పెబ్బేరు రూరల్: వనపర్తి మండలం అప్పాయిపల్లిలో గురువారం గుర్తుతెలియని దుండగులు రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి వివరాల మేరకు.. అప్పాయిపల్లికి చెందిన దామరగిద్ద శంకర్రావు, అతడి తమ్ముడు ఆనంద్రావు ఇళ్లలోకి దొంగలు చొరబడి వెండి వస్తువులతో పాటు కొంత నగదును చోరీ చేశారు. ఆనంద్రావు ఇంట్లో 10 తులాల వెండి విగ్రహం, రూ.5వేలు, శంకర్రావు ఇంట్లో 20 తులాల వెండి వస్తువులు, రూ 10వేల నగదు చోరీ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అదేవిధంగా బాండుపేపర్లు, ప్రాంసరీ నోట్లను కాల్చి బూడిద చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
రెండు ఇళ్లలో చోరీ
Published Sat, May 25 2024 12:30 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఉన్నట్టుండి రూ. 33 కోట్ల జాక్పాట్ : గుండె ఆగినంత పనైందట!
- స్పీకర్ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలతో లోక్సభలో దుమారం
- హిజాబ్ బ్యాన్.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
- ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్కు కౌంటరిచ్చిన హీరోయిన్!
- కాంగ్రెస్ అధిష్టానం పిలుపు.. ఢిల్లీకి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- మాల్యా పెళ్లి సందడి : మెనూలో అదే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
- ట్రేడింగ్లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!
- సఫారీలకు సెమీస్ గండం.. ఈ సారైనా గట్టెక్కుతారా?
- భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
Advertisement