
మిజోరాం: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్షా.. ఓ చిన్నారికి గిటార్ను బహుమతిగా ఇచ్చారు. శనివారం మిజోరాంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఏడేళ్ల చిన్నారి ఎస్తేర్ లాల్దుహవ్మి హనామ్టే వందేమాతరాన్ని పాడింది. ఆ చిన్నారిని అభినందిస్తూ గిటార్ను బహుమతిగా ఇచ్చారు.
ఆ చిన్నారిని "వండర్ కిడ్"గా అభివర్ణించిన అమిత్ షా.. భారత్పై ప్రేమ మనల్ని ఏకం చేసిందన్నారు. ‘‘చిన్నారి ఎస్తేర్ వందేమాతరాన్ని పాడి నా హృదయాన్ని కదిలించింది.. ఏడేళ్ల చిన్నారికి దేశంపై ఉన్న ప్రేమ తన పాటలో కనిపించింది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి పాట వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. కాగా, 2020లో ‘మా తుజే సలామ్’ పాట వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించిన ఎస్తేర్.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె అనేక అవార్డులను కూడా అందుకుంది.
Love for Bharat unites us all.
Deeply moved to listen to Mizoram's wonder kid Esther Lalduhawmi Hnamte, singing Vande Mataram in Aizawl today. The seven-year-old's love for Bharat Mata poured out into her song, making listening to her a mesmerizing experience.
Gifted her a… pic.twitter.com/7CLOKjkQ9y— Amit Shah (@AmitShah) March 15, 2025
Comments
Please login to add a commentAdd a comment