నేడు సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా.. | CM YS Jagan Memantha Siddham Bus Yatra Schedule | Sakshi
Sakshi News home page

నేడు సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా..

Published Mon, Apr 8 2024 4:47 AM | Last Updated on Mon, Apr 8 2024 8:41 AM

CM YS Jagan Memantha Siddham Bus Yatra Schedule - Sakshi

ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లి ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభం 

వెంకటా­చలంపల్లి వద్ద పింఛన్‌ లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి   

వినుకొండ అడ్డరోడ్డు వద్ద భోజన విరామం 

వినుకొండలో 3 గంటలకు రోడ్‌ షో.. గంటావారిపాలెం వద్ద రాత్రి బస 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజైన సోమవారం(ఏప్రిల్‌ 8) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఆదివారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదివారం రాత్రి బస చేసిన వెంకటాచలంపల్లి ప్రాంతం దగ్గర నుంచి సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.

ఉదయం 9.30 గంటలకు వెంకటాచలంపల్లి వద్ద సామాజిక పింఛన్‌ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు వినుకొండకు చేరుకొని రోడ్‌ షోలో పాల్గొంటారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెంలో రాత్రి బసకు చేరుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement