రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Dec 26 2023 5:06 AM | Updated on Dec 26 2023 7:58 AM

 నుజ్జునుజ్జయిన కారు - Sakshi

నుజ్జునుజ్జయిన కారు

మైలార్‌దేవ్‌పల్లి: కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మధు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాత బస్తీ డబీర్‌పూర ప్రాంతానికి చెందిన ముస్తాఫా వాజీద్‌, రెహాన్‌ఉద్దీన్‌, మహమ్మద్‌ షోయబ్‌, రహీమ్‌ ఉద్దీన్‌లతో పాటు ఉమార్‌ నిసార్‌ (22) కారులో బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లారు.

సోమవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా కాటేదాన్‌ ప్రధాన రహదారిపై కుక్క రోడ్డుకు అడ్డురావడంతో దానిని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉమర్‌ నిహాల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతావారికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement