సీఎం సమక్షంలో భారీ చేరికలు | Sakshi
Sakshi News home page

సీఎం సమక్షంలో భారీ చేరికలు

Published Thu, May 9 2024 3:50 AM

సీఎం సమక్షంలో భారీ చేరికలు

మద్దూరు: సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో బుధవారం చేరారు. రెనివట్ల ఎంపీటీసీ కన్కమ్మ, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి పార్టీ నాయకులు కరుణాకర్‌రెడ్డి, నర్సిము లు, ప్రభాకర్‌రెడ్డి వీరితో పాటు మరో 100 మంది కార్యకర్తలు హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో పార్టీలో చేరారు. అలాగే నియోజకవర్గంలోని కోస్గి లో కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జీ తిరుపతిరెడ్డి సమక్షంలో మద్దూరు, పల్లెర్ల, పర్సపూర్‌, రెనివట్ల, తిమ్మారెడ్డిపల్లి, చెన్వార్‌ తదితర గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ నాయకులు మద్దూరు మైనార్టీ నాయకులు పార్టీలో చేరారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డిని అత్యధిక మేజార్టీతో గెలిపించాలని వారు సూచించారు. నియోజకవర్గ సమగ్రాభివృద్దికి అందరు కలిసి రావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, పార్టీ అద్యక్షుడు నర్సింహా, పార్టీ నాయకులు తిరుపతిరెడ్డి, సంజీవ్‌, రమేష్‌రెడ్డి, చెన్నాప్ప, రహీం, చంద్రమోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement