ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం - | Sakshi
Sakshi News home page

ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం

Published Sat, May 25 2024 6:05 PM

ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం

నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి

నర్సాపూర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని వాపోయారు. ఎరువులు, విత్తనాలు దొరకడం లేదన్నారు. సకాలంలో తూకం వేయకపోవడంతో ధాన్యం తడిసిందన్నారు. తరుగు పేరిట బస్తాకు నాలుగు నుంచి ఆరు కిలోల ధాన్యం తీసుకుంటూ రైతులను నష్టాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్నిరకాల వడ్లకు బోనస్‌ ఇవ్వాలన్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు వెంట వెంటనే డబ్బులు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. వానాకాలం సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులు ఏనాడు ఇబ్బంది పడలేదని గుర్తుచేశారు. రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో రైతులకు రుణాలు లభించడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌గౌడ్‌, నాయకులు సత్యంగౌడ్‌, జితేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ప్రవీణ్‌, నాగరాజుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement