ఆయుధ పూజకు బస్సుకు రూ. 100 మాత్రమే | - | Sakshi
Sakshi News home page

ఆయుధ పూజకు బస్సుకు రూ. 100 మాత్రమే

Published Thu, Oct 10 2024 1:46 AM | Last Updated on Thu, Oct 10 2024 1:46 AM

-

● ఆర్టీసీ, బీఎంటీసీ డ్రైవర్ల ఆవేదన

శివాజీనగర: దసరా పండుగలో ఆయుధ పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే ప్రభుత్వం ఆయుధాల పూజకు ఒక్కో బస్సుకు రూ.వంద ఇచ్చి వారి ఆశలపై చల్లనీళ్లు చల్లింది. వేలాది బస్సులు నిర్వహించే రవాణా సంస్థలకు వేల కోట్ల ఆదాయం వస్తోంది. అయినా ఆయుధ పూజకు వంద రూపాయాలు సరిపెట్టడంతో డ్రైవర్లు విస్తుపోతున్నారు. గతేడాది కూడా ఇంతే ఇస్తే గత్యంతరం లేక సిబ్బంది స్వంత డబ్బుతోనే బస్సులను సొగసుగా అలంకరించి పూజలు నెరవేర్చారు. వంద రూపాయలతో బస్సుకొక పెద్ద పూలహారం కూడా కొనడం సాధ్యపడదు. టెంకాయ, అగరబత్తి, కర్పూరం, గుమ్మడి, పసుపు–కుంకుమతో పాటుగా ఎన్నో వస్తువులు కావాలి. వంద రూపాయాల్లో వీటన్నిటిని తీసుకొచ్చి పూజ జరపగలమా? అని సిబ్బంది సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement