ఆరేళ్ల ప్రేమ.. ప్రేయసి పుట్టిన రోజు, రూమ్‌లో పార్టీ చేసుకుందామని పిలిచి.. | - | Sakshi
Sakshi News home page

ప్రేయసి పుట్టిన రోజు.. రూమ్‌లో పార్టీ చేసుకుందామని పిలిచాడు.. వేరొకరితో చాటింగ్‌ చేయడం చూసి..

Apr 16 2023 7:58 AM | Updated on Apr 16 2023 8:53 AM

- - Sakshi

 పార్టీ చేసుకుందామని ప్రశాంత్‌ ఆమెను తన రూంకు పిలిచాడు.

కర్ణాటక: ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసిన ప్రియుని ఉదంతం బెంగళూరు రాజగోపాలనగర పరిధిలో జరిగింది. హోంశాఖ ఆఫీసులో క్లర్క్‌గా పని చేస్తున్న నవ్య (24) హతురాలు. ఆమె రామనగర జిల్లా కనకపుర తాలూకా తామసంద్రకు చెందినవారుకాగా, కోరమంగళలో నివాసం ఉంటూ ఉద్యోగం చేసేది. ఒకే ఊరు, దూరపు బంధువు అయిన ప్రశాంత్‌ బెంగళూరు లగ్గేరి రాజేశ్‌నగరలో ఉంటూ, పీణ్యలో ఫ్యాక్టరీలో ఆపరేటర్‌గాపని చేస్తున్నాడు. ఇద్దరూ ఆరేళ్ల నుంచి ప్రేమించుకొంటున్నారు. మంగళవారం నవ్య పుట్టిన రోజు. శుక్రవారం పార్టీ చేసుకుందామని ప్రశాంత్‌ ఆమెను తన రూంకు పిలిచాడు.

చాటింగ్‌పై గొడవ జరిగి
మధ్యాహ్నం మూడు గంటలకు కేక్‌ కట్‌చేశారు. కొంతసేపటికి నవ్య మొబైల్‌లో చాటింగ్‌ చేయడం చూసిన ప్రశాంత్‌ అనుమానంతో ప్రశ్నించగా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఉన్మాదిగా మారిన ప్రశాంత కేక్‌ కోసిన కత్తితోనే నవ్య గొంతు కోశాడు. తీవ్ర రక్తసావంతో ఆమె అక్కడికక్కడే విలవిలలాడుతూ ప్రాణాలు వదిలింది. ఏమి చేయాలో దిక్కుతోచని ప్రశాంత్‌ ఆమె శరీర భాగాలను కత్తిరించి గోనె సంచిలో పెట్టి దూరంగా పడేయాలని ప్లాన్‌ వేశాడు. ఆదీ సాధ్యంకాకపోవడంతో గదిలోనే శవంతో పాటు సాయంత్రం వరకు ఉన్నాడు, తరువాత స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా చెప్పాడు. పోలీసులు నవ్య తల్లి నాగరత్నకు ఫోన్‌లో చెప్పి పిలిపించారు. ప్రశాంత్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement