అనుమానంతో.. భార్య కాళ్లు, చేతులు కట్టేసి.. కిరాతకంగా ప్రాణం తీసిన భర్త! | - | Sakshi
Sakshi News home page

అనుమానంతో.. భార్య కాళ్లు, చేతులు కట్టేసి.. కిరాతకంగా ప్రాణం తీసిన భర్త!

Published Tue, Oct 31 2023 1:22 AM | Last Updated on Tue, Oct 31 2023 1:23 PM

- - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఓ భర్త కట్టుకున్న భార్యపై అనుమానంతో హత్య చేసిన ఘటన సోమవారం మండలంలోని కిష్టంపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మహబూబ్‌నగర్‌ మండలంలోని పాలకొండకు చెందిన అర్వ ఈశ్వరమ్మ(38)ను 21ఏళ్ల క్రితం కిష్టంపల్లికి చెందిన అర్వ కృష్ణయ్యకు ఇచ్చి వివాహం చేశారు. వారి జీవితంలో అనుమానం అనే భూతం దాపురించడంతో ఐదేళ్లుగా భార్యభర్తల మద్య గొడవ లకు దారి తీసింది. ఈవిషయంపై పలుమార్లు గ్రామంలో, బంధువుల సమక్షంలో పంచాయితీలు పెట్టి భర్త హెచ్చరించినా ఫలితం లేకపోయింది.

ఆదివారం రాత్రి అందరూ నిద్రించాక భార్యపై పథకం ప్రకారం కాళ్లు, చేతులు కట్టేసి, గట్టిగా అదిమిపట్టి పీకను నొక్కి హత్య చేశాడు. అనంతరం చున్నీతో భార్య గొంతుకు కట్టి ఇంట్లోని ప్యాన్‌కు వేలాడే దీసే క్రమంలో పెద్ద కొడుకు చూసి తన తాతయ్యకు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఈవిషయంపై అతన్ని గట్టిగా వారించారు. సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లాకేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఘటనపై ఈశ్వరమ్మ తండ్రి బత్తుల శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవినాయక్‌ పేర్కొన్నారు.
ఇవి చదవండి: విద్యార్థుల దుస్తులు.. విద్యార్థినులతో విప్పించి.. ఫొటోలు తీసి.. కీచక టీచర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement