకోర్టు ముందు ఉపకులాలకు న్యాయబద్ధమైన రిజర్వేషన్ పంపకం అవసరమే అని ఒప్పుకుందో... ఆ ప్రభుత్వమే కేంద్ర స్థాయిలో కులాల వారీగా జనాభా లెక్కలు తీయించే వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జడ్జిమెంట్ అమలుకు పూనుకోలేదు. ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం సొంత రాష్ట్ర ఉపకులాల లెక్కలు తీయించి, ఏదో ఒక రిజర్వేషన్ కేటగిరీలో రిజర్వేషన్ విభజిస్తే ఆ విభజన మళ్లీ హైకోర్టులో ఉపకుల లెక్కల యాక్యురసీ (కచ్చితత్వం) కొట్టివేయబడుతుంది. చివరకు సుప్రీంకోర్టుకు పోయినా అదే సమస్య ఎదురవుతుంది.ఇది ఎస్సీ, ఎస్టీల సమస్య మాత్రమే కాదు...ఇప్పటికే ఉప కులాల లెక్కలు తీసిన బిహార్ రిజర్వేషన్ విభజన, పెంపుదలను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల ఉపకుల న్యాయపర విభజన కేవలం ఎస్సీలకో, ఎస్టీలకో సంబంధించింది మాత్రమే కాదు. ఓబీసీ కులాల్లో అన్ని రాష్ట్రాల్లో తమ తమ ఉపకులాల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగాలు, సీట్లు రావడం లేదని ఉద్యమాలు నడుస్తున్నాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో మాదిగ, మాల కులాలకో; కోయ, గోండు, చెంచు, లంబాడాల మధ్య విభజనకో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పరిమితమై లేదు. బీసీ కులాల్లో ఉన్న ఏబీసీడీ గ్రూపుల్లో చాలా ఉప కులాలున్నాయి. డీ గ్రూపులో గొల్ల– యాదవులకు... మున్నూరు కాపులకు దొరికే అవకాశాలు దొరకడం లేదనీ, బీ గ్రూపులో కురుమలకు తమ వాటా తమకు దొరకడం లేదనే తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే వాళ్ళు తమ కులాన్ని సెమీ–నొమాడిక్ కమ్యూనిటీ (అర్ధ సంచార జాతి) లోకి మార్చాలని డిమాండ్ ఉంది.మహారాష్ట్రలో ధనగర్లు (గొర్రెల కాపర్లు) చాలా ఉద్యమాలు నడిపి తమ కులానికి మొత్తం ఓబీసీ రిజర్వేషన్లో 3 శాతం వాటా సంపాదించుకున్నారు. అక్కడి మరాఠాలు తమకూ రిజర్వేషన్లు కావాలని చాలా కాలంగా పోరాడుతున్నారు. కోర్టులు అందుకు అంగీకరించనందున తమకు కుంబి కులసర్టిఫికెట్లు ఇచ్చి రిజర్వేషన్లోకి చొప్పించండి అని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. గుజరాత్లో పటేళ్లు (పాటీదార్లు) తమకూ రిజర్వేషన్లు కావాలని చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఉపకుల రిజర్వేషన్ జడ్జిమెంట్ ద్వారా ఈ అన్ని రకాల డిమాండ్లకు పరిష్కారం వెతకాల్సి ఉంటుంది.2024 ఎన్నికల్లో ఓట్ల కోసం చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఉపకులాలకు ‘మీ వాటా మీకు ఇప్పిస్తామని’ వాగ్దానం చేసింది. ప్రధానమంత్రి స్వయంగా ఆ మీటింగులో పాల్గొన్నారు. కానీ జాతీయ స్థాయిలో కుల గణన చేయించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్... 1931 నాటి జనాభా లెక్కల్లో చేసినట్లు కులగణనను జనాభా లెక్కల్లో భాగంగా చెయ్యాల్సిన అవసరాన్ని కేంద్రం ముందు పెట్టింది. ఇక తప్పించుకోవడం సాధ్యం కాదు.కాంగ్రెస్ వెనక్కి తగ్గింది!కాంగ్రెస్ పార్టీ 2011 జనాభా లెక్కల్లో భాగంగా కులగణన ఒక ప్రత్యేక కుల లెక్కల షెడ్యూల్ను తయారుచేసి లెక్కలు తీయించారు. కానీ శుద్రాతీత అగ్రకులాల్లో (బ్రాహ్మణ, బనియా, క్షత్రియ, కాయస్థ, ఖత్రి కులాల వారి నుండి) వ్యతిరేకత రావడం వల్ల ఆ లెక్కలు బయట పెట్టకుండా ఆపేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో మేధావి వర్గమంతా ఈ ఐదు కులాల వారే! 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ కులజనాభా లెక్కలు కావాలని కాంగ్రెస్ ఓట్ల శాతం పెంచే ప్రయత్నం చేశారు. కానీ రిజర్వేషన్ బయట ఉన్న కులాల నుండి అన్ని పార్టీల్లో వ్యతిరేకత వస్తోంది. ఈ కారణం వల్లనే కర్ణాటకలో కులాల లెక్కలు తీసి కూడా బయట పెట్టకుండా ఆపేశారు. కారణం బ్రాహ్మణ, బనియా, లింగాయత్, వక్కళి కులాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కనుక. వీటన్నిటికి మూలమేమంటే చాలా చిన్న శూద్రేతర కులాలు చాలా పెద్ద మొత్తంగా ఉద్యోగాలు, ప్రభుత్వరంగ ఐఐటీ, ఐఐఎమ్లు, మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందుతున్నాయి. వీరి కులాల సంఖ్య జనాభా లెక్కల ద్వారా బయటికి వస్తే వారు దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని నడుపడానికి వ్యతిరేకంగా చాలా పెద్ద తిరుగుబాటు వస్తుంది.మొత్తం మీద శూద్రుల వాటా తక్కువే!రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు, కమ్మలు, వెలమలకు కూడా అర్థం కాని అంశమేమంటే... ఢిల్లీ అధికారంలోగానీ, బ్యూరాక్రసీలోగానీ; గవర్నర్లు, అంబాసిడర్ల వంటి పదవుల్లో కానీ వీరి వాటా చాలా తక్కువ అనేది. రిజర్వేషన్ బయట ఉన్న మొత్తం శూద్ర అగ్ర కులాలకు వారి జనాభా లెక్కల ప్రకారం చూస్తే కేంద్ర అధికారంలో కానీ, మోనోపలీ క్యాపిటల్లో కానీ అతి కొద్దిపాటి వాటా మాత్రమే ఉన్నది. కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్లో కాని, ప్రధానమంత్రి సెక్రటేరియట్లో కాని వారు ఎవ్వరూ కనబడరు. వారు కేవలం రాష్ట్ర అధికారం కోసమే ఆరాటపడుతున్నారు. కానీ కేంద్రంలో మొత్తం శూద్రుల వాటా చాలా చిన్నదిగా ఉంది. కుల గణన... రెడ్డి, కమ్మ, వెలమ వంటి కులాలు జాతీయ స్థాయిలో వాటా పొందడానికి పనికొస్తుంది. ఇదే పరిస్థితి కర్ణాటకలోని లింగాయత్, వక్కళి కులస్థులది కూడా! వాళ్ళు రాష్ట్ర రిజర్వేషన్ సిస్టమ్లో భాగస్వాములే కానీ కులలెక్కలను వ్యతిరేకిస్తున్నారు. కేరళలో నాయనార్లు కుల లెక్కలే కాదు రిజర్వేషన్లను కూడా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు తాము శూద్రులం కాదు క్షత్రియులమని చెప్పుకుంటున్నారు. ఇది కేవలం ఆ చిన్న రాష్ట్రంపై పెత్తనం చలాయించడానికి పనికొస్తుంది. కానీ కేంద్రంలో నాయనార్లకు కూడా వాటా లేదు. ప్రతి రాష్ట్రంలో ఉన్న శూద్ర పై కులాలు కులగణనను ఎందుకు స్వాగతించాలో ఆలోచించడం లేదు.1931లో బ్రిటిష్ ప్రభుత్వం కులాల లెక్కలు తీసి ఉండకపోతే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణులు తామే దేశంలో అత్యధికులం అని నమ్మించేవారు. అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వాళ్ళు అలానే నమ్మించారు. దేశం మొత్తం మీద బ్రిటిష్ పాలక వ్యవస్థ (అడ్మినిస్ట్రేషన్)లో వాళ్ళే ఉండేవారు. జనాభా రీత్యా కూడా ‘మేమే అన్ని కులాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నామ’ని నమ్మించేవారు. ఆచరణలో కులం ఉన్నప్పుడు ఆ కులం సంఖ్య ఎంత ఉందో తెలిస్తే తప్ప కులాల అభివృద్ధి, దేశం అభివృద్ధి జరిగే ప్రణాళికలు తయారు చెయ్యడం సాధ్యం కాదు.తక్కువ సంఖ్యలో ఉండి ఎక్కువ ఉద్యోగాలు, విద్యారంగంలో సీట్లు సంపాదించే కులాలు, కులం లెక్కలు తియ్యొద్దని తప్పకుండా వాదిస్తాయి. ఈ ఆలోచనా ధోరణి నుండే రిజర్వేషన్లలో 50 శాతానికి మించి ఉండకూడదని వాదించాయి. సుప్రీంకోర్టులో తమకు అనుకూల జడ్జిమెంటును సంపాదించాయి. దానికి మెరిట్ అనే ఒక వాదనను ముందు పెట్టాయి. అసలు కులాన్ని ఈ దేశానికి బ్రిటిష్ వలసవాదులు తెచ్చారని వాదించాయి. ఉత్పత్తి కులాలు ముఖ్యంగా శూద్రులు ఢిల్లీలో పాలకులైతే తమ చరిత్ర తలకిందులవుతుందని భావించాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉపకులాల వాటా జడ్జిమెంట్ చరిత్ర మలుపును మరో మెట్టు ఎక్కించేదనే అంశంలో సందేహం లేదు. ఇప్పుడు అన్ని శూద్ర కులాలు, దళితులు, ఆదివాసులు ఐక్యంగా కుల జనాభా లెక్కలు చెయ్యాలని పోరాడటమే వారి భవిష్యత్తుకు మార్గం. - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
వినేశ్ రజత పతకం అప్పీల్పై తీర్పు నేడు!
పారిస్: క్రీడాలోకమే కాదు... యావత్ దేశం ఎదురుచూపులకు నేడు తెరపడే అవకాశముంది. భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అప్పీల్పై నేడు తీర్పు వెలువడనుంది. పారిస్ విశ్వక్రీడల్లో మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్లోకి ప్రవేశించిన ఆమె సరిగ్గా బౌట్కు ముందు కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. దీంతో ఫైనల్లో ఓడినా కనీసం ఖాయమనుకున్న రజతం చేజారడంతో పాటు... అమె పాల్గొన్న వెయిట్ కేటగిరీ జాబితాలో చివరి స్థానంలో నిలవడం భారతావనిని నిర్ఘాంత పరిచింది. తన అనర్హతపై సవాలుకు వెళ్లిన ఫొగాట్... సంయుక్త రజతం డిమాండ్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో అప్పీలు చేసింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిష్ణాతులైన లాయర్లతో ఈ అప్పీలుపై వాదించింది. విచారణ పూర్తికావడంతో నేడు సీఏఎస్ తుది తీర్పు వెలువరించనుంది. కాగా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ... వినేశ్ బరువు పెరగడం, అనర్హతకు బాధ్యుడిని చేస్తూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పర్దివాలాపై విమర్శలకు దిగడం సమంజసం కాదని చెప్పింది.సంబంధిత అథ్లెట్ల బరువు, ఈవెంట్ల నిబంధనలపై కోచ్, వ్యక్తిగత సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడింది. -
కేసు ఉన్నా.. ఉద్యోగం తొలగించరాదు
సాక్షి, అమరావతి: క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నంత మాత్రాన ఓ ఉద్యోగిని నేరుగా ఉద్యోగం నుంచి తీసేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. నేరం నిరూపణ అయ్యేంతవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిర్దోషే అని.. దీనిని అధికారులు విస్మరించకూడదని గుర్తు చేసింది. క్రిమినల్ కేసు పెండింగ్లో ఉండటం ఆ ఉద్యోగి తన అధికారిక విధులను నిర్వర్తించడానికి ఎంతమాత్రం అడ్డంకి కాదని తేల్చిచెప్పింది. క్రిమినల్ కేసు ఉన్నప్పుడు ఉద్యోగంలోంచి తీసేయాలంటే.. ముందుగా ఆ ఉద్యోగికి షోకాజ్ నోటీసు ఇవ్వడం, విచారణ జరపడం అధికారుల బాధ్యత అని తెలిపింది. నోటీసు ఇవ్వకుండా, విచారణ జరపకుండా ఉద్యోగం నుంచి తొలగించేంత భారీ శిక్ష విధించడం చట్టప్రకారం చెల్లదని స్పష్టం చేసింది. అలాంటి శిక్ష రద్దవుతుందని తేల్చి చెప్పింది. అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్న ఓ మహిళను ఏసీబీ కేసు నెపంతో నేరుగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. సదరు మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తూ అధికారులు జారీ చేసిన ప్రొసీడింగ్స్ను రద్దు చేసింది. ఇదీ కేసుపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామానికి చెందిన కె.ధనలక్ష్మి 1998లో అంగన్వాడీ కార్యకర్తగా నియమితులయ్యారు. ఆ తరువాత కాంట్రాక్ట్ పద్ధతిలో సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుకు ఆమెను ఎంపిక చేశారు. కాగా.. 2008 డిసెంబర్ 11న ఏసీబీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే.. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు డిసెంబర్ 14న అధికారులు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. తనను ఏకపక్షంగా తొలగించారంటూ ఆమె 2009లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ధనలక్ష్మిని అంగన్వాడీ వర్కర్గా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో ధనలక్ష్మి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీవ్రంగా స్పందించడంతో విధిలేని పరిస్థితుల్లో 2010లో ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. తమపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారన్న ఉద్దేశంతో అధికారులు ధనలక్ష్మిని ఏసీబీ కేసును సాకుగా చూపి ఉద్యోగం నుంచి తొలగిస్తూ 2011లో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వీటిని సవాల్ చేస్తూ ఆమె అదే ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి శ్రీకాంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారులు కావాలనే ఆమెను తప్పుడు కేసులో ఇరికించారన్నారు. ఈ విషయం నిరూపణ కావడంతో 2016లో ఏసీబీ కోర్టు ధనలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించి.. కేసు కొట్టేసిందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేస్తూ రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ధనలక్ష్మిని నాలుగు వారాల్లో తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆమె అన్ని రకాల సర్వీసు ప్రయోజనాలకు అర్హురాలని, చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం మొత్తాన్ని నాలుగు వారాల్లో చెల్లించాలని సూచించారు. -
ఆక్రమణ నుంచి ‘అమరా’కు విముక్తి
పెదకాకాని: దేవదాయ శాఖ 17ఏళ్ల పాటు చేసిన న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. సుమారు రూ.3 కోట్ల విలువైన 20 సెంట్ల స్థలాన్ని అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా అమరా వారి సత్రం పెదకాకాని శివాలయం దేవస్థానానిదే అని హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఆలయ అధికారులు మంగళవారం దానిని స్వాదీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆలయ ఉప కమిషనర్ దాసర శ్రీరామ వరప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. 1942లో గుంటూరుకు చెందిన అమరా వెంకటేశ్వర్లు, మువ్వల వెంకట సుబ్బారావులు గుంటూరు జిల్లా పెదకాకాని శివాలయం ఎదురుగా ఉన్న 20 సెంట్లు భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిలో భక్తుల సౌకర్యార్థం సత్రం నిర్మించారు. వారి అనుమతితో 1968లో దేవదాయ శాఖ ఆ«దీనంలోకి తీసుకుని కొంతకాలం గడిచిన తరువాత సత్రం యజమానుల నుంచి కంట్రిబ్యూషన్ వసూలుచేశారు. సత్రం నిర్వాహకులు ఆ సత్రంలో పనులకు యండ్రప్రగడ సీతారామయ్య, వెంకటరత్నం (భార్యభర్తలను)లను నియమించి వారికి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. 2006లో అప్పటి ఆలయ ఈఓ బీహెచ్ వీరారెడ్డిని ఆ సత్రానికి సింగిల్ ట్రస్టీగా దేవదాయ శాఖ అధికారులు నియమించారు. ఆ తర్వాత కొంతకాలానికి సత్రంలో ఉంటున్న యండ్రప్రగడ సీతారామయ్య సత్రం తనదేనంటూ భార్య వెంకటరత్నంకు వీలునామా రాయడం.. వెంకటరత్నం తన కుమారుల్లో ఒకరైన సాంబశివరావుకు రిజి్రస్టేషన్ చేశారు. ఆ తర్వాత 2005లో సత్రాన్ని ఖాళీ చేయాలని ఆలయ అధికారులు కోరడంతో అందులో ఉంటున్న యండ్రప్రగడ కుటుంబం సత్రం తమదేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.సత్రం పూర్తి హక్కులు శివాలయానికి.. జిల్లా న్యాయస్థానం నుంచి ఈ కేసు వ్యవహారం 2008లో ట్రిబ్యునల్కు చేరడంతో 2011లో సత్రం ఆలయానికి చెందినదేనని తీర్పు వచ్చింది. అప్పటికే సత్రంలో పని కల్పిస్తే సత్రాన్ని స్వాధీనం చేసుకున్నారని భావించిన సత్రం యజమానులు అమరా వెంకటేశ్వర్లు, మువ్వల వెంకటసుబ్బారావు కుటుంబ సభ్యులు 2008లో ఆ సత్రం పూర్తి హక్కులు శివాలయానికి కల్పిస్తూ రిజి్రస్టేషన్ చేశారు. సత్రాన్ని స్వాధీనం చేసుకోవడంలో కొందరు అధికారుల ఉదాశీన వైఖరితో ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి గ్రామపెద్ద ఆలపాటి రామస్వామి కూడా అమరా వారి సత్రం ఆలయానికి చెందినదేనంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో.. గత నెల 21న అమరా వారి సత్రం సంపూర్ణ హక్కులు పెదకాకాని శివాలయానికి చెందినవేనని హైకోర్టు తీర్పు ఇచి్చంది. దీంతో సత్రంలో ఉంటున్న యండ్రప్రగడ వెంకటరత్నంకు పదిరోజుల పాటు ఆలయ శివ సదనంలో ఒక రూంలో ఉండేందుకు అనుమతించి మంగళవారం సత్రాన్ని ఖాళీ చేయించారు. అనంతరం శిథిలావస్థకు చేరిన సత్రాన్ని కూలి్చవేశారు. ఈ భూమి శివాలయానికి చెందినదని.. ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరంగా శిక్షార్హులని ఆలయ ఉప కమిషనర్ దాసర శ్రీరామ వరప్రసాదరావు హెచ్చరించారు. -
పిన్నెల్లి వ్యాజ్యాలపై తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి : పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ వ్యాజ్యాల్లో తీర్పు వెలువరించే వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పిన్నెల్లి పాల్గొనకుండా పెట్టిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటింగ్లో పాల్గొనేందుకు పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తరువాత ఈ ఉత్తర్వులను పొడిగిస్తూ వచ్చింది. గురువారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి.పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారు.. తీవ్రంగా పరిగణించండిఈ సందర్భంగా పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘం, పోలీసుల తీరును ఎండగట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి తీరాలన్న లక్ష్యంతో ఎన్నికల కమిషన్ అసాధారణ రీతిలో ఉత్తర్వులిచ్చిందని, గతంలో ఎన్నడూ కమిషన్ ఇలా వ్యవహరించలేదని అన్నారు. పోలీసులు పరిధి దాటి వ్యవహరించారన్నారు. తప్పుడు వివరాలతో కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈవీఎం కేసులో పిన్నెల్లికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వనున్నట్లు సంకేతాలు రావడంతో ఆ వెంటనే హత్యాయత్నం కేసులు బనాయించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారన్నారు. గత నెల 22న హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వగా, 23న ఇతర కేసుల్లో పిన్నెల్లిని నిందితునిగా చేర్చారని తెలిపారు. హైకోర్టుకు మాత్రం 22నే చేసినట్లు చెప్పారని, తరువాత ఇది అబద్ధమని తేలడంతో 23నే నిందితునిగా చేర్చినట్లు పోలీసులు అంగీకరించక తప్పలేదన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. పోలీసుల తీరును తీవ్రంగా పరిగణించాలన్నారు. హత్యాయత్నం చేశారని చెప్పినంత మాత్రాన ఆ సెక్షన్ కింద కేసు నమోదుకు వీల్లేదని, అందుకు నిర్దిష్ట విధానం ఉందని వివరించారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిన్నెల్లిపై పెట్టిన మరో కేసు చెల్లదని చెప్పారు.నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోండిపోలీసుల తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు నమోదు చేశామని తెలిపారు. 2019లో కూడా ఇదే తరహా కేసు నమోదైందన్నారు. మధ్యంతర ముందుస్తు బెయిల్ షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారని, సాక్షులను బెదిరించారని తెలిపారు. పిన్నెల్లి, అతని అనుచరుల దాడిలో కారెంపూడి సీఐ నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డారన్నారు. పిటిషనర్ నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకునేందుకు వచ్చిన శేషగిరిరావు, ప్రశ్నించిన మరో మహిళపై పిన్నెల్లి, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారన్నారు.అశ్వనీ కుమార్ నియామకం చట్ట విరుద్ధంఅనంతరం పిన్నెల్లి న్యాయవాది నిరంజన్రెడ్డి పోలీసుల తరఫున అశ్వనీ కుమార్ హాజరు కావడంపై అభ్యంతరం తెలిపారు. ఆయన నియామకం సీఆర్పీసీ నిబంధనలకు అనుగుణంగా జరగలేదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం గురించే నిబంధనల్లో ఉంది తప్ప, స్పెషల్ కౌన్సిల్ గురించి లేదన్నారు. తప్పును సరిచేసుకుని చట్ట ప్రకారం ఆయన్ను నియమించుకుంటే అభ్యంతరం లేదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
పోస్టల్ బ్యాలెట్ పై నేడు కీలక తీర్పు
-
Madhya Pradesh High Court: సహజీవనం చేసినా భరణం
భోపాల్: చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా ఒక పురుషుడితో చాలాకాలం సహజీవనం చేసి విడిపోయిన మహిళ భరణానికి అర్హురాలేనని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. భరణం ఇవ్వాలన్న కింది కోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. 38 ఏళ్ల శైలేంద్ర బాప్చే, 48 ఏళ్ల అనిత చాలాఏళ్లు సహజీవనం చేశారు. కుమారుడు పుట్టాక విడిపోయారు. బిడ్డను పోషించుకోవడానికి, తన జీవనానికి భరణం ఇవ్వాలని అనిత డిమాండ్ చేయగా శైలేంద్ర అంగీకరించలేదు. దాంతో ఆమె ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. అనిత్ పిటిషన్పై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు రూ.1,500 చొప్పున భరణం చెల్లించాలని శైలేంద్రను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శైలేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వును సమర్థించింది. శైలేంద్ర పిటిషన్ను కొట్టివేసింది. సహజీవనం చేసి విడిపోయిన మహిళ తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే సీఆర్పీసీ సెక్షన్ 125 కింద ఆమెకు భరణం చెల్లించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. -
కవితకు బెయిల్పై 8న తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. ఈనెల 8వ తేదీ సోమవారం తీర్పు వెలువరిస్తామన్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 20న విచారణ చేపడతామని తెలిపారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్, బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారించారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింíఘ్వీ, ఈడీ తరఫున జొహెబ్ హొస్సేన్లు వాదనలు వినిపించారు. తల్లి పర్యవేక్షణ అవసరం: సింఘ్వీ కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, 16 ఏళ్ల కుమారుడికి తల్లి పర్యవేక్షణ, భావోద్వేగ మద్దతు ఈ సమయంలో ఎంతో అవసరమని సింఘ్వీ పేర్కొన్నారు. తల్లి అరెస్టుతో కుమారుడు ఎంతో దిగ్భ్రాంతి చెందిన పరిస్థితిని మనం చూడాలన్నారు. కవిత కుమారుడు పరీక్షలు రాసే సబ్జెక్టులు ప్రస్తావిస్తూ.. తల్లి స్థానాన్ని తండ్రి లేదా సోదరుడు భర్తీ చేయలేరని, మానసిక ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పారు. తల్లి దగ్గర ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుందని తెలిపారు. కవితకు బెయిల్ ఇచ్చినా ఈడీకి వచ్చే ఇబ్బందేమీ లేదని, ఆమెను తిరిగి సుల భంగానే అదుపులోకి తీసుకోవచ్చని అన్నారు. తండ్రి ఢిల్లీలో ఉండి న్యాయపోరాటం చేస్తున్నారని కుమారుడు తెలంగాణలో ఉన్నారని సింఘ్వీ తెలిపారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయంలో ప్రధాని ఆల్ ఇండియా రేడియోలో ఉపన్యాసాలు ఇస్తున్నారని, ఆ సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఊహకు మించి ఉంటుందని వ్యాఖ్యానించారు. అన్నీ చూసి కోర్టు నిర్ణయం తీసుకోవాలి: హొస్సేన్ సెక్షన్ 45 నిబంధనలు సింఘ్వీ నొక్కి చెబుతున్నారని, అయితే ప్రజా జీవితంలో ఉండే ప్రముఖ రాజకీయ నాయకురాలికి అవి వర్తించవని ఈడీ తరఫు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ అన్నారు. ఈ కేసులో లంచం ఇచ్చినట్టుగా ఆరోపణలున్న ప్రధాన వ్యక్తుల్లో ఒక మహిళను ప్రశ్నిస్తున్నామని, ప్రాక్సీల ద్వారా ఆమె లబ్ధి పొందారని వాదించారు. కేవలం ఇతర నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ విషయం చెప్పడం లేదని, సంబంధిత పత్రాలు, వాట్సాప్ చాట్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం, ఆమెకు వ్యతిరేకంగా ఉన్న అన్ని విషయాలు చూసి న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తన దగ్గర ఉన్న ఎఫ్ఎస్ఎల్ నివేదిక సాక్ష్యాలు ఎలా నాశనం చేశారో నిరూపిస్తుందన్నారు. కవిత పలు ఫోన్ల నుంచి సమాచారం డిలీట్ చేశారని, మొత్తంగా 100 కంటే ఎక్కువ ఫోన్లు నాశనం చేశారని ఆరోపించారు. ఈ కేసులో చాలా పెద్ద పురోగతి సాధించే దశలో ఉన్నామని, తాత్కాలిక ఉపశమనం కల్పిస్తే దర్యాప్తు పక్కకు వెళ్లే అవకాశం ఉందన్నారు. కవిత చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని, ప్రజలను కూడా ఆమె ప్రభావితం చేస్తారన్నారు. సాక్షుల్ని పిలిచి వారి వారి వాంగ్మూలాలు మార్చుకోవాలని బెదిరించే అవకాశం ఉందంటూ హొస్సేన్ వాదించారు. ఈ దశలో కవిత న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరోసారి జోక్యం చేసుకొని కవిత కుమారుడికి 12 పేపర్లలో ఏడు పూర్తయ్యాయని భారతీయతలో తల్లి ఒకరే తగిన సాన్నిహిత్యాన్ని అందించగలరని తెలిపారు. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. -
బదిలీ అధికారం యజమానికి ఉంది
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీ విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారిని బదిలీచేసే అధికారం సదరు యజమాని (ప్రభుత్వం)కి ఉందని స్పష్టంచేసింది. ఒప్పందంలో బదిలీ ప్రస్తావన ఉన్నప్పుడు ప్రభుత్వం వారిని బదిలీ చేయడం తప్పుకాదని తేల్చిచెప్పింది. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను బదిలీచేస్తూ 2022లో ప్రభుత్వం జారీచేసిన జీఓ–103ను హైకోర్టు సమర్ధించింది. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగులు కనీస వేతన స్కేల్కు అర్హులని స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని వారందరికీ కనీస వేతన స్కేల్ను వర్తింపజేస్తూ సమగ్ర ఉత్తర్వులు జారీచేసిందని.. అందులో కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నారని పేర్కొంది. సవరించిన కనీస వేతన స్కేల్ను కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 1–1–2022 నుంచి అమలుచేయాలని.. వారికి చెల్లించాల్సిన బకాయిలను 12 వారాల్లో చెల్లించాలని అధికారులకు తేలి్చచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ కృపాసాగర్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు.. రాష్ట్ర ప్రభుత్వం తమకు కనీస వేతన స్కేల్ను ఖరారుచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను అమలుచేసేలా అధికారులను ఆదేశించడంతో పాటు, తమను వివిధ ప్రాంతాలకు బదిలీచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను చట్ట విరుద్దంగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లోని కాంట్రాక్టు టీచర్లు 2022లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు కాంట్రాక్టు టీచర్ల బదిలీల ఉత్తర్వుల విషయంలో జోక్యానికి నిరాకరించారు. ఇదే సమయంలో కోర్టుకొచ్చిన టీచర్లు ఎక్కడ పనిచేస్తున్నారో వారిని అక్కడే కొనసాగించాలని.. అంతేకాక.. వారికి కనీస వేతనాలు, తదనుగుణ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పారు. బదిలీల విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ కాంట్రాక్టు టీచర్లు.. కనీస వేతనాలపై ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. బదిలీ అధికారం యజమానికి ఉంది ‘ఇక కాంట్రాక్టు టీచర్ల బదిలీ విషయానికొస్తే, వారిని కావాల్సిన చోటుకు బదిలీ చేయడం సబబే. నిజానికి.. 2013 నాటి కాంట్రాక్టు ఒప్పందంలో బదిలీల విషయంలో ఎలాంటి నిబంధన లేదు. దీని ఆధారంగా కాంట్రాక్టు టీచర్లు తమను బదిలీ చేయడానికి వీల్లేదంటున్నారు. అయితే, 2022లో తీసుకొచ్చిన కొత్త ఒప్పందంలో బదిలీ నిబంధన ఉంది. అందువల్ల ప్రస్తుత కేసులో కాంట్రాక్టు టీచర్ల బదిలీ ఉత్తర్వులను ఎంతమాత్రం తప్పుపట్టలేం. బదిలీల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు సమర్థనీయమే’.. అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంచేసింది. వారికిచ్చి వీరికివ్వకపోవడం వివక్షే.. వీటిపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కాంట్రాక్టు టీచర్ల తరఫు న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. ఈ తీర్పు కాంట్రాక్టు, తాత్కాలిక, అడ్హాక్ తదితర ఉద్యోగులకు వర్తిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాలను వర్తింపజేస్తూ జీఓ ఇచ్చిందని, అయితే అధికారులు వాటిని కాంట్రాక్టు టీచర్లకు వర్తింపచేయడం లేదన్నారు. పిటిషనర్లు కాంట్రాక్టు టీచర్లు మాత్రమేనని, వారికి ట్రాన్స్ఫర్లు వర్తింపజేయడానికి వీల్లేదని తెలిపారు. కనీస వేతనాలు వర్తింపజేయకుండా బదిలీలు చేయడానికి వీల్లేదన్నారు. సర్వశిక్షాభియాన్ తరఫు న్యాయవాది కేవీ రఘువీర్ వాదనలు వినిపిస్తూ.. కేజీబీవీ, యూనివర్సిటీలు, సొసైటీలు, మోడల్ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కనీస వేతన స్కేల్ను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అయితే, ఈ ఉత్తర్వులు మంజూరు చేసిన ఖాళీల కింద నియమితులైన వారికి మాత్రమే వర్తిస్తాయన్నారు. అలాగే, బదిలీ చేయాలని పలువురు కాంట్రాక్టు టీచర్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమరి్పంచారని, ఆ మేరకు వారి బదిలీ జరిగిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కనీస వేతనాల విషయంలో ఎన్వీ సుమంత్ వాదనలతో ఏకీభవిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. అంతేకాక.. ‘తమకు కనీస వేతన స్కేల్ ఉత్తర్వులను వర్తింపజేయాలన్న కాంట్రాక్టు టీచర్ల అభ్యర్థన సబబైనదే. సమాన పనికి సమాన వేతనం చెల్లించకపోవడం అన్నది దోపిడీ, బానిసత్వం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగానే కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకునే వారికి కనీస వేతన స్కేల్ను అమలుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అధికారులు ఆ స్కేల్ను వర్తింపజేయకపోవడం ఏకపక్షం. కనీస వేతనాల విషయంలో సింగిల్ జడ్జి తీర్పును ఏ రకంగానూ విమర్శించాల్సిన అవసరంలేదు’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
ప్రణీత్రావు పిటిషన్లో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శ కాలను పాటించడం లేదని, పీఎస్లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు లేవని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరడంతోపాటు పోలీస్ కస్టడీ ఇస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రణీత్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు వాదనలు వినిపిస్తూ.. ‘24 గంటలూ ప్రణీత్రావును పోలీసులు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా.. దాన్ని పాటించడంలేదు. ప్రణీత్ పరువుకునష్టం కలిగించేలా అధికారులు వివరాలు మీడియాకు లీక్ చేస్తున్నారు’ అని చెప్పారు. అనంతరం పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదిస్తూ.. ‘పిటిషనర్ న్యాయవాది వాదనలు సరికాదు. 2023లో అక్రమంగా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఇది చాలా తీవ్ర నేరం. నిబంధనల మేరకే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. సాక్ష్యాలను అందించేందుకే రమేశ్ విచారణ జరిగే ప్రాంతానికి వచ్చారు తప్ప.. విచారణలో పాల్గొనలేదు’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. గురువారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. -
చైల్డ్ పోర్నోగ్రఫీపై ఆ తీర్పు దుర్మార్గం: సుప్రీం
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేయడం, చూడటం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు దుర్మార్గంగా అభివర్ణించింది. ఆ తీర్పుపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. చెన్నైకి చెందిన ఎస్.హరీశ్(28) పిల్లలతో కూడిన పోర్నోగ్రఫీ కంటెంట్ను తన సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాడంటూ పోలీసులు కేసు పెట్టారు. దీనిపై హరీశ్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లాడు. విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం పోక్సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ను డౌన్లోడ్ చేయడం, చూడటం నేరం కాదని పేర్కొంటూ జనవరి 11వ తేదీన తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ ఫరీబాద్కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఎన్జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పిటిషన్పై విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పు చట్టాలకు వ్యతిరేకం, దుర్మార్గమని పేర్కొంది. ఏకసభ్య ధర్మాసనం ఇలాంటి తీర్పు ఎలా ఇవ్వగలదని ప్రశ్నించింది. -
AP : జస్టిస్ రాకేష్ వివాదాస్పద తీర్పు రద్దు
ఏపీ హైకోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు జస్టిస్ రాకేష్కుమార్ ఇచ్చిన వివాదస్పద తీర్పును రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ డిసెంబర్ 31, 2020న జస్టిస్ రాకేష్కుమార్ ఒక తీర్పు ఇచ్చారు. తన వ్యక్తిగత వ్యాఖ్యలను తీర్పులో చేర్చిన జస్టిస్ రాకేష్.. దాన్నే తీర్పుగా పేర్కొనడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. జస్టిస్ రాకేష్కుమార్ ఇచ్చిన తీర్పును అప్పట్లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఆ పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింగ్వీ, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వాళ ప్రకటించింది. కేసు పూర్వపరాలేంటీ? ప్రభుత్వ స్థలానికి సంబంధించిన వేలం వ్యవహారానికి సంబంధించి 2020లో ఓ పిటిషన్ ఏపీ హైకోర్టు ముందు దాఖలయింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అలాగే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న జస్టిస్ రాకేష్ కుమార్.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ డిసెంబర్ 31, 2020న ఓ తీర్పు ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, యంత్రాంగం లేదంటూ తన తీర్పులో వ్యాఖ్యలు చేశారు జస్టిస్ రాకేశ్కుమార్. శాసనవ్యవస్థమీదా, పోలీసు యంత్రాంగంమీద, మూడు రాజధానుల అంశంమీదా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన జస్టిస్ రాకేశ్కుమార్ వాటన్నింటిని తీర్పులో పొందుపరిచారు. సుప్రీంకోర్టుపైనే ఎదురుదాడి దీంతో పాటు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ వ్యవహారంపైనా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు జడ్జిలను బదిలీ చేయడాన్ని హైకోర్టుపై దాడిగా అభివర్ణించారు. నాడు హైకోర్టు జడ్జిగా జస్టిస్ రాకేష్ చేసిన తీర్పులో ఏకంగా సుప్రీంకోర్టు కొలిజీయంనే తప్పుబట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పింది? కేసుల విచారణ జాప్యంపై, అలాగే అమరావతి భూముల కేసులో జస్టిస్ రాకేశ్కుమార్ ఇచ్చిన తీర్పు అంశాలనూ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇతర రాజ్యాంగ వ్యవస్థల విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందంటూ హైకోర్టు ఆరోపించడం జరికాదని సూచించింది సుప్రీంకోర్టు. జస్టిస్ రాకేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఒక హైకోర్టు జడ్జిగా తనకున్న విచక్షణాధికారాన్ని ఇష్టానుసారంగా వినియోగించలేరని, వ్యవస్థలను ఇబ్బంది పెట్టకూడదని తెలిపింది. ఒక హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుపట్టే ముందు.. తాను కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న విషయాన్ని రాకేష్కుమార్ గుర్తించకపోవడం శోచనీయమని పేర్కొంది. జస్టిస్ రాకేష్ కుమార్ పై ఆరోపణలేంటీ? వివాదాల్లో ఇరుక్కోవడం జస్టిస్ రాకేష్కుమార్కు ఇది కొత్తేమీ కాదు. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ NCLATలో సభ్యుడిగా ఉన్న రాకేష్కుమార్ తీరును ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన ఆ పోస్టుకు రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఫినోలెక్స్ కేబుల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేందుకు ప్రయత్నించడంతో ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది సర్వోన్నత న్యాయస్థానం. జస్టిస్ రాకేశ్కుమార్ కోర్టు ధిక్కరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో పాట్నా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టంతా అవినీతిమయమయిందని నిరాధార ఆరోపణలు చేసి విమర్శల పాలయ్యారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ సీరియస్ -
చంద్రబాబు ముందస్తు బెయిల్ పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు
-
కొడాలి నాని, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు కొట్టేసిన కోర్టు
సాక్షి, విజయవాడ: ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ నేతలపై టీడీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులను విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టేసింది. నానితో పాటు, మరో ఆరుగురు వైఎస్సార్సీపీ నేతలు నిర్దోషులుగా కోర్టు తీర్పునిచ్చింది. 2017లో వినాయకచవితి సందర్భంగా గుడివాడలో నాని నిర్వహించిన అన్న సమారాధనను పోలీసుల ద్వారా టీడీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. డీఎస్పీ మహేష్ నేతృత్వంలో అన్నదానాన్ని పోలీసులు అడ్డుకోబోగా, అన్నం పెడుతుంటే అడ్డుకోవడమేంటని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. భోజనం చేస్తున్న టేబుళ్లను పోలీసులు నెట్టి వెయ్యడంతో దుమారం చెలరేగింది. ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే నాని, వైసీపీ నాయకులు గుడ్లవల్లేరు బాబ్జి, కొంకితల ఆంజనేయ ప్రసాద్, చుండూరి శేఖర్ సహా మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జరిగిన విచారణలో పోలీసులు చూపినవి తప్పుడు సాక్ష్యాలని న్యాయమూర్తి నిర్ధారించారు. వైఎస్సార్సీపీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను కొట్టేస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్ -
ఆ 181 ఎకరాలు హెచ్ఎండీఏవే..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్లోని 181 ఎకరాల వివాదాస్పద భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కే చెందుతాయని హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. అందులోని 50 ఎకరాలపై తమకు హక్కులు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. 2007 నుంచి శంషాబాద్ గ్రామ పంచాయతీ జారీ చేసిన ఆస్తి పన్ను నోటీసులు, మున్సిపల్ అనుమతి, రెవెన్యూ రికార్డులు, విద్యుత్ బిల్లులు, ఫొటోలు, 2023 ఏప్రిల్ 20 నాటి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, ఇంటి పన్ను రశీదులు, ఇంటి నిర్మాణ అనుమతి.. ఇలా అన్నీ నకిలీవేనని జ్యుడీషియల్ రిజిస్ట్రార్నివేదిక బయటపెట్టిందని స్పష్టం చేసింది. 2007లోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు కల్పి త రసీదులు సృష్టించారని పేర్కొంది. 1990 సెపె్టంబర్ 4 నాటి ఉత్తర్వుగా పేర్కొంటూ.. 1992లో టైప్ చేసిన కాపీని పిటిషనర్ ఇచ్చారని, అది కూడా నకిలీదేనని తేలిందని వెల్లడించింది. అన్ని అంశాలను పరిశీలించాక పిటిషనర్కు ఉపశమనం పొందడానికి ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. ‘పైగా’భూములని పేర్కొంటూ.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని సర్వే నంబర్ 725/21లోని 7.31 ఎకరాలు, సర్వే నంబర్ 725/23లోని 10.07 ఎకరాలు, సర్వే నంబర్ 725/25లోని 12.34 ఎకరాలు సహా దాదాపు 50 ఎకరాల భూమిని తన పూర్వికులు పైగా (సైన్యం నిర్వహణకు పరిహారంగా నిజాం నవాబ్ మంజూరు చేసిన భూమి) యజమానుల నుంచి కొనుగోలు చేశారని హైదరాబాద్ వట్టేపల్లికి చెందిన యహియా ఖురేషి హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇబ్బందులు క ల్పిస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ల ధర్మాసనం విచారణ జరిపింది. రసీదులన్నీ నకిలీవే.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ రాఘవన్, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. తప్పుడు పత్రాలు, రసీదులు సృష్టించి కోర్టును తప్పదారి పట్టిస్తున్నారని.. అత్యంత విలువైన ప్రాంతంలో దాదాపు 50 ఎకరాలకు పైగా భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని ఏజీ కోర్టుకు వివరించారు. 2007, 2012లో జారీ చేసిన రసీదులు పూర్తిగా నకిలీవని స్పష్టం చేశారు. తప్పుడు రసీదులను, కోర్టు తీర్పు ఉత్తర్వుల పత్రాలను ఆయన ఈ సందర్భంగా ధర్మాసనానికి అందించారు. 2007 నాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని, రసీదుల్లో మాత్రం తెలంగాణ అని పేర్కొన్నారని.. అలాగే శంషాబాద్ గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, హైదరాబాద్ అని మరో రసీదులో ఉందని వివరించారు. దాంతో ఈ అంశంపై పూర్తి విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం గతంలోనే జ్యుడీïÙయల్ రిజిస్ట్రార్ను ఆదేశించింది. రిజిస్ట్రార్విచారణ జరిపి కోర్టుకు నివేదిక ఇచ్చారు. పిటిషనర్ పేర్కొన్నట్టుగా 1997లో అసలు పిటిషన్లే నమోదు కాలేదని వివరించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు ఇచి్చంది. -
చట్టబద్ధత కల్పించలేం
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం అలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. ‘‘అది న్యాయస్థానానికి సంబంధించింది కాదు. పార్లమెంటు పరిధిలోని అంశం. కోర్టులు చట్టాలు చేయవు. వాటిని మంచి చెడులను బేరీజు వేస్తాయంతే’’ అని పేర్కొంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. అయితే స్వలింగ సంపర్కులకు పెళ్లాడే స్వేచ్ఛ, హక్కు ఉంటాయని స్పష్టం చేసింది. అంతేగాక ఇతరుల మాదిరిగానే వారికి అన్ని రకాల హక్కులూ సమానంగా ఉంటాయని, వారిపై వివక్ష చూపొద్దని పేర్కొంది. వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయమై సాధారణ ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ప్రభుత్వాలకు సూచించింది. తద్వారా స్వలింగ సంపర్కులు వివక్ష ఎదుర్కోకుండా చూడాలని పేర్కొంది. అలాగే స్వలింగ బంధాలు పట్టణ, సంపన్న వర్గాలకు పరిమితమైన ధోరణి అన్న కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ధర్మాసనం తప్పుట్టింది. ‘‘స్వలింగ సంపర్కం అనాది కాలం నుంచీ ఉన్న సహజ ధోరణే. అది కేవలం పట్టణాలకో, సంపన్న వర్గాలకో సంబంధించింది కాదు. ఈ విషయంలో కుల, సామాజిక వర్గ భేదాలూ ఉండవు. కనుక ఆ అపోహను వదిలించుకోవాలి’’ అని సూచించింది. కాకపోతే స్వలింగ జంటలకు పిల్లలను దత్తత తీసుకునే హక్కుండబోదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 3:2తో మెజారిటీ తీర్పు వెలువరించింది. దత్తతతో పాటు పలు న్యాయపరమైన అంశాల విషయంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్తో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పి.ఎస్.నరసింహ విభేదించారు. నాలుగు తీర్పులు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2018లో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కూడా కల్పించాలంటూ ఎల్జీబీటీక్యూఐఏ++ వర్గాల తరఫున 21 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుదీర్ఘ విచారణ అనంతరం గత మే 11న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా దీనిపై మొత్తం 4 తీర్పులు వెలువరించింది. మొత్తం అంశంపై సీజేఐ 247 పేజీల తీర్పు వెలువరించారు. స్వలింగ జంటల దత్తత తదితర అంశాలపై సీజేఐ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ జస్టిస్ కౌల్ విడిగా 17 పేజీల తీర్పు వెలువరించారు. కాగా వాటితో విభేదిస్తూ తనతో పాటు జస్టిస్ కోహ్లీ తరఫున జస్టిస్ భట్ 89 పేజీల తీర్పు వెలువరించారు. దానితో పూర్తిగా ఏకీభవిస్తూ జస్టిస్ నరసింహ 13 పేజీల తీర్పు రాశారు. స్వలింగ ప్రవృత్తి సహజమైనదే తప్ప మానసిక రుగ్మత కాదని సీజేఐ స్పష్టం చేశారు. లైంగిక గుర్తింపు, ప్రవృత్తుల గురించి విచారణ జరిపే నెపంతో స్వలింగ జంటలను పోలీసులు వేధించవద్దని ఆదేశించారు. ఈ నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించడం గానీ, వారి నివాసాలకు వెళ్లడం గానీ చేయొద్దని చెప్పారు. దత్తతపై... అవివాహితులకు, స్వలింగ జంటలకు దత్తత హక్కుండదంటూ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు వెలువరించింది. వారికి ఆ హక్కును నిషేధిస్తున్న దత్తత చట్ట నిబంధనలను సమర్థిస్తున్నట్టు పేర్కొంది. అయితే దీనిపై కూడా పార్లమెంటు సమగ్రంగా చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. సమస్యల పరిష్కారానికి కమిటీ స్వలింగ సంపర్కులకు చట్టబద్ధ వివాహ హక్కు లేదని, రాజ్యాంగం ప్రకారం దాన్ని మౌలిక హక్కుగా పొందజాలరని పేర్కొంటూ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. అదే సమయంలో, స్వలింగ జంటల సమస్యలు, ఆందోళనల పరిష్కారానికి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించేందుకు కేబినెట్ కార్యదర్శి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎల్జీబీటీ కమ్యూనిటీతో పాటు సామాజిక తదితర రంగాల నిపుణులకు అందులో చోటుండాలని సూచించింది. వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయానికైనా వచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని వర్గాల వారి వాదనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలియజేసింది. రేషన్ కార్డు తదితరాల నిమిత్తం స్వలింగ జంటను ఒకే కుటుంబంగా పరిగణించడం, ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవడం, డెత్ బెనిఫిట్స్ తదితరాల నిమిత్తం తమలో ఒకరిని నామినీగా పేర్కొనడం వంటి సౌకర్యాలను కల్పించవచ్చేమో పరిశీలించాలని సూచించింది. దాంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇచ్చారు. అన్ని అంశాలనూ సమగ్రంగా పరిశీలించిన మీదట కమిటీ ఇచ్చే తుది నివేదికను కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాలనపరంగా అన్ని స్థాయిల్లోనూ అమలు చేయాలని సీజేఐ స్పష్టం చేశారు. ‘స్వలింగ జంటల బంధాన్ని చట్టపరంగా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. లేదంటే వారికి అన్యాయం చేసినట్టే అవుతుంది’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఎల్జీబీటీక్యూఐఏ++ అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, క్వశ్చనింగ్, ఇంటర్సెక్స్, పాన్సెక్సువల్, టూ స్పిరిట్, అసెక్సువల్ తదితరులు కేవలం లైంగిక ప్రవృత్తి ఆధారంగా పెళ్లి చేసుకునే విషయంలో ఫలానా వారికి ఫలానా హక్కు వర్తించబోదని చెప్పబోవడం పొరపాటే అవుతుంది. స్వలింగ జంటలు పరస్పరం ప్రేమను వ్యక్తం చేసుకోవడాన్ని ఎవరూ నిషేధించలేరు. కానీ దానికి చట్టపరమైన గుర్తింపును మాత్రం ఇప్పటికైతే వారు కోరజాలరు. అలాగే దత్తత హక్కును కూడా! ఈ విషయంలో జస్టిస్ భట్ తీర్పుతో పూర్తిగా ఏకీభవిస్తున్నా – జస్టిస్ నరసింహ ఎవరేమన్నారు.. అవివాహితులు, స్వలింగ జంటలు దత్తత తీసుకోవడాన్ని నిషేధిస్తున్న సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్అథారిటీ (సీఏఆర్ఏ) నిబంధన 5(3) రాజ్యాంగవిరుద్ధం, చట్టవిరుద్ధం. స్త్రీ పురుష జంటలు మాత్రమే మంచి తల్లిదండ్రులు కాగలరన్న భావన సరికాదు. అది స్వలింగ జంటల పట్ల వివక్షే అవుతుంది. అసలు వివాహమనే బంధానికి సమానంగా వర్తించే సార్వత్రిక భావనంటూ ఏదీ లేనే లేదు – సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వలింగ సంపర్కుల పట్ల జరుగుతున్న చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దేందుకు బహుశా ఇది సరైన సందర్భం. ఈ దిశగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ సకారాత్మక చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా – జస్టిస్ ఎస్.కె.కౌల్ ఎల్జీబీటీక్యూఏఐ++ జంటల సమస్యలు మా దృష్టికి రాకపోలేదు. కానీ వారికి దత్తత హక్కు లేదన్న సీఏఆర్ఏలోని నిబంధన 5(3) చెల్లుబాటవుతుంది. అయితే స్వలింగ స్వభావులకు భాగస్వాములను ఎంచుకునేందుకు, సహజీవనం చేసేందుకు పూర్తి హక్కుంటుంది. అయితే ఆ బంధంతో వారికి దఖలు పడాల్సిన హక్కులను గుర్తించాల్సిన అనివార్యత మాత్రం ప్రభుత్వాలకు లేదు -జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ -
విద్యుత్ బకాయిల చెల్లింపుపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల వివాదంలో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలంటూ ఏపీ.. దీనిపై ఇప్పటికే ఇచ్చిన స్టేను పొడించాలంటూ తెలంగాణ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘంగా వాదనలు వినిపించగా.. హైకోర్టు మంగళవారం తన తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి తమకు తెలంగాణ నుంచి రూ.6,756.92 కోట్లు (అసలు రూ.3,441.78 కోట్లు, వడ్డీ, సర్చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు) రావాల్సి ఉందని ఏపీ వాదిస్తోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఏపీకి 30 రోజుల్లోగా రూ.6,756.92 కోట్లు చెల్లించాలంటూ 2022 ఆగస్టు 29న తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు 2022 సెప్టెంబర్లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బకాయిల విషయంలో తెలంగాణ సర్కార్పై ఒత్తిడి తేవొద్దని స్టే ఇచ్చింది. ఈ వ్యవహారం ఇలా కోర్టులో ఉండగానే.. విద్యుత్ బకాయిలు తప్పకుండా చెల్లించాలని ఆదేశించినా తెలంగాణ ఇవ్వడం లేదని.. అందువల్ల రిజర్వు బ్యాంకులోని తెలంగాణ ఖాతా నుంచి సొమ్మును మినహాయించుకుని ఏపీకి చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చింది. దీనితో కేంద్రం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని, చెల్లింపులపై స్టేను పొడిగించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులోని ప్రధాన పిటిషన్లో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. బకాయిల వల్ల ఇబ్బందుల్లో ఏపీ డిస్కమ్లు తెలంగాణ బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ విద్యుత్ డిస్కమ్లు ఆర్థిక ఇబ్బందుల్లో పడాల్సి వచ్చిందని ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. పునర్విభజన తర్వాత విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన ఈ బకాయిలకు, పునర్విభజన చట్టానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విభజన తర్వాత 2017 వరకు కూడా ఏపీ డిస్కమ్లు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశాయన్నారు. బకాయిలు చెల్లించక బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, తెలంగాణకు విద్యుత్ నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. బకాయి ఉన్న విషయాన్ని తెలంగాణ కూడా అంగీకరిస్తోందని గుర్తు చేశారు. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకిరణ్రెడ్డి వాదనలు వినిపించారు. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని, బకాయిల చెల్లింపుపై ఉత్తర్వులు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉందని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ల ధర్మాసనం మంగళవారం తీర్పు రిజర్వు చేసింది. -
ఆ జీవోలపై హైకోర్టు పునర్విచారణ
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ స్కాంలతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓ 1411.. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 344ను సవాలుచేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు శనివారం తిరిగి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, కేంద్రం దాఖలు చేసే కౌంటర్లకు సమాధానం దాఖలు చేయాలని పిటిషనర్లయిన రామయ్య, రాజేంద్రప్రసాద్లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను పట్టించుకోని సింగిల్ జడ్జి.. మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటు జీఓలను సవాలుచేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్లు 2020లో వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. వీటిపై విచారణ జరిపిన నాటి న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, ఆ జీఓల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2020 సెపె్టంబర్ 16న మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే సంపూర్ణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను ఆ తరువాత ప్రభుత్వాలు తప్పనిసరిగా కొనసాగించాలన్నారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చుకుని వారి వాదనలు వినాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సైతం న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ జీఓలవల్ల వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్లు బాధిత వ్యక్తులు కాదని, వారి వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సైతం జస్టిస్ సోమయాజులు పరిగణనలోకి తీసుకోలేదు. ‘సుప్రీం’ ఆదేశాలతో తిరిగి విచారణ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తిరిగి ఈ ఏడాది జూన్లో విచారణ మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. అటు తరువాత పలుమార్లు ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. తాజాగా.. శనివారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ మరోసారి విచారణ జరిపారు. కౌంటర్ల దాఖలుకు కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్ తరఫు న్యాయవాది వరుణ్ బైరెడ్డి గడువు కోరారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ స్పందిస్తూ.. సిట్ పరిధిలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించాలంటూ తాజాగా పిల్ దాఖలైందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వ్యాజ్యం విచారణకు వస్తే అందులోనూ కేంద్రం తన వైఖరిని తెలియజేయాల్సి ఉంటుందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి గడువునిచ్చారు. తదుపరి విచారణను అక్టోబరు 20కి వాయిదా వేశారు. అప్పటికల్లా ఇరుపక్షాలు కౌంటర్లు, వాటికి రిప్లైలు దాఖలు చేయడం పూర్తిచేయాలని న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ స్పష్టంచేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రద్దు.. దీంతో.. జస్టిస్ సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తప్పుపట్టి వాటిని రద్దుచేసింది. హైకోర్టు ఆ మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదని, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రెండు జీఓలను పరిశీలిస్తే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు ఆ జీఓ జారీ అయినట్లు భావించడానికి వీల్లేదంది. కేంద్రాన్ని సైతం ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేర్చుకోవాలని హైకోర్టును ఆదేశించింది. కేంద్రం అభిప్రాయం కూడా తెలుసుకోవాలంది. కేసు పూర్వాపరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను మూడునెలల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో హైకోర్టుకు స్పష్టం చేసింది. -
చాట్జీపీటీ చెప్పిందని కోర్టు మెట్లక్కిన దిగ్గజ కంపెనీ.. చివరికి ఏమైందంటే
ఓ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్జీపీటీ ఇచ్చిన ఆధారాల్ని పరిగణలోకి తీసుకొని తీర్పు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇంతకీ ఆ కేసు ఏంటి? చాట్జీపీటీ ఇచ్చిన ఆధారాలేంటి? పలు నివేదికల ప్రకారం.. ఇటీవల ఫ్రాన్స్ లగ్జరీ షూ తయారీ సంస్థ క్రిస్టియన్ లౌబౌటిన్.. భారత్లోని ఢిల్లీ కేంద్రంగా షుటిక్ అనే కంపెనీ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా షూ’లను తయారు చేసి అమ్మకాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు షుటిక్పై క్రిస్టియన్ లౌబౌటిన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. తమ సంస్థ కొన్ని షూ డిజైన్లు తమకే చెందుతాయంటూ ట్రేడ్మార్క్ తీసుకుందని, ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కోర్టుకు వివరించింది. అయితే, షుటిక్ తమ ట్రేడ్ మార్క్ షూ డిజైన్లను కాపీ కొట్టిందని, ఇదే విషయాన్ని చాట్జీపీటీ చెప్పినట్లు ఆధారాలు సమర్పించింది. తమకు న్యాయం చేయాలని విన్నవించుకుంది. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు.. న్యాయస్థానంలో చట్టపరమైన లేదా వాస్తవిక సమస్యల పరిష్కారానికి చాట్జీపీటీ ఇచ్చిన ఆధారాలు సరిపోవని కోర్టు పేర్కొంది. ఏఐ చాట్బాట్ల ప్రతిస్పందనలు, కల్పితాలు, ఊహాజనిత డేటా మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు.. ప్రతివాది ఉద్దేశపూర్వకంగా మనీ సంపాదనకు ట్రేడ్ మార్క్ నిబంధనలను ఉల్లంఘించారని అర్థమవుతుందని తెలిపింది. ఇకపై బూట్ల డిజైన్లు, రంగులు కాపీ చేయరాదని, ఆ ఒప్పందం ఉల్లంఘిస్తే రూ.25 లక్షలు జరిమాన చెల్లించాల్సి వస్తుందని ప్రతివాదిని హెచ్చరించింది. ప్రస్తుతం, పిటిషనర్ ఖర్చుల కింద వాదికి రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. చదవండి👉 ‘ఆ AI టూల్ను షట్డౌన్ చేస్తున్నాం’.. చాట్జీపీటీ సృష్టికర్త సంచలన ప్రకటన! -
గద్వాల ఎమ్మెల్యే DK అరుణ.! హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో శాసనసభ్యుడి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో ఆయన తర్వాత రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను 2018 డిసెంబర్ 12 నుంచీ ఎమ్మెల్యేగా పరిగణించాలని ఆదేశించింది. తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన కృష్ణమోహన్రెడ్డికి రూ.2,50,000 జరిమానా విధించింది. మరో రూ.50,000ను పిటిషనర్కు పరిహారంగా చెల్లించాలని సూచించింది. డీకే అరుణ పిటిషన్తో.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణమోహన్రెడ్డి, కాంగ్రెస్ అభ్యరి్థగా డీకే అరుణ పోటీ చేశారు. ఇందులో కృష్ణమోహన్రెడ్డికి 1,00,057 ఓట్లు, అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే ఎన్నికల సమయంలో కృష్ణమోహన్రెడ్డి సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని.. ఆయన ఎన్నికను రద్దు చేసి, తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ డీకే అరుణ తరఫున న్యాయవాది యోగితా ప్రకాశ్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ వినోద్కుమార్ గురువారం తీర్పు వెలువరించారు. భూములు, ఖాతాల వివరాలు చెప్పలేదని.. అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తూ.. కృష్ణమోహన్రెడ్డి, ఆయన భార్య పేరుతో ఉన్న వాహనాలకు ట్రాఫిక్ చలానాలు ఉన్నా చెల్లించలేదని, ఈ వివరాలను అఫిడవిట్లో పేర్కొన లేదని కోర్టుకు వివరించారు. గద్వాల ఎస్బీఐ, ఏడీబీ బ్యాంకుల్లో కృష్ణమోహన్రెడ్డి, ఆయన భార్య జ్యోతికి ఉన్న ఖాతాల వివరాలను చెప్పలేదన్నారు. సిబిల్ వివరాల ప్రకారం ఎమ్మెల్యే బ్యాంకులకు రూ.1,09,67,737 రుణాలు బకాయిలు ఉన్నా వెల్లడించలేదని, అలాగే జాతీయ బ్యాంకుల్లో మరో రూ.1.22 కోట్ల రుణాలున్నా పేర్కొనలేదని వివరించారు. అదే విధంగా పుద్దూరులో వారికి ఉన్న 24 ఎకరాల భూమిని అఫిడవిట్లో చూపలేదన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినా స్పందన రాలేదు. పత్రికా ప్రకటన ఇచ్చినా స్పందించలేదు. దీంతో న్యాయమూర్తి తీర్పును జూన్ 22న తీర్పును రిజర్వు చేసి గురువారం వెల్లడించారు. అయితే ఈ కేసులో కృష్ణమోహన్రెడ్డి తరఫున వాదనలు వినిపించేందుకు ఆగస్టు 18న న్యాయవాది మనోహర్ వచ్చారని, ఈ మేరకు అప్లికేషన్ దాఖలు చేశారని రిజిస్ట్రీ హైకోర్టుకు వివరించింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. జూన్ 22నే తీర్పు రిజర్వు చేశామని, ఈ నేపథ్యంలో మధ్యంతర అప్లికేషన్ను అనుమతించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా..బండ్ల కృష్ణమోహన్రెడ్డి తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని, తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తీర్పు వెలువరించిందన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు నాలుగు అభియోగాలతో కోర్టుకు వెళ్లారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, కొందరికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేక దొడ్డిదారి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తాను గత ఎన్నికల్లో 37వేల మెజారీ్టతో గెలిచానని, ఈసారి 50వేల మెజారీ్టతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా న్యాయం జరిగింది: డీకే అరుణ తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తూ ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, అభ్యర్థులకు ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చెంపపెట్టు వంటిదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. ఈ తీర్పు మూడేళ్ల ముందే రావాల్సిందని.. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. హైకోర్టు తీర్పును గద్వాల ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఘన విజయం సాధిస్తుందనే దానికి ఇది సంకేతమని పేర్కొన్నారు. -
ఫార్మాసిటీ భూసేకరణ రద్దు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫార్మా సిటీకి సంబంధించిన భూసేకరణ కేసులో ప్రకటన, అవార్డులు, పరిహారం డిపాజిట్ సహా తదుపరి అన్ని చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మేడిపల్లి, కురిమిద్ద గ్రామవాసులైన 180 మంది పిటిషనర్ల నుంచి మళ్లీ అభ్యంతరాలను తీసుకొని, భూ సేకరణ ప్రారంభించాలని ఆదేశించింది. భూసేకరణలో చేపట్టాల్సిన కనీస విధానాన్ని కూడా పాటించకుండా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేసింది. ఏదైనా భూమిని సేకరించేటప్పుడు అనుసరించాల్సిన విధానంపై 2017లో ప్రధాన కార్యదర్శి మెమోను జారీ చేసినా, దాన్ని అర్థం చేసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొంది. పిటిషన్ వేసిన తర్వాత కూడా అధికారులు తమ తప్పును గుర్తించలేదని, తమ చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశా రని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో మూడేళ్లు గడిచినా ప్రతిష్టాత్మకమైన ఫార్మా సిటీ నిర్మాణం కూడా ముందుకుసాగలేదని పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వం 2020, జూలై 23న జారీ చేసిన భూసేకరణ ప్రకటనను కొట్టివేస్తున్నామని వెల్లడించింది. భూసేకరణ, పునరావాసం చట్టంలోని సెక్షన్ 15 కింద అభ్యంతరాలను 3 నెలల వ్యవధిలోగా తీసుకుని, మళ్లీ భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. తీర్పు తేదీ ప్రామాణికంగా మార్కెట్ విలువ పేర్కొనాలి భూసేకరణ, పునరావాస చట్టప్రకారం తమకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వడం లేదని, ఇతర చర్యలు చేపట్టడం లేదని మేడిపల్లి, కురిమిద్ద గ్రామవాసులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎం.సుధీర్కుమార్ విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫున రవికుమార్, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరీందర్ పరిషద్ వాదనలు అందకుముందు వినిపించారు. ‘రెండు వారాల్లో పిటిషనర్లు అభ్యంతరాలను తెలియజేయాలి. అధికారులకు సహకరించాలి. ఈ తీర్పు తేదీని ప్రామాణికంగా తీసుకుని అధికారులు మార్కెట్ విలువ నిర్ణయించాలి. ఇరుపక్షాలు చర్చలతో ప్రయోజనాలను పొందాలి. 2015లోనే ప్రభుత్వం గ్రీన్ ఫార్మా సిటీ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించింది. చట్టపరమైన అడ్డంకులు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. చట్టాలు ఏం చెబుతున్నాయో కూడా ఐఏఎస్ అధికారులు అర్థం చేసుకోకపోవడం, భూసేకరణ చట్టాన్ని ఎలా అమలు చేయాలన్నది కూడా తెలియకపోవడం ఆక్షేపణీయం. దీని కారణంగానే రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 2017, అక్టోబర్ 23న మోమో జారీ చేయాల్సి వచ్చింది. అందులో 2013 భూ సేకరణ చట్ట ప్రకారం.. సేకరణ సమయంలో అనుసరించాల్సిన విధానం ఏంటీ అన్నది చెబుతూ పలు మార్గదర్శకాలు వెల్లడించారు. పిటిషన్ వేసిన తర్వాత కూడా అధికారులు తమ తప్పును గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గుడ్డిగా తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చారు. దీని కారణంగా ఎంతో విలువైన కోర్టు సమయం మూడేళ్లుగా వృథా అవుతూ వచ్చింది’అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. -
గ్రేహౌండ్స్ భూమిపై ఎల్లో రాబందుల కళ్లు.. పచ్చ గుండాలకు సుప్రీం కోర్టు షాక్
సాక్షి, ఢిల్లీ: 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, ఆయన నాయకత్వంలోని టిడిపిలో ఏ చాప్టర్ చూసినా ఏదో ఒక అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. చంద్రబాబుతో తిరిగే వాళ్లెవరయినా.. ఏదో ఒక కేసులో ఇరుక్కోవడం తరచుగా బయటపడుతోంది. హైదరాబాద్ భూమి వెనక బాబు అనుచరుడు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల రెవెన్యూ పరిధి. హైదరాబాద్ శివార్లలో అత్యంత విలువైన భూమి. 143 ఎకరాల ఈ భూమి విలువ అక్షరాలా పది వేల కోట్లు. దీన్ని గతంలో గ్రే హౌండ్స్ సంస్థకు కేటాయించారు. దేశంలో శాంతి భద్రతలను రక్షించే సంస్థల్లో ఒకటయిన గ్రౌహౌండ్స్ కే ఎసరు పెట్టేందుకు ప్రయత్నించారు టిడిపి నేత ఒకరు. ఆయనే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్న మాండ్ర శివానందరెడ్డి. రెండు దశాబ్దాలుగా ప్లాన్ అప్పట్లో పోలీస్ శాఖలో పని చేసిన మాండ్ర శివానందరెడ్డికి ఈ స్థలం వెనకున్న లూపోల్స్ కొన్ని తెలుసు. ఇంకేముంది.. ఈ భూమినే కొట్టేసేందుకు రకరకాల కుట్రలు పన్నారు. చంద్రబాబు అండతో రకరకాల కొత్త డాక్యుమెంట్లు సృష్టించారు. అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చెల్లవని తెలిసినప్పటికీ తామే జీపీఏ హోల్డర్లమంటూ దందా సాగించారు. అయితే ఈ కుట్రలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. 1994 నుంచి కొనసాగుతున్న భూ వివాదానికి ముగింపు పలికింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రూ.10 వేల కోట్ల విలువైన ఈ భూమిని కొట్టేసేందుకు రకరకాల కుట్రలు చేశారు. మంచిరేవులలోని ఈ భూములకు విలువ పెరగడంతో వాటిపై రాబందుల కళ్లు పడ్డాయని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ల్యాండ్ మాఫియా జోక్యం కూడా కనిపిస్తోంది. ఈ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తుదివి. ఎలాంటి జోక్యాలు అనుమతించబోం. ఇక ముందు ఈ వ్యవహారంలో ఎలాంటి పిటిషన్ లను అనుమతించబోం. అలాగే కింది కోర్టులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు.’’ అని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. హక్కులన్నీ ప్రభుత్వానికే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలోని 142.39 ఎకరాల భూయాజమాన్య హక్కులు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజా ఆదేశాలతో 1994 నుంచి కొనసాగుతున్న భూవివాదానికి ముగింపు పలికినట్టయింది. ఈ భూములపై కిందిస్థాయి కోర్టులు, హైకోర్టు ఎలాంటి జోక్యం చేసుకునే అధికారం లేదని, ఇప్పుడు ఇచ్చిన తీర్పే తుదితీర్పు అని ఆదేశాల్లో పేర్కొంది. సదరు భూమి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందని, తదుపరి కేటాయింపులపై దాని యాజమాన్య, స్వాధీన హక్కులు ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకొని గ్రేహౌండ్స్కు బదిలీ చేయాలని చెప్పింది. బాబు బ్యాచ్ లో మహా ముదుర్లు చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో ఆయన వెంట బాగా దగ్గరగా నడిచిన వాళ్లలో, లేదా చంద్రబాబుతో కలిసి రకరకాల వ్యవహారాలు నడిపిన వాళ్లలో చాలా మంది ఇప్పుడు ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. మార్గదర్శి స్కాంలో బాబు ఫ్రెండ్ రామోజీరావు, అవినీతి కేసులో బాబు ఫ్రెండ్ సింగపూర్ ఈశ్వరన్, ఓటుకు కోట్లు కేసులో బాబు అనుచరుడు రేవంత్ రెడ్డి, అమరావతి రాజధాని కేసులో పార్టీ నేతల్లో చాలా మంది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా దూరం వెళ్తుంది. -
‘కొత్తగూడెం’ తీర్పుపై స్టే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వా లని కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నామని, దీని కోసం స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘జలగం వెంకట్రావు ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టు నాకు అనుకూలంగా తీర్పునిస్తే.. అప్పుడు నాకు అన్యాయం జరిగినట్లు అవుతుంది. ఎన్నికైన నాటి నుంచి శాసనసభ్యుడిగా సేవలందిస్తున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. తీర్పును సవాల్ చేసే వరకు అమలుపై స్టే ఇవ్వాలి. ఈ ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ కోర్టు ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ ఇంకా అందలేదు.. దీంతో అప్పీల్కు సమయం పట్టే అవకాశం ఉంది.అప్పీల్ చేసే వరకు చట్టప్రకారం 30 రోజుల పాటు తీర్పును నిలిపివేయాలి. సర్టిఫైడ్ కాపీ ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి’అని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి బుధవారం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టులో తీర్పును సవాల్ చేయనున్నామని, అప్పటివరకు స్టే ఇవ్వాలని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించారు. స్టే ఇవ్వడంతో మీకు వచ్చే ఇబ్బంది ఏమిటని జలగం తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి దాదాపు మరో 4 నెలల కాలం మాత్రమే ఉందని, ఇప్పుడు బాధ్యతలు చేపట్టకపోతే ఆ కొద్ది నెలల కాలం కాస్త పూర్తయ్యే అవకాశం ఉందని న్యాయవాది బదులిచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదని.. 2018, డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా ప్రకటించాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
బాబు, సోనియా ఏపీకి అన్యాయం చేశారా? ఇదిగో ఇలా బయటపడింది..!
వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్కు మరో ఆభరణం లభించినట్లయిందా? ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడప ఎంపీగా ఉన్న సమయంలో సొంతంగా పార్టీ పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలిసి ఆయనపై పెట్టిన కేసులలోని డొల్లతనం ఒక్కొక్కటి బయటపడుతోంది. ఆ కేసులను న్యాయస్థానాలు కొట్టివేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఒకరకంగా సంచలనంగా ఉన్నాయని చెప్పాలి. వాన్ పిక్ ప్రాజెక్టు ఆస్తులను జప్తు చేస్తున్న రోజులలోనే, ఈ కంపెనీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ను జగన్ కేసులలో ఇరికించి అరెస్టు చేసినప్పుడే ఇది చాలా అన్యాయమని నేను అభిప్రాయపడ్డారు. పలు ఆర్టికల్స్ కూడా రాశాను. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టినందుకు వాన్ పిక్కు భూములు కేటాయించారంటూ సీబీఐ పెట్టిన కేసు ఎంత అధ్వాన్నమైనదో ఇప్పుడు రుజువు అయింది. ఎక్కడైనా పరిశ్రమలు పెడతామని రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేస్తే అరెస్టు చేయాలి కాని, పరిశ్రమల స్థాపనకు భూములు సేకరించిన కంపెనీపైన, ఆ కంపెనీ చైర్మన్ పైన కేసు పెట్టడం ఏమిటా అన్న బాధ కలిగేది. కాని మన దేశంలో ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో బ్యాంకులకు రుణాలు ఎగవేసినవారు హాపీగా కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతల సరసన ఉండగలుగుతున్నారు. వాన్పిక్ ప్రాజెక్టు కనుక అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే, ఈ రోజున ఏపీకి పెద్ద ఆభరణం లభించినట్లయ్యేది. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చీరాల, రేపల్లె ప్రాంతంలో బారీ ఎత్తున పవర్ ప్రాజెక్టులు, ఇతర ఓడరేవు ఆధారిత పరిశ్రమలు స్థాపించడానికి గాను వాన్ పిక్ సంస్థకు సుమారు 13 వేల ఎకరాల భూములను కేటాయించారు. వీటిలో ఎక్కువగా ప్రభుత్వ అస్సైన్డ్ భూములుఉన్నాయి. అస్సైన్డ్ లబ్దిదారులు ఎవరికైనా తమ భూమిని అమ్ముకున్నా, ఆ కొనుగోలుదారులతో పాటు, ఒరిజినల్ యజమానులకు కూడా నిర్దిష్ట పరిహారం చెల్లించి అందరిని సంతృప్తిపరిచి భూములు సేకరించారు. అవి కూడా సేద్యానికి పనికిరాని భూములే అత్యధికం. కాని జగన్ మీద అక్కసుతో సీబిఐ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టి పారిశ్రామికవేత్తలను అరెస్టు చేసింది. సిబిఐకి తోడు ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా అదే ప్రకారం ఆస్తులను జప్తు చేసింది. ఇదంతా దశాబ్దం క్రితం జరిగింది. అప్పటి నుంచి ఆ భూములన్నీ వృధాగా పడి ఉన్నాయి. రావల్సిన పరిశ్రమలు రాకుండా పోయాయి. ఈ రకంగా ఏపీకి సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు, సిబిఐ ఆనాటి జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తీరని అన్యాయం చేశారు. పరిశ్రమలు రాకుండా చేశారు. చదవండి: పవన్ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని.. అదే కనుక అప్పుడే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా ఉంటే, ఈ పాటికి అక్కడ అభివృద్ది జరిగి ఉండేది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ప్రాజెక్టు ఏపీకి పెద్ద ఆస్తిగా మారి ఉండేది. వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చి ఉండేవి. చిత్రం ఏమిటంటే పరిశ్రమలు పెట్టిన జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, ఆనాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ వంటివారు జైళ్లలో మగ్గవలసి వచ్చింది. పరిశ్రమలు పెట్టకుండా వేల కోట్లు ఎగవేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సుజన చౌదరి, లగడపాటి రాజగోపాల్, టి.సుబ్బరామిరెడ్డి , రాయపాటి సాంబశివరావు.. ఇలా టీడీపీ,కాంగ్రెస్, బీజేపీలో చేరిన కొందరు టీడీపీ నేతలకు రాజభోగాలు అనుభవించగలుగుతున్నారు. ఆ రోజుల్లో ఈడి జప్తు చేసిన ఈ భూమి విలువను సుమారు నలభై మూడు వేల కోట్లుగా లెక్కగట్టారు. ఈ ఆస్తి అంతా జగన్ దేనని చంద్రబాబు, టీడీపీ నేతలు, తప్పుడు ప్రచారం చేశారు. వైఎస్ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును చేపట్టినప్పుడు భూ సేకరణకు కూడా టీడీపీ అడ్డుపడింది. అయినా వైఎస్ ముందుకు వెళ్లారు. ఆయన ఆకస్మిక మరణం మొత్తం రాష్ట్రానికి తీరని నష్టం చేసింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో సోనియా, చంద్రబాబు ఏకమవడం, సిబిఐ లక్ష్మీనారాయణను అడ్డు పెట్టుకుని కేసులు నడిపించడం వంటివి చేశారని పలు విమర్శలు వచ్చేవి. ఈనాడు రామోజీరావు వంటివారు పలు తప్పుడు కథనాలు ఇచ్చి ప్రజలను తప్పుదారి పట్టించడం నిత్య కృత్యంగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి కనువిప్పు అవుతుంది. దేశానికి ఇలాంటి ప్రాజెక్టులు ఎంత అవసరమో ఆ గౌరవ న్యాయ స్థానం గుర్తించినట్లయింది. కింది కోర్టు మైండ్ అప్లై చేయకుండా యాంత్రికంగా ఆస్తుల జప్తును సమర్ధించిందని అభిప్రాయపడింది. మొత్తం ఈడి చార్జీషీట్ను తప్పుపట్టింది. ఇది ఏపీకి శుభకరమైన విషయం అని చెప్పాలి. తీర ప్రాంతంపై బాగా దృష్టి పెట్టి అభివృద్ది చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఈ తీర్పును అవకాశంగా తీసుకుని నిమ్మగడ్డ ప్రసాద్ను ఎంకరేజ్ చేసి ఇప్పటికైనా ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చేలా చేయగలగాలి. చదవండి: ‘వాన్పిక్’ ఆస్తుల అటాచ్మెంట్ చెల్లదు నిజానికి నిమ్మగడ్డ ప్రసాద్ ఈ ప్రాజెక్టు టేకప్ చేయకుండా ఉంటే జైలుకు వెళ్లవలసి వచ్చేదికాదు. విదేశాలలో సైతం ఇబ్బంది పడవలసి వచ్చేదికాదు. కేవలం సీబిఐ,ఈడీ వంటి సంస్థల నిర్వాకం వల్ల ఇలా జరిగింది. వీటన్నిటిని మనసులో పెట్టుకుని ప్రాజెక్టును వదలివేయకుండా నిమ్మగడ్డ దీనిని ముందుకు తీసుకువెళితే బాగుంటుంది. రాష్ట్రాభివృద్దికి అడ్డుపడిన తెలుగుదేశం, కాంగ్రెస్ వంటి పార్టీలు పైకి మాత్రం అభివృద్ది కాముకులుగా పిక్చర్ ఇస్తుంటాయి. కాని లోపల మాత్రం ఇలాంటి కుట్రలు పన్ని ఏపీ అభివృద్దికి విఘాతం కలిగించాయి. నలభై మూడువేల కోట్ల అక్రమాలు జరిగాయని ఇంత కాలం ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన వాదన తప్పని అంగీకరిస్తారా? లేక కొత్తగా ఏదో ఒక దిక్కుమాలిన ప్రచారం చేస్తారా? అన్నది చూడాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఫలించిన మూడు దశాబ్దాల న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో స్వామి హథీరాంజీ మఠానికి చెందిన 25.36 ఎకరాలపై రక్షిత కౌలుదారులు మూడు దశాబ్దాలుగా చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది. ఈ కేసులు పెండింగ్లో ఉండగానే తల్లిదండ్రులు మరణించడంతో వారి పిల్లలు చట్టబద్ధ వారసులుగా న్యాయ పోరాటాన్ని కొనసాగించారు. ఫలితం అందుకున్నారు. ఈ భూమిని సాగు చేసుకుంటున్న రక్షిత కౌలుదారులకే విక్రయించేందుకు మఠం సంరక్షకునికి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1990లో జారీ చేసిన జీవో 751ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చి న తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. వేలంలో కాకుండా, మఠానికి పూర్తిస్థాయి సంరక్షకుడు లేకుండా భూములను విక్రయించడానికి వీల్లేదన్న సింగిల్ జడ్జి తీర్పును ధర్మాసనం తప్పుపట్టింది. ఆ భూముల విక్రయం ప్రతిపాదనను మఠాధిపతి సర్జుదాస్ 1979లోనే తీసుకొచ్చారని గుర్తు చేసింది. 1957 నుంచి ఆ భూములు రక్షిత కౌలుదారుల సాగులోనే ఉన్నాయని, వాటిని వారి నుంచి స్వాదీనం చేసుకోవడం న్యాయపరంగా చాలా కష్టమని భావించడం, వివాదాలకు ఆస్కారం ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఆ భూములను వారికే విక్రయించడం మేలని మఠం సంరక్షకుడు చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఇదీ నేపథ్యం: హథీరాంజీ మఠానికి తిరుపతిలోని సర్వే నంబర్లు 51/1, 54/2లో ఉన్న 25.36 ఎకరాలను ఎం.చెంగమ్మ, టి.మునుస్వామి నాయుడు 1957 నుంచి రక్షిత కౌలుదారులుగా సాగు చేస్తున్నారు. ఆ తరువాత వారికి మఠం మహంత్ శాశ్వత లీజు మంజూరు చేశారు. మహంత్ మరణం తరువాత 1966లో ఆ లీజు రద్దయింది. అయినా వారు లీజు డీడ్ల ద్వారా కొనసాగుతున్నారు. 1980లో అప్పటి మహంత్ సస్పెండ్ అయ్యారు. మఠానికి సంరక్షకుడు నియమితులయ్యారు. అనంతరం ఆ భూమిని కౌలుదారులకే విక్రయించాలని మఠం నిర్ణయించింది. దీనిపై వి.నాగమణి, డి.కుప్పుస్వామి నాయుడు మరికొందరు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఈ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ రక్షిత కౌలుదారులకే భూమిని విక్రయించేందుకు అనుమతిస్తూ 1990లో జీవో 751 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ నాగమణి తదితరులు హైకోర్టులో అదే ఏడాది పిటిషన్ వేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. జీవో 751ని రద్దు చేస్తూ 2002లో తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చెంగమ్మ తదితరులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అనంతరం చెంగమ్మ, ఆమె భర్త వెంకట్రామనాయుడు మరణించడంతో వారి పిల్లలు ఈ వ్యాజ్యంలో చట్టబద్ధ వారసులుగా చేరారు. ఈ అప్పీల్పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తుది విచారణ జరిపి ఇటీవల తీర్పునిచ్చింది. -
ఆర్ట్స్లోనే కామర్స్ కూడా.. ఏపీ హైకోర్టు ముందుకు ఓ ఆసక్తికర కేసు..
సాక్షి, అమరావతి : బీకాం కోర్సు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగం కిందకు వస్తుందా రాదా అంటూ హైకోర్టు ముందుకు ఓ ఆసక్తికర కేసు వచ్చింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. బీకాం కోర్సు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగం కిందకే వస్తుందని తీర్పు చెప్పింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు బీకాంను ఈ విభాగం కిందే బోధిస్తున్నాయని గుర్తు చేసింది. బీకాం, ఆర్ట్స్ విభాగం కిందకు రాదనేందుకు ఆధారాలేవీ అధికారులు సమర్పించలేదంది. కామర్స్ కోర్సు ఆర్ట్స్ కిందకు వస్తుందని యూజీసీ సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇచ్చిందని వివరించింది. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్–2) పోస్టుకు బీకాం చదివిన వారు అర్హులు కాదనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారు ఈ విధులు నిర్వర్తించలేరన్న అధికారుల వాదనను తోసిపుచ్చింది. నోటిఫికేషన్లో ఈ ఉద్యోగులు ఎలాంటి విధులు నిర్వర్తించాలో ఎక్కడా ప్రస్తావించలేదని, ఆర్ట్స్ నేపథ్యం ఉన్న వారు మాత్రమే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారని కూడా చెప్పలేదంది. క్రీడాకారులు, ఎక్స్ సర్విస్మెన్, ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వారికి అవకాశం ఇచ్చారని, వయో పరిమితిని సైతం సడలించారని గుర్తు చేసింది. వీరంతా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించగలిగినప్పుడు, బీకాం చదివిన వారూ అర్హులవుతారని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, సర్టీఫికెట్ల పరిశీలన సమయంలో అనర్హులుగా తేల్చిన అభ్యర్థులను ఆ పోస్టుకు అర్హులుగా పరిగణించాలని అధికారులను ఆదేశించింది. పిటిషనర్లను ఆ పోస్టుకు పరిగణనలోకి తీసుకుని, నియామకాలు చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్ తదితరులతో కూడిన ధర్మాసనం గత వారం తీర్పు వెలువరించింది. విచారణ ద్వారా తేల్చాలన్న సింగిల్ జడ్జి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టుకు పురపాలక శాఖ 2019లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు బీకాం చదివిన వారూ దరఖాస్తు చేయగా, వారిని అధికారులు రాతపరీక్షకు అనుమతించారు. సర్టీఫికెట్ల పరిశీలన సమయంలో బీకాం కోర్సు ఆర్ట్స్, హ్యుమానిటీస్ విభాగం కిందకు రాదని, పోస్టుకు అర్హులు కారని అధికారులు తిరస్కరించారు. దీనిపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అధికారులకు పూర్తిస్థాయి వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది. దానిపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అధికారులకు చెప్పింది. అభ్యర్థులు పురపాలక శాఖ కమిషనర్కు వినతిపత్రం సమర్పించగా, దానిని తిరస్కరిస్తూ కమిషనర్ 2020లో ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. పిటిషనర్లు చదివిన బీకాం కోర్సు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కిందకు వస్తుందో లేదో తేల్చాలని అధికారులను ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. చదవండి: Fact Check: దగా చేసింది ఎవరో తెలియదా రామోజీ ? ఈ అప్పీళ్లపై జస్టిస్ సోమయాజులు ధర్మాసనం విచారణ జరిపింది. అభ్యర్థుల తరఫున న్యాయవాది జొన్నలగడ్డ సుదీర్ వాదనలు వినిపిస్తూ.. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు బీకాం ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కిందకే వస్తుందని యూజీసీ సమాధానం ఇచ్చిందంటూ, ఆ వివరాలను కోర్టు ముందుంచారు. రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాలు బీకాంను ఆర్ట్స్ విభాగం కింద పేర్కొంటూ ఇచ్చిన డిగ్రీ సర్టీఫికేట్లను ధర్మాసనం ముందుంచారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, యూజీసీ 2014లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామన్నారు. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టు అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిందని, కార్పొరేట్ అకౌంటింగ్ తదితర సబ్జెక్టులు ఈ పోస్టు కింద నిర్వర్తించే విధులకు సరిపోవన్నారు. అందువల్ల పురపాలక శాఖ నిర్ణయంలో ఎలాంటి తప్పులేదని తెలిపారు. -
నాణ్యమైన తీర్పులతో ప్రజల హక్కులకు రక్షణ
గుంటూరు లీగల్ : నాణ్యమైన తీర్పులతో ప్రజల హక్కులకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా న్యాయాధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజలోని ఏపీ జ్యుడీషియల్ అకాడమిలో శనివారం న్యాయాధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా చీఫ్ జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా పాల్గొని.. న్యాయాధికారులకు వృత్తిలో మెలకువలను వివరించారు. జస్టిస్ సి.ప్రవీణ్కుమార్, జస్టిస్ ఆకుల శేషసాయి, జస్టిస్ వై.సోమయాజులు, జస్టిస్ సి.మానవేంద్రనాథ్రాయ్ తదితరులు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ హరిహరనాధశర్మ, అధ్యాపక బృందం పాల్గొన్నారు. జస్టిస్ ప్రవీణ్కుమార్ కృషి అభినందనీయం రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో హైకోర్టు అభివృద్ధికి జస్టిస్ ప్రవీణ్కుమార్ ఎంతో కృషి చేశారని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా ప్రశంసించారు. హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా జ్యుడీషియల్ అకాడమీలో ప్రవీణ్కుమార్ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్కుమార్ సేవలను కొనియాడారు. -
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలని దాఖలైన కేసులో హైకోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. ఈ కేసులో వాద, ప్రతివాదనలు ముగియడంతో త్వరలో తీర్పును వెలువరిస్తామని పేర్కొంది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్రెడ్డితో పాటు నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజి, న్యాయవాది బి.శ్రీనివాస్, తుషార్ వెల్లపల్లి ఇతరులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ఈ కేసును ఏసీబీ అధికారులు మాత్రమే విచారణ చేయాలని.. లా అండ్ ఆర్డర్ పోలీసులకు, సిట్కు ఆ అధికారం లేదని బుధవారం బీజేపీ తరఫున హాజరైన జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు. గురువారం మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ సూచన మేరకు లేదా వ్యక్తులు ఫిర్యాదు చేసినప్పుడు పబ్లిక్ సర్వెంట్పై విచారణ చేసే అధికారం లా అండ్ ఆర్డర్ పోలీసులకు కూడా ఉంటుందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ కేసును తప్పనిసరిగా ఏసీబీనే దర్యాప్తు చేయాల్సి ఉందా అని ప్రశ్నించారు. దీనికి ఏజీ బదులిస్తూ.. అలాంటిదేమీ లేదని అన్నారు. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత దాన్ని సిట్కు బదలాయించారని చెప్పారు. ‘ప్రభుత్వం పూర్తి అధికారాలిస్తూ సిట్ను ఏర్పాటు చేసింది. ఏసీబీ, లా అండ్ ఆర్డర్ కేసులను ఏదైనా సిట్ దర్యాప్తు చేయవచ్చు. ఆ మేరకు సిట్కు అన్ని అధికారాలు ఉన్నాయి. సిట్ దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగా జరుగుతోంది. నిందితులు విచారణకు సహకరించడం లేదు. కేసులు వేస్తూ తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. ఈ కేసులో పలువురు మధ్యంత పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని పట్టించుకోకుండా ప్రధాన పిటిషన్పై విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పాలి’అని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, మధ్యంతర పిటిషన్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం తమ దృష్టికి తేవాలన్నారు. ప్రధాన పిటిషన్లపై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, అక్టోబర్ 27న ప్రధాన పిటిషన్ దాఖలైంది మొదలు ఇప్పటివరకు వాదప్రతివాదనలు వాడీవేడిగా సాగాయి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సైతం హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. కేసును సీబీఐకి అప్పగించాలని, సిట్ స్వేచ్ఛగా, పారదర్శకంగా దర్యాప్తు చేయడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.. సిట్ దర్యాప్తును అడ్డుకోవద్దని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు -
చిక్కుల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చిక్కుల్లో పడ్డారు. మూడు దశాబ్దాల క్రితం ఒక వ్యక్తి మరణానికి కారకుడైన కేసులో దోషి అయిన సిద్ధూ స్వల్ప జరిమానాతో బయటపడ్డారు. సిద్ధూ చేసిన నేరానికి తగిన శిక్ష పడలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ మళ్లీ కోర్టుకెక్కడంతో తీర్పుని పునఃసమీక్షించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 1998లో పంజాబ్లోని పాటియాలాలో వాహనం పార్కింగ్పై వివాదం నెలకొని 65 ఏళ్ల వయసున్న గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ చితకబాదారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో కుటుంబ సభ్యులు సిద్ధూపై కేసు పెట్టారు. ఈ కేసు నుంచి బయట పడడానికి సిద్ధూ దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశారు. పంజాబ్ హరియాణా హైకోర్టు సిద్ధూ ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2018 మేలో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని పక్కన పెట్టేసింది. సీనియర్ సిటిజన్ను గాయపరిచినందుకు కేవలం వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సిద్ధూని కేసు నుంచి విముక్తుడిని చేసింది. ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబం మళ్లీ కోర్టుకెక్కింది. సిద్ధూకి కఠిన శిక్ష విధించాలని బాధిత కుటుంబం సుప్రీంలో శుక్రవారం వాదనలు వినిపించింది. సిద్ధూ తరపున కాంగ్రెస్ నేత, లాయర్ పి. చిదంబరం వాదనలు వినిపించారు. ఇన్నేళ్ల తర్వాత తీర్పుని సమీక్షించడం అర్థరహితమని పేర్కొన్నారు. -
పూర్తి సహకారమందిస్తాం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంపై దర్యాప్తు కొనసాగించనున్న నిపుణుల కమిటీకి తమ పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టంచేసింది. ప్రతిపక్ష నేతలు, సామాజిక ఉద్యమ కారులు, పాత్రికేయులు తదితరులపై కేంద్ర ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ సాయంతో నిఘా పెట్టిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. దీంతో ఈ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు స్వతంత్య్ర సభ్యులతో ఒక నిపుణుల కమిటీని ఇటీవల ఏర్పాటుచేసింది. ఈ కమిటీకి కావాల్సిన మౌలిక, మానవ వనరుల, ల్యాబొరేటరీ వసతులు, సమాచారం ఇలా అన్ని రకాల సహాయసహకారాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిస్తుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంచేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన ‘టైమ్స్ నౌ సమ్మిట్ 2021’లో మంత్రి ప్రసంగించారు. ‘ చట్టాన్ని మీరి మోదీ సర్కార్ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ విషయంలో మాకు ఎలాంటి చింతా లేదు. నిపుణుల కమిటీ తుది నివేదిక ఎలా ఉన్నా మాకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు’ అని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ‘ ఇంతవరకూ దేశాన్ని పాలించిన ఏ ప్రభుత్వమూ పెగాసస్ స్పైవేర్ను కొనలేదంటారా?’ అన్న సూటి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ‘ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా గతంలోనే స్పష్టంచేశాం. చట్టాల చట్రంలోనే మా పాలన కొనసాగుతోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ఆయా చట్టాలను గతంలో రూపొందించారు. ఆ చట్టాల నాలుగు గోడల మధ్యే మేమున్నాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాలపై నియంత్రణపై ఆయన మాట్లాడారు. మన సంస్కృతి దెబ్బతినకుండా, భవిష్యత్ పరిణామాలకు తగ్గట్లుగా ఐటీ మార్గదర్శకాలు రూపొందాయన్నారు. -
ఆ అధికారిని జైలుకు పంపడమే కరెక్ట్
సాక్షి, హైదరాబాద్: కోర్టుధిక్కరణ పిటిషన్లపై అప్పీల్ దాఖలు చేసే కేసుల్లో సంబంధిత అధికారులు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని గతంలో తాము ఆదేశించినా.. వరంగల్ సౌత్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్వో) టి.కృష్ణాగౌడ్ ఎందుకు హాజరు కాలేదని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయని ఇటువంటి అధికారులను జైలుకు పంపడమే సమంజసమని వ్యాఖ్యానించింది. ఇప్పటికే సింగిల్ జడ్జి విధించిన శిక్ష అమలును నిలిపివేస్తూ 2018లో ఇచ్చిన ఉత్తర్వులు ఆరు నెలలపాటు మాత్రమే అమల్లో ఉంటాయని, గతంలో ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమల్లో లేనందున కృష్ణాగౌడ్ను జైలుకు పంపాల్సిన అవసరముందని స్పష్టంచేసింది. కాగా, తదుపరి విచారణకు కృష్ణాగౌడ్ తప్పనిసరిగా హాజరవుతారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ విజ్ఞప్తిచేయగా ధర్మాసనం అందుకు అనుమతించింది. జూన్ 15న హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను వాయిదావేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వరంగల్ జిల్లా కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చింతగూడ ప్రాంతంలోని కంపార్ట్మెంట్ 851లోని 30 ఎకరాలను గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నామని, అటవీ భూమి అనే పేరుతో అటవీ అధికారులు అడ్డుకుంటున్నారంటూ అదే ప్రాంతానికి చెందిన వజ్జా రాజబాబు 2014లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన సింగిల్ జడ్జి.. పిటిషనర్ల భూముల జోలికి పోరాదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. అయినా వినని అటవీ అధికారులు పిటిషనర్లను అడ్డుకోవడంతోపాటు ట్రాక్టర్ను సీజ్చేశారు. అంతేగాక వారు వంట చెరుకు, ఇతర అటవీ ఉత్పత్తులు తరలిస్తున్నారంటూ అక్రమంగా కేసు నమోదుచేశారు. దీన్ని సవాల్చేస్తూ పిటిషనర్లు కోర్టుధిక్కరణ కింద దాఖలుచేసిన పిటిషన్ను విచారించిన సింగిల్ జడ్జి.. బాధ్యులైన అటవీశాఖ అధికారులకు రెండు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అటవీ అధికారులు దాఖలు చేసిన అప్పీల్ను విచారించిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ 2018లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ అప్పీల్ మంగళవారం మరోసారి విచారణకు రాగా కృష్ణాగౌడ్ ప్రత్యక్షంగా హాజరుకాకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. -
ఈ తీర్పు అమరావతికీ వర్తిస్తుందా?!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తాజాగా ఇచ్చిన తీర్పు ఆసక్తిని గొల్పుతోంది. గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని హైకోర్టు కొట్టిపడేసిన సందర్భంగా.. గ్రామాలను పరిరక్షించుకోవాలని న్యాయమూర్తి హితవు చెప్పారు. అన్ని గ్రామాలను పట్టణీకరణ చేస్తే మన సంస్కృతి, వ్యవసాయం ఏమి అవుతాయని కూడా ఆయన ప్రశ్నించారు. భారత దేశ ఆత్మ గ్రామాలలోనే ఉందన్న మహాత్మాగాంధీ అన్న వ్యాఖ్యలను కూడా ఆయన గుర్తు చేశారు. మరి 33 వేలకుపైగా ఎకరాల మాగాణి భూమిని రైతులనుంచి తీసుకుని గత ప్రభుత్వం సంకల్పించిన అమరావతి రాజధాని భూముల విషయంలో ఈ తీర్పు వర్తించదా? అమలాపురానికి ఒక నీతి, అమరావతికి మరొక రీతి సరైందేనా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు అత్యంత ఆసక్తికరంగా ఉంది. అమలాపురం, చుట్టుపక్కల ఉన్న 200 పైగా గ్రామాలను కలుపుతూ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవోని హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా గౌరవ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అందులో గ్రామాలను పరిరక్షించుకోవాలని న్యాయమూర్తి హితవు చెప్పారు. అన్ని గ్రామాలను పట్టణీకరణ చేస్తే మన సంస్కృతి, వ్యవసాయం ఏమి అవుతాయని ఆయన ప్రశ్నించారు. భారత దేశ ఆత్మ గ్రామాలలోనే ఉందన్న మహాత్మాగాంధీ అన్న వ్యాఖ్యలను కూడా ఆయన గుర్తు చేశారు. నిజంగానే న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఆలోచించదగినవి. గత కొన్నేళ్లుగా పట్టణాలు పెరిగే కొద్దీ వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్నాయి. కాస్త డబ్బు ఎక్కువ వస్తోందని రైతులు కూడా తమ భూములను వ్యాపారులకు విక్రయించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీని ప్రభావం వ్యవసాయంపై కూడా పడుతోంది. గ్రామాలలో వ్యవసాయం తగ్గుతోంది. ఇతర వృత్తులు కూడా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో ప్రాధాన్యం కలిగినటువంటిది. ఇదే సమయంలో గత ప్రభుత్వం రాజధాని పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలను కలుపుతూ రాజధాని అభివృద్ధి సంస్థ పరిధిలోకి తెచ్చింది. అందులో 29 గ్రామాలను కోర్ కాపిటల్గా ప్రకటించింది. ఈ కోర్ కాపిటల్ పరిధిలోని పలు గ్రామాలలో మూడు పంటలు పండే భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రాజధాని పేరుతో భారీ భవనాలు నిర్మించవద్దని అప్పట్లో పర్యావరణ వేత్తలు సూచించారు. కృష్ణానది కరకట్టను ఆనుకుని భవంతులు నిర్మించిన తీరును కూడా వారు తప్పు పట్టారు. పర్యావరణ ప్రభావం గురించి కూడా వారు పలు వ్యాఖ్యలు చేశారు. ఒక సందర్భంగా ప్రముఖ పర్యావరణ వేత్త రాజేంద్ర సింగ్ ఆ ప్రాంతంలో పర్యటించడానికి వస్తే చంద్రబాబు ప్రభుత్వం ఆయనను అక్కడకు రానివ్వలేదు. అప్పట్లో రాజధాని పరిధిలోని గ్రామాలలో భూములు ఇవ్వడానికి ఒప్పుకోని కొంతమంది రైతుల పంటపొలాలను కూడా దగ్ధం చేయడంలో ఆనాటి ప్రభుత్వ పాత్ర ఉందని చాలామంది భావి స్తారు. ఉండవల్లి, పెనుమాక తదితర కొన్ని గ్రామాల రైతులు అయితే ఒక వైపు ఉద్యమం, మరో వైపు కోర్టులలో పోరాటం చేశారు. అదే సమయంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కూడా ఆయా ప్రాంతాలలో పర్యటించి రాజధానికి గుంటూరు– విజయవాడ మధ్య ప్రాంతం అనువైనది కాదని అభిప్రాయపడింది. దీనివల్ల పంటలు పండే భూములు అన్నీ పట్టణీకరణ కిందకు పోతాయని పేర్కొంది. కానీ ఈ నివేదికను బుట్టదాఖలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం మొదట విజయవాడ పరిసరాలలో రాజధాని అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఊహాగానాలకు అవకాశం ఇచ్చింది. అమాయకులైన అనేకమంది మెట్ట ప్రదేశంగా ఉన్న నూజివీడు ప్రాంతంలో రాజ ధాని వస్తుందని నమ్మి అక్కడ భూములు కొని నష్టపోయారు. మరోవైపు తెలుగుదేశం పెద్దలు కొందరు ప్రస్తుత అమరావతిగా పరిగణించే మారుమూల గ్రామాలలో భూములు కొనుగోలు చేయగలిగారు. దానినే ఇన్సైడ్ ట్రేడింగ్ అని అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శలు చేసేది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. విశేషం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి రాజధానిపై నివేదిక ఇవ్వాలని కోరితే, చంద్రబాబు ప్రభుత్వం అప్పటి మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రాజకీయ నాయకులు, వ్యాపారులతో కమిటీ వేసింది. ఆ కమిటీ చేసిందేమీ పెద్దగా లేదు. చంద్రబాబు మాత్రం సుమారు 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో సమీకరించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తే వారిని వేధించారు. ఆయా రాజకీయ పార్టీలు ఇన్ని వేల ఎకరాల సేకరణ సరికాదని వాదించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వేలాది ఎకరాలను అప్పటి నుంచి బీడు భూములుగా మార్చి రైతులకు మాత్రం ఏటా ప్రభుత్వం కౌలు చెల్లిస్తూ వస్తోంది. ఓటుకు నోటు కేసు తర్వాత ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదిలిపెట్టి చంద్రబాబు కృష్ణానది ఒడ్డున ఒక అక్రమ కట్టడంలో నివసించడం ఆరంభించారు. ఒక ముఖ్యమంత్రే ఇలా అక్రమ కట్టడంలో ఉంటారా అని ఎందరు విమర్శలు చేసినా పట్టించుకోలేదు. జాతీయ రహదారికి ఇరవై , ముప్ఫై కిలోమీటర్ల దూరంలో మారుమూల అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటివాటికి తాత్కాలిక భవనాలు నిర్మించారు. ఆ తర్వాత శాశ్వత భవనాలు నిర్మించడానికి లక్ష కోట్ల ప్రణాళికను ప్రకటించారు. కేంద్రానికి ఈ నిధుల కోసం లేఖలు రాస్తే వారు ఆశ్చర్యపోయారు. కేంద్రం 2,500 కోట్ల రూపాయలను ఇచ్చి సరిపెట్టింది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రాజధానిలోనే ప్రభుత్వం నిధులు అన్నిటిని వెచ్చిస్తోందన్న భావన ప్రజలలో ఏర్పడి బాబు ప్రభుత్వ ఓటమికి దారి తీసింది. ఈ నేప«థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి అసెంబ్లీలో చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిపై ప్రతి పక్ష తెలుగుదేశం, మరికొన్ని పక్షాలు ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళనలు చేయడానికి పిలుపు ఇచ్చాయి. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, కొందరు రైతులు కానీ శిబిరం వేసుకుని ప్రతిరోజు నిరసన తెలుపుతుంటారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై పలువురు హైకోర్టుకు వెళ్లారు. వారిలో ఎక్కువమంది టీడీపీ మద్దతుదారులో, సానుభూతిపరులో ఉన్నారు. ఇప్పుడు ఈ కేసును హైకోర్టులో విచారిస్తున్నారు. రాజధాని విషయంలో హైకోర్టు జోక్యం తగదని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ, ఇందులో జరిగిన స్కామ్లు, అప్పట్లో ఆయా కమిటీల సిఫారసులు తదితర విషయాలను తన వాదనలో వినిపించారు. అయితే కేంద్రం చేసిన చట్టంలో మూడు రాజధానులకు అవకాశం లేదని, అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేసినవారు వాదించారు. హైకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందో తెలియదు. కాని అదే హైకోర్టులో మరో ధర్మాసనం కోనసీమలో అర్బన్ అథారిటీని వ్యతిరేకిస్తూ గ్రామాలలో వ్యవసాయాన్ని పాడు చేయవద్దని, మన సంస్కృతిని దెబ్బతీయవద్దని వ్యాఖ్యానించింది. మరి అలాంటప్పుడు బాబు ప్రభుత్వం 33 వేల ఎకరాలు సేకరించడం కానీ, మూడు పంటలు పండే భూములను బలవంతంగా తీసుకోవడం కానీ, విజయవాడ, గుంటూరు మధ్య మరో మహానగరం నిర్మిస్తామని చెప్పడం కానీ .. ఇవన్నీ కూడా ఆ గౌరవ న్యాయమూర్తి వేరే కేసులో చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటే బాబు ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని అనుకోవాలి కదా అన్న వాదన తెరపైకి వస్తుంది. రాజధాని ప్రాంతం కాబట్టి న్యాయమూర్తి వ్యాఖ్యలు ఈ ప్రాంతానికి వర్తించవు అంటే ఏమీ చెప్పలేం. కానీ ఒకే హైకోర్టులో గ్రామాలను పట్టణాలుగా మార్చడంపై, వ్యవసాయం లేకుండా చేయడం, మన సంస్కృతిని దెబ్బతీయడం వంటివాటిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతాయా? అన్న చర్చకు ఆస్కారం ఏర్పడింది. ఏది ఏమైనా గ్రామాల గురించి, సంస్కృతి గురించి చెప్పిన ఆ న్యాయమూర్తిని అభినందించాలి. అంతేకాక గ్రామాలే భారత దేశ ఆత్మ అని మహాత్మాగాంధీ అన్న విషయం గుర్తుచేసిన న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలియచేయాలి. మరి అమరావతి గ్రామాలకు కూడా అది వర్తిస్తుందా? లేదా అన్నది కాలమే తేల్చాలా? వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు -
ఆస్తి హక్కు, సుప్రీం సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుటుంబంలోని ఆడబిడ్డలకు కొడుకులతోపాటు సమాన ఆస్తి హక్కులను కల్పిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005 అమలుకు ముందే తండ్రి మరణించినప్పటికీ, వారికి తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. హిందూ వారసత్వ చట్టంలో 2005 సవరణ ప్రకారం కుమార్తెలకు తండ్రి ఆస్తిలో సంపూర్ణ హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. సవరణ సమయం 2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆమెకు వారసత్వ హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. 2005లో చట్టం అమల్లోకి వచ్చేనాటికి తండ్రి చనిపోతే సోదరులు ఆస్తిలో వాటా నిరాకరించడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం 2005 నాటికి తండ్రి మరణించినా, బతికి ఉన్నా ఆడపిల్లలకు సమాన వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై ట్రయల్ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న విషయాలను ఆరు నెలల్లో నిర్ణయించాలని ధర్మాసనం ఆదేశించింది. -
సుప్రీంలో తొలిసారి ఏకసభ్య ధర్మాసనాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తొలిసారి మూడు ఏకసభ్య ధర్మాసనాలు ఒకేరోజు 20 చొప్పున కేసులను విచారించి తీర్పులిచ్చాయి. బుధవారం జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ రవింద్ర భట్, జస్టిస్ హృషికేశ్ రాయ్లు వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణలు జరిపారు. ఒక్కొక్కరు సుమారు 20 ట్రాన్స్ఫర్ పిటిషన్ల(కేసుల విచారణను ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు మార్చాలనే వినతి)ను విచారించి, తదనుగుణంగా ఉత్తర్వులిచ్చారు. కేసుల భారాన్ని తగ్గించుకునేందుకు గత సెప్టెంబర్లో సుప్రీంకోర్టు రూల్స్ బుక్లోని పలు నిబంధనలను మార్చింది. ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలకు సంబంధించిన ముందస్తు బెయిల్ కేసులను ఏకసభ్య ధర్మాసనాలు విచారించవచ్చని పేర్కొంది. (వారిని ఎందుకు విమర్శించరు?) -
‘స్థానిక’ రిజర్వేషన్లపై తీర్పు వాయిదా
సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 28న జారీచేసిన జీఓ 176ను సవాలు చేస్తూ కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అంశంపై మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపై గురువారం సీజే నేతత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. జనాభా లెక్కించాకే రిజర్వేషన్లు.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డితో పాటు మరికొందరు వాదనలు వినిపిస్తూ.. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని నిబంధనలు చెబుతున్నాయని, కాని బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారి జనాభాను లెక్కించాలన్నారు. ఇవేమీ చేయకుండానే బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారన్నారు. పంచాయతీరాజ్ శాఖ సర్వే ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయడం చట్ట విరుద్ధమన్నారు. జనాభా పెరిగినా.. 34 శాతమే రిజర్వేషన్లు అనంతరం.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు ఏ సందర్భంలో చెప్పిందో ఆయన ధర్మాసనానికి వివరించారు. తాము బీసీ లెక్కలను తేల్చి వాటి ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశామన్నారు. బీసీ ఓటర్లు 48.13 శాతమని.. అయినప్పటికీ తాము వారికిచ్చింది 34 శాతం రిజర్వేషనేనని చెప్పారు. మార్చి నెలాఖరుకల్లా పంచాయతీ ఎన్నికలు పెట్టి తీరాలని, లేని పక్షంలో కేంద్ర నిధులు ఆగిపోతాయని ఆయన కోర్టుకు నివేదించారు. -
తీర్పు నేపథ్యంలో సంయమనం పాటించాలి
సాక్షి, కరీంనగర్: రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై తీర్పు రానున్న నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలన్నారు. తీర్పుకు అనుకూలంగా, ప్రతికూలంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని చెప్పారు. ర్యాలీలు, ఊరేగింపులు, టపాసులు కాల్చడం, స్వీట్ల పంపిణీపై నిషేధం విధించినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో తీర్పుపై ఎలాంటి ప్రచారం చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లోకి చేరే ఆర్టీసీ కార్మికులకు రక్షణ కల్పిస్తాం.. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలనుకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా రిపోర్ట్ చేయవచ్చని పేర్కొన్నారు. విధుల్లో చేరాలనుకునే కార్మికులకు పోలీసులు రక్షణ కల్పిస్తారని తెలిపారు. విధుల్లో చేరే కార్మికులపై బెదిరింపులకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్ బాబు అంత్యక్రియల సమయంలో గొడవ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని పీసీ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబుకు చెంపపెట్టు: బాలినేని
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కోర్టు తీర్పు చంద్రబాబు, టీడీపీకి చెంపదెబ్బ అని.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని విద్యుత్ శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పీపీఏల పునఃసమీక్ష వ్యవహారాన్ని తాము కోరినట్టుగా ఏపీఈఆర్సీకి హైకోర్టు అప్పగించిందన్నారు. రేట్లు ముట్టుకోకూడదన్న కంపెనీల వాదనను కోర్టు తోసిపుచ్చిందని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలన్నీ ప్రజల కోసమేనని తెలిపారు. విద్యుత్రంగ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అవినీతి రహిత, పారదర్శక పాలనను ప్రజలకు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందడుగు వేస్తున్నారని.. అందులో భాగంగా పీపీఏలపై కూడా సమీక్ష చేయాలని నిర్ణయించారని వెల్లడించారు. చేతనైతే ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ధైర్యంగా తీసుకుంటున్న చర్యలను సమర్థించాలని.. లేకపోతే మౌనంగా కూర్చోవాలన్నారు. (చదవండి : విద్యుత్ కంపెనీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ..!) ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని కట్టుకథలు.. కొన్ని కంపెనీలతో కుమ్మక్కై అధిక ధరకు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను మాత్రమే పునఃసమీక్షిస్తామని చెప్పామన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం, విద్యుత్ పంపిణీ సంస్థలు బతికి బట్టకట్టడానికే ఈ నిర్ణయాలని చెప్పామన్నారు. ప్రజలకోసం కాకుండా లోపాయికారీ ఒప్పందాలు కోసం చంద్రబాబు, టీడీపీ నాయకులు పోరాటం చేశారని మండిపడ్డారు. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశారన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష ఘోర అపరాధంగా, అభివృద్ధికి నిరోధంగా కట్టుకథలు అల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లంచగొండి విధానాల వలనే.. పీపీఏల పునఃసమీక్ష రాజ్యాంగవిరుద్ధం, చట్ట విరుద్ధం అని మాట్లాడారని.. పరిశ్రమలకు తక్కువ ధరకు విద్యుత్ రావాలన్నా, డిస్కంలు బతికి బట్టకట్టాలన్నా, విద్యుత్ కంపెనీలకు సకాలంలో చార్జీలు చెల్లించాలన్నా... ఈ చర్యలు తప్పనిసరి అని మంత్రి బాలినేని పేర్కొన్నారు. తాము ప్రజల తరఫున మాట్లాడుతున్నామని.. ఛార్జీలు తక్కువ ఉంటేనే ప్రజలకు, పారిశ్రామిక రంగానికి మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబు లంచగొండి విధానాల వల్లే గడచిన ఐదేళ్లలో విద్యుత్ సంస్థల బకాయిలు 20 వేల కోట్లు దాటాయని విమర్శించారు. -
‘అయోధ్య మధ్యవర్తి’ తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాద కేసును మధ్యవర్తికి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. సమస్య పరిష్కారానికి అర్హులైన మధ్యవర్తుల పేర్లు సూచించాలని కక్షిదారుల్ని కోరింది. ఈ వ్యవహారంలో త్వరలోనే ఆదేశాలు జారీచేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తెలిపింది. వివాద స్వభావం దృష్ట్యా మధ్యవర్తిత్వ మార్గం ఎంచుకోవడం సరైనది కాదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సమస్య సద్దుమణిగేందుకు అవకాశం ఉన్నప్పుడే ఈ దిశగా యోచించాలని పేర్కొన్నారు. గతంలోనూ మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారానికి చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని కక్షిదారు రామ్లల్లా విరాజ్మాన్ తరఫు లాయర్ సీఎస్ వైద్యనాథన్ గుర్తుచేశారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడన్న విషయంలో ఎలాంటి వివాదం లేదని, కాబట్టి ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం అక్కర్లేదని అన్నారు. అయోధ్యలో వివాదాస్పద భూమి ప్రభుత్వానికే చెందుతుందని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ఆ స్థలంలో ఆలయం ఉండేదని గుర్తిస్తే, రామాలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని 1994లో పీవీ ప్రభుత్వం కోర్టుకు మాట ఇచ్చిన సంగతిని ప్రస్తావించారు. వివాదం ఆస్తికే సంబంధించికాదని, సెంటిమెంట్లు, విశ్వాసాలతోముడిపడి ఉందని వ్యాఖ్యానించింది. మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలన్న కోర్టు సూచనకు ముస్లిం సంస్థలు అంగీకరించగా, హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. -
13న ‘శబరిమల’ పిటిషన్ల విచారణ
న్యూఢిల్లీ/తిరువనంతపురం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను నవంబర్ 13న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని ఇదివరకే జారీచేసినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం మంగళవారం వెల్లడించింది. రివ్యూ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని జాతీయ అయ్యప్ప భక్తుల అసోసియేషన్ తరఫు లాయర్ మాథ్యూస్ జె.నెదుంపరా విజ్ఞప్తి చేయడంతో బెంచ్ పైవిధంగా స్పందించింది. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ 19 పిటిషన్లు దాఖలయ్యాయి. 10–50 ఏళ్ల మధ్యనున్న మహిళలూ అయ్యప్ప ఆలయంలోకి వెళ్లొచ్చని అత్యున్నత న్యాయస్థానం గత నెలలో చారిత్రక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అపవిత్రం చేయొద్దు: స్మృతి ఇరానీ శబరిమల సంప్రదాయాలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మద్దతు పలికారు. ప్రార్థించే హక్కు పేరిట ఆలయాన్ని అపవిత్రం చేయొ ద్దన్నారు. ‘కనీస విచక్షణతో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. రుతుస్రావ రక్తంతో తడిసి న న్యాప్కిన్లతో స్నేహితుల ఇంటికి వెళ్తామా? వెళ్లం కదా.. మరి దేవుడి నిలయమైన ఆలయంలోకి అలా అడుగుపెట్టొచ్చా? మనకు ప్రార్థించే హక్కు ఉంటుంది. కానీ ఆలయాన్ని అపవిత్రంచేసే హక్కు లేదు. ఈ తేడాను గుర్తించి సంప్రదాయాల్ని గౌరవించాలి’ అని అన్నారు. -
జంట పేలుళ్ల కేసులో నేడే తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ 2007లో హైదరాబాద్లోని గోకుల్చాట్, లుంబినీ పార్కులో జరిపిన జంట బాంబు పేలుళ్ల కేసులో సోమవారం తీర్పు వెలువడనుంది. గోకుల్చాట్, లుంబినీ పార్కులో పేలుళ్లతోపాటు దిల్సుఖ్నగర్లో దొరికిన పేలని బాంబుల కు సంబంధించి మొత్తం 3 కేసుల విచారణ ఈ నెల 7తో పూర్తయింది. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదు గురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. సోమవారం తీర్పు వెలువడనుండ టంతో పోలీసు విభాగం జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది. ఆక్టోపస్ కమాండోలను మోహరించింది. ఈ పేలుళ్లు జరిగి శనివారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవే ‘తొలి–ఆఖరి’ కేసులు... పేలుళ్ల కేసులను తొలుత నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేశారు. పేలుళ్ల ఘటన తర్వాత నాటి ప్రభుత్వం ఉగ్ర వాదంపై పోరుకు ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) విభాగాన్ని ఏర్పాటు చేసి నిఘా, ఆపరేషన్స్, దర్యాప్తు బాధ్యతలు కల్పిస్తూ పోలీసుస్టేషన్ హోదా ఇచ్చింది. దీంతో సిట్ నుంచి ఈ 3 కేసులూ ఆక్టోపస్కు వెళ్లాయి. దీనిపై ఆక్టోపస్ అధికా రులు 2009లో 3 అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇది జరిగిన ఏడాదికే ఆక్టోపస్ను కమాండో ఫోర్స్గా మార్చిన ప్రభుత్వం పోలీ సు స్టేషన్ హోదాను ఉగ్రవాద వ్యతిరేక విభాగమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్కు కట్టబెట్టింది. దీంతో ఈ కేసులు సీఐ సెల్కు బదిలీ అయ్యాయి. సీఐ సెల్కు భవిష్యత్తులో మరే ఇతర కేసు దర్యాప్తును అప్పగించకూడ దని నాడే నిర్ణయించారు. దీంతో ఆక్టోపస్, సీఐ సెల్ వింగ్స్ పర్యవేక్షించిన తొలి, ఆఖరి కేసులుగా ఈ మూడే రికార్డులకు ఎక్కాయి. -
అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులకు హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ‘‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్ఏ సంపత్కుమార్ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా మని గత వారం చెప్పారు. అయితే ఇప్పుడు దాని గురించి ఎలాంటి ప్రస్తావనా చేయడం లేదు. తీర్పు ను అమలు చేయనందుకు అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్ రావులకు సోమవారం ఫారం–1 నోటీసులు జారీ చేస్తాం’’అని న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు తేల్చిచెప్పారు. నోటీసులు జారీ చేయడానికి ముందు కావాలంటే వాదనలు వినిపించుకోవచ్చని వారి తరఫు న్యాయవాదులకు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఫారం–1 నోటీసులు జారీ చేసేటప్పుడు వాదనలు వినాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ అవకాశం ఇస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు. తీర్పు అమలుకు ప్రయత్నాలు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్.. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గత వారం జరిగిన విచారణ సందర్భంగా తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసెంబ్లీ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ చెప్పారు. దీంతో న్యాయమూర్తి విచారణను ఈనెల 10కి వాయిదా వేశారు. ఈలోపు జస్టిస్ శివశంకరరావు తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి వేర్వేరుగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై అత్యవసరంగా విచారణ జరిపేందుకు నిరాకరించిన ధర్మాసనం, విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది. వాటితో సంబంధం లేదు కోర్టు ధిక్కార పిటిషన్పై జస్టిస్ శివశంకరరావు శుక్రవారం విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదుల వెంకటరమణ తాము దాఖలు చేసిన అప్పీళ్ల గురించి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, స్టే ఏమైనా వచ్చిందా? అని ఆరా తీశారు. స్టే రాలేదని చెప్పడంతో, అయితే ఆ అప్పీళ్లతో తనకు సంబంధం లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ‘‘గత వారం ఈ కేసు విచారణ సందర్భంగా నేను ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కాని ఇప్పుడు ఆ విషయం గురించి కనీసం ప్రస్తావనా చేయడం లేదు. తీర్పు అమలు గురించి చెప్పకుండా, అప్పీళ్ల గురించి చెబుతారేంటి’’ అని నిలదీశారు. విచారణను వాయిదా వేయాలని వెంకటరమణ కోర గా, న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. ‘మీరేం చెప్పదలచుకున్నారో చెప్పండి.. వింటాను. నిబంధనల ప్రకారం మీ వాదనలు వినాల్సిన అవసరమే లేదు. అయినా కూడా వింటా’అని అన్నారు. దీంతో అటు వేదుల వెంకటరమణ, ఇటు న్యాయశాఖ కార్యదర్శి తరఫున హాజరవుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావుకు ఏం చేయాలో పాలు పోక అలా ఉండిపోయారు. ఈ సమయంలో వేదుల వెంకటరమణ.. కనీసం సోమవారానికన్నా వాయిదా వేయాలని అభ్యర్థించడంతో న్యాయమూర్తి అంగీకరించారు. ఆ రోజున కార్యదర్శులిద్దరికీ ఫారం–1 కింద నోటీసులు జారీ చేస్తానని, దానికి ముందు వాదనలు వినిపించాలనుకుంటే వినిపించుకోవచ్చని చెప్పారు. ఫారం–1 నోటీసులు జారీ చేసేందుకు ధర్మాసనం ముందు దాఖలు చేసిన అప్పీళ్లు తమకు ఎంత మాత్రం అడ్డంకి కాదని పేర్కొన్నారు. విచారణను ఈనెల 13కి వాయిదా వేశారు. -
ఉసురుతీసిన పెద్దమనుషుల తీర్పు
మహబూబాబాద్ రూరల్: పక్కనున్న వ్యవసాయ భూములకు వెళ్లే దారి తీసేందుకు తన వ్యవసాయ భూమిలో నుంచి పెద్దమనుషులు 17 గుంటల భూమి తీశారని మనోవేదనకు గురైన ఓ రైతు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ మండలం మాధవాపురం గ్రామశివారు దారావత్తండాలో శుక్రవారం జరిగింది. కురవి ఎస్సై ఎన్.నాగభూషణం, మృతుడి భార్య దారావత్ లక్ష్మి, స్థానికుల కథనం ప్రకారం... మహబూబాబాద్ మండలం మాధవాపురం శివారు దారావత్తండాకు చెందిన దరావత్ లచ్చిరాం(50)కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పక్కనే ఇదే తండాకు చెందిన అతడి దాయాదులు దరావత్ లింగన్న, మోహన్, రమేష్, కస్నాకు వరుసగా భూములు ఉన్నాయి. వారి భూముల మధ్య లచ్చిరాం భూమి కూడా కొంత ఉంది. అయితే ఆయా భూములకు వెళ్లేందుకు దారి కోసం భూమి ఇవ్వాలని వారు రెండేళ్లుగా కోరుతున్నారు. ఈ విషయంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. మొదటిసారి పంచాయితీలో పెద్దమనుషులు లచ్చిరాం భూమిలో నుంచి ఒక గుంటకు బదులు నాలుగు గుంటల భూమిని లింగన్న భూమికి వెళ్లే దారి కోసం కేటాయించారు. ఇటీవల పంచాయితీలో మళ్లీ లచ్చిరాంకు చెందిన 17 గుంటల భూమిని దారి కోసం తీశారు. దీంతో తన భూమిని ఎక్కవగా దారి కోసం కేటాయిస్తూ పెద్ద మనుషులు అన్యాయం చేశారంటూ మనోవేదనకు చెంది శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో పురుగుల మందు తాగి... దరావత్ లచ్చిరాం గతంలో కూడా ఇదే విషయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దాయాదులు, ఇతర రైతులైన దరావత్ మోహన్, దరావత్ లింగన్న, దరావత్ రమేష్, దరావత్ కస్నా, దరావత్ వీరన్నతోపాటు పెద్ద మనుషులైన దరావత్ హరియా, దరావత్ శంకర్ ఏడుసార్లు పంచాయితీలు నిర్వహించి లచ్చిరాంకు రూ.60 వేల వరకు ఖర్చు చేయించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అప్పట్లో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. ఇందుకు రూ.80 వేలు ఖర్చయ్యింది. దారి కోసం భూమి కోల్పోవడం, పెద్ద మనుషుల తీరుతో మనోవేదనకు గురై ఇప్పుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య లక్ష్మి వాపోయింది. తమ భూమిలోకి వెళ్లకుండా కావాలని దారావత్ మోహన్, దారావత్ బీక్యా దారిలో ముళ్లకంప, ఇనుప కంచె వేశారని ఆవేదన చెందింది. లచ్చిరాం భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కురవి ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
‘కేసుల కేటాయింపు’పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: కేసుల కేటాయింపు (రోస్టర్)పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్న ప్రత్యేక అధికారాలను తొలగించాలన్న పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. కేసుల కేటాయింపు బాధ్యతను ఐదుగురు జడ్జీల కొలీజియంకు అప్పగించాలని కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ వేసిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. ఫలానా కేసు తనకు కేటాయించలేదని లేదా ఎందుకు కేటాయించరంటూ కొందరు జడ్జీలు అసంతృప్తికి గురయిన సందర్భాలు కూడా హైకోర్టుల్లో ఉన్నాయని విచారణ సందర్భంగా జడ్జి సిక్రి అన్నారు. పిటిషనర్ తరఫున దుశ్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. సున్నితమైన కొన్ని కేసుల బాధ్యతను కొన్ని బెంచ్లకే అప్పగించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ‘మాస్టర్ రోస్టర్’గా సీజేఐకు అపరిమిత అధికారం ఉన్నట్లు కాదని తెలిపారు. సుప్రీంజడ్జిగా ఇందూ ప్రమాణం సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా(61) సుప్రీం న్యాయమూర్తిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా ఆమెతో ప్రమాణం చేయించారు. ఈమె రాకతో సుప్రీంజడ్జీల సంఖ్య 25కు చేరుకుంది. దీంతో న్యాయవాది నుంచి నేరుగా సుప్రీం కోర్టు జడ్జిగా ఎన్నికైన తొలి మహిళగా ఆమె నిలిచారు. సుప్రీం చరిత్రలో ఒకేసారి ఇద్దరు మహిళా జడ్జీలు పనిచేయడం ఇది మూడోసారి. -
పేలుడు నుంచి తీర్పు దాకా..
సాక్షి, హైదరాబాద్: చరిత్రాత్మక మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగి పదకొండేళ్లు అవుతోంది. కేసు దర్యాప్తు నాలుగు చేతులు మారింది. మొత్తం పది మందిని నిందితులుగా చేర్చగా.. అందులో ముగ్గురు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. ఆరుగురిని అరెస్టు చేయగా.. ఐదుగురిపై న్యాయస్థానంలో అభియోగ పత్రాలు దాఖలయ్యాయి. ఒక నిందితుడు 2007లో మధ్యప్రదేశ్లో హత్యకు గురయ్యాడు. మొత్తంగా సుదీర్ఘ విచారణ తర్వాత సోమవారం ఈ కేసు వీగిపోయింది. అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పేలుడు నాటి నుంచి తీర్పు ఈ కేసులో కీలక పరిణమాలు ఇవీ.. 2007 మే 18 మధ్యాహ్నం 1.25 గంటలకు మక్కా మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఘటనాస్థలంలోనే ఐదుగురు మరణించగా.. నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 58 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన తర్వాత చెలరేగిన అల్లర్లను అదుపు చేయడానికి జరిగిన పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మక్కా మసీదులో పేలకుండా ఉన్న మరో బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2007 మే 24 మక్కా మసీదు పేలుడు, బాంబు దొరికిన కేసుల దర్యాప్తు బాధ్యతను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నుంచి సీబీఐకి అప్పగించారు. తొలుత స్థానిక హుస్సేనీ ఆలం పోలీసుస్టేషన్లో కేసులు నమోదు చేసినా.. తర్వాత సీసీఎస్లోని సిట్కు బదిలీ అయ్యాయి. 2007 జూన్ 10 అప్పటి సీబీఐ ఎస్పీ ఆర్.ఎస్.దినకర్ ప్రసాద్ నేతృత్వంలో డీఎస్పీ ఠాకూర్, ఇన్స్పెక్టర్లు శర్మ, ప్రక్యాల్లతో కూడిన బృందం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. 2008 అక్టోబర్ 28 మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుడు కేసులో అక్కడి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అభినవ్ భారత్ సంస్థకు చెందిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్, శ్రీకాంత్ పురోహిత్లను అరెస్టు చేశారు. వారిని విచారించినప్పుడు రాజస్తాన్లోని అజ్మీర్లో పేలుళ్లకు బాధ్యులైన దేవేంద్ర గుప్తా, లోకేశ్ శర్మ, రామచంద్ర, సందీప్ల పేర్లు బయటికి వచ్చాయి. 2010 ఏప్రిల్ 28 రాజస్తాన్ పోలీసులు దేవేంద్ర గుప్తా, లోకేశ్ శర్మలను అరెస్టు చేసి విచారించిన సమయంలో.. మక్కా మసీదులో పేలుళ్లకు పాల్పడింది కూడా తామేనని వెల్లడించారు. దీంతో సీబీఐ అధికారులు వారిని విచారించాలని నిర్ణయించారు. 2010 జూన్ 11 దేవేంద్ర గుప్తా, లోకేశ్ శర్మలను తీసుకువచ్చి, విచారించేందుకు సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారంట్లు పొందారు. 2010 జూన్ 18 ప్రత్యేక బృందంతో రాజస్తాన్కు వెళ్లిన సీబీఐ అధికారులు.. దేవేంద్ర, లోకేశ్లను హైదరాబాద్కు తీసుకువచ్చారు. న్యాయస్థానం అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుని విచారించగా.. స్వామి అసీమానంద పేరు వెలుగులోకి వచ్చింది. 2010 నవంబర్ 19 ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో మారుపేరుతో రహస్య జీవితం గడుపుతున్న స్వామి అసీమానందను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. రామచంద్ర, సందీప్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు. 2010 డిసెంబర్ 13 ఈ కేసులో సీబీఐ అధికారులు ప్రిలిమినరీ చార్జిషీట్ దాఖలు చేశారు. అసీమానంద మినహా మిగతా ఇద్దరు నిందితులు దేవేంద్ర, లోకేశ్లపై నాంపల్లి కోర్టులో 75 పేజీల అభియోగపత్రం దాఖలు చేశారు. అప్పట్లో అసీమానంద పోలీసు కస్టడీలో ఉండటంతో అభియోగాలు నమోదు చేయలేదు. 2011 ఏప్రిల్ 7 కేంద్ర హోం శాఖ నిర్ణయం మేరకు మక్కా పేలుడు కేసు దర్యాప్తు సీబీఐ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయింది. పరారీలో ఉన్న రామచంద్ర, సందీప్, అశోక్లపై రూ.20 లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ.. గాలింపు ముమ్మరం చేసింది. 2011–2013 ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు 2011 మే, 2012 జూలై, 2013 ఆగస్టులలో అసీమానంద సహా పలువురిపై మూడు సప్లిమెంటరీ చార్జిషీట్లు దాఖలు చేశారు. అరెస్టైన వారిలో తేజోరామ్ పర్మార్పై మాత్రం అభియోగాలు నమోదు కాలేదు. సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందనే ఉద్దేశంతో వారి వివరాలను గోప్యంగా ఉంచారు. 2018 ఏప్రిల్ 16 నిందితులను దోషులుగా నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించలేకపోవడం, ప్రాసిక్యూషన్ వైఫల్యం, అనేకమంది సాక్షులు ఎదురుతిరిగిన నేపథ్యంలో మక్కా పేలుడు కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు. దేవేంద్ర గుప్తా, లోకేశ్ శర్మ, స్వామి అసీమానంద, భరత్ మోహన్లాల్ రతీశ్వర్, రాజేంద్ర చౌదరిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు. తీర్పులో న్యాయం లేదు మక్కా మసీదు బాంబు పేలుళ్లలో మా బావ జాఫర్ మృతి చెందాడు. పెళ్లయి ఏడాది కాకముందే మరణించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న జాఫర్ను నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు చనిపోయాడు. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయం లేదు. దోషులను శిక్షించాల్సింది పోయి నిరపరాధులుగా విడుదల చేయడం సరైంది కాదు. – మహ్మద్ ఉమర్, మృతుడు జాఫర్ బావమరిది సరైన న్యాయం చేయలేదు బాంబు పేలుళ్ల ఘటనలో ప్రార్థనలకు వెళ్లిన మా అల్లుడు షేక్ నహీం మృతి చెందాడు. దాంతో అతడి తల్లి అనారోగ్యం పాలైంది. తీర్పు అనుకూలంగా రాలేదు. ఎన్ఐఏ సరైన న్యాయం చేయలేదు. – మహ్మద్ సలీం, మృతుడు షేక్ నహీం మేనమామ ఓ బాంబును నిర్వీర్యం చేశాం మక్కా మసీదు బాంబు పేలుళ్లు మధ్యాహ్నం 1.20 గంటలకు జరిగినట్లు సమాచారం అందడంతో ఘటనా స్థలికి చేరుకున్నాం. చార్మినార్ వద్ద పరిస్థితి తీవ్రంగా ఉండటంతో సివిల్ డ్రెస్సులో లోపలికి వెళ్లాం. అప్పటికే రాళ్ల దాడులు, గొడవలు జరుగుతున్నాయి. పేలుడు జరిగిన బండరాయి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న బాక్స్ను స్వాధీనం చేసుకున్నాం. అందులో బాంబు ఉంది. వెంటనే ఖిల్వత్ ప్లే గ్రౌండ్లోకి తీసుకెళ్లి బాంబును నిర్వీర్యం చేశాం. – సీహెచ్. నాగసాయి, బాంబు స్క్వాడ్ ఇన్స్పెక్టర్ -
ఈ తీర్పు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు నూటికి నూరుపాళ్లు అన్యాయమైనదని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రాజకీయ జోక్యానికి తలొగ్గి, కేసును నీరుగార్చిందని ఆరోపించారు. సోమవారం మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు అనంతరం.. మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షుల్లో అత్యధిక భాగం ప్రతికూలంగా మారిపోయారు. కీలక సాక్షులు మాటమార్చారు. ఇంత జరుగుతున్నా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుడ్డి, చెవిటిదానిలా మిన్నకుండిపోయింది. అసలు ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తును సరిగా ముందుకు తీసుకెళ్లలేదు. అరెస్టైన ప్రధాన నిందితులకు 90 రోజులలోపే బెయిల్ వచ్చినా దానిని సవాల్ చేయలేదు. ఎన్ఐఏ రాజకీయ జోక్యానికి తలొగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో న్యాయమన్నదే లేకుండా పోయే ప్రమాదముంది..’’అని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం, ఎన్ఐఏ వ్యవహరించాయని ఆరోపించారు. పేలుళ్లలో మరణించినవారి కుటుంబాలకు న్యాయం దక్కలేదన్నారు. కర్ణాటకలో జేడీఎస్కు మద్దతిస్తాం.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, జేడీఎస్కు మద్దతిస్తామని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా విఫలమయ్యాయని.. అభివృద్ధి జరగాలంటే బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు. అందుకోసమే జేడీఎస్కు మద్దతివ్వాలని నిర్ణయించామని.. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటామని చెప్పారు. అవసరమైతే జేడీఎస్ తరఫున బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. -
తీర్పును స్వాగతిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగా అమాయకులపై కేసులు బనాయించారని ఆరోపించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కేసును అడ్డుపెట్టుకుని కాంగ్రెస్, మజ్లిస్లు దుర్మార్గపు రాజకీయాలు చేశాయని విమర్శించారు. తాజా తీర్పును పరిశీలించైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ నుంచి ట్యాంక్బండ్ వరకు వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించలేని సీఎం కేసీఆర్కు దళితుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం మానవీయ కోణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 14 నుంచి మే 5 వరకు గ్రామీణ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దళిత వాడల్లో భోజనం, పల్లె నిద్రలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలను ఎండగట్టేందుకు ప్రజాచైతన్యయాత్రలను నిర్వహిస్తామన్నారు. మే 2న కిసాన్ కల్యాణ్ కార్యశాలలు, మే 5న కౌశల్ వికాస్ యోజన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకుముందు బీజేపీ పదాధికారుల, జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్రావు, ఇంద్రసేనారెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ తీర్పు వారికి చెంపపెట్టు: దత్తాత్రేయ కాంగ్రెస్ హయాంలో మక్కా మసీదు పేలుళ్ల కేసు సందర్భంగా కాషాయ తీవ్రవాదం అంటూ తప్పుడు ప్రచారం చేసిన వారికి తాజా తీర్పు చెంపపెట్టులాంటిదని ఎంపీ దత్తాత్రేయ పేర్కొన్నారు. అప్పట్లో చేసిన ఆరోపణలు తప్పని తేలిపోయిందని ఓ ప్రకటనలో తెలిపారు. -
‘ఎస్సీ, ఎస్టీ చట్టం’పై ఆర్డినెన్స్?
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఆ తీర్పును రద్దు చేసేలా ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పునకు ముందున్న యథాస్థితికి ఆ చట్టాన్ని పునరుద్ధరించాలని కేంద్రం భావిస్తోంది. ఆర్డినెన్స్ జారీ ద్వారా సుప్రీంకోర్టు చేసిన మార్పుల్ని రద్దు చేసే అంశంపై ఇప్పటికే సమాలోచనలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై సాగుతున్న చర్చలపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. ‘ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఉద్రిక్తతల్ని తగ్గించవచ్చనే ఆలోచనలో కేంద్రం ఉంది. అలాగే సుప్రీంకోర్టు తీర్పును నిరోధించేలా జూలైలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై వేధింపుల నిరోధక చట్టం, 1989ను సవరించేలా బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది’ అని వెల్లడించాయి. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత నెల 20న సుప్రీం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్తో తక్షణ ఫలితం ‘ఒకసారి ఆర్డినెన్స్ జారీ చేస్తే.. ఆ తర్వాత దానిని బిల్లు రూపంలో మార్చి పార్లమెంటు ఆమోదం పొందవచ్చు. రెండింటి ఫలితాలు ఒకటే అయినా ఆర్డినెన్స్తో తక్షణం ఎస్సీ, ఎస్టీ చట్టం పూర్వపు స్థితిలో అమల్లోకి వస్తుంది. ఆర్డినెన్స్తో వెంటనే ఫలితాన్ని పొందవచ్చు. దేశంలో కొనసాగుతున్న నిరసనల్ని నియంత్రించవచ్చు’ అని ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు చేస్తూ మార్చి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దళిత, గిరిజన సంఘాలతో పాటు అనేక రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తీర్పును నిరసిస్తూ ఏప్రిల్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారనివ్వబోమని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘మనం పటిష్టంగా రూపొందించిన చట్టం ప్రభావితమయ్యేందుకు (సుప్రీంకోర్టు తీర్పు ద్వారా) అనుమతించమని మీకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇచ్చిన తీర్పు దేశానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తుందని, సమీక్షించాలని ఇప్పటికే సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరిన విషయం విదితమే. ఇంకా నిర్ణయం తీసుకోలేదు: ప్రభుత్వం కాగా ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఆర్డినెన్స్ జారీకి ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై సుప్రీం తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రివ్యూ పిటిషన్తో తక్షణ ఫలితం రాకపోవచ్చని, అలాగే సుప్రీంకోర్టు నిర్ణయం సానుకూలంగా ఉండకపోవచ్చని.. అందువల్ల భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందని భావిస్తున్నారు. వ్యతిరేకంగా వస్తే ఆర్డినెన్స్: పాశ్వాన్ దళితుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం బలహీనపరిచే చర్యల్ని ప్రభుత్వం అంగీకరించబోదని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్పై తీర్పు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో.. ఆర్డినెన్స్తో పాటు పలు ప్రత్యామ్నాయాల్ని కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు. ‘తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తే.. ఆ తర్వాతి రోజే కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్పై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన న్యాయమూర్తుల అంశంపై మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఒక్క న్యాయమూర్తి కూడా లేరు. హైకోర్టుల్లో నామమాత్రంగా న్యాయమూర్తులు ఉన్నారు’ అని పేర్కొన్నారు. -
ఆ వడ్డీ రేట్లను కోర్టులు పరిశీలించవచ్చు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్న వేళ సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. రుణవిముక్తి చట్టం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో బ్యాంకులు రైతులకిచ్చే రుణాలపై వడ్డీ రేటును పరిశీలించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందని కోర్టు తేల్చింది. బ్యాంకులు ప్రజలకిచ్చే రుణాలపై వడ్డీ అధికంగా ఉందంటూ ఏ కోర్టులూ విచారణ జరపరాదని బ్యాంకింగ్ నియంత్రణ చట్టం–1949లోని సెక్షన్ 21ఏ చెబుతోంది. రైతుల రుణాలు రాష్ట్ర జాబితాలోని అంశమనీ, దీంట్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు ఉంటుందని సుప్రీం తేల్చింది. -
ఆరుషి హత్య కేసులో.. సంచలన తీర్పు
-
‘కార్పొరేషన్’ తీర్పు... 24 గంటలే
♦ గెలుపు ఓటములపై ఎవరి ధీమా వారిది ♦ కూడికలు, తీసివేతల్లో అభ్యర్థులు కాకినాడ : ఈవీఎంలలో నిక్షిప్తమైన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఓటర్ల తీర్పు మరో 24 గంటల్లో బయటకు రానుంది. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో సెప్టెంబర్ 1వ తేదీన జరిగే కౌంటింగ్పైనే అందరి దృష్టి పడింది. 48 డివిజన్లకు సంబంధించి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ సరళి ఆధారంగా అభ్యర్థులు గెలుపు ఓటములపై కూడికలు, తీసివేతల్లో పడ్డారు. ఏ డివిజన్లలో ఎంత శాతం పోలైంది? ఆ డివిజన్లలో ఏ వర్గం ప్రతిస్పందన ఏమిటి? ఓటర్ నాడి ఎలా ఉంది? వంటి అంశాలపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉన్న అనుచరులు, ఇతర సిబ్బందిని కూడా ప్రజాస్పందనపై ఆరా తీయడంలో మునిగిపోయారు. ఓటింగ్ సరళి ఆధారంగా ఏ ప్రాంతంలో అనుకూలంగా ఉంటుంది? ఎక్కడ ప్రతికూలంగా ఉంటుంది? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఎవరి ధీమా వారిది... గెలుపుపై అభ్యర్థులు ధీమాగా కనిపిస్తున్నారు. పోలింగ్ సరళిని బట్టి తమకే అవకాశాలున్నాయంటే ... తమదే విజయమంటూ ప్రధాన రాజకీయ పక్షాలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళి కూడా తమకే అనుకూలంగా ఉందంటూ చెప్పుకొస్తున్నారు. ఇంటెలిజెన్స్ నివేదికపై ఆరా... కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంటెలిజెన్స్ నివేదికపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై ఇప్పటికే ఓ రిపోర్టును ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ డివిజన్ ఏ పార్టీ ఖాతాలో వేశారనే అంశంపై అభ్యర్థులు ఆసక్తితో సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఓటరు తీర్పు ఎటువైపు? కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటరు ఎటువైపు మొగ్గారనే అంశంపై ఆసక్తి నెలకొంది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ, అధికార దుర్వినియోగం, ఓటర్లకు బెదిరింపులు, ప్రలోభాల నేపథ్యంలో వీరి నిర్ణయం ఎలా ఉంటుందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని డివిజన్లలో చివరి మూడు రోజులుగా డబ్బుతోపాటు కానుకలు కూడా పంపిణీ చేశారు. ఏది ఏమైనా మరో 24 గంటల్లో రానున్న ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
కనికరంలేని గ్రామ తీర్పు..
మైసూరు: గ్రామాల్లో పెద్దరాయుళ్ల తీర్పు ఆనాటి నుంచి ఈనాటికి కొన్నిచోట్ల అమల్లో ఉంది. గ్రామం తీర్పులో దయ, జాలి, కనికరం అనేవి ఏవీ ఉండవు. గ్రామ పెద్దరాయుడికి ఎదురు తిరిగి మాట్లాడినందుకు ఒక దివ్యాంగుడిని గ్రామం నుంచి వెళ్లిపోవాలని తీర్పు చెప్పారు. నా మాటనే లెక్క చేయవా అని దివ్యాంగున్ని గ్రామం నుంచి బహిష్కరించిన ఘటన ఆదివారం జిల్లాలోని హెచ్.డి.కోట తాలూకాలో జరిగింది. వివరాలు.. తాలూకాలోని హంపాపుర గ్రామానికి చెందిన దివ్యాంగుడు సణ్ణస్వామి.. అదే గ్రామంలో ఉంటున్న తన బంధువుల ఇంటి సమీపంలోనున్న కొబ్బరి చెట్టును తొలగించడానికి ప్రయత్నించాడు. దీనికి గ్రామపెద్ద సిద్ధనాయక అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో సణ్ణస్వామిని గ్రామం నుంచి బహిష్కరిస్తూ సిద్ధనాయక తీర్పు చెప్పాడు. గ్రామ బహిష్కరణ విధించడంతో సణ్ణస్వామికి గ్రామంలో హోటల్, రేషన్, కటింగ్సెలూన్లోకి కూడా రానివ్వడంలేదు. తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు హంపాపుర పోలీస్స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. -
నేడు జడ్జిమెంట్
సీకే బాబుపై హత్యాయత్నం కేసు ►2007లో సీకే బాబు లక్ష్యంగా కాల్పులు ►గన్మెన్, ఉద్యోగి, దుండగుడు మృతి ►57 మంది సాక్ష్యుల్ని విచారించిన కోర్టు ►నేడు తుది తీర్పు.. కోర్టు వద్ద భారీ భద్రత చిత్తూరు (అర్బన్): చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు లక్ష్యంగా 2007లో జరిగిన కాల్పుల ఘటనలో కోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించనుంది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సీకే అంగ రక్షకుడితోపాటు మునిసిపల్ ఉద్యోగి, అగంతకుల్లో ఒకడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాదాపు పదేళ్ల పాటు విచారణ జరిగిన తరువాత ఈ ఘటనపై కోర్టు తీర్పు వెలువరించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏమి జరిగిందంటే... 2007 ఫిబ్రవరి 9వ తేదీ సమయం ఉదయం 9 గంటలు కావస్తోంది. చిత్తూరు నగరంలోని పలమనేరు రోడ్డులో ఉన్న క్లబ్కు వెళ్లడం సీకేకు అలవాటు. మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉన్నా సీకే క్లబ్ వద్ద ఉన్న తన గదిలో అనుచరులతో కలిసి అల్పాహారం చేస్తున్నారు. ఇంతలో తుపాకులతో వచ్చిన ఓ అగంతక ముఠా గది వద్ద ఉన్న గన్మెన్ (ఏఆర్ కానిస్టేబుల్) హుస్సేన్ బాషను తుపాకీతో కాల్పి చంపింది. అక్కడి నుంచి సీకే ఉన్న గదిలోకి వెళ్లారు. సీకే ఆయన అనుచరులు గడ్డాలతో ఉండడంతో ఎవరిని కాల్చాలో తెలియక అందరికీ గురిపెట్టారు. ఒక్క సారిగా కాల్పుల శబ్దం. కొంతమంది పరుగులు తీశారు. చిత్తూరు మునిసిపాలిటీలో పనిచేస్తున్న నావరసు అనే ఉద్యోగి దుండగుల తూటాకు బలయ్యాడు. ఆగంతకుల్లో ఓ వ్యక్తిని సీకే అంగరక్షకులు మట్టుపెట్టారు. కాలికి బుల్లెట్ తగిని ఓ వ్యక్తి, మరికొంత మంది పారిపోయారు. సీకే బాబు తృటిలో తప్పించుకున్నారు. వీరిపై కేసులు... 2005లో అప్పటి కౌన్సిలర్, టీడీపీ నేత కటారి మోహన్పై జరిగిన హత్యాయత్నానికి ప్రతీకారంగా సీకేపై కాల్పులు జరిగాయని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడిగా కటారి మోహన్, మోహన్ మేనల్లుడు చింటూ (మేయర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు), సతీష్బాబు, పటాన్ సర్దార్, కటారి ప్రవీణ్ (కటారి మోహన్ కుమారుడు), శాంతకుమార్, అమర్నాథ్, శశిధర్, ప్రకాష్, సతీష్, రాజ, వెంకటాచలపతి, జలగం మురళి, త్రివిక్రమ్, ఏకాంబరంపై అభియోగాలు మోపుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. అందరినీ అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నిందితుల్లో కటారి మోహన్, శాంతకుమార్ చనిపోయారు. కాల్పులు జరిగినప్పుడే రాజా అనే వ్యక్తి కాలికి బుల్లెట్ గాయం తగలడంతో పారిపోయాడు. అతని ఆచూకీ తెలియరాలేదు. మొత్తం 94 మందిని పోలీసులు సాకు‡్ష్యలుగా చేర్చారు. ఇందులో కోర్టు 57 మందిని విచారించింది. చిత్తూరులోని 9వ జిల్లా అదనపు, సెషన్స్ కోర్టు దీనిపై సోమవారం తీర్పు వెలువరించనుంది. ముందస్తు జాగ్రత్తగా చిత్తూరు న్యాయస్థానాల సముదాయం వద్ద పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. -
కోర్టు తీర్పుపై నేతల అభిప్రాయాలు
టీనగర్: ఆస్తులు కూడబెట్టిన కేసులో శశికళ దోషిగా సుప్రీంకోర్టు ప్రకటించడంతో రాజకీయ నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తమిళిసై సౌందరరాజన్ (బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు): సుప్రీంకోర్టు తీర్పు అవినీతిపరులకు అగాథం వంటిది. బీజేపీ లక్ష్యం అవినీతిని అంతమొందించడమే. ఈ తీర్పుతో రాష్ట్ర ప్రజలకు మేలు కలిగింది. తిరుమావళవన్ (వీసీకే అధ్యక్షుడు): ఇది చారిత్రాత్మక తీర్పు. అవినీతికి పాల్పడేవారికి భీతి కలిగించే తీర్పు జి.రామకృష్ణన్ (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి) : ప్రజా జీవితంలో అవినీతికి పాల్పడే వారికి ఈ తీర్పు ఒక హెచ్చరిక ఈఆర్.ఈశ్వరన్ (కొంగునాడు మక్కల్ దేశీయకట్చిఅధ్యక్షుడు):సుప్రీంకోర్టు తీర్పు అవినీతికి పాల్పడే నేతలకు సమ్మెటపోటు. ఇనాయతుల్లా (అఖిల భారత దేశీయ లీగ్ అధ్యక్షుడు): సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రజలు రక్షించబడ్డారు. ఎన్ఆర్.ధనబాలన్ (పెరుందలైవర్ మక్కల్ కట్చి): దీర్ఘకాలం తర్వాత తీర్పు విడుదలయినప్పటికీ ప్రశంసనీయంగా నిలిచింది. సేతురామన్ (మూవేందర్ మున్నని కళగం, అధ్యక్షుడు) : రాష్ట్ర ప్రజల మనోభావాన్ని సుప్రీంకోర్టు నెరవేర్చినట్లయింది. జవాహిరుల్లా (మనిదనేయ మక్కల్ కట్చి అధ్యక్షుడు) : 21 ఏళ్ల తర్వాత అవినీతిని ధ్రువపరుస్తూ నేడు సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పు వాస్తవంగా చారిత్రాత్మకం. తమిళరువి మణియన్ : సుప్రీంకోర్డు అవినీతికి వ్యతిరేకంగా నరకాసుర వధ జరిపింది. ఇదే విధంగా పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. -
‘ఫిరాయింపుల’ తీర్పుపై అప్పీల్
సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు దాఖలు సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఇద్దరు న్యాయ మూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై గురువారం విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తమ పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్లోకి ఫిరాయించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, జి.సాయన్న, ప్రకాశ్గౌడ్, మంచిరెడ్డి కిషన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, రాజేందర్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, కె.పి.వివేకానంద్, మాగంటి గోపీనాథ్, అరెకపూడి గాంధీలపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ నేతలు స్పీకర్ ముందు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను పరిష్కరించకుండానే టీఆర్ఎస్లో టీటీడీఎల్పీ వీలైనమైనట్లు పేర్కొంటూ శాసనసభ కార్యదర్శి పేరు మీద బులిటెన్ జారీ అయింది. ఈ బులిటెన్ రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని కొట్టేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, స్పీకర్ తీరును ఆక్షేపించారు. తన ముందున్న అనర్హత పిటిషన్లను పరిష్కరించకుండానే, టీటీడీఎల్పీ విలీనంపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఈ కేసులో స్పీకర్ ఓ ట్రిబ్యునల్గా వ్యవహరిస్తున్నారని, అందువల్ల ఆయన నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటూ గత సెప్టెంబర్ 21న ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 21తో మూడు నెలల గడువు ముగియనున్న నేపథ్యంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి.. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై గురువారం ధర్మాసనం విచా రణ చేపట్టింది. ఈ సందర్భంగా కార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద పెండిం గ్లో ఉన్నప్పుడు దానిపై న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదని తెలిపారు. అధికరణ 212 ప్రకారం శాసన వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం తగదని చెప్పారు. పూర్తిస్థాయి వాదనల నిమిత్తం విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
‘కృష్ణా’ తీర్పుపై ఏంచేద్దాం!
టీఏసీతో జల వనరుల విభాగం సమాలోచన సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం గురువారం సాంకేతిక సలహా సంఘం (టీఏసీ)తో సమాలోచనలు జరిపింది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఫలితం ఉంటుం దా? ఉండదా? అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చిం చింది. అయితే సుప్రీంకు వెళ్లే విషయమై భిన్నాభిప్రాయాలు రావ డం, ఇది పూర్తిగా న్యాయపరమైన అంశం కావడంతో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంలో సీనియర్ న్యాయవాదులతో చర్చించి తుది నిర్ణయానికి రావడమే ఉత్తమమని సలహా సంఘం సూచించినట్లు సమాచారం. ట్రిబ్యునల్ తీర్పు ప్రభావం, ట్రిబ్యునల్కు సమర్పించాల్సిన అఫిడవిట్ తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశానికి టీఏసీ సభ్యులు గోపాల్రెడ్డి, రవూఫ్, కె.వేణుగోపాల్రావు, న్యాయవాదులు రవీందర్రావు, విద్యాసాగర్ తదితరులు హాజరయ్యారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్కు అదనంగా మరో పిటిషన్ వేయాలని, ట్రిబ్యునల్ తీర్పుపై స్టే కోరాలని కొందరు సూచించగా, తీర్పు వెలువడ్డాక కోర్టును ఆశ్రయించినా ఫలితం ఉండదని మరికొందరు అభిప్రాయపడినట్లుగా తెలిసింది. కాగా, ఈ నెల 29న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్తో నిర్వహించే సమావేశంలోనే ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావాలని సూచిస్తూ సమావేశాన్ని ముగించినట్లుగా తెలిసింది. -
ట్రిబ్యునల్ తీర్పు.. కొత్త సచివాలయం
♦ నేటి మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు అంశాలపైనే ప్రధాన చర్చ ♦ ట్రిబ్యునల్ తీర్పుపై నీటిపారుదల అధికారులతో హరీశ్రావు సమీక్ష సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు.. కొత్త సచివాలయం నిర్మాణం.. ఈ రెండు అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం నేడు ప్రత్యేకంగా సమావేశమవుతోంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రంపై పడే ప్రభావం, భవిష్యత్ కార్యాచరణతో పాటు మొత్తం పది అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకే విచారణ పరిమితమైతే తెలంగాణకు ఎనలేని నష్టం జరిగే అవకాశాలున్నాయి. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. తీర్పు వెలువడినందున ఇప్పటికిప్పుడు సుప్రీంకి వెళ్లినా ఇంతకు మించి చేసేదేమీ ఉండదనే వాదనను సైతం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రానికి న్యాయం చేసే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోరాదని, ఈ కేసులో ఏపీని కలుపుకుని సుప్రీంకోర్టుకు వెళ్లాలని రిటైర్డ్ ఇంజనీర్లు ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యంగా బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు అదనంగా కేటాయించిన 254 టీఎంసీలను ఆ రాష్ట్రాలు వాడుకుంటే దిగువకు నీరొచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఖరీఫ్ ఆశలు పూర్తిగా వదులుకోవడమో లేక అక్టోబర్ వరకు ఆగడమో చేయాల్సిందేనని, ఇది రాష్ట్రానికి గొడ్డలిపెట్టేనని అంటున్నారు. రెండు రాష్ట్రాలకే ఈ వాదనలు పరిమితమైతే తెలంగాణ కేవలం క్యారీ ఓవర్ కింద ఇచ్చిన 150 టీఎంసీలు, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అందులో వచ్చే వాటాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కొత్తగా ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల అవసరాలకు ఈ వాటాలు ఎంతమాత్రం సరిపోవు. అందుకే సుప్రీంను ఆశ్రయించి స్టే కోరాలనే వాదనలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రి కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. మరోవైపు ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో నీటిపారుదల మంత్రి హరీశ్రావు గురువారం సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ట్రిబ్యునల్ తీర్పు, కేంద్ర ప్రభుత్వ పాత్ర, తదుపరి అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలు, సుప్రీంలో ఇప్పటికే దాఖలై ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ల పురోగతిని సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రిని కలసి ఆ వివరాలన్నింటినీ అందించారు. వచ్చే నెలలోనే కూల్చివేత..! ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి.. అదే ప్రాంగణంలో కొత్త సచివాలయం నిర్మించే అంశాన్ని కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇందులో ఉన్న తమ సచివాలయ ప్రాంగణాన్ని తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరించింది. కానీ విభజనకు సంబంధించిన అంశం కావటంతో ఏపీ సచివాలయం స్వాధీనం, మొత్తం సచివాలయంలోని అన్ని భవనాల కూల్చివేతపై మంత్రివర్గంలో చర్చించి తీర్మానం చేయనున్నారు. అదే తీర్మానాన్ని గవర్నర్ ఆమోదానికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలోనే కూల్చివేత పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. అందుకు వీలుగా సచివాలయంలోని ఆఫీసులన్నీ తాత్కాలికంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న భవనాల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన ఆఫీసులను సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్కు తరలించాలని, ఏపీ ప్రభుత్వానికి నాంపల్లిలో గాంధీభవన్ పక్కన ఉన్న మనోరంజన్ బిల్డింగ్ను అప్పగించాలని నిర్ణయించారు. కేబినెట్ సమావేశం నేపథ్యంలో గురువారం సీఎస్ ఈ రెండు భవనాలను పరిశీలించారు. -
‘123 జీవో రద్దు ప్రభుత్వానికి చెంపపెట్టు’
నిజామాబాద్ సిటీ : మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ భూసేకరణకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 123ను రాష్ట్ర హైకోర్టు రద్దు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కాంగ్రెస్ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారన్నారు. ప్రతిపక్షాలు కూడా రైతుల పక్షాన నిలబడ్డాయన్నారు. 123 జీవో సరైందేనని సమర్థించుకున్న సీఎం కోర్టు తీర్పుపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. 2013లో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో తప్పుడు లెక్కలు చోటు చేసుకున్నాయని, వీటిపై కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, మేయర్ సుజాత, మున్సిపల్ అధికారులు సీఎం ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర పొలిట్బ్యూరో సభ్యుడు పోశెట్టి స్వయంగా విమర్శించటం ఆ పార్టీకి సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేశ్రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి మోహన్రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుమీర్హైమద్, నాయకులు బంటు రాము, విపుల్గౌడ్, వక్ఫ్బోర్డు చైర్మన్ జావీద్ అక్రమ్, ఎస్టీసెల్ నగర అధ్యక్షుడు సుభాష్జాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
విస్తృత ధర్మాసనానికి హైకోర్టు విభజన తీర్పు
రెండు ప్రశ్నలను లేవనెత్తిన ద్విసభ్య ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను హైకోర్టు గురువారం విస్తృత ధర్మాసనానికి నివేదించింది. ఈ సందర్భంగా ధర్మాసనం రెండు ప్రశ్నలను లేవనెత్తింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్థలాన్ని నోటిఫై చేసే విషయంలో ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 31 (2) కింద రాష్ట్రపతికున్న అధికారాలను నియంత్రించేలా గత తీర్పు ఉందా? ఇందుకు సంబంధించి ఆ తీర్పులో లోపాలున్నాయా? ఇక.. 2014, 1956 విభజన చట్టాల్లోని పదజాలం పరస్పర భిన్నంగా ఉన్న నేపథ్యంలో అసలు హైకోర్టు ‘ప్రధాన కేంద్రం’ అంటే అర్థం ఏమిటి? అన్న ఈ ప్రశ్నలను విస్తృత ధర్మాసనం ముందుంచింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. రాష్ట్ర విభజన జరిగినా కూడా హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతోందంటూ హైదరాబాద్కు చెందిన ధనగోపాల్రావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిని విచారించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంపైనే ఉండాలని తీర్పునిచ్చింది. ఏపీ హైకోర్టును తెలంగాణ భూభాగంపై ఏర్పాటు చేసేందుకు చట్టం అనుమతించడం లేదంది. అయితే ఈ తీర్పు ఏపీ హైకోర్టు ఏర్పాటు చేసే స్థలాన్ని నోటిఫై చేసే విషయంలో రాష్ట్రపతి అధికారాలను నియంత్రించేలా ఉందని, అందువల్ల దానిని పునఃసమీక్షించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవీందర్రెడ్డి అనే న్యాయవాది వేర్వేరుగా రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గతవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విని తీర్పును వాయిదా వేసి గురువారం ఉదయం తీర్పు వెలువరించింది. ‘రివ్యూ పిటిషన్లలో లేవనెత్తిన అంశాల్లో విస్తృత ప్రయోజనాలున్నాయి. 2014 పునర్విభజన చట్టాన్ని అనుసరించి ప్రధాన పిటిషన్లలో ఉభయ పక్షాలు కూడా పూర్తిస్థాయిలో వాదనలు వినిపించాయి. వాటిని అప్పటి ధర్మాసనం తన ప్రధాన తీర్పులో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని విస్తృత ధర్మాసనం విచారించడమే మేలని మేం అభిప్రాయపడుతున్నాం’ అని జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు కాపీని విస్తృత ధర్మాసనం ఏర్పాటు నిమిత్తం ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
మహిళకు మైక్రోసాఫ్ట్ నష్టపరిహారం
న్యూయార్క్ః సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త ఫీచర్లతో ప్రవేశ పెట్టిన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.. సంస్థకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. లక్షల మంది యూజర్ల అభిప్రాయాలతో తీర్చి దిద్దామని, అత్యంత సురక్షితమైన వెర్షన్ అంటూ గత యేడాది మార్కెట్లో ప్రవేశ పెట్టిన కంపెనీ.. యూజర్లను అప్ గ్రేడ్ చేసుకోమంటూ తొందర పెట్టడం తలకు చుట్టుకుంది. పాత వెర్షన్ ఓ ఎస్ లను వాడుతున్న వారికి విండోస్ 10 అప్ గ్రేడ్ చేసుకోమంటూ నోటీసులు పంపించడం చిక్కులు తెచ్చిపెట్టింది. ఓ మహిళ కోర్టుకెక్కడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కాలిఫోర్నియా సాసాలిటోకు చెందిన మహిళ టెరీ గోల్డ్ స్టీన్.. మైక్రోసాఫ్ట్ కంపెనీపై పెట్టిన కేసులో విజయం సాధించింది. మైక్రోసాఫ్ట్ తమను విండోస్ 10 అప్ గ్రేడ్ చేసుకోమని బలవంత పెడుతోందంటూ పెట్టిన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఆర్నెల్లలో 30 కోట్లమంది వరకూ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేసుకున్నా... అక్కడితో ఆగని మైక్రోసాఫ్ట్.. ఆ సంఖ్య మరింత పెంచేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా పాత ఓ ఎస్ లను వాడుతున్నవారికి నోటిఫికేషన్లు పంపించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సంస్థ తమను బలవంత పెడుతోందంటూ అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేయగా... కొందరు తమ ప్రమేయం లేకుండా విండోస్ 10 ఇన్ స్టాల్ అయిపోతోందంటూ మండిపడ్డారు. అదే ఆరోపణలతో కోర్టు కెక్కిన మహిళ కేసును కోర్టు విచారించింది. తాజాగా వెలువడ్డ తీర్పులో ఆమెకు మైక్రోసాఫ్ట్ 10 వేల డాలర్డు అంటే సుమారు 7 లక్షల రూపాయలను చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో మైక్రోసాఫ్ట్ కంపెనీ టెరీకి పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఓ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న టెరీ.. తన కంప్యూటర్లో విండోస్ 7 తో పనిచేస్తోంది. అయితే ఆమె చేసుకోకుండానే విండోస్ 10 అప్ డేట్ అయిపోవడంతో ఆగ్రహించిన ఆమె మైక్రోసాఫ్ట్ కంపెనీ తీరుపై కోర్టులో కేసు వేసింది. విండోస్ 10 అప్ డేట్ వల్ల కంప్యూటర్ పనిచేయడం మానేసిందని, తన వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిందని కోర్టుకు విన్నవించింది. అందుకు పరిహారంగా 17 వేల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. కేసును విచారించిన కోర్టు.. సదరు మహిళకు 10 వేల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో సంస్థ చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. -
ఖేడ్ మే మెగా ఫైట్...
♦ ఓటరు తీర్పు నేడే పోలింగ్కు సర్వం సిద్ధం ♦ పకడ్బందీగా ఏర్పాట్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు చర్యలు ♦ కలెక్టర్, ఇతర అధికారుల పర్యవేక్షణ ఖేడ్ ఓటరన్న వైపే అందరి చూపు.. తీర్పు ఎటువైపో తేలేది నేడే.. అభ్యర్థుల భవితవ్యంపై ఉత్కంఠ.. మరోవైపు పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఉప ఎన్నికల్లో 1.88 లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రోనాల్డ్రాస్ చెప్పారు. ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డు అందుబాటులో లేకపోతే 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్క గుర్తింపు కార్డు ఉన్నా ఓటు వేయవచ్చని అన్నారు. 16న ఎన్నికల ఫలితాల ప్రకటన ఉంటుందని తెలిపారు. - నారాయణఖేడ్ నారాయణఖేడ్ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం శుక్రవారం ఖేడ్లో పోలింగ్ సిబ్బం దికి అవసరమైన ఈవీఎంలతోపాటు పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసి ఆయా కేంద్రాలకు పంపించారు. రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సాగిన ఈవీఎంలు, సామగ్రి పంపిణీ ప్రక్రియను కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఎన్నికల పరిశీలకులు పర్యవేక్షించారు. - నారాయణఖేడ్ ♦ వెబ్కాస్టింగ్ ద్వారా కేంద్రాల పర్యవేక్షణ ♦ వీడియో చిత్రీకరణ భారీగా బలగాలు ♦ రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు వెల్లడి నారాయణఖేడ్/రేగోడ్: నారాయణఖేడ్ నియోజకవర్గంలో శనివారం జరగనున్న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఖేడ్లోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద శుక్రవారం పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామగ్రిని అంజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పోలింగ్ సిబ్బందికి గతంలోనే రెండుమార్లు శిక్షణ ఇచ్చామన్నారు. శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్కు ముందు 6గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరించినట్టు తెలిపారు. 125 మంది మైక్రో అబ్జర్వర్లు, 200 మంది వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని.. ప్రతి విషయం రికార్డు అవుతుందన్నారు. కేంద్రం నుంచి ఎన్నికల వ్యయ పరిశీలకులు కూడా వచ్చారని తెలిపారు. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే సత్వరం మరో ఈవీఎంను ఏర్పాటు చేస్తామన్నారు. అందుకుగాను పలు ఈవీఎంలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఆర్టీసీ బాదుడు. నారాయణఖేడ్: ఖేడ్ ఉప ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ అ ధికారులు ప్రయాణికుల నుంచి అదనంగా వసూలు చే స్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్కు వచ్చేందుకు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు చార్జీ రూ.73. కాగా శుక్రవారం స్పెషల్ బస్సు పేరిట సర్వీసులను నడిపిన అధికారులు రూ.110 వసూలు చేశారు. ఒక్కో టికెట్పై ఇలా రూ.37 అదనంగా వసూలు చేయడమేమిటని ప్రశ్నిస్తే అధికారులు చెప్పినట్టే వసూలు చేస్తున్నామని కండక్టర్లుసమాధానమిచ్చారని ప్రయాణికులు తెలిపారు. -
‘అమ్మ’ కోసం ఆత్మహత్య
సేలం : అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అనుకూలంగా తీర్పు వస్తుందో రాదోనన్న ఆవేదనతో అన్నాడీఎంకే నాయకుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. నామక్కల్ జిల్లా రాశిపురం సమీపంలోని ఓ చౌదాపురానికి చెందిన శేఖర్(41) అన్నాడీఎంకే నాయకుడు. కొం త కాలంగా జయలలిత నిర్ధోషిగా విడుదల కావాలని కాంక్షిస్తూ ఆల యాల బాట పట్టాడు. సోమవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందోనని శనివారం మిత్రుల వద్ద వాపోయాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శేఖర్ రాత్రి తన ఇంట్లో ఊరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న వెన్నందూరు పోలీసు ఇన్స్పెక్టర్ జగన్నాథన్ మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. శనివారం సాయంత్రం నుంచి తీవ్ర మనో వేదనతో శేఖర్ ఉన్నట్టు కుటుంబీకులు పేర్కొనడంతో అమ్మకోసం ఆత్మహత్య చేసుకున్నాడన్న నిర్ధారణ అయింది. -
అమ్మ పూజల జోరు
అన్నాడీఎంకే శ్రేణుల గుండెల్లో కౌంట్డౌన్ మొదలైంది. జయలలిత మెడకు చుట్టుకున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు త్వరలో తీర్పుచెప్పబోతున్న తరుణంలో పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు నుంచి ఆమె సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తూ మం త్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక యాగాలు, హోమాలు, పూజల జోరు పెంచారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని జయలలిత అక్రమార్జనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆమెపై మోపబడిన కేసు 18 ఏళ్లపాటు నడిచింది. ఆరోపణలు నిర్ధారణ అయినట్లు ప్రకటించిన బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జయకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఇదే కేసులో సహ నిందితులైన శశికళ, ఇళవరసి, సుధాకర్కు సైతం నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానాను విధిస్తూ కోర్టు తీర్పుచెప్పింది. ఈ తీర్పుపై జయ కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేయగా న్యాయమూర్తి కుమారస్వామి నేతృత్వంలో విరామమెరుగని విచారణ సాగింది. ప్రయివేటు సంస్థలు తమ వాదనను ఫిబ్రవరి 23వ తేదీతో ముగించాలని, ఆ తరువాత ప్రభుత్వ న్యాయవాది భవానిసింగ్ తన చివరి వాదనను పూర్తిచేయగానే తీర్పు తేదీని ప్రకటిస్తామని న్యాయమూర్తి కుమారస్వామి స్పష్టం చేశారు. మార్చి మొదటి వారంలో జయ అప్పీలుపై న్యాయమూర్తి తీర్పు ఖాయమనే ప్రచారం సాగుతోంది. అంతేగాక ఈ కేసు నుంచి అమ్మ బయటపడుతుందని విశ్వసిస్తున్నారు. మంత్రుల మహాయాగాలు కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పబోతున్న తరుణంలోనే జయ జన్మదినం (గత నెల 24వ తేదీ) రావడంతో పార్టీ అంతా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిగితేలుతోంది. కేసు నుంచి జయ బయటపడాలని, మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రార్థిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బుధవారం అనేక కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రి వలర్మతి బుధవారం ఒక్కరోజునే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నుంగంబాక్కం అగస్తీశ్వరన్ కోవిల్లో 67 మంది శివార్చకులతో మహారుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఓంశక్తి వినాయగర్ ఆలయంలో సైదాపేట ఎమ్మెల్యే సెందమిళన్ హోమాలు, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించగా, మంత్రి వలర్మతి పాల్గొన్నారు. నగరంలో మరికొన్ని చోట్ల నిర్వహించిన అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్కేనగర్ ఎమ్మెల్యే వెట్రివేల్ ఓట్టేరిలోని గోమాత ఆలయంలో రెండు వేల పశువులకు పూజలు చేశారు. దక్షిణ చెన్నై పార్టీ నేతలు ఆస్పత్రుల్లోని రోగులకు దోమతెరలు, హార్లిక్స్, పౌష్టికాహారం పంపిణీ చేశారు. రాయపురంలో ఉచితై వెద్యశిబిరాన్ని నిర్వహించారు. వడపళని మురుగన్ ఆలయంలో టీ నగర్ ఎమ్మెల్యే కలైరాజన్ బంగారు రథోత్సవాన్ని జరిపారు. తిరునెల్వేలీ స్వయంభు లింగస్వామి ఆలయంలో 167 మందికి అన్నదానం, 67 మందికి చీరలు, పంచెలు పంపిణీ చేశారు. మధురైలో వేలాది మంది మహిళలు ఊరేగింపుగా తెప్పకుళం మారియమ్మన్ ఆలయానికి చేరుకుని పొంగళ్లు పెట్టారు. -
తీర్పుకు కట్టుబడాల్సిందే!
సాక్షి, చెన్నై : న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు ప్రతి ఒక్కరూ కట్టుబడాల్సిందేనని డీఎండీకే అధినేత విజయకాంత్ అన్నారు. అనుకూలంగా తీర్పు వస్తే సంబరాలు చేసుకోవడం లేదంటే దాడులకు దిగడం హేయమైన చర్యగా ఖండించారు. ఇకనైనా ‘తలైవి’జపం వీడి ప్రజా హితాన్ని కాంక్షించాలని అన్నాడీఎంకే శ్రేణులకు హితవు పలికారు. కర్ణాటక, తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు.అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా ఆ పార్టీ వర్గాలు రాష్ట్రంలో సాగిస్తున్న నిరసనల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయంటూ పదే పదే ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ గగ్గోలు పెడుతున్నారు. తమకు భద్రత కల్పించాలని ఏకంగా గవర్నర్ రోశయ్యకు సైతం విజ ్ఞప్తి చేసిన విజయకాంత్ తాజాగా తన స్వరాన్ని మరిం తగా పెంచారు. స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో అన్నాడీఎంకే వర్గాలపై విరుచుకు పడ్డారు. హిత బోధ చేస్తూనే, తలైవి జపం వీడండని సూచించారు. అంగీకరించాల్సిందే: సీఎంగా జయలలిత ఉన్న సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పులన్నింటిని అన్నాడీఎంకే వర్గాలు ఆహ్వానించాయని, అంగీకరించాయని, సంబరాలు చేసుకున్నాయని వివరించారు. అయితే, అదే కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును మాత్రం ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. తమ తలైవి నిరపరాధి అని కన్నీళ్లు పెడుతున్నారని, ఆమె నిరపరాధిగా ఉండి ఉంటే, 18 ఏళ్లు వాయిదాల మీద వాయిదాలతో విచారణను ఎందుకు కాలయాపన చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తే ఓ విధంగా, వ్యతిరేకంగా వస్తే మరో విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అధికార పక్షంలో ఉంటూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడంతో పాటు ప్రజా సంఘాలు, ప్రైవేటు సంస్థల్ని బెదిరించి మరీ నిరసనల బాట పట్టించడం ఎంత వరకు సమంజసమని మండి పడ్డారు. 144 సెక్షన్: కావేరి, ముల్లైపెరియార్ డ్యాం హక్కులపై తమిళనాడుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తే సంబరాలు చేసుకున్నారని, ఆ గెలుపు ఏదో జయలలిత వ్యక్తిగతంగా సాధించినట్టు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఏదేని నిరసన బయలు దేరుతోందంటే చాలు జిల్లా...జిల్లాకు 144 సెక్షన్ అమలయ్యేదని గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాల రగులుతుంటే ఎందుకు ఆ సెక్షన్ ప్రయోగించడం లేదని ప్రశ్నించారు. కర్ణాటక , తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా పోస్టర్లు వెలుస్తుంటే, పోలీసులు చోద్యం చూడడం శోచనీయమని మండి పడ్డారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తికి వ్యతిరేకంగా, ఆ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా పోస్టర్లు వేస్తున్న అన్నాడీఎంకే వర్గాలపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇన్నాళ్లు తలైవి జపం చేసింది చాలు అని, ఇకనైనా ఁతలైవిరూ. నినాదాన్ని పక్కన పెట్టి ప్రజా హితాన్ని కాంక్షించే విధంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంకు విజయకాంత్ సూచించడం గమనార్హం. తనకు ఎలాంటి భయం లేదని, నా మీద నాకు నమ్మకం ఉందని, ప్రభుత్వంతో ప్రజల కోసం ఢీకొట్టేందుకు ఎంత వరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని హెచ్చరించడం విశేషం. -
సీఐ, ఎస్ఐలకు రెండేళ్ల జైలుశిక్ష
పొన్నూరురూరల్: పొన్నూరు రూరల్ పోలీస్స్టేషన్లో 2006లో సీఐ, ఎస్ఐలుగా పనిచేసిన శివరామరాజు, మోజస్పాల్లకు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ పొన్నూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.రవి మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి. పొన్నూరు మండలం ములుకుదురు గ్రా మానికి చెందిన విశ్రాంత తహశీల్దార్ ముసులూరి సత్యనారాయణకు చెందిన 3.63 ఎకరాల మాగాణిలో వరికుప్పను అదే గ్రామానికి చెందిన కొందరు అక్రమంగా నూర్చేసి ధాన్యాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన పొన్నూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ నిందితులకు పోలీసులు కొమ్ముకాసి కేసును నీరుగార్చడంతో లోకాయుక్తను ఆశ్రయించారు. లోకాయుక్త విచారణ అనంతరం సంబంధిత పోలీసు అధికారులపై చర్య లు తీసుకోవాలని తీర్పునిచ్చింది. ఇదే కేసుపై 2008లో సత్యనారాయణ పొన్నూరు కోర్టులో అప్పటి బాపట్ల డీఎస్పీ అబ్దుల్ రషీద్, రూరల్ సీఐ శివరామరాజు, ఎస్ఐలు మోజస్పాల్, రవికుమార్లపై ప్రైవేటు కేసు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం అప్పటి సీఐ శివరామరాజు, ఎస్ఐ మోజస్పాల్లను నిందితులుగా పేర్కొంటూ వారిద్దరికీ రెండేసి సంవత్సరాలు జైలుశిక్ష విధిస్తూ జడ్జి కె.రవి తీర్పునిచ్చారు. అప్పటి బాపట్ల డీఎస్పీ అబ్దుల్ రషీద్ ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల ఆయనపై కేసు పెండింగ్లో ఉంది. రూరల్ ఎస్ఐ రవికుమార్పై ఆరోపణలు రుజువుకాక ఆయనపై కేసును కొట్టివేశారు. సీఐ శివరామరాజు కొంతకాలం జిల్లాలో డీఎస్పీగా పనిచేసి పదవీ విరమణ పొందగా, మోజస్పాల్ ప్రస్తుతం హైదరాబాద్లో సీబీసీఐడీ విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. ఈ కేసులో తెనాలికి చెందిన న్యాయవాది జి.ఎస్ నాగేశ్వరరావు ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు. -
ఏపీఎన్జీఓల సమ్మె పై నేడు హై కోర్టు తీర్పు
-
విభజన పై రాష్ట్ర హైకోర్టు తీర్పు నేడు