నేతకాని కార్పొరేషన్‌ కాంగ్రెస్‌తోనే సాధ్యం | Sakshi
Sakshi News home page

నేతకాని కార్పొరేషన్‌ కాంగ్రెస్‌తోనే సాధ్యం

Published Mon, May 6 2024 11:55 PM

నేతకాని కార్పొరేషన్‌ కాంగ్రెస్‌తోనే సాధ్యం

● నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం నరేశ్‌

చెన్నూర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే నేతకానీ కార్పొరేషన్‌ ఏర్పాటు సాధ్యమవుతుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం నరేశ్‌ అన్నారు. ఇటీవల ధర్మపురిలో జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల సభలో నేతకాని కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంపై సంఘం అధ్వర్యంలో సోమవారం సీఎం, ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతకాని కులస్తులను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఉపాధి అవకాశాలు లేక దుర్భర జీవనం సాగిస్తున్నారన్నారు. కార్పోరేషన్‌ ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాంటెంకి పోచం, దుర్గం నగేశ్‌, రావుల తిరుపతి, వెంకటస్వామి, సునార్కర్‌ రాంబాబు, రాజేశ్‌, లీల, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement