
2021కి గాను మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతి పొందిన David Julius, Ardem Patapoutian
శరీరం ఎందుకు వేడెక్కెతుంది.. స్పర్శలో తేడాలపై పరిశోధనకు గాను వీరద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించారు
వాషింగ్టన్: వైద్యశాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను అమెరికన్ పరిశోధకులకు నోబెల్ బహుమతి లభించింది. డాక్టర్ డేవిడ్ జూలియస్, డా. అరర్డెం పటాపౌషియన్లకు ఉమ్మడిగా నోబెల్ బహుమతి ప్రకటించారు. శరీరం ఎందుకు వేడెక్కెతుంది.. స్పర్శలో తేడాలపై పరిశోధనకు గాను వీరద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించారు.
‘‘మనిషి మనుగడలో వేడి, చలి,స్పర్శను గ్రహించే మన సామర్థ్యం చాలా అవసరం. పైగా ఈ చర్యలు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన పరస్పర చర్యను బలపరుస్తుంది. దైనందిన జీవితంలో మనం ఈ అనుభూతులను తేలికగా తీసుకుంటాము. అయితే ఉష్ణోగ్రత, పీడనాన్ని గ్రహించడానికి నరాల ప్రేరణలు ఎలా మొదలవుతాయి అనే ప్రశ్నను పరిష్కరించిందినందుకు గాను ఈ సంవత్సరం డాక్టర్ డేవిడ్ జూలియస్, డా. అరర్డెం పటాపౌషియన్లకు ఉమ్మడిగా నోబెల్ బహుమతి ప్రకటించాం’’ అని నోబెల్ అసెంబ్లీ పేర్కొంది.
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 4, 2021
The 2021 #NobelPrize in Physiology or Medicine has been awarded jointly to David Julius and Ardem Patapoutian “for their discoveries of receptors for temperature and touch.” pic.twitter.com/gB2eL37IV7
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ జూలియస్ వేడిని ప్రతిస్పందించే చర్మం నరాల చివరలలో సెన్సార్ను గుర్తించడానికిగాను మితిమీరిన ఘాటు ఉండే మిరపకాయల నుంచి కాప్సైసిన్ అనే పదార్ధాన్ని ఉపయోగించారు. స్క్రిప్స్ రీసెర్చ్లోని హోవార్డ్ హ్యూస్ మెడికల్ ఇనిస్టిట్యూట్లో పని చేసస్తున్న ఆర్డెమ్ పటాపౌటియన్, చర్మం మరియు అంతర్గత అవయవాలలో యాంత్రిక ఉద్దీపనలకు ప్రతిస్పందించే నోవల్ క్లాస్ సెన్సార్లను కనుగొనడానికి ఒత్తిడి-సున్నితమైన కణాలను ఉపయోగించారు. (చదవండి: నోబెల్ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు)
ఈ పరిశోధనల వల్ల మన నాడీ వ్యవస్థ వేడి, జలుబు, యాంత్రిక ఉద్దీపనలను ఎలా గ్రహిస్తుందనే దానిపై మన అవగాహన మరింత బాగా పెరుగుతుంది. ఈ పరిశోధకులు మన భావాలు, పర్యావరణం మధ్య సంక్లిష్ట పరస్పర చర్యపై మన అవగాహనలో తప్పిపోయిన క్లిష్టమైన లింక్లను గుర్తించారు.
(చదవండి: నోబెల్ అవార్డు నామినేషన్లలో ట్రంప్ పేరు!)
డేవిడ్ జూలియస్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో పప్రొఫెసర్గా పని చేస్తున్నానరు. ఇక డా. అర్డెం పటాపౌషియన్ అర్మెనియా నుంచి వచ్చి అమెరికాలో సస్థిరపడ్డారు. లెబనాన్లోని బీరూట్లో జన్మించిన అరర్డె.. అమెరికాకు వలస వచ్చారు. ప్రస్తుతం లా జొల్లాలో నన్యూరో సైంటిస్ట్గా పరశోధనలు చేస్తున్నానరు అర్డెం.