టీడీపీ నేతను చితకబాదిన మహిళలు! | Womens fires on TDP leader over illegal mining | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతను చితకబాదిన మహిళలు!

Published Tue, Feb 4 2025 4:10 AM | Last Updated on Tue, Feb 4 2025 4:10 AM

Womens fires on TDP leader over illegal mining

లాంలో అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో చెలరేగిన వివాదం

అనుమతుల్లేకుండా జనావాసాల్లో బ్లాస్టింగ్‌ 

ఇళ్లపై పడిన రాళ్లు 

దురుసు ప్రవర్తన కారణంగా వివాదం

తాడికొండ: తాడికొండ మండలం లాం గ్రామంలో అక్రమ మైనింగ్‌ వ్యవహారం రచ్చకెక్కడంతో మహిళలు ఆగ్రహించి ఓ టీడీపీ నేతను చితకబా­దిన వైనం తీవ్ర సంచలనం సృష్టించింది. వివరా­ల్లోకి వెళితే..  లాం గ్రామంలో ఎలాంటి అనుమ­తులు లేకుండా తెలుగు తమ్ముళ్లు అక్రమంగా మైనింగ్‌ చేసి గ్రావెల్‌ను జోరుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బ్లాస్టింగ్‌ చేసే సమయంలో అక్కడ జనావాసాల మధ్య పెద్ద రాయి వచ్చి పడింది. దాన్ని తొలగించకుండా తెలుగు తమ్ముళ్లు వదిలేయడంతో టీడీపీకే చెందిన అహ్మద్‌ కుటుంబ సభ్యులు పార్టీ గ్రామ అధ్యక్షుడు షేక్‌ అఫ్జల్‌ను నిలదీశారు.

ఇలా అయితే తాము  ఉండేదెలా అంటూ ప్రశ్నించారు. స్థాని­కులు దీనికి వత్తాసు పలకడంతో వ్యవహారం ముదిరింది. అఫ్జల్‌ దుర్భాషలా­డడంతో స్థానిక మహి­ళలతోపాటు, తెలుగు తమ్ముళ్లు దాడికి దిగారు. దాడిలో అఫ్జల్‌ చొక్కా చిరిగి­పోయింది. దీంతో ఆగ్రహించిన అఫ్జల్‌ వర్గీయులు ఎదురు­దాడికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్తతత నెలకొంది.

కాగా,  గ్రామంలో రెండు నెలలుగా  అక్రమంగా మైనింగ్, బ్లాస్టింగ్‌ కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రెండుసార్లు కలెక్టర్‌తోపాటు, మైనింగ్, విజిలెన్స్‌ అధికారులకు గ్రామస్తులు నేరుగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు కనీసం తొంగి చూసిన దాఖలాలు లేవు. దీంతో స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయమై తాడికొండ సీఐ కె.వాసును వివరణ కోరగా వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ రాలేదని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement