ఖమ్మంక్రైం: జిల్లాలోని కల్లూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడ ఐపీ పెట్టి ఏపీలో నివసిస్తుండగా, ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. దీంతో ఏపీలోని నూజివీడుకు చెందిన పోలీసులు ఖమ్మంలో విచారణ చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కల్లూరు ప్రాంతానికి చెందిన నాగరాజు పలువురి వద్ద అప్పులు చేసి కొన్నాళ్లుగా వడ్డీ చెల్లించిన అతను తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో బాధితులు గత జనవరిలో ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే కోర్టులో ఐపీ దాఖలు చేసిన ఆయన పరారీలో ఉన్నాడు. ఈ క్రమాన శనివారం ఏపీలోని నూజివీడుకు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. కొంతకాలంగా నాగరాజు నూజివీడులో నివాసముంటుండగా ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో విచారణ కోసం వచ్చినట్లు తెలిపారు. దీంతో తమ వద్ద కూడా కేసు నమోదైందని తెలపగా.. నాగరాజుపై ఫిర్యాదు చేసిన వ్యక్తులను సైతం నూజివీడు పోలీసులు విచారించినట్లు తెలిసింది.
విచారణ చేపట్టిన ఆంధ్రా పోలీసులు