బోటులో అగ్నిప్రమాదం.. 40 మంది హైతీ పౌరులు మృతి | Boat Fire Kills At Least 40 Haitian Migrants | Sakshi
Sakshi News home page

బోటులో అగ్నిప్రమాదం.. 40 మంది హైతీ పౌరులు మృతి

Published Sat, Jul 20 2024 8:32 AM | Last Updated on Sat, Jul 20 2024 9:52 AM

Boat Fire Kills At Least 40 Haitian Migrants

పోర్ట్‌ ఓ ప్రిన్స్‌ : హైతీ నుంచి 80 మంది శరణార్థులతో వెళుతున్న బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సమారు 40 మంది మృతి చెందారు. మరో 40 మందిని హైతీ రక్షక దళం కాపాడింది.

హైతీలోని సెయింట్‌ మైఖేల్‌ నార్త్‌ నుంచి బయలుదేరిన ఈ పడవ కాయ్‌కోస్‌, టర్క్స్‌ ఐలాండ్‌కు వెళుతోంది. పడవలో ఉన్నవారు క్యాండిల్స్‌ వెలిగించారు.

దీంతో  ఈ మంటలు బోటులో ఉన్న పెట్రోల్‌ డ్రమ్ములకు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. హైతీ గత కొంత కాలంగా సామాజిక, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో పౌరులు దేశం విడిచి వలస వెళుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement