జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు దగ్ధం | Ap Rtc Bus Caught Fire At Jadcharla In Accident | Sakshi
Sakshi News home page

జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన ఆర్టీసీ బస్సు

Published Mon, Jul 15 2024 6:59 AM | Last Updated on Mon, Jul 15 2024 8:59 AM

Ap Rtc Bus Caught Fire At Jadcharla In Accident

సాక్షి,మహబూబ్‌నగర్‌ జిల్లా: జడ్చర్లలో సోమవారం(జులై 15) తెల్లవారుజామున 2 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44పై భూరెడ్డి పల్లి వద్ద  ఏపీలోని ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డీసీఎంను ఢీకొని దగ్ధమైంది. 

ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డవారిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బస్సు ధర్మవరానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement