మంత్రాల నెపంతో సజీవదహనం  | Man Cremated On Suspicion Of Doing Mantras In Jagtial | Sakshi
Sakshi News home page

మంత్రాల నెపంతో సజీవదహనం 

Published Tue, Nov 24 2020 4:38 AM | Last Updated on Tue, Nov 24 2020 4:38 AM

Man Cremated On Suspicion Of Doing Mantras In Jagtial - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జగిత్యాల : మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని సజీవదహనం చేశారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన పవన్‌కుమార్‌ (38) బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అతడి బావమరిది జగన్‌ వారం క్రితం గుండెపోటుతో చనిపోయాడు. అయితే.. జగన్‌ మృతికి పవన్‌కుమార్‌ కారణమని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం జగన్‌ పెద్దకర్మకు హాజరై చిత్రపటం వద్ద పవన్‌కుమార్‌ మొక్కుతుండగా పెద్ద బావమరిది విజయ్‌స్వామి, జగన్‌ భార్య సుమలత ఇద్దరూ కలసి అతడిని గదిలో బంధించారు. పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. దీంతో పవన్‌కుమార్‌ సజీవ దహనమయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement