
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి భేటీ అయ్యారు. స్టాఫ్ కౌన్సిల్లోని అన్ని సంఘాలను చర్చలకు హాజరయ్యాయి. ఉద్యోగుల సమస్యలపై సమగ్రంగా చర్చించిన సీఎం జగన్ 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. అలాగే, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247 కోట్ల అదనపు భారం పడనుంది.
చదవండి: చేయగలిగినంత చేస్తాం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment