అనాథ వృద్ధుడిని కాపాడిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

అనాథ వృద్ధుడిని కాపాడిన పోలీసులు

Published Wed, Jul 19 2023 4:32 AM | Last Updated on Wed, Jul 19 2023 2:27 PM

- - Sakshi

నిజామాబాద్‌: అటవీ ప్రాంతంలో చలనం లేకుండా పడి ఉన్న అనాథ వృద్ధుడిని కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్‌ పోలీసులు కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం పోచారం శివారు అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వృద్ధుడు వానకు తడిసి చలనం లేకుండా పడి ఉండడాన్ని పశువుల కాపరులు గమనించారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై కోనారెడ్డి తన సిబ్బందితో వెళ్లాడు. వృద్ధుడిని కిలో మీటర్‌ దురం నుంచి చేతులపై మోసుకొచ్చి పోలీసు వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వృద్ధుడి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఎస్సై కోనారెడ్డి మాట్లాడుతూ.. రెండ్రోజుల కిందట ఈ వృద్ధుడు అటవీ ప్రాంతానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారన్నారు.

వృద్ధుడు వానకు తడిసి శరీరం బిగిసిపోయి ఉన్నందున వివరాలు చెప్పలేక పోయాడన్నారు. కాగా సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించి వృద్ధుడిని కాపాడిన పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు. ఎస్సైతో పాటు ఏఎస్సై రాములు, సిబ్బంది అంజి, సంజీవ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement