మర్డర్ మిస్టరీ 'కిరోసిన్'​.. ట్రైలర్​ రిలీజ్​ చేసిన మంత్రి తలసాని | Minister Talasani Srinivas Yadav Launches Kerosene Trailer | Sakshi
Sakshi News home page

Minister Talasani Srinivas Yadav: ట్రైలర్​ ఆద్యంతం ఆసక్తిగా ఉంది: మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్

Jun 6 2022 4:23 PM | Updated on Jun 6 2022 4:28 PM

Minister Talasani Srinivas Yadav Launches Kerosene Trailer - Sakshi

Minister Talasani Srinivas Yadav Launches Kerosene Trailer: ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృధ్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న సస్పెన్స్​ థ్రిల్లర్​ 'కిరోసిన్'​. బిగ్​ హిట్​ ప్రొడక్షన్స్​ బ్యానర్​పై వస్తున్న ఈ సినిమాకు ధృవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోగా, జూన్ 17న గ్రాండ్​గా విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అనంతరం చిత్రబృందానికి మంత్రి తలసాని ఆల్​ ది బెస్ట్​ చెప్పారు. 2 నిమిషాల 14 సెకన్ల ట్రైలర్​ ఆద్యంతం ఆసక్తిగా ఉందన్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలు జోడించి ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ ట్రైలర్​ లాంచ్​ కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్ పృధ్వీ యాదవ్, దీప్తి కొండవీటి, కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, వెంకన్న ముదిరాజ్, హేమంత్ యాదవ్, సురేంద్ర, స్వాతి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement