సాక్షి, బళ్లారి: చట్టాన్ని ధర్మాన్ని కాపాడాల్సిన పోలీసు వృత్తిలో ఉండి భార్యా పిల్లలకు అన్యాయం చేశాడు. వారిని వదిలేసి మరో మహిళతో జీవిస్తుండడంపై అతని భార్య నిరసనకు దిగింది. తనకు భర్త కావాలని పిల్లలతో సహా భార్య ఽబైఠాయించిన ఘటన సోమవారం బళ్లారి నగరంలోని రామ్నగర యసోజీ కాలనీలో జరిగింది. నగరంలో కానిస్టేబుల్గా పని చేస్తున్న బోనిబసప్ప అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య సౌమ్య మెట్టినింటి ముందు ధర్నాకు దిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2013లో తమకు వివాహం అయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది. అయితే గత కొన్నేళ్లుగా దావణగెరెకు చెందిన వేరే మహిళతో అతడు సహజీనవం సాగిస్తున్నాడని తెలిపింది. గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి కేసు పెట్టినట్లు తెలిపింది. తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని, పిల్లల చదువులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని భోరుమని విలపించింది. తన భర్త తనకు కావాలని, పరసీ్త్ర నుంచి అతన్ని విడిపించాలని మొరపెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment