mizoram
-
డబుల్ సెంచరీతో చెలరేగిన బాలీవుడ్ దర్శకుడి కొడుకు
ఫస్ట్క్లాస్ క్రికెట్లో మిజోరాం స్టార్ ప్లేయర్, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా తనయుడు అగ్ని చోప్రా తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో భాగంగా నాడియాడ్ వేదికగా మణిపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో అగ్ని చోప్రా అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.తొలి ఇన్నింగ్స్లో మణిపూర్ బౌలర్లను చోప్రా ఉతికారేశాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ తన రెండో ఫస్ట్క్లాస్ డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 269 బంతులు ఎదుర్కొన్న అగ్ని చోప్రా.. 29 ఫోర్లు, ఒక సిక్సర్తో 218 పరుగులు చేసి ఔటయ్యాడు.కాగా ఈ ప్రస్తుత రంజీ సీజన్లో చోప్రాకు ఇది వరుసగా రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్ కంటే ముందు అరుణాచల్ ప్రదేశ్పై సెకెండ్ ఇన్నింగ్స్లో చోప్రా ద్విశతకం సాధించాడు. అదే మ్యాచ్లో చోప్రా తొలి ఇన్నింగ్స్లో సెంచరీ కూడా నమోదు చేయడం గమనార్హం.ఈ ఏడాది సీజన్లో చోప్రా కేవలం ఐదు ఇన్నింగ్స్లలో 646 పరుగులు లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే.. చోప్రా విధ్వంసకర డబుల్ సెంచరీ ఫలితంగా మిజోరాం తొలి ఇన్నింగ్స్లో 536 పరుగుల భారీ స్కోర్ సాధించింది.చదవండి: WI vs SL: మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ..! కట్ చేస్తే.. విధ్వంసకర సెంచరీ -
కుప్పకూలిన క్వారీ.. పది మంది మృతి
ఐజ్వాల్: మిజోరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ రాతి క్వారీ కుప్పకూలి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఐజ్వాల్ జిల్లాలో జరిగిన క్యారీ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరికొంత మంది క్యారీలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.#Mizoram: 2 killed, many feared dead after stone quarry collapses in #AizawlTwo individuals were killed after a stone quarry collapsed in Aizawl’s Melthum and Hlimen border on May 28 around 6 am after #CycloneRemal wreaked havoc across Mizoram, as per latest reports.… pic.twitter.com/rCr7cExMGX— India Today NE (@IndiaTodayNE) May 28, 2024క్యారీలో చిక్కుకున్నవారిని రెస్య్కూ చేసి బయటకు తీసుకురావటానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భారీ వర్షం, కొండచరియలు విరిగిపడే ప్రాంతం సెర్చ్ ఆపరేషన్కు ప్రతికూలంగా మారిందని వెల్లడించారు.10 Dead, Several Feared Trapped As Stone Quarry Collapses In Mizoram https://t.co/8B5FGdvLz6— Priyanka Krishnadas (@pri3107das) May 28, 2024 మరోవైపు భారీ వర్షం కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులుకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. అదే విధంగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో హైవేలు, కీలక రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. హుంతూర్ వద్ద జాతీయ రహదారి 6పై కొండచరియలు విరిగిపడటంతో ఐజ్వాల్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఆదివారం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో రెమాల్ తుపాన్ బిభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. -
నాడు టీవీ యాంకర్.. నేడు అసెంబ్లీ స్పీకర్!
Mizoram First Woman Speaker : అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈశాన్య రాష్ట్రం మిజోరాం రాజకీయాల్లో చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. 40 మంది సభ్యులున్న మిజోరాం రాష్ట్ర అసెంబ్లీకి మొట్టమొదటి సారిగా ఓ మహిళ స్పీకర్గా నియమితులయ్యారు. జోరెమ్ పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు, ఎమ్మెల్యే బారిల్ వన్నెహసాంగి మార్చి 7న జరిగిన అసెంబ్లీ సెషన్లో స్పీకర్ స్థానాన్ని అధిష్టించారు. మిజోరాం అసెంబ్లీకి ఇది ఒక ముఖ్యమైన చారిత్రక మైలురాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి, జోరెమ్ పీపుల్స్ మూవ్మెంట్ అగ్రనేత లాల్దుహోమా పేర్కొన్నారు. సాంప్రదాయ పరిమితులను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు ఈ మైలురాయి ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు. మిజోరాం మొదటి మహిళా స్పీకర్ బారిల్ వన్నెహసాంగి మార్చి 7న మిజోరాం మొదటి మహిళా అసెంబ్లీ స్పీకర్గా నియమితులయ్యారు. రాష్ట్రంలో మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం చూపారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో జోరెమ్ పీపుల్స్ మూవ్మెంట్ కి చెందిన వన్నెహసంగి ఒకరు. మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి ఎఫ్. లాల్నున్మావియాపై ఆమె 9,370 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా కూడా 32 ఏళ్ల బారిల్ వన్నెహసాంగి చరిత్ర సృష్టించారు. రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకముందు వన్నెహసాంగి ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా పనిచేశారు. మేఘాలయలోని షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ నుండి ఆర్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె టెలివిజన్ యాంకర్గా పనిచేశారు. వన్నెహసాంగికి ఆకట్టుకునే సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
5 వికెట్లతో చెలరేగిన తనయ్.. హైదరాబాద్ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో హైదరాబాద్ జట్టు ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ ఇన్నింగ్స్ విజయాలు సాధించి 35 పాయింట్లతో టాపర్గా నిలిచింది. ఆరు జట్లున్న ప్లేట్ డివిజన్లో భాగంగా మిజోరం జట్టుతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది. ఆట మూడో రోజు ఓవర్నైట్ స్కోరు 458/8తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 9 వికెట్లకు 465 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 266 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మిజోరం 43.1 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 74 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈనెల 9 నుంచి జరిగే సెమీఫైనల్స్లో నాగాలాండ్తో హైదరాబాద్; మేఘాలయతో మిజోరం ఆడతాయి. ఫైనల్ చేరిన రెండు జట్లు వచ్చే ఏడాది రంజీ ట్రోఫీ సీజన్లో ఎలైట్ డివిజన్లో ఆడతాయి. చదవండి: NZ vs SA: రచిన్ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్ సెంచరీతో -
చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
ఫస్ట్క్లాస్ క్రికెట్లో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమారుడు, మిజోరాం ఆటగాడు అగ్ని చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో తన తొలి నాలుగు మ్యాచ్లలో నాలుగు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్గా అగ్ని చోప్రా ప్రపంచ రికార్డు సాధించాడు. రంజీ ట్రోఫీ-2024లో భాగంగా మేఘాలయాతో మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లోనూ సెంచరీలతో చెలరేగిన చోప్రా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది సీజన్తో రంజీల్లోకి అరంగేట్రం చేసిన చోప్రా.. సిక్కింతో తన తొలి మ్యాచ్లోనే సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో 166 పరుగులు చేసిన అగ్ని, రెండో ఇన్నింగ్స్లో 92 పరుగులు సాధించాడు. అనంతరం నాగాలాండ్, అరుణాచాల్ ప్రదేశ్పై సెంచరీలతో కదం తొక్కాడు. ఓవరాల్గా ఇప్పటివరకు తన ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ సెంచరీతో మెరిశాడు. ఈ ఏడాది రంజీ సీజన్లో 4 మ్యాచ్లు ఆడిన చోప్రా.. 767 పరుగులు చేసి టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇక ఈ మధ్యే 12th ఫెయిల్ మూవీతో భారీ విజయం అందుకున్న విధు వినోద్ చోప్రా ఇప్పుడు పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. చదవండి: Mayank Agarwal: ఆ బాటిల్ తీసుకుని తాగగానే వాంతులు.. భయంకర పరిస్థితి -
మిజోరాంలో ప్రమాదానికి గురైన మయన్మార్ సైనిక విమానం..
ఐజ్వాల్: మిజోరంలో మయన్మార్ ఆర్మీకి చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం రన్వేపై దిగుతుండగా అదుపు తప్పి కొంత దూరంలో ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. మిజోరాంలోని లెంగ్పుయ్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తమ దేశంలో జరుగుతున్న అతర్యుద్ధం కారణంగా సరిహద్దుల దాటి భారత్లోని మిజోరం రాష్ట్రంలోకి చొరబడిన మయన్మార్ సైనికులను స్వదేహానికి తీసుకెళ్లేందుకు ఈ విమానం వచ్చిన సమయంలో ప్రమాదం జరిగింది. కాగా టేబుల్టాప్ రనేవేలు (పీఠభూమి లేదా ఎత్తైన కొండ పైభాగం ప్రాంతాల్లో నిర్మించిన రన్వే) సవాలుతో కూడుకొని ఉన్నాయి. ఇలాంటి రన్వేలో భారత్లో ఆరు మాత్రమే ఉన్నాయి. వీటి వల్ల విమానాలు ల్యాండింగ్ అవుతున్న సమయాల్లో రన్వే నుంచి జారిపోయే ప్రమాదం ఉంటుంది. చదవండి: భారత్కు శాశ్వత సభ్యత్వం లేదు.. ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు ఇక మయన్మార్లో తిరుగుబాటు గ్రూపులతో జరుగుతోన్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో ఆ దేశం నుంచి భారీగా సైనికులు భారత్లోకి చొరబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత వారం మొత్తం 276 మంది మయన్మార్ సైనికులు మిజోరాంలోకి ప్రవేశించారని, వీరిలో 184 మంది సైనికులను భారత్ సోమవారం వెనక్కి పంపినట్లు అస్సాం రైఫఙల్స్ సోమవారం పేర్కొంది. స్వతంత్ర రాఖైన్ రాష్ట్ర కోసం పోరాటం చేస్తున్న మయన్మార్ తిరుగుబాటు బృందం ‘అరాకన్ ఆర్మీ’ సాయుధులు గతవారం దేశ సైనిక క్యాంప్పై దాడి చేసి ఆక్రమించుకున్నారు. దీంతో మయన్మార్ సైనికులు మిజోరాంలోని లాంగ్ట్లై జిల్లాలోని భారత్-మయన్మార్-బంగ్లాదేశ్ ట్రైజంక్షన్ వద్ద ఉన్న బందుక్బంగా గ్రామం ద్వారా దేశంలోకి ప్రవేశించి అస్సాం రైఫిల్స్ క్యాంప్లో లొంగిపోయారు. వీరి వద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా ఉన్నాయి. మయన్మార్ సైనికులను పర్వాలోని అస్సాం రైఫిల్స్ శిబిరానికి తరలించారు. అనంతరం వారిని లుంగ్లీకి మకాం మార్చారు. ఐజ్వాల్ సమీపంలోని లెంగ్పుయ్ విమానాశ్రయం నుండి మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలోని సిట్వేకు మయన్మార్ వైమానిక దళానికి చెందిన విమానాల్లో సైనికులను స్వదేశానికి పంపే ప్రక్రియ ప్రారంభించినట్లు అస్సాం రైఫిల్స్ అధికారి ఒకరు తెలిపారు. మిగిలిన 92 మంది సైనికులను నేడు మయన్మార్ తరలిస్తామని చెప్పారు. -
భారత్లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మయన్మార్ ప్రభుత్వ ఆర్మీ(జుంటా) సైనికులు భారత్లోకి చొచ్చుకురావటంపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయటంలో భాగంగా భారత సరిహద్దుల వెంట త్వరలో పటిష్టమైన కంచెను ఏర్పాటు చేయనున్నట్లు హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎలాంటి కంచె ఉందో.. ఇక్కడ (భారత్-మయన్మార్) సరిహద్దు వద్ద కూడా చాలా పటిష్టమైన కంచె ఏర్పాటు చేస్తామని అన్నారు. దీంతో మనదేశంలోకి సరిహద్దులు దాటుకొని మయన్మార్ సైనికులు రావటం సాధ్యం కాదని పేర్కొన్నారు. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్లో ఆశ్రయం పొందుతున్నారు. మయన్మార్ ఆర్మీ సైనికుల విషయాన్ని.. మిజోరం సీఎం లాల్దుహోమ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. భారత సరిహద్దుల్లోని మిజోరం ప్రాంతం నుంచి మయన్మార్ ఆర్మీ సైనికులను వెనక్కి పంపించాలని కేంద్రాన్ని ఆయన అభ్యర్థించిన విషయం తెలిసిందే. చదవండి: భారత్లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన -
భారత్లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన
గౌహతి: మయన్మార్లో కొన్ని రోజులుగా దేశ సైనిక ప్రభుత్వం, అక్కడి ప్రజాస్వామ్య సాయుధ దళాలకు మధ్య ఉద్రిత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మయన్మార్ ఆర్మీ(జుంటా) సైనికులు భారత సరిహద్దులు దాటి భారత్లోని మీజోరంకి వరుసకడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం అప్రమత్తమైంది. మీజోరం భూభాగంలోకి చొచ్చుకువస్తున్న జుంటా సైనికులను వెంటనే మయన్మార్కు తిరిగి పంపిచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్లో ఆశ్రయం పొందుతున్నారు. పెద్ద ఎత్తున సరిహద్దు దాటుకొని మిజోరం వైపు వస్తున్న మయన్మార్ సైనికులను వెనక్కి పంపిచాలని మిజోరం సీఎం లాల్దుహోమ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు మిజోరం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిత్త పరిస్థితుల నేపథ్యంలో తిరిగి స్థిరత్వం నెలకొల్పడానికి మయన్మార్ సైనికులు వెనక్కి పంపించాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఇక.. ఇటీవల తరచూ మయన్మార్ సైనికలు భారత సరిహద్దులు దాటుకొని మిజోరం రాష్ట్రంలోకి వస్తున్నారని మిజోరం సీఎం లాల్దుహోమ తెలిపారు. మనవతా సాయం కింద మయన్మార్ సైనికులకు తాము సైనిక క్యాంప్లో సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇలా 450 మంది జుంటా సైనికులను వెనక్కి పంపించినట్లు తెలిపారు. 2021 నుంచి మయన్మార్లో సైనిక ప్రభుత్వం.. ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థల నుంచి తీవ్రమైన తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలు నగరాల్లోని సైనిక స్థావరాలను తిరుగుబాటు సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: గాంధీలను మించిన అవినీతి పరులు ఎవరైనా ఉంటారా? -
తీవ్ర గాయాలతో భారత్లోకి మయన్మార్ సైనికులు.. ఏమైందంటే?
మయన్మార్ (బర్మా) చెందిన 151 మంది సైనికులు భారత్లోకి చొచ్చుకొని వచ్చారు. మిజోరం రాష్ట్రంలో గల సరిహద్దు జిల్లా లాంగ్ట్లైలోకి మమన్మార్ సైనికులు తరలివచ్చినట్లు అస్సాం రైఫిల్స్ అధికారి వెల్లడించారు. ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థ అయిన అరాకన్ ఆర్మీ(ఏఏ) ఆ దేశ సైన్యం ‘తత్మాదవ్’ క్యాంప్ను ధ్వంసం చేసింది. దీంతో మయన్మార్ సైన్యంలోని 151 మంది సైనికులు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్లోని మిజోరంలోకి ప్రవేశించారు. కాగా.. కొన్ని రోజులుగా భారత్ సరిహద్దుకు సమీపంలోని మయన్మార్ ప్రాంతంలో ఆ దేశ సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల సాయుధ సంస్థ అరాకన్ ఆర్మీకి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం తీవ్రమైన గాయాలతో కొంతమంది సైనికులు భారత్లోకి వచ్చినట్లు ధ్రువీకరించారు. అయితే అస్సాం రైఫిల్స్ అధికారులు గాయపడిన మయన్మార్ సైనికులకు ప్రథమ చికిత్స అందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం మయన్మార్ సైనికులు అస్సాం రైఫిల్స్ కస్టడీలో మయన్మార్ సరిహద్దు వద్ద ఉన్నారని పేర్కొన్నారు. వారిని మయన్మార్ పంపించడానికి భారత దేశ విదేశాంగ శాఖ, మయన్మార్ మిలిటరీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయని అస్సాం రైఫిల్స్ అధికారులు తెలిపారు. మరోవైపు మయన్మార్లో సైనిక పాలనను కూలదోసి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి అక్కడి ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థలు ఉమ్మడిగా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. త్రీబ్రదర్హుడ్ అలయన్స్ (టీబీఏ), మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్డీఏఏ), టాంగ్ జాతీయ విమోచన సైన్యం(టీఎన్ఎల్ఏ), అరాకన్ ఆర్మీ(ఏఏ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. చదవండి: హౌతీ రెబెల్స్ను మళ్లీ దెబ్బ కొట్టిన అమెరికా -
మిజోరం సీఎంగా లాల్దుహోమా ప్రమాణ స్వీకారం
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్ఎన్పీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం జెడ్ఎన్పీ అధినేత లాల్దుహోమా చేత ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మిజోరంలో భారీ విజయం సాధించిన జెడ్ఎన్పీ నూతన ప్రభుత్వం నేడు కొలువుదీరింది. #WATCH | Aizawl, Mizoram: Zoram People's Movement (ZPM) leader Lalduhoma takes oath as the Chief Minister of Mizoram as the swearing-in ceremony begins pic.twitter.com/oCMbU2xVSf — ANI (@ANI) December 8, 2023 నవంబర్ 7న జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాల్లో జోరామ్ నేషనలిస్ట్ పార్టీ 27 స్థానాల్లో ఘన విజయం సాధించింది. మిజో నేషనల్ ఫ్రంట్ కేవలం 10 స్థానాలకే పరిమితమైంది. -
కలల సాధకులు... చరిత్ర సృష్టించారు
విజయానికి తొలి మెట్టు కల కనడం. కల కనడం ఎంత తేలికో ఆ కలను నిజం చేసుకోవడం అంత కష్టం. అయితే లక్ష్య సాధన వైపు బలంగా అడుగులు వేసే వారికి కలను నెరవేర్చుకోవడం కష్టం కాదని ఈ ఇద్దరు నిరూపించారు. మిజోరం నేపథ్యంగా చరిత్ర సృష్టించి వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు వన్నెహ్సోంగీ, మనీషా పధి... మిజోరంలో రాజకీయ సంప్రదాయాన్ని పక్కన పెట్టి అధికారంలోకి రాబోతున్న జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్పీఎం) గురించి మాట్లాడుకున్నట్లుగానే ఆ పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికైన బారిల్ వన్నెహ్సోంగి గురించి కూడా ఘనంగా మాట్లాడుకుంటున్నారు. రేడియో జాకీగా పని చేసిన 32 ఏళ్ల బారిల్ వన్నెహ్సోంగి ‘జెడ్పీఎం’ నుంచి శాసనసభకు ఎన్నికైన అత్యంత చిన్న వయస్కురాలైన మిజోరం శాసనసభ్యురాలిగా రికార్డ్ సృష్టించింది... మిజోరం శాసనసభ ఎన్నికల్లో జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్పీఎం) ఘన విజయం సాధించడమనేది రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. అదృష్టం కాదు. మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), కాంగ్రెస్లను దాటుకొని అధికారం లోకి రావడం అంత తేలిక కాదు. అయితే ‘జోరం పీపుల్స్ మూమెంట్’ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు. ‘మనకంటూ ఒకరోజు తప్పకుండా వస్తుంది’ అని గట్టిగా అనుకుంది. సరిగ్గా ఇదే స్ఫూర్తి వన్నెహ్సోంగిలో కనిపిస్తుంది. చలాకీగా, నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే వన్నెహ్సోంగి రాజకీయ, సామాజిక సంబంధిత విషయాలను మాట్లాడుతున్నప్పుడు మాత్రం ‘ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకరేనా’ అన్నట్లుగా ఉంటుంది. బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారికి సైద్ధాంతిక పునాది కూడా ముఖ్యం. కాలేజీ రోజుల నుంచే రాజకీయ దిగ్గజాలతో మాట్లాడడం, ఎన్నో పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో విషయాలపై సాధికారత సాధించగలిగింది వన్నెహ్సోంగి. హైస్కూల్ రోజుల నుంచి మొదలు మేఘాలయా రాజధాని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన సమయం వరకు వన్నెహ్సోంగి ఎప్పుడూ విన్న మాట, బాధ పెట్టిన మాట ... ‘రాజకీయాలు మహిళలకు తగనివి. రాజకీయాల్లోకి వచ్చినా రాణించలేరు’ ఈ భావన తప్పు అని నిరూపించడానికి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఆమె మనసులో బలంగా పడింది. రేడియో జాకీగా, టీవి ప్రెజెంటర్గా పని చేసిన వన్నెహ్సోంగి ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. ‘రాజకీయాలు అంటే టీవి మైక్ ముందు మాట్లాడినంత తేలిక కాదు’ అని ముఖం మీదే అన్నారు చాలామంది. వారి మాటలతో డీలా పడలేదు వన్నెహ్సోంగి. తమ మీద తమకు నమ్మకం ఉన్న వారి దగ్గర ఢీ అంటే ఢీ అనే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతోనే తొలిసారిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కార్పోరేటర్గా గెలిచింది. విశాల రాజకీయ ప్రపంచంలో కార్పోరేటర్గా గెలవడం చిన్న విజయమే కావచ్చుగానీ ఆ విజయం తనకు అపారమైన ధైర్యం ఇచ్చి– ‘యస్. నేను సాధించగలను’ అని ముందుకు నడిపించింది. మిజోరంలోని ఐజ్వాల్ సౌత్–3 నియోజక వర్గం నుంచి 1,414 ఓట్ల మెజార్టీతో గెలిచిన బారిల్ వన్నెహ్సోంగి ‘సంకల్పబలం ఉండాలేగానీ మన కలల సాధనకు జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాదు’ అంటుంది. ఇన్స్టాగ్రామ్తో ఎంతోమందికి చేరువ అయింది వన్నెహ్సోంగి. ఇన్స్టాగ్రామ్ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది. ఇన్స్టాలో ఆమెకు మూడు లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నారు. ‘భవిష్యత్ లక్ష్యం ఏమిటీ?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం...‘చదువు ద్వారా అద్భుతాలు సాధించవచ్చు. అభివృద్ధి పథంలో పయనించవచ్చు. అందుకే రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను’ అంటుంది వన్నెహ్సోంగి. యంగ్, ఎనర్జిటిక్ అండ్ డేరింగ్ అని అభిమానులు పిల్చుకునే వన్నెహ్సోంగి మదిలో ఎన్నో కలల ఉన్నాయి. అవి రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉన్న కలలు. ఆ కలల సాకారంలో శాసనసభ్యురాలిగా తొలి అడుగు వేసింది. ఏడీసీ మనీషా చిన్నప్పుడు తండ్రి యూనిఫాంను పోలిన డ్రెస్ ధరించి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా తెగ హడావిడి చేసింది మనీషా. అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోయింది. తండ్రి నడకను అనుకరించింది. ఆరోజు తమ ముద్దుల బిడ్డను చూస్తూ తెగ నవ్వుకున్న మనీషా తల్లిదండ్రులు, ఇప్పుడు కుమార్తె ఉన్నతిని చూసి గర్విస్తున్నారు. స్క్వాడ్రన్ లీడర్ మనీషా సాధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్కు ఎయిడ్–డి–క్యాంప్ (ఏడీసీ)గా నియామకం అయిన ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్గా చరిత్ర సృష్టించింది... మనీషా పధి స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. తల్లి గృహిణి. తండ్రి మనోరంజన్ పధి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది మనీషా. చదువుకు తగ్గ ధైర్యం ఉండేది. తండ్రిలాగే ‘ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్’ కావాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నది. చిన్నప్పుడు తండ్రి యూనిఫామ్ను పోలిన డ్రెస్ను ధరించి సందడి చేసేది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసిన మనీషా ఆ తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరింది. గతంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్– పుణె చివరగా భటిండాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పనిచేసింది ‘ఏడీసీగా మనీషా పధి నియామకం ఒక మైలురాయి మాత్రమే కాదు. లింగ వివక్షతను కాలదన్ని వివిధ రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్న మహిళా శక్తికి నిదర్శనం. ఈ అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. అన్ని రంగాల్లో మహిళా సాధికారతను కొనసాగిద్దాం’ అని వ్యాఖ్యానించారు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు. ‘ఎయిడ్–డి–క్యాంప్’ అనేది సాయుధ దళాల్లో ఉన్నత స్థాయి అధికారికి సహాయపడే అధికారి హోదాను సూచిస్తుంది. మన దేశంలో ‘ఎయిడ్–డి–క్యాంప్’ గౌరవప్రదమైన హోదా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్... మొదలైన వాటిలో సర్వీస్ చీఫ్లకు సాధారణంగా ముగ్గురు ‘ఎయిడ్–డి–క్యాంప్’లు ఉంటారు రాష్ట్రపతికి ఆర్మీ నుంచి ముగ్గురు, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం అయిదుగురు ఉంటారు. ఇక రాష్ట్ర గవర్నర్లకు ఇద్దరిని నియమిస్తారు. మా కూతురు మా శక్తి మనిషా పధి తల్లిదండ్రులు ఒడిషాలోని భువనేశ్వర్లో నివాసం ఉంటున్నారు. తమ కుమార్తె మిజోరం గవర్నర్ ‘ఏడీసీ’గా నియామకం కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘2015లో ఫస్ట్ పోస్టింగ్ నుంచి ఇప్పటి వరకు విధి నిర్వహణకు సంబంధించి ఎంతో అనుభవాన్ని సొంతం చేసుకుంది. ఆ అనుభవమే మనీషాను ‘ఏడీసీ’గా నియామకం అయ్యేలా చేసింది. మనిషా తల్లిదండ్రులుగా ఈ నియామకం విషయంలో సంతోషిస్తున్నాం. గర్విస్తున్నాం’ అంటున్నాడు మనీషా తండ్రి మనోరంజన్ పధి. ‘చదువు విషయంలో, వృత్తి విషయంలో మనీషా మమ్మల్ని సంతోషానికి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం నా సంతోషాన్ని వ్యక్తీకరించడానికి మాటలు రావడం లేదు. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగింది’ అంటుంది మనీషా తల్లి. ‘తన కలను నిజం చేసుకోవడానికి సొంత ఊరు దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు మాతో పాటు మనీషాకు ఎంతో మంది నిరుత్సాహపరిచే మాటలెన్నో చెప్పారు. మనీషా ఒక్క నిమిషం కూడా అధైర్యపడింది లేదు. అలాంటి మాటలను పట్టించుకోవద్దని మేము గట్టిగా చెప్పేవాళ్లం. అమ్మాయిల కెరీర్ డ్రీమ్స్కు తల్లిదండ్రులు అండగా నిలబడితే వారు అద్భుత విజయాలు సాధిస్తారు. తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తారు’ అంటున్నాడు మనోరంజన్ పధి. మనీషా పధి తల్లిదండ్రులకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటి సారాంశం ‘మీ అమ్మాయి బంగారం’ -
నాడు యాంకర్ నేడు ఎమ్మెల్యేగా..!
ఇటీవల ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వాటిలో నాలుగు రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించగా, ఒక్క మిజోరాం అసెంబ్లీ ఫలితాలు మాత్రం డిసెంబర్ 4న ప్రకటించడం జరిగింది. ఆ ఫలితాల్లో బారిల్ వన్నెహ్సాంగి అనే మహిళ ప్రధాన ఆకర్షణగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ ఎవరీమె? ప్రత్యేకత ఏంటీ అంటే.. 40 మంది సభ్యులు ఉన్న మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో జెడ్పీఎం అభ్యర్థిగా బారిల్ బరిలోకి దిగి మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థిని గద్దెదించింది. దీంతో ఆమె అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా నిలిచింది. ఆమె వయసు జస్ట్ 32 ఏళ్లే. బారిల్ ఐజ్వాల్ సౌత్ -III నుంచి పోటీకి దిగి, మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి(ఎంఎన్ఎఫ్) లాల్నున్మావియాను 9.370 మెజార్టీ ఓట్లతో ఓడించి విజయం సాధించింది ఇక ఆమె నేపథ్యం చూస్తే..మేఘాలయాలోని షిల్లాంగ్లో నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ను అభ్యసించింది. ఆమె ప్రముఖ టీవీ యాంకర్గా కెరీర్ను ప్రారంభించి..క్రమంగా సోషల్ మీడియా ఫ్లాట్ఫాం ఇన్స్టాగ్రాంలో బాగా ఫేమస్ అయ్యింది. ఆమెకు ఏకంగా దాదాపు 250కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రేజే ఆమెను ప్రజలకు మరింత చేరువ చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుక దోహదపడింది. ఇకఎన్నికల అఫిడవిట్ ప్రకారం..ఆమె గతంలో ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంఏసీ)లో కార్పొరేటర్గా పనిచేశారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఇక ఇదే రాష్ట్రం నుంచి బారిల్ వన్నైసంగీలానే మరో ఇద్దరు మహిళలు గెలుపొందడం విశేషం. వారిలో ఒకరు మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) అభ్యర్థి. (చదవండి: ఫోర్బ్స్ జాబితాలో నలుగురు భారతీయులకు చోటు! సీతారామన్ ఎన్నో స్థానంలో ఉన్నారంటే..?) -
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
-
మిజోరంలో ఓట్ల లెక్కింపు 4న
న్యూఢిల్లీ: íఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఒకే రోజు మొదలవుతుందని ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మిజోరంలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు శుక్రవారం ఈసీ తెలిపింది. క్రైస్తవులు మెజారిటీ కలిగిన ఈ రాష్ట్రానికి చెందిన వివిధ వర్గాల ప్రతినిధులు 3వ తేదీ, ఆదివారం తమకు ఎంతో ప్రత్యేకమైనది అయినందున ఓట్ల లెక్కింపు వాయిదా వేయాలని కోరినట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు కౌంటింగ్ను ఒక రోజు అంటే 4వ తేదీకి వాయిదా వేసినట్లు వివరించింది. -
Elections 2023: రిజల్ట్ చూద్దాం.. మజా చేద్దాం!
సినిమా కాదు.. క్రికెట్ మ్యాచ్ అంతకంటే కాదు కానీ, ఈ ఆదివారం సిసలైన మజాను కోట్ల మంది ఆస్వాదించబోతున్నారు ఎలాగంటారా?.. డిసెంబర్ 3.. రాజకీయ పార్టీలకు బిగ్డే చార్ పటాకా బద్ధలయ్యే రోజది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్.. మూడు రాష్ట్రాల్లో రెండు ప్రధాన పార్టీల హోరాహోరీ పోరుపై నెలకొన్న ఆసక్తి ఇక ఇటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ప్రధాన పార్టీల నడుమ విజయధీమాలతో తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన వేళ.. ఓడేదెవరు? నెగ్గేదెవరనేది పక్కనపెడితే.. ఈ సూపర్ సండే మాంచి కిక్కు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.. రాజస్థాన్ చెరో దఫా ప్రభుత్వాల్ని ఇక్కడ కాంగ్రెస్-బీజేపీలు గత మూడు దశాబ్దాలుగా ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. అయితే.. గత మూడేళ్లుగా నడుస్తున్న గ్రూప్ రాజకీయాల నేపథ్యంలో ఈసారి రాజస్థాన్లో ఎవరు సర్కార్ను నెలకొల్పుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పుడున్న రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14, 2024తో ముగియనుంది. ఈలోపు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీకి.. 199 స్థానాలకు(ఒక దగ్గర అభ్యర్థి మరణంతో ఎన్నిక నిలిపివేశారు) నవంబర్ 25వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 75.45% పోలింగ్ నమోదైంది. ప్రభుత్వ ఏర్పాటుకు 101 స్థానాలు రావాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాల ప్రభావం తమను మళ్లీ గెలిపిస్తుందని కాంగ్రెస్.. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో పేరుకుపోవడంతో పాటు తాము ఇచ్చిన ఎన్నికల హామీలకు ప్రజలు పట్టం కడతారని బీజేపీ గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఎగ్జిట్పోల్ ఫలితాలు హోరాహోరీ పోటీనే చూపిస్తున్నాయి ఇక్కడ. మధ్యప్రదేశ్ కిందటి ఎన్నికల్లో నెగ్గి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేశామనే సంతోషం కాంగ్రెస్కు రెండేళ్లే ఉంది. తిరుగుబావుటా నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిణామాలు.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో ఇప్పుడున్న అసెంబ్లీ గడువు జనవరి 6, 2024తో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. నవంబర్ 17వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తంగా 5.6 కోట్ల ఓటర్లకుగానూ.. 77.15 శాతం నమోదు అయ్యింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి.. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు రావాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్లో ఈ ఐదేళ్లలో రెండు ప్రభుత్వాలు వచ్చాయి. గత ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. రెండేళ్లు తిరగకముందే 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కుప్పకూలింది. సరిపడా బలం కమల్నాథ్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్లు ధీమాతో ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో సగం బీజేపీకి అనుకూలంగా.. సగం హంగ్ చూపిస్తుండగా.. ఓటర్ పల్స్ ఎలా ఉండనుందా? అనే ఆసక్తి నెలకొంది. ఛత్తీస్గఢ్ వరుసగా మూడు పర్యాయాలు(2003 నుంచి 2018 దాకా) సంపూర్ణ పాలన కొనసాగించిన బీజేపీకి చెక్ పెడుతూ కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమా కాంగ్రెస్లో కనిపిస్తుంటే.. కంచుకోటను చేజిక్కించుకుని తీరతామంటూ బీజేపీ ధీమా కనబరుస్తోంది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ గడువు జనవరి 3, 2024తో ముగియనుంది. ఈలోపు ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. రెండు ఫేజ్ల్లో నవంబర్ 7న, నవంబర్ 17న పోలింగ్ నిర్వహించింది ఈసీ. మొత్తం కోటి 63 లక్షల ఓటర్లు ఉండగా.. 76 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్గఢ్లో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 46 రావాలి. రూరల్ డెవలప్మెంట్ అనేది ప్రధాన అస్త్రంగా.. సంక్షేమ పథకాలను కాంగ్రెస్ నమ్ముకుంది. మరో వైపు అవినీతి ఆరోపణలు, మత మార్పిడులు, హామీలు నెరవేర్చకపోవడం వంటి అస్త్రాలను బీజేపీ సంధించింది. మరోవైపు.. అద్భుతం జరిగితేనే బీజేపీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ ఈ సారి అధికారం నిలబెట్టుకున్నా సీట్లు తగ్గే అవకాశముందని, ఇవేవీకావు.. బీజేపీ ఏకపక్షంగా నెగ్గుతుందని ఇలా రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి అక్కడ. ఈ తరుణంలో.ఎగ్జిట్ పోల్స్ సైతం ఛత్తీస్గఢ్లో హోరాహోరీ అంచనా వేస్తుండడంతో ఆసక్తి నెలకొంది. తెలంగాణ గత రెండు దఫాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. హ్యాట్రిక్ కొడతామంటోంది. ఈ పదేళ్లలో ఘోరంగా అవినీతి జరిగిందని.. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో తారాస్థాయికి వెళ్లిందని.. అది తమకు అధికారం కట్టబెడుతుందని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలు చెప్పుకుంటున్నాయి. సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు.. ఈలోపే ఏకపక్షంగా వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. గెలుపుపై ఎవరికి వాళ్లే వ్యక్తం చేస్తున్న ధీమా పరిణామాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ సస్పెన్స్ థ్రిల్లర్ను మరిపించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మూడో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఇప్పుడున్న అసెంబ్లీ కాలపరిమితి జనవరి 16, 2024తో ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 30 తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 3.26 కోట్ల ఓటర్లు ఉండగా.. 70 శాతం పైనే ఓటింగ్ నమోదు అయ్యిందని అంచనా. అంటే.. దాదాపు కోటి మంది దాకా పోలింగ్కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీకి 119 స్థానాలు ఉండగా.. అధికారం ఏర్పాటు చేయాలంటే 60 సీట్ల మెజారిటీ అవసరం. పదేళ్ల పాలన ప్రచార అస్త్రంగా బీఆర్ఎస్.. అత్యధిక సీట్లతో, మూడోసారి విజయంతో రికార్డు నెలకొల్పుతామని అంటోంది. ఇక ఈ పాలనలోనే జరగని అవినీతి లేదంటూ బీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారంతో కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లోకి వెళ్లాయి. సర్వేలు ఒకలా.. ఎగ్జిట్పోల్స్ మరోలా రావడంతో ఓటర్ పల్స్పై గందరగోళమే నెలకొంది. పైగా సాయంత్రం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడంతో.. తెలంగాణలో ఈసారి ఓటింగ్ గెలుపోటములను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇస్తారనే తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆ బెట్టింగ్స్ తారాస్థాయికి చేరాయంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఏమేర ఉత్కంఠ నెలకొందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద.. ఈ ఆదివారం డిసెంబర్ 3న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ.. ఫలితాల వెల్లడి.. నాయకుల గెలుపొటములతో.. పార్టల సంబురాలు-నిరుత్సాహాలతో కోట్ల మందికి(ప్రత్యేకించి ఓటర్లకు..) ఇత్యాది పరిణామాలు మస్త్ మజాను అందించబోతున్నాయి! -
లాల్దుహోమా ఎవరు? మిజోరం ఎన్నికల్లో ఎందుకు కీలకం?
మిజోరం.. దేశంలోని ఒక చిన్న రాష్ట్రం... అసెంబ్లీ కూడా చిన్నదే. 40 మంది సభ్యుల ఈ అసెంబ్లీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలో నవంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కారణంగా దేశవ్యాప్తంగా మిజోరం రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈసారి మిజోరంలో ముక్కోణపు పోటీ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), కాంగ్రెస్తో పాటు, ఈసారి లాల్దుహోమా నేతృత్వంలోని జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్ఎన్పీ)కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. దీంతో లాల్దుహోమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. యువత నుంచి లాల్దుహోమాకు అత్యధిక ఆదరణ దక్కుతోంది. మిజోరాం అభివృద్ధి గురించి, కాంగ్రెస్, ఎంఎన్ఎఫ్ నుంచి రాష్ట్రానికి విముక్తి చేయడం గురించి ఆయన మాట్లాడుతున్నారు. మిజోరాం సీఎంకు లాల్దుహోమా గట్టి పోటీదారు అని ఇక్కడివారంతా చెబుతున్నారు. ఇంతకీ లాల్దుహోమా ఎవరు? యువత ఆయనకు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? లాల్దుహోమా మిజోరంనకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి. 1977లో ఐపీఎస్ పూర్తి చేశాక, గోవాలో స్క్వాడ్ లీడర్గా విధులు నిర్వహిస్తూ స్మగ్లర్ల ఆటకట్టించారు. లాల్దుహోమా సాధించిన విజయాలు మీడియాలో తరచూ కనిపిస్తుంటాయి. 1982లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు. లాల్దుహోమా 1984లో ఎంపీగా లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన పేరిట ఓ ప్రత్యేక రికార్డు కూడా ఉంది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన మొదటి ఎంపీగా లాల్దుహోమా నిలిచారు. 1988లో కాంగ్రెస్ సభ్యత్వాన్ని వదులుకున్నందుకు లోక్సభ నుండి బహిష్కరణకు గురయ్యారు. లాల్దుహోమా.. జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్ఎన్పీ)వ్యవస్థాపక అధ్యక్షుడు. 2018 మిజోరాం శాసనసభ ఎన్నికల్లో జెడ్ఎన్పీ నేతృత్వంలోని జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) కూటమి మొదటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన నిలిచారు. ఐజ్వాల్ వెస్ట్-1, సెర్చిప్ నియోజకవర్గాల నుండి ఎన్నికైన లాల్దుహోమా.. సెర్చిప్కు ప్రాతినిధ్యం వహించేందుకు మొగ్గుచూపారు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సమయంలో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు 2020లో శాసనసభ సభ్యునిగా అనర్హుడయ్యారు. ఇది భారతదేశంలోని రాష్ట్ర శాసనసభలలో మొదటి ఉదంతంగా నిలిచింది. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో సెర్చిప్ నుంచి లాల్దుహోమా తిరిగి ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: చనిపోయిన 12 గంటలకు తిరిగి బతికిన చిన్నారి! -
మిజోరాం ఎగ్జిట్పోల్స్లో గెలుపు ఎవరిదంటే..!
ఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు వచ్చేశాయి. ఐదు రాస్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిజోరాంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) మరోసారి ఆధిక్యం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే స్పష్టం చేయగా, జోరమ్ పీపుల్స్ మూమెంట్(జేపీఎం) పైచేయి సాధిస్తుందని జన్ కీ బాత్ సర్వే తెలిపింది. 40 అసెంబ్లీ సీట్లున్న మిజోరాంలో ఎంఎన్ఎఫ్ 16 నుంచి 20 స్థానాలను సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే తెలపగా, జన్ కీ బాత్ సర్వే మాత్రం ఎంఎన్ఎఫ్ 10 నుంచి 14 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటివరకూ వచ్చిన మూడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం అక్కడ ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. మిజోరాం అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పీపుల్స్ పల్స్ సర్వే ఎంఎన్ఎఫ్ 16-20 జేపీఎం-10-14 ఐఎన్సీ 2-3 బీజేపీ 6-10 ఇతరులు-0 జన్ కీ బాత్ సర్వే ఎంఎన్ఎఫ్-10-14 జేపీఎం-15-25 కాంగ్రెస్-5-9 బీజేపీ-0-2 ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ఎంఎన్ఎఫ్ 14-18 జేపీఎం 12-16 కాంగ్రెస్ 8-10 బీజేపీ 0-2 ABP-Cvoter MNF-15-21 ZPM-12-18 OTH-0-10 Times Now-ETG MNF-14-18 ZPM-10-14 OTH-9-15 ఎగ్జిట్పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
ఎన్నికల వేళ భారీగా సొత్తు సీజ్: సీబీడీటీ
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మిజోరంలలో లెక్కల్లో చూపించని నగదు భారీగా పట్టుబడుతున్నట్లు ఆదాయ పన్ను విభాగం సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్)తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో 2019లో జరిగిన లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా బుధవారం తెలిపారు. సోదా, నిఘా చర్యలను ఎన్నికల కమిషన్ సమన్వయంతో చేపడుతున్నామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలున్న రాజస్తాన్లో పట్టుబడిన అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి తదితరాల మొత్తం విలువ మూడింతలయిందన్నారు. 2021లో సీజ్ చేసిన మొత్తం సొత్తు విలువ రూ.322 కోట్లు కాగా, 2022లో అది రూ.322 కోట్లకు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1,021 కోట్లకు పెరిగిందని గుప్తా పేర్కొన్నారు. -
మిజోరంలో 77 శాతానికి పైగా పోలింగ్
ఐజ్వాల్: అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), విపక్ష జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం), కాంగ్రెస్ మధ్య తీవ్రపోటీకి వేదికగా నిలిచిన మిజోరం శాసనసభ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 40 స్థానాలకూ ఒకే దఫాలో పోలింగ్ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు అందిన సమాచారం మేరకు 77.39 శాతం పోలింగ్ నమోదైందని అదనపు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్.లియాంజెలా చెప్పారు. సవరించిన తుది ఫలితాలు బుధవారం వచ్చేసరికి పోలింగ్ శాతం 80 శాతాన్ని తాకొచ్చు. 18 మంది మహిళలు సహా మొత్తంగా 174 మంది అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. రాష్ట్రంలోని 8.57 లక్షల ఓటర్లు ఉన్నారు. సెర్చిప్ జిల్లాలో అత్యధికంగా 84.49 శాతం, ఐజ్వాల్ జిల్లాలో అత్యల్పంగా 73.09 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు 7,200 భద్రతా సిబ్బందిని నియోగించారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్కేంద్రాలను ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ఓటేయబోతే మొరాయించింది ఐజ్వాల్లోని ఒక ఈవీఎం ఏకంగా ముఖ్యమంత్రినే రెండోసారి పోలింగ్కేంద్రానికి రప్పించింది. మొదటిసారి మొరాయించడమే ఇందుకు కారణం. ర్యామ్హ్యూన్ వెంగ్లాయ్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు ఉదయాన్ని ముఖ్యమంత్రి జోరామ్థంగా విచ్చేశారు. అప్పుడే ఈవీఎం మొరాయించింది. చేసేదేం లేక ఇంటికి వెనుతిరిగారు. మళ్లీ 9.40 గంటలకు వచ్చి ఓటేశారు. ‘ ఈసారి కనీసం 25 చోట్ల గెలుస్తాం’ అని సీఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లాల్సావ్తా ఐజ్వాల్ వెస్ట్–3 నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 96 ఏళ్ల అంధుడు పూ జదావ్లా పోస్టల్ బ్యాలెట్ను కాదని స్వయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. పోలింగ్ నేపథ్యంలో మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసేశారు. రాకపోకలను ఆపేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఏకంగా 81.61 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. డిసెంబర్ మూడో తేదీన ఓట్లలెక్కింపు ఉంటుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 చోట్ల గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఉపఎన్నికల్లో మరో రెండు చోట్ల గెలిచింది. విపక్ష జెడ్పీఎం ఎనిమిది చోట్ల గెలిచింది. బీజేపీ కేవలం ఒక్క స్థానంలో, కాంగ్రెస్ ఐదు చోట్ల విజయబావుటా ఎగరేశాయి. ‘ఈసారి పట్టణప్రాంతాల్లో జెడ్పీఎం, గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎన్ఎఫ్ ఎక్కువ సీట్లు గెలవొచ్చు’ అన్న విశ్లేషణలు వినిపించాయి. -
3 రోజుల లాభాలకు బ్రేక్
ముంబై: దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడంతో స్టాక్ సూచీల 3 రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. ఆసియా, యూరప్ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించారు. ట్రేడింగ్లో 383 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరికి 16 పాయింట్ల స్వల్ప నష్టంతో 64,942 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 94 పాయింట్ల పరిధిలో కదలాడింది. ఆఖరికి ఐదు పాయింట్ల నష్టంతో 19,407 వద్ద నిలిచింది. చైనా అక్టోబర్ ఎగుమతులు భారీగా క్షీణించినట్లు డేటా వెల్లడికావడంతో ఆసియాలో ఒక్క తైవాన్ తప్ప మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు 2% నష్టపోయాయి. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన, ఇంధన షేర్ల పతనంతో యూరప్ మార్కెట్లు ఒకశాతం మేర పతనమయ్యాయి. హోనాసా కన్జూమర్ లిస్టింగ్ పర్వాలేదనిపించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.324) వద్దే లిస్టయ్యింది. చివరికి 4% లాభంతో రూ.337 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.10,848 కోట్లుగా నమోదైంది. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ చివరిరోజు నాటికి 73.15 రెట్లు సబ్స్క్రయిబ్ అ య్యింది. 5.77 కోట్ల ఈక్విటీలను జారీ చేయగా 422 కోట్ల ఈక్విటీలకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐబీ కోటా 173.52 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్ల కోటా 84.37 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 16.97 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. -
ఓటు వేయకుండానే వెనుదిరిగిన సీఎం జోరాంతంగా.. ఆ తర్వాత
ఐజ్వాల్: ఈవీఎం మొరాయించడంతో మిజోరాం సీఎం జోరాంతంగా ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి కాసేపు వేచి ఉన్న సీఎం.. అప్పటికీ ఈవీఎం పనిచేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చారు. మీడియా సమావేశం తర్వాత మళ్లీ తన ఓటు హక్కుని వినియోగించుకుంటానని స్పష్టం చేశారు. మరికాసేపటి తర్వాత మళ్లీ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు మిజోరాంలో 40 స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7:00 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్య జనం పోలింగ్లో పాల్గొన్నారు. ఐజ్వాల్ నార్త్-II అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 19-ఐజ్వాల్ వెంగ్లాయ్ పోలింగ్ స్టేషన్లో ఈరోజు ఉదయం తన ఓటు వేయడానికి సీఎం జోరాంతంగా వెళ్లారు. అదే సమయంలో ఈవీఎం మొరాయించింది. తప్పని స్థితిలో సీఎం జోరాంతంగా వెనుదిరిగారు. మీడియా సమావేశం తర్వాత మళ్లీ తన ఓటు హక్కుని వినియోగించుకుంటానని తెలిపారు. కాసేపయ్యాక మళ్లీ వచ్చి ఓటు వేశారు. రాష్ట్రంలో అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో దిగారు. మొత్తం 8.57 లక్షల ఓటర్లకుగాను 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఇదీ చదవండి: ఎన్నికల వేళ మవోయిస్టు పేలుళ్లు.. సీఆర్పీఎఫ్ జవాన్కి గాయాలు -
ఛత్తీస్ గఢ్ లో మొదలైన పోలింగ్
-
మిజోరం, ఛత్తీస్గఢ్లో పోలింగ్: ఇప్పటి వరకు ఎంత శాతమంటే?
Updates.. మిజోరం, ఛత్తీస్గఢ్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.. 11 గంటల వరకు పోలింగ్ ఇలా.. ►ఛత్తీస్గఢ్లో 22.97 శాతం పోలింగ్ ►మిజోరంలో 26.43 శాతం పోలింగ్ నమోదు 22.97% voter turnout recorded till 11 am in Chhattisgarh and 26.43% in Mizoram. #ChhattisgarhElections2023 #MizoramElection2023 pic.twitter.com/xKeNXk3etK — ANI (@ANI) November 7, 2023 ప్రజల కోసమే కాంగ్రెస్.. ►ఎన్నికల పోలింగ్ సందర్బంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ మాట్లాడుతూ.. ఐదేళ్లలో మేం చేసిన పనితో నక్సలిజం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఫలితంగా గ్రామాల్లోనే పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు.. ప్రజలు తమ గ్రామంలోనే ఓటు వేస్తారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వీటన్నింటి ప్రస్తావన ఉంది. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ఎప్పుడూ సామాన్య ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. #WATCH | Chhattisgarh Elections | CM and Congress leader Bhupesh Baghel says, "Naxalism has retreated to a great extent with the work we have done in 5 years. As a result, polling booths have been set up inside villages. People will vote in their village itself. There is a… pic.twitter.com/Lg01Hlushn — ANI (@ANI) November 7, 2023 ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్ ఇలా.. ►ఛత్తీస్గఢ్లో 9.93 శాతం ►మిజోరంలో 12.80 శాతం పోలింగ్ నమోదు 9.93% voter turnout recorded till 9 am in Chhattisgarh and 12.80% in Mizoram. #ChhattisgarhElections2023 #MizoramElection2023 pic.twitter.com/XkG5JYHGpp — ANI (@ANI) November 7, 2023 23ఏళ్ల తర్వాత పోలింగ్ ►సుక్మాలోని నక్సల్స్ ప్రభావిత కరిగుండం ప్రాంతంలో 23 ఏళ్ల తర్వాత ఓటింగ్ జరుగుతోంది. సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్, జిల్లా బలగాల భద్రతతో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. #WATCH | Chhattisgarh Elections | Sukma: Voting being held in naxal-affected Karigundam area after 23 years. The polling process is being held under the security cover by CRPF 150 Battalion and District Force. (Video Source: CRPF 150 Battalion) pic.twitter.com/pk2tfpUs86 — ANI (@ANI) November 7, 2023 ► ఛత్తీస్గఢ్లో సుక్మా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు. #WATCH | Voters stand in a queue outside a polling booth in the Sukma Assembly Constituency to cast their votes for the Chhattisgarh Assembly elections 2023. pic.twitter.com/7OVHn0cCEl — ANI (@ANI) November 7, 2023 #WATCH | Chhattisgarh elections | Voters queue up outside a polling booth in Kondagaon as they await their turn to cast a vote in the first phase of Assembly elections.#ChhattisgarhElection2023 pic.twitter.com/p699iWnbpT — ANI (@ANI) November 7, 2023 ►ఓటు వేసిన మిజోరం గవర్నర్ హరిబాబు కంభంపాటి. ఐజ్వాల్లోని సౌత్-2 పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. #WATCH | Mizoram Governor Hari Babu Kambhampati casts his vote at a polling booth in Aizawl South - II. #MizoramElections2023 pic.twitter.com/wDjBQVlLRt — ANI (@ANI) November 7, 2023 ఈ సందర్బంగా గవర్నర్ హరిబాబు కంభంపాటి మాట్లాడుతూ.. మిజోరం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం, అక్షరాస్యత శాతం చాలా ఎక్కువ. ప్రజలు కూడా తమ హక్కుల గురించి తెలుసుకుంటారు. మిజోరాం ప్రజలందరూ ఓటు వేసి ఎన్నికల్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మిజోరంలో ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంది. ఈసారి కూడా చాలా ఎక్కువ శాతం ఉంటుందని నేను భావిస్తున్నాను. #WATCH | Mizoram Governor Hari Babu Kambhampati says, "Mizoram is a literate state, literacy rate is very high. People are also aware of their rights. I appeal to all the people of Mizoram to vote and participate in the election and strengthen democracy...I think in Mizoram,… https://t.co/A4GElwDrcR pic.twitter.com/ckV4Cronb6 — ANI (@ANI) November 7, 2023 ►ఓటు వేసిన మిజోరం కాంగ్రెస్ చీఫ్ లాల్సావ్తా ఓటు వేశారు. ఐజ్వాల్లోని మిషన్ వెంగ్తలాంగ్ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | State Congress chief Lalsawta says, "...We are confident that we can form the Government...This constituency is difficult to predict but I think we will come on top...We have already considered the possibility of securing 22 seats."#MizoramElections2023 https://t.co/T2jK0jh3Ft pic.twitter.com/wX8kam8lHl — ANI (@ANI) November 7, 2023 ఛత్తీస్గఢ్లో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి కేదార్ కశ్యప్ ►ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణపూర్ బీజేపీ అభ్యర్థి కేదార్ కశ్యప్.. భాన్పురి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 212లో ఓటు వేశారు. #WATCH | BJP candidate from Narayanpur, Kedar Kashyap casts his vote for the Chhattisgarh Assembly Elections 2023 at polling booth number 212 in Bhanpuri Assembly Constituency. pic.twitter.com/cbh8FejMRI — ANI (@ANI) November 7, 2023 ►ఈ సందర్భంగా కేదార్ కశ్యప్ మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్లో బీజేపీ గెలుపు ఖాయం. కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓటు వేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. బీజేపీకి ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ►ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిజోరంలో హంగ్ వచ్చే ప్రసక్తే లేదు. ఇక్క ఎంఎన్ఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. మెజార్టీపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. మిజోరంలో మేము చాలా అభివృద్ధి పనులు చేశాం. నేను ఓటు వేసిన సందర్బంగా ఈవీఎం పనిచేయలేదు. నేను కాసేపట్లో మళ్లీ ఓటు వేస్తాను. మిజోరంలో మ్యాజిక్ ఫిగర్ 21. కానీ, 25 స్థానాల్లో మేము గెలుస్తాం. #WATCH | Mizoram elections | CM and MNF president Zoramthanga says, "In order to form the Government, 21 seats are needed. We hope that we will be able to get more than that, maybe 25 or more. I believe that we will have a comofortable majority." pic.twitter.com/PozWwno2v5 — ANI (@ANI) November 7, 2023 ►ఈ క్రమంలో ఈవీఎం మొరాయించడంతో ఆయన ఓటు వేయలేకపోయారు. #WATCH | Mizoram elections | CM and MNF president Zoramthanga could not cast a vote; he says, "Because the machine was not working. I was voting for some time. But since the machine could not work I said that I will visit my constituency and vote after the morning meet." https://t.co/ytRdh7OpKe pic.twitter.com/f8uJdUUUrL — ANI (@ANI) November 7, 2023 ►ఓటు వేసిన మిజోరం సీఎం జోరంతంగా #WATCH | Chief Minister of Mizoram Zoramthanga casts his vote for the Mizoram Assembly Elections 2023 at 19-Aizawl Venglai-I YMA Hall polling station under Aizawl North-II assembly constituency. pic.twitter.com/w3MdGFLWme — ANI (@ANI) November 7, 2023 ►మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐజ్వాల్ వెంగలై-1 ఐఎంఏ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ►మిజోరం, ఛత్తీస్గఢ్లో మొదటి దశలో పోలింగ్ ప్రారంభమైంది. Voting for Mizoram Assembly Elections 2023 begins. pic.twitter.com/qufBy3nlal — ANI (@ANI) November 7, 2023 Voting for the first phase of Chhattisgarh Assembly Elections 2023 begins. Twenty of the 90 assembly seats will be voting in the first phase of polls. Over 40 lakh electors will vote across 5,304 polling stations in the first phase. pic.twitter.com/HTHM9J39nj — ANI (@ANI) November 7, 2023 ►మిజోరం అసెంబ్లీకి నేడు జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) మధూప్ వ్యాస్ చెప్పారు. అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 8.57 లక్షల ఓటర్లకుగాను 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ►149 పోలింగ్ కేంద్రాలు మారుమూల ప్రాంతాల్లోనూ, మరో 30 కేంద్రాలు, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉన్నాయని చెప్పారు. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రంతో ఉన్న మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేశారు. వీటితోపాటు రాష్ట్రంతో ఉన్న అస్సాంలోని మూడు జిల్లాలు, మణిపూర్లోని రెండు, త్రిపురలోని ఒక జిల్లా సరిహద్దులను మూసివేశారు. భద్రతా విధుల్లో మూడు వేల మంది పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సేవలను వినియోగించుకుంటున్నారు. #WATCH | Aizawl: Preparations underway at the polling booth for the Mizoram Assembly Elections 2023 Voting for Mizoram Assembly Elections 2023 is to begin at 7 am today. (Visuals from 19-Aizawl Venglai-I YMA Hall polling station under Aizawl North-II assembly constituency.) pic.twitter.com/VPcOul2j4C — ANI (@ANI) November 7, 2023 ►ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు సిద్ధమైంది. అసెంబ్లీలోని 90 స్థానాలకు గానూ 20 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. తొలి దశలో పోలింగ్ జరుగనున్న ఈ 20 స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచిన 223 మంది అభ్యర్థుల్లో 25 మంది మహిళలున్నారు. తొలిదశలో మొత్తం 5,304 పోలింగ్ కేంద్రాల్లో 40.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. #WATCH | Rajnandgaon, Chhattisgarh: Preparations underway as voting for the first phase of #ChhattisgarhElections2023 to begin at 8 am today; visuals from Booth No - 96 Wesleyan English Medium School, Rajnandgaon. pic.twitter.com/vjMBeamlxN — ANI (@ANI) November 7, 2023 ►మొత్తం 5,304 పోలింగ్ స్టేషన్లకు గాను 25,429 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) చెప్పారు. పది నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మరో 10 నియోజకవర్గాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. మొదటి విడత పోలింగ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం బస్తర్లోని 12 నియోజకవర్గాల్లో జరగనున్నందున అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. వీరిలో 40 వేల మంది కేంద్ర సాయుధ రిజర్వు బలగా(సీఏపీఎఫ్)లున్నాయి. #WATCH | Aizawl: Preparations underway at the polling booth for the Mizoram Assembly Elections 2023 Voting for Mizoram Assembly Elections 2023 is to begin at 7 am today. (Visuals from 19-Aizawl Venglai-I YMA Hall polling station under Aizawl North-II assembly constituency.) pic.twitter.com/VPcOul2j4C — ANI (@ANI) November 7, 2023 ►తొలిదశలో బరిలో ఉన్న అభ్యర్థులలో బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్సింగ్తో పాటు ఆయన మంత్రివర్గంలో పనిచేసిన ఐదుగురు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుత కేబినెట్లోని ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీ సహా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్లు బరిలో ఉన్నారు. తొలిదశలోని 20 స్ధానాల్లో ముఖ్యంగా చిత్రకోట్, రాజ్నంద్గావ్, కవర్ధా, కొండగావ్, కొంటా, కేశ్కాల్, నారాయణ్పూర్, బిజాపూర్, అంతాగఢ్, దంతెవాడ నియోజకవర్గాలపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. #WATCH | Chhattisgarh: Preparations, mock poll underway as voting for the #ChhattisgarhElections2023 to begin at 7 am today; visuals from a polling booth in Kondagaon. pic.twitter.com/CS6QJsQmBB — ANI (@ANI) November 7, 2023 ►రాజ్నంద్గావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ మాజీ సీఎం రమణ్సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గిరీష్ దేవాంగన్ల మధ్య నెలకొంది. రాజ్నంద్గావ్ అసెంబ్లీ సీటు రమణ్ సింగ్కు బలమైన కోటగా పరిగణిస్తారు. 2008 నుంచి 2018 వరకు ఈ స్థానం నుంచి గెలుపొందారు. రమణ్సింగ్కు పోటీగా కాంగ్రెస్ సీనియర్ నేత గిరీష్ దేవాంగన్ను ఇక్కడి నుంచి పోటీకి దింపింది. చిత్రకోట్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి వినాయక్ గోపాల్ దీపక్కు సవాల్ విసిరారు. #WATCH | Chhattisgarh: Preparations, mock poll underway as voting for the first phase of #ChhattisgarhElections2023 will begin at 7 am today in Konta Assembly constituency of Sukma district. pic.twitter.com/LvoZgOttBv — ANI (@ANI) November 7, 2023 #WATCH | Chhattisgarh: Preparations, mock poll underway as voting for the first phase of #ChhattisgarhElections2023 will begin at 7 am today in Jagdalpur Assembly Constituency of Bastar district. pic.twitter.com/von3Pvi1qu — ANI (@ANI) November 7, 2023 -
మిజోరంలో నేడే పోలింగ్
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీకి నేడు జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) మధూప్ వ్యాస్ చెప్పారు. అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు చెప్పారు. మొత్తం 8.57 లక్షల ఓటర్లకుగాను 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. 149 పోలింగ్ కేంద్రాలు మారుమూల ప్రాంతాల్లోనూ, మరో 30 కేంద్రాలు, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉన్నాయని చెప్పారు. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రంతో ఉన్న మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేశారు. వీటితోపాటు రాష్ట్రంతో ఉన్న అస్సాంలోని మూడు జిల్లాలు, మణిపూర్లోని రెండు, త్రిపురలోని ఒక జిల్లా సరిహద్దులను మూసివేశారు. భద్రతా విధుల్లో మూడు వేల మంది పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సేవలను వినియోగించుకుంటున్నారు. -
ముగిసిన ప్రచారం.. అక్కడ రేపే పోలింగ్
ఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) ఈశాన్య రాష్ట్రం మిజోరం, ఛత్తీస్గఢ్లో తొలి విడతలో పోలింగ్ జరుగనుంది. మిజోరంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఛత్తీస్గఢ్లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. దీంతో, ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్లో నక్సల్ ప్రభావిత బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాలు, మరో నాలుగు ఇతర జిల్లాల్లో ఈ 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 25 మంది మహిళలతో పాటు మొత్తం 223 మంది అభ్యర్థులు తొలి విడత బరిలో ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉన్నదని సర్వేలు చెప్తున్నాయి. తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న 20 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లను కైవసం చేసుకుంది. కాగా, రెండో విడుతలో 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరుగనుంది. మరోవైపు.. మిజోరంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. మొత్తం 8.57 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించనున్నారు. ఎన్నికల్లో 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతఃరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల్లోని దాదాపు 30 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. బంగ్లాదేశ్, మయన్మార్తో సరిహద్దులు పంచుకొనే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మొత్తంగా 3 వేల మంది పోలీసు సిబ్బంది, 5,400 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించామని తెలిపారు. VIDEO | Mizoram elections 2023: EVMs being dispatched to various polling booths in Aizawl. Polling for 40 assembly constituencies will take place in Mizoram on November 7.#AssemblyElectionsWithPTI #MizoramElections2023 pic.twitter.com/Bo8CmO0o5e — Press Trust of India (@PTI_News) November 6, 2023 మూడు పార్టీల ముమ్మర ప్రచారం మిజోరంలో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), ప్రతిపక్ష కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నది. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు ఎంఎన్ఎఫ్ ముమ్మర ప్రచారం చేసింది. అటు మిజోరంలో గత రెండు పర్యాయాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్నది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించిన జెడ్పీఎం పార్టీ ఈసారి ఎన్నికల్లో కింగ్ మేకర్గా నిలిచి, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఉంది. #Chhattisgarh: Ahead of Assembly elections, polling teams leave by helicopter to #Naxal-hit areas, in Sukma The first phase of voting for #ChhattisgarhElections2023 will be held on November 7.#lokmat #lokmattimes #Elections2024 #AssemblyElection2024 #voting pic.twitter.com/yDRqGx6Xjg — Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) November 4, 2023 ఇది కూడా చదవండి: అవినీతిపరులంతా బీజేపీలోకే: కేజ్రివాల్ -
మిజోరంలో జెడ్పీఎం జోరు!
ఈశాన్యాన బుల్లి రాష్ట్రం మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఈసారి ఆసక్తికరంగా మారింది. ప్రతి రెండు ఎన్నికలకు ఓసారి అధికార పార్టీని సాగనంపడం ఇక్కడి ప్రజలకు అలవాటు. అలా కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) వంతులవారీగా అధికారంలోకి వస్తూ ఉన్నాయి. కానీ ఈసారి జోరాం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) జోరుతో పోరు ఆసక్తికరంగా మారింది. దానికి తోడు గత రెండు దశాబ్దాలుగా ఇద్దరిని మాత్రమే సీఎంలుగా చూసిన రాష్ట్రానికి ఈసారి కొత్త ముఖాన్ని ఆ పాత్రలో చూసే అవకాశం దక్కుతుందా అన్నది కూడా ఆసక్తికరమే... ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంఎన్ఎఫ్ చేసిన పోరాటం ఫలించి 1987లో మిజోరం రాష్ట్రంగా ఏర్పడి నాటి నుంచి ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ మధ్యే అధికారం చేతులు మారుతూ వస్తోంది. ఈసారి పాలక ఎంఎన్ఎఫ్కే మొగ్గుందని భావిస్తున్నా కొత్తగా తెరపైకి వచ్చిన జెడ్పీఎం కాంగ్రెస్ను తోసిరాజని రెండో ప్రధాన పక్షంగా ఆవిర్భవించే దిశగా దూసుకెళ్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పలు పార్టీల కూటమిగా తెరపైకి వచ్చిన జెడ్పీఎం ఇప్పుడు ఒకే పార్టీగా రూపుదిద్దుకుంది. పార్టీగా ఈసీ గుర్తింపు రాకపోవడంతో స్వతంత్రులుగా బరిలోకి దిగి ఏకంగా ఆరు స్థానాలు నెగ్గి కాంగ్రెస్ను మూడో స్థానంలోకి నెట్టేసింది! ఈ ఐదేళ్లలో పట్టణ ప్రాంతాల్లో పట్టు సాధించడమే గాక యువతను బాగా ఆకట్టుకుంటోంది. పార్టీ అధ్యక్షుడైన మాజీ ఐపీఎస్ అధికారి లాల్డుహోమా (73)కు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులున్నారు. మణిపూర్ హింసాకాండలో బాధితులుగా మారి రాష్ట్రం వీడిన కుకీ గిరిజనులకు ఆశ్రయం కల్పించడం తనకు బాగా కలిసొస్తుందని ఎంఎన్ఎఫ్ చీఫ్, సీఎం జోరాం తంగా లెక్కలేసుకుంటున్నారు. కానీ ఇదొక్కటే ఆ పార్టీని గట్టెక్కిస్తుందని చెప్పలేమంటున్నారు పరిశీలకులు. ఆయన హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. అంతేగాక ఉపాధి కల్పన, చెప్పుకోదగ్గ సంక్షేమ పథకాల వంటివేవీ లేకపోవడం కూడా బాగా మైనస్గా మారుతోంది. ఈ క్రమంలో ప్రజలు జెడ్పీఎం వైపు చూస్తున్నట్టు కన్పిస్తోంది. కాంగ్రెస్ పొత్తు వ్యూహం జెడ్పీఎం ముప్పును గమనించిన కాంగ్రెస్ కాస్త వ్యూహం మార్చింది. పీపుల్స్ కాన్ఫరెన్స్, జోరాం నేషనలిస్ట్ పార్టీలతో ఈసారి జట్టు కట్టింది. ఓటర్ల మనోగతాన్ని మలచడంలో కీలక పాత్ర వహించే చర్చి, మిజోరం పీపుల్స్ ఫోరం మద్దతు కోసం పార్టీలన్నీ ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నాయి. మూడు పార్టీలూ మొత్తం 40 స్థానాల్లోనూ బరిలో దిగాయి. మహిళలకు మొండిచేయి మిజోరం జనాభాలో క్రైస్తవులే మెజారిటీ. రాష్ట్రంలో పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువ కావడం మరో విశేషం! కానీ టికెట్ల కేటాయింపులో మాత్రం మహిళలకు మొండిచేయే ఎదురవుతూ వస్తోంది. మూడు పార్టీలూ కలిపి కూడా ఈసారి కేవలం ఆరుగురు మహిళలే బరిలో ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. -
ఎన్నికల బరిలో ‘మిజోరం’ కోటీశ్వరులు
మిజోరంలో 2023, నవంబరు 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్నికల బరిలోకి దిగిన మొత్తం 174 మందిలో 112 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. అభ్యర్థుల అఫిడవిట్ల ప్రకారం 64.4 శాతం మంది అభ్యర్థులు రూ. కోటి లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. సంపన్న అభ్యర్థులలో ముందుగా వినిపించే పేరు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్రూ లాల్రెంకిమా పచువా. ఆయన రూ.69 కోట్లు విలువ చేసే ఆస్తులు కలిగివున్నారు. ఆయన ఐజ్వాల్ నార్త్-III నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇతని తరువాత సెర్చిప్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్కు చెందిన ఆర్ వన్లాలత్లుంగా రూ.55.6 కోట్ల ఆస్తులు కలిగివున్నారు. చంపై నార్త్ నుంచి పోటీ చేస్తున్న జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్కు చెందిన హెచ్ గింజలాలా రూ.36.9 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. అఫిడవిట్ ప్రకారం సెర్చిప్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థి రామ్లున్-ఎడెనా అత్యంత పేద అభ్యర్థి. ఇతని దగ్గర 1500 విలువైన చరాస్తులున్నాయి. టుయిచాంగ్ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి తవాన్పుయ్ అభ్యర్థులలో అత్యధిక వయసు కలిగిన వ్యక్తి. ఆయనకు 80 ఏళ్లు. బీజేపీ అభ్యర్థి ఎఫ్ వాన్హమింగ్తంగా(31) ఎన్నికల బరిలోకి దిగిన అతి పిన్న వయస్కురాలు. ఇది కూడా చదవండి: అత్యాచార బాధితురాలిని పట్టించుకోని శివరాజ్ సర్కార్! -
రాహుల్ గాంధీ రూటే వేరు
-
మిజోరాంలో రాహుల్ పర్యటన.. మోదీ టార్గెట్గా విమర్శలు..
ఐజ్వాల్: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీసగఢ్, మిజోరాం రాష్ట్రాలకు మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్తోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ రంగంలోకి దిగి పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిన్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రకటన, సభలు, పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నాయి. బీజేపీ టార్గెట్గా విమర్శలు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో పర్యటించారు. ఈ సందర్భంగా మరో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ హింస సమస్యను లేవనెత్తుతూ కేంద్రంలోని బీజేపీ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. మణిపూర్ రాష్ట్రాన్ని బీజేపీ నాశనం చేసిందని ఆరోపించిన రాహుల్.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీకి ముఖ్యమైనది కాదేమో! ఈ మేరకు రాహుల్ మాట్లాడుతూ.. ‘కొన్ని నెలల క్రితం మణిపూర్లో పర్యటించారు. రాష్ట్ర రూపాన్ని బీజేపీ నాశనం చేసింది. మణిపూర్ ఎన్నో రోజులు ఒక రాష్ట్రంగా ఉండలేదు. రెండు విడిపోతుంది. అక్కడ ప్రజలు హత్యకు గురవుతున్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిన్నారులను చంపేస్తున్నారు. కానీ అక్కడికి(మణిపూర్) వెళ్లడం ప్రధాని మోదీకి ముఖ్యమైనదిగా కనిపించడం లేదు’ అని రాహుల్ మండిపడ్డారు. రెండు రోజుల పర్యటన రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన (సోమవారం, మంగళవారం) నిమిత్తం మిజోరాం రాజధాని ఐజ్వాల్లో ఉన్నారు. సోమవారం ఉదయం ఐజ్వాల్లోని చన్మారి జంక్షన్ నుంచి రాజ్ భవన్ వరకు (4,5 కి.మీ) పాదయాత్ర చేపట్టారు. అనంతరం గవర్నర్ నిలయం సమీపంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. నేడు సాయంత్రం విద్యార్థులతో రాహుల్ ముచ్చటించనున్నారు. మంగళవారం ఐజ్వాల్లో పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్నారు. దక్షిణ ప్రాంతంలోని లుంగ్లీ పట్టణంలో కూడా ఆయన పర్యటించి అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తరువాత లుంగ్లీ నుంచి ప్రత్యేక విమానంలో అగర్తలా మీదుగా ఢిల్లీకి బయలుదేరుతారు. అభ్యర్థుల ప్రకటన 40 స్థానాలున్న మిజోరాం అసెంబ్లీకి నవంబర్ 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు 39 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కూడా కాంగ్రెస్ నేడు విడుదల చేసింది. -
మిజోరంలో ముక్కోణం
ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ముక్కోణ పోరు నెలకొంది. పాలక మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), కాంగ్రెస్తో పాటు జోరాం పీపుల్స్ మూవ్మెంట్ ఈసారి హోరాహోరీగా తలపడుతున్నాయి... జోరాం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) రాకతో బుల్లి రాష్ట్రం మిజోరంలో పోరు ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీ మొత్తం 40 స్థానాలకూ అభ్యర్థులను బరిలో దింపింది. పార్టీ నాయకుడు లాల్దుహోమా గత ఉప ఎన్నికలో నెగ్గిన సెర్చిప్ నుంచే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే 39 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక పాలక ఎంఎన్ఎఫ్ కూడా మొత్తం సీట్లకూ అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో 15 కొత్త ముఖాలున్నాయి. ఇద్దరు మహిళలకు కూడా అవకాశం దక్కింది. సీఎం, ఎంఎన్ఎఫ్ అధ్యక్షుడు జోరాంతంగా ఐజ్వాల్ ఈస్ట్–1 నుంచే బరిలో దిగుతున్నారు. ఇక ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జెడ్పీఎం జోరు...! మిజోరం జనాభా కేవలం 11 లక్షలు. దశాబ్దాల తరబడి సాగిన చొరబాట్ల సమస్య అనంతరం 1987లో రాష్ట్రంగా ఏర్పడింది. నాటినుంచీ ప్రతి రెండుసార్లకు ఒకసారి చొప్పున అధికారం ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ మధ్య చేతులు మారుతోంది. ఈసారి మాత్రం పాలక ఎంఎన్ఎఫ్కే కాస్త మొగ్గుందని పరిశీలకులు భావిస్తున్నారు. కానీ జెడ్పీఎం గట్టి పోటీ ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారే ఆస్కారం కూడా లేకపోలేదని చెబుతున్నారు. సరిగ్గా 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరేడు పార్టీల కూటమిగా పుట్టుకొచ్చిన జెడ్పీఎం ఆ తర్వాత ఒకే పార్టీగా రూపుమార్చుకుంది. పట్టణ ప్రాంతాల్లో చూస్తుండగానే పట్టు సాధించింది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా సత్తా చాటాలని భావిస్తోంది. మిజోరం జనాభాలో క్రైస్తవులే మెజారిటీ. వారి మనోగతంతో పాటు మయన్మార్ శరణార్థుల అంశం కూడా ఈసారి నిర్ణాయకంగా మారవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడవుతాయి. 2018లో ఇలా... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఎన్ఎఫ్ అన్ని స్థానాల్లోనూ పోటీ చేయగా బీజేపీ 39 స్థానాల్లో బరిలో దిగింది. ఎంఎన్ఎఫ్ 26, కాంగ్రెస్ 5 సీట్లు గెలవగా బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులుగా బరిలో దిగిన జెడ్పీఎం అభ్యర్థులు ఎనిమిది సీట్లలో నెగ్గారు. కేంద్రంలోని పాలక ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎంఎన్ఎఫ్ మిజోరంలో బీజేపీతో జట్టు కట్టకుండా విడిగానే పోటీ చేసింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
మణిపూర్లో వలసదారుల జల్లెడ కార్యక్రమం పొడిగింపు
ఇంఫాల్: మణిపూర్లో అల్లర్లు తగ్గుముఖం పట్టి అక్కడ పరిస్తితి ఇప్పుడిప్పుడే యధాస్థితికి చేరుకుంటోంది. అంతకుముందు మయన్మార్ నుంచి ఇక్కడికి వలస వచ్చినవారిని లెక్కించాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని గడువు సెప్టెంబర్ 30తో ముగియనుండటంతో కేంద్రం ఆ గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించింది. మణిపూర్ అల్లర్లకు మయన్మార్ నుంచి వలస వచ్చిన వారు కూడా కారణమై ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బయోమెట్రిక్ ఆధారంగా మయన్మార్ వాసులను లెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్ర హోంశాఖ.మణిపూర్తో పాటు మిజోరాంలో కూడా ఈ వలసదారులను లెక్కించమని కోరిన మిజోరాం దానిని తిరస్కరించింది. అలా చేస్తే అక్కడి వారిపై వివక్ష చూపించినట్లవుతుందని మిజోరాం అభిప్రాయపడింది. మే 29న కేంద్ర హోంశాఖ అక్రమ వలసదారులను బయోమెట్రిక్ ఆధారంగా గుర్తించాలని సెప్టెంబర్ 30 లోపే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. హోంశాఖ జాయింట్ సెక్రటరీ అంతకుముందు తెలిపిన వివరాల ప్రకారం మయన్మార్ వాసులు సాధారణంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తుంటారని అందుకే వారి గణన చేపట్టామన్నారు. ఎన్సీఆర్బీ(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) వారిచే శిక్షణ తీసుకున్న ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి కూడా అల్లర్లకు మయన్మార్ వాసులే కారణమని ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. మయన్మార్ వలసదారులు ఎక్కువగా అడవులను కొట్టి, గసగసాల సాగు, గంజాయి సాగుకి పాల్పడుతూ ఉంటారని సీఎం బైరెన్ సింగ్ ప్రకటించారు. ఇది కూడా చదవండి: సీబీఐ క్లీన్చిట్ ఇస్తే రాజీనామా చేస్తారా? కేజ్రీవాల్ సవాల్! -
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఫార్ములా ఇదే..
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ ఐదు రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించే పనిలో పడింది. స్థానిక నాయకత్వం.. ఇదే ఏడాది కర్ణాటక ఎన్నికల్లోనూ తర్వాత జరిగిన ఉపఎన్నికలలోనూ బీజేపీ వెనుకబడటంతో ఈ విడత ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని నిర్ణయించుకుంది. బీజేపీ పార్టీ ప్రధానంగా 'మోదీ నాయకత్వాన్ని' నమ్ముకోగా రెండో అంశంగా ఆయా రాష్ట్రాల్లో 'పార్టీ సమిష్టి నాయకత్వానికి' పెద్దపీట వేయనుంది. హిందీ భాషా ప్రాబల్యమున్న రాష్ట్రాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ప్రాధాన్యతనివ్వకుండా నాయకుల మధ్య సమన్వయం కుదర్చడానికే ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వాన్ని బలపరచాలన్న యోచనలో ఉంది పార్టీ అధిష్టానం. నో వారసత్వం.. ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ఎలాంటి ప్రస్తావన చేయకుండా ఉంటే స్థానిక నాయకులకు తమ అభ్యర్థిత్వాన్ని బలపరచుకునే అవకాశం కల్పించినట్లు ఉంటుందన్నది అధిష్టానంని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అదే విధంగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తోన్న ప్రధాని తమ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టే యోచనలో ఉన్నారు. ప్రస్తుత సంచరం ప్రకారం బీజేపీ ఒక కుటుంబం నుంచి ఒకే టికెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్.. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్ ప్రాధాన్యతను తగ్గించడమే కాకుండా ఇప్పటివరకు ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనికి తోడు నలుగురు ఎంపీలు, ముగ్గురు కేంద్ర మంత్రులతో పాటు జాతీయ జనరల్ సెక్రెటరీ విజయ్ వర్గియా కూడా ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. శివరాజ్ సింగ్ భవితవ్యంపై ఎలాంటి సూచనలు లేని కారణంగా వీరిలో ఎవరినైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్.. బీజేపీ అదే ఫార్ములాను రాజస్థాన్లో కూడా అమలు చేయాలని చూస్తోంది. ఇక్కడైతే బీజేపీ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్ధికి కొదవే లేదు. గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘవాల్, కిరోడీ లాల్ మీనా, దియా కుమార్, రాజ్యవర్ధన్ రాథోడ్, సుఖవీర్ సింగ్, జౌన్పురియాలతో పాటు సింధియా రాజ కుటుంబీకురాలు వసుంధరా రాజే కూడా ఉండనే ఉన్నారు. వీరిలో కూడా అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండా బీజేపీ ఎన్నికలకు వెళ్లాలన్నది పార్టీ యోచన. ఛత్తీస్గడ్.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఛత్తీస్గడ్లో బీజేపీ కాస్త భిన్నమైన ప్రణాలికను అమలు చేయనుంది. ఇప్పటికే ఆ పార్టీ అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్ మేనల్లుడు విజయ్ బాఘేల్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కుటుంబ వైరం ద్వారా లబ్దిపొంది పార్టీని బలోపేతం చేయాలన్నది బీజేపీ అధిష్టానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. విజయ్ ఈసారి ఎన్నికల్లో పఠాన్ జిల్లాలోని దుర్గ్ నుంచి పోటీ చేయనున్నారు. 2003 నుంచి భూపేష్, విజయ్ల మధ్య ఈ స్థానంలో ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. వీరితోపాటు కేంద్రమంత్రి రేణుకా సింగ్, రాజ్యసభ ఎంపీ సరోజ్ పాండే తోపాటు మాజీ ముఖ్యమంత్రి రామం సింగ్ కూడా ఉన్నప్పటికీ బాఘేల్ కుటుంబానికే ప్రాధాన్యతనిచ్చింది బీజీపీ అధిష్టానం. తెలంగాణ.. ఇప్పటివరకు దక్షిణాదిన ఖాతా తెరవని బీజేపీకి ఈసారి కొద్దోగొప్పో ఊరటనిచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. మిషన్ సౌత్లో భాగంగా ఇక్కడ కూడా సీఎం అభ్యర్థిత్వానికి నాయకుల మధ్య పోరే కొలమానం కానుంది. ఇక్కడ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, మరో ఎంపీ ధర్మపురి అరవింద్, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ లలో ఎవరైనా సీఎం కావచ్చు. అభ్యర్థిని మాత్రం ముందు ప్రకటించకుండా ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం సమిష్టిగా పనిచేయాలని సూచించింది. మిజోరాం.. ఇక బీజేపీకి ఈ ఎన్నికల్లో క్లిష్టతరమైన రాష్ట్రం మిజోరాం. ఈ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రమైన మణిపూర్లో జరిగిన అల్లర్లు ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయండంలో సందేహంలేదు. దీంతో బీజేపీ ఇక్కడ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరముంది. వారి ప్రధాన అజెండా 'మోదీ నాయకత్వం' 'స్థానిక సమిష్టి నాయకత్వం' రెండూ ఇక్కడ పనిచేయకపోవచ్చు. ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక -
Women : ఆడబిడ్డల ఆంధ్రా!
సాక్షి, అమరావతి: దేశంలో, రాష్ట్రంలో జననాల్లో బాలికల సంఖ్య పెరుగుతోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 2022–23లో బాలికల నిష్పత్తి 15కు పెరగ్గా, రాష్ట్రంలో 24కు పెరిగింది. దేశం మొత్తంతోపాటు చాలా రాష్ట్రాల్లో గతంలో కన్నా జననాల్లో బాలికల నిష్పత్తి పెరుగుతోందని, ఇది శుభపరిణామమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే బిహార్తో పాటు మిజోరాం, నాగాలాండ్లలో గతం కన్నా బాలికల నిష్పత్తి తగ్గడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. బేటీ బచావో బేటీ పఢావో పథకం ద్వారా బాలికలు, మహిళా సాధికారతకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం కింద జనన సమయంలో లింగ నిర్ధారణను గుర్తించే చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేసిందని, ఆడపిల్లల జననాల పట్ల అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టిందని తెలిపింది. ఆడపిల్లల అభివృద్ధికి ప్రోత్సాహం ఆడపిల్లల విద్య, పెరుగుదల, అభివృద్ధి, హక్కులకు మద్దతుగా సానుకూల చర్యలను ప్రోత్సహించడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకాలతో కూడిన కార్యాచరణ క్యాలెండర్ జారీ అయినట్లు తెలిపింది. దానిని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. లింగ నిష్పత్తి తగ్గకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు తెలిపింది. -
‘మిజోరం’ ప్రమాదం.. 22కు చేరిన మృతులు
ఐజ్వాల్: మిజోరంలోని ఐజ్వాల్లో బుధవారం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం సాయంత్రం వరకు మొత్తం 22 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. జాడ తెలియకుండా పోయిన మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. అతడు ప్రాణాలతో ఉండే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. క్షతగాత్రులైన ముగ్గురిలో ఇద్దరిని ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. బాధితులైన మొత్తం 26 మందీ పశి్చమ బెంగాల్లోని మాల్డా జిల్లాకు చెందిన వారే. -
బ్రిడ్జి కింద నలిగిన బతుకులు
కోల్కతా/ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో బుధవారం ఘోరం జరిగింది. ఐజ్వాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 100 మీటర్ల పొడవైన రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. నిర్మాణ పనుల్లో ఉన్న కారి్మకుల్లో కనీసం 18 మంది ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇంకా కనీసం ఐదుగురి జాడ తెలియాల్సి ఉంది. మృతుల్లో అత్యధికులు పశి్చమ బెంగాల్కు చెందిన వారే. ప్రమాద ప్రాంతం సైరంగ్ ఐజ్వాల్కు 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. కురింగ్ నది మీద నిర్మిస్తున్న బ్రిడ్జి పైకి చేర్చే క్రమంలో గాంట్రీ కుప్పకూలడమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 16 మృతదేహాలను వెలికితీశారు. సహాయ, తరలింపు తదితర చర్యల్లో మిజోరం అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాల్సిందిగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. మృతుల కుటుంబాల్లోని అర్హులకు రైల్వే శాఖ పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. Under construction railway over bridge at Sairang, near Aizawl collapsed today; atleast 17 workers died: Rescue under progress. Deeply saddened and affected by this tragedy. I extend my deepest condolences to all the bereaved families and wishing a speedy recovery to the… pic.twitter.com/IbmjtHSPT7 — Zoramthanga (@ZoramthangaCM) August 23, 2023 ఇది కూడా చదవండి: Live Updates: చందమామను ముద్దాడే క్షణం కోసం.. చరిత్రకు అడుగు దూరంలో చంద్రయాన్–3 -
ఏడుపదుల వయసులో స్కూల్కి..అది కూడా 3 కిలోమీటర్లు..
చదువుకోవాలన్న తప్పన, జిజ్ఞాస ఉండేలా కాని చదువుకోవడానికి ఏ వయసు అయితే ఏంటి?. చదువుకోవాల్సిన టైంలో ఏవో కారణాల రీత్యా చదువుకోలేకపోవచ్చు. అవకాశం దొరికితే వదులుకోకుండా ఆ కోరిక నెరవేర్చుకోవచ్చు అని నిరూపించాడు ఓ వృద్ధుడు. వివరాల్లోకెళ్తే..మిజోరాంకు చెందిన లాల్రింగ్థరా అనే 78 ఏళ్ల వృద్ధుడు హైస్కూల్లో చేరి ఔరా అనిపించాడు. ఆ వయసులో కాలినడకన స్కూల్కి వెళ్లి మరీ చదువుకుంటున్నాడు. చదువుకి వయసు అడ్డంకి కాదు అని చేసి చూపించి ఆశ్చర్యపరిచాడు. ఆ వృద్ధుడు 1945లో ఇండో మయన్మార్ సరిహద్దు సమీపంలోని ఖువాంగ్లెంగ్ గ్రామంలో జన్మించాడు. రెండొవ తరగతి వరకే చదువుకున్నాడు. తండ్రి మరణంతో చదువుకు దూరమయ్యాడు. తన తల్లికి అతడు ఒక్కడే సంతానం కావడంతో తల్లికి చేదోడుగా పొలం పనులకు వెళ్తుండేవాడు. బతుకు పోరాటం కోసం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తూ..అలా న్యూహ్రుయికాన్ గ్రామంలో స్థిరపడ్డాడు. బాల్యం అంతా కటిక పేదరికంలోనే మగ్గిపోయింది. దీంతో లాల్రింగ్థరా చదువు అనేది అందని ద్రాక్షలా అయిపోయంది. ఇప్పుడు అతను ఓ చర్చిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతనిలో చదువుకోవాలనే కోరిక మాత్రం చావలేదు. అందువల్లే ఇక ఇప్పుడైన తన కోరిక తీర్చుకోవాలనే కృత నిశ్చయానికి వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఈ మేరకు లాల్రింగ్థరా మాట్లాడుతూ..తనకు చదవడం, రాయడంలో ఇబ్బంది లేదని, ఆంగ్లభాషలోని సాహిత్య పదాలు మాత్రం అర్థమయ్యేవి కావంటున్నాడు. ఎలాగైనా తన ఆంగ్ల భాషను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతోనే స్కూల్లో జాయిన్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు లాల్రింగ్థరా. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా అతను మా టీచర్ల బృందానికి, విద్యార్థులకు ఆదర్శమైన వ్యక్తి అని, అదే సమయంలో అతనికి నేర్పడం అనేది మాకు ఒక సవాలు కూడా అని అన్నారు. అతనికి తాము అన్ని విధాల మద్దతు ఇవ్వడమేగాక చదువుకోవడంలో తగిన సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. (చదవండి: ఇదేం విచిత్రం! ఆవు పాము రెండు అలా..) -
Manipur violence: మొయితీల వలసబాట
గువాహటి/కోల్కతా: కల్లోల మణిపూర్లో తెగల మధ్య రాజుకున్న మంటలు ఆరడం లేదు. బాధితులు ప్రాణభయంతో రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నారు. సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ పొరుగు రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. సొంత రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడేదాకా మరోచోట తలదాచుకోవడమే మేలని భావిస్తున్నారు. ఇద్దరు గిరిజన మహిళలను దిగంబరంగా ఊరేగించిన ఘటన బయటపడిన తర్వాత మొయితీ తెగ ప్రజల్లో భయాందోళన మరింత పెరిగిపోయింది. ఇప్పటికే మిజోరాంలో ఉంటున్న మణిపూర్ మొయితీల్లో ప్రాణ భయం మొదలైంది. మాజీ మిలిటెంట్ గ్రూప్ నుంచి బెదిరింపులు రావడమే ఇందుకు కారణం. 41 మంది మెయితీలు శనివారం రాత్రి మిజోరాం నుంచి అస్సాంలోని సిల్చార్కు చేరుకున్నారు. వారికి బిన్నాకండీ ఏరియాలోని లఖీపూర్ డెవలప్మెంట్ బ్లాక్ కార్యాలయ భవనంలో ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా ఆర్థికంగా మెరుగైన స్థానంలో ఉన్నవారేనని, సొంత వాహనాల్లో అస్సాం దాకా వచ్చారని పేర్కొన్నారు. ఈ 41 మంది మొయితీల్లో కాలేజీ ప్రొఫెసర్లు, ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఉన్నారని తెలియజేశారు. మిజోరంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని వారు చెప్పారని వివరించారు. అయినప్పటికీ అక్కడ రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక అస్సాంకు వచ్చామంటూ తమతో పేర్కొన్నారని వెల్లడించారు. బాధితులకు పూర్తి రక్షణ కలి్పస్తున్నట్లు అస్సాం పోలీసులు ఉద్ఘాటించారు. వదంతులు నమ్మొద్దు: మిజోరాం ప్రభుత్వం మణిపూర్లో మే 3వ తేదీ నుంచి ఘర్షణలు ఉధృతమయ్యాయి. ఇప్పటిదాకా వేలాది మంది మొయితీలతోపాటు గిరిజన తెగలైన కుకీలు, హమర్ ప్రజలు వలసబాట పట్టారు. వీరిలో చాలామంది అస్సాంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలా ఉండగా, వెంటనే రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలంటూ మిజోరంలో తలదాచుకుంటున్న మణిపూర్ మొయితీలకు మాజీ తీవ్రవాద గ్రూపు నుంచి బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ మాజీ మిలిటెంట్ గ్రూప్నకు కుకీ అనుకూల వర్గంగా పేరుంది. తమ రాష్ట్రంలో ఉంటున్న బాధితులకు పూర్తిస్థాయిలో రక్షణ కలి్పస్తున్నామని, వదంతులు నమ్మొద్దని మిజోరం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బెదిరింపులు తట్టుకోలేక కొందరు మొయితీలు మిజోరం నుంచి సొంత రాష్ట్రం మణిపూర్కు వెళ్లిపోయినట్లు తెలిసింది. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4న చోటుచేసుకుంది. మే 15న ఇంఫాల్లో 18 ఏళ్ల బాలికలపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట ఆరోపించింది. -
ఎగిరొచ్చిన కొత్త జాతి జీవి.. ఎక్కడో తెలుసా!
ఐజ్వాల్: అత్యల్పదూరం ఎగిరే బల్లి జాతి బుల్లి జీవిని శాస్త్రవేత్తలు భారత్లో తొలిసారిగా మిజోరంలో గుర్తించారు. చెట్లపై జీవించే దీనికి గెక్కో మిజోరమెన్సిస్ అని పేరు పెట్టారు. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఒక్క ఉదుటున దూకడం దీని ప్రత్యేకత. 20 సెం.మీ. పొడవుండే ఈ జీవికి గెంతేందుకు అనువుగా తోక చివరి భాగం పైకి వంగి ఉంది. ‘వీటి డీఎన్ఏ 21 శాతం వేరుగా ఉంది. ఇది నిజంగా కొత్త జాతి’ అని మిజోరం వర్సిటీ, జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలజీ పరిశోధకులు తెలిపారు. మిజోరం ప్రజలు వీటిని అత్యంత ఖరీదైనవిగా భావించి వేటాడుతున్నారట. మిజోరాం అడవుల్లో కనుగొన్న కొత్త రకం ఎగిరే బల్లులు, గెక్కో పొపాయెన్సిస్కు దగ్గరి పోలికలున్నాయట. ప్రపంచంలో గెకో జెనస్ కు చెందిన 13 జాతులకు చెందిన బల్లులున్నాయి. వాటిలో చాలా రకాలు దక్షిణాసియాలో కనిపిస్తాయి. చదవండి: ఆర్బీఐ కంటైనర్లో రూ.1000 కోట్ల నగదు.. భారీ భద్రత, హఠాత్తుగా ఆగిపోయిన వాహనం -
ఆ హీట్ స్ట్రోక్ హీట్ మాములుగా లేదు! దెబ్బకు బహిరంగ కార్యక్రమాలు..
మహారాష్ట్రలోని అవార్డుల కార్యక్రమంలో వడదెబ్బతో సుమారు 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన చర్చనీయాంశంగా మారడమే గాక సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి కూడా. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఎండలు తగ్గేవరకు మధ్యాహ్నం నుంచి సాయంత్ర 5 గంటల వరకు ఎలాంటి బహిరంగ కార్యక్రమాలను నిర్వహించకూడదని నిషేధించింది. వాస్తవానికి నాడు బహిరంగ మైదానంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భూషణ్ అవార్డుల కార్యక్రమానికి లక్షలాదిమంది హాజరయ్యారు. ఆ సమావేశం మండే ఎండలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ రోజు ఆ సమావేశం జరిగనప్పుడూ గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఈ కార్యక్రమానిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే రూ. 5 లక్షల పరిహారం కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక పై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. షిండే ప్రభుత్వంపై నరహత్య కేసు నమోదు చేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ డిమాండ్ చేశారు. ఇది ప్రకృతి వైపరిత్యం కాదని, మానవ నిర్మిత విపత్తు అని విమర్శులు గుప్పించారు. దీనికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని పవార్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు అధిక పరిహారం ఇవ్వాలని కూడా పవార్ డిమాండ్ చేశారు. (చదవండి: దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏంటో తెలుసా?) -
దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏంటో తెలుసా?
భారతదేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరాం నిలిచింది. ఈ మేరకు గురుగ్రామ్లోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ స్ట్రాటజీ ప్రొఫెసర్ రాజేష్ కె పిలానియా అధ్యయనం ప్రకారం దీన్ని ప్రకటించారు. నివేదిక ప్రకారం.. 100 శాతం అక్షరాస్యత సాధించడంలో భారతదేశంలోని మిజోరాం రాష్ట్రం రెండో స్థానం దక్కించుకుంది. అంతేగాదు ఇక్కడ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా విద్యార్థులు అభివృద్ధి చెందేలా పుష్కలమైన అవకాశాలను అందిస్తోంది. ఈ ఆనంద సూచికను కుటుంబ సంబంధాలు, పని సంబంధిత సమస్యలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, మతం, ఆనందం, కోవిడ్-19 ప్రభావం, శారీరక మానసిక ఆరోగ్యంతో సహా ఆరు పారామితుల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. మిజోరాంలో ఐజ్వాల్లోని ప్రభుత్వ మిజో హైస్కూల్(జీహెచ్ఎంస్) విద్యార్థి..తన తండ్రి చిన్నతనంలో కుటుంబాన్ని విడిచిపెట్టడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అతను చదువులో రాణించడం విశేషం. అదేవిధంగా జీఎంహెచ్ఎస్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థి నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో చేరాలని ఆకాంక్షిస్తున్నాడు. అతని తండ్రి పాల ఫ్యాక్టరీలో పని చేస్తాడు, అతని తల్లి గృహిణి. ఆ ఇద్దరూ విద్యార్థులు తమ పాఠశాల కారణంగా తమ లక్ష్యాన్ని చేరుకుంటామనే భావంతో ఉన్నారు. అంతేగాదు మా ఉపాధ్యాయులు మాకు మంచి స్నేహితులు మేము వారితో ఏ విషయాన్నేనా పంచుకోవడానికి సందేహించం, భయపడం అని మరో విద్యార్థి చెప్పాడు. మిజోరాంలో అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో వారు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి క్రమం తప్పకుండా బేటీ అవుతారని తెలిసింది. పైగా అక్కడ చదువుల కోసం తల్లిదండ్రలు ఒత్తిడి చాలా తక్కువ. ప్రతి బిడ్డ లింగ భేదం లేకుండా ముందుగా సంపాదించడం ప్రారంభిస్తారని నివేదిక పేర్కొంది. అక్కడ ప్రజలు ఏ పనిని చిన్నదిగా భావించరు. యువకులు సాధారణంగా 16 లేదా 17 ఏళ్ల వయసు నుంచి ఉపాధి వెతుక్కుంటారు. దీంతోపాటు బాలికలు, అబ్బాయిలు అనే వివక్ష ఉండదని నివేదిక పేర్కొంది. ఇలా అనే అంశాల్లో సానూకూలత కనిపించడంతో మిజోరాం అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా నిలిచింది. (చదవండి: అది సరికాదు.. సాయిబాబా కేసును మరోసారి విచారించండి: సుప్రీం కోర్టు) -
షాకింగ్.. సబ్బు పెట్టెల్లో హెరాయిన్.. రూ.12 కోట్ల డ్రగ్స్ సీజ్..
ఐజ్వాల్: మిజోరాంలో డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. పోలీసులు, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఐజ్వాల్లో రెండు చోట్ల మత్తుపదార్థాలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం నలుగురు డ్రగ్ పెడ్లర్స్ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక చోట 98,000 డ్రగ్స్ మాత్రలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.9.8 కోట్లు ఉంటుందని తెలిపారు. మరో ఘటనలో శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. 40 సబ్బుపెట్టెల్లో హెరాయిన్ను గుర్తించారు అధికారులు. దీని విలువ రూ.2.5కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు.. వీడియో వైరల్.. -
డబుల్ సెంచరీతో విరుచుకుపడిన కోహ్లి
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో మిజోరం కెప్టెన్ తరువార్ కోహ్లి ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బంతితో (4/2) మాయ చేసిన కోహ్లి.. ఆ తర్వాత బ్యాటింగ్లో ఏకంగా డబుల్ సెంచరీతో (297 బంతుల్లో 203; 30 ఫోర్లు, సిక్స్) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్.. కోహ్లి, రాల్టే (4/21), నవీన్ (1/22), అవినాశ్ యాదవ్ (1/17) ధాటికి 304 ఓవర్లలో 63 పరుగులకే కుప్పకూలింది. ఏపీ ఇన్నింగ్స్లో ఐదుగురు డకౌట్ కాగా.. కుమార్ న్యోంపు (24), కమ్షా (17), నబమ్ అబొ (10) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మిజోరం.. తరువార్ కోహ్లి, గోస్వామి (50) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 338 పరుగులకు ఆలౌటైంది. మిజోరం ఇన్నింగ్స్లో కోహ్లి, గోస్వామి, ఆండర్సన్ (28) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. అరుణాచల్ బౌలర్లలో నబమ్ అబొ 4, యబ్ నియా 3, అఖిలేశ్ సహాని 2, చేతన్ ఆనంద్ ఓ వికెట్ పడగొట్టారు. మిజోరం తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 275 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్.. రెండో రోజు మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 77 పరుగులు (23 ఓవర్లలో) చేసింది. టెకీ నెరీ (27) ఔట్ కాగా.. కుమార్ న్యోంపు (31), కెప్టెన్ సూరజ్ తయమ్ (18) క్రీజ్లో ఉన్నారు. టెకీ నెరీ వికెట్ అవినాశ్ యాదవ్కు దక్కింది. ప్రస్తుతానికి అరుణాచల్ ప్రదేశ్ ఇంకా 198 పరుగుల వెనకంజలో ఉంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మిజోరం కెప్టెన్ తరువార్ కోహ్లి.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఇద్దరూ మంచి మిత్రులు, 2008లో భారత్ అండర్-19 వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యులు అన్న విషయం చాలామందికి తెలీదు. నాటి ప్రపంచకప్లో విరాట్తో (235) సమానంగా పరుగులు చేసిన తరువార్ (218, 3 వరుస హాఫ్ సెంచరీలు).. ఆతర్వాత నిలకడలేమి కారణంగా జాతీయ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. మరోవైపు విరాట్ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ క్రికెట్ చరిత్రలోనే మేటి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోగా.. మీడియం ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన తరువార్.. సొంత రాష్ట్రమైన పంజాబ్ తరఫున సరైన అవకాశాలు రాక మిజోరంకు వలస వెళ్లి కెరీర్ను కొనసాగిస్తున్నాడు. కాగా, టాలెంట్ పరంగా చూస్తే విరాట్కు తరువార్ ఏమాత్రం తీసిపోడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. -
రాళ్ల క్వారీలో కూలిన బతుకులు
ఐజ్వాల్: మిజోరాంలో ఘోర ప్రమాదం జరిగింది. రాళ్ల క్వారీ కుప్పకూలిన ఘటనలో.. కడపటి వార్తలు అందేసరికి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాళ్ల కింద చిక్కుకున్న మరికొందరు కూలీల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నయ్థియాల్ జిల్లాలోని మౌదర్హ్ అనే గ్రామంలో ఏబీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రాళ్ల క్వారీలో ప్రమాదం జరిగింది. ఈ క్వారీలో రెండున్నర ఏళ్లుగా పనులు జరుగుతున్నాయి. మృతులంతా బీహారీ కూలీలని అధికారులు ప్రకటించారు. మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయ్యింది. సోమవారమే ఈ రాళ్ల క్వారీ కూలిపోయింది. కార్మికులు మధ్యాహ్న భోజన అనంతరం పనుల్లో మునిగిపోగా.. ఈ ప్రమాదం జరిగింది. కూలీలలో 12 మందితో పాటు హిటాచి డ్రైవర్లు క్వారీ లోపల చిక్కుకుపోయినట్లు సమాచారం. వాళ్లను కాపాడేందుకు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వలంటీర్లు తరలివచ్చారు. రాష్ట్ర విపత్తు నివారణ బృందాలతో పాటు సరిహద్దు భద్రతా దళాలు, అస్సాం రైఫిల్స్ రెస్య్యూ ఆపరేషన్ చేపట్టాయి. -
కుమార్తె చేసిన పనికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణలు
ఐజ్వాల్: ముఖ్యమంత్రి కుమార్తె అంటే ఆ హోదానే వేరు. ఎక్కడికెళ్లినా సాదరంగా ఆహ్వానిస్తారు. ఆమె ఆదేశిస్తే చిటికేలో పని పూర్తవుతుంది. ఆమెకు కోపం వచ్చేలా ఎవరూ మసులుకోవాలనుకోరు. అలాంటిది ఓ డాక్టర్.. మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా కుమార్తె ఆదేశాలను ధిక్కరించాడు. దీంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. డాక్టర్పై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా క్షమాపణలు చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే? మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా కుమార్తె మిలారి చాంగ్టే.. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్లోని ఓ డెర్మటాలజిస్ట్ వద్దకు గత బుధవారం వైద్య పరీక్షల కోసం వెళ్లారు. అయితే, అపాయింట్మెంట్ లేకుండా పరీక్షించేది లేదని ఆ డాక్టర్ తేల్చి చెప్పాడు. క్లినిక్ మూసివేసే లోపు అపాయింట్మెంట్ తీసుకోవాలని మిలారి చాంగ్టేకు సూచించాడు. ఈ విషయం ఆమెకు కోపం తెప్పిచింది. నన్నే అపాయింట్మెంట్ తీసుకోమంటావా అని డాక్టర్పై దాడి చేశారు మిలారి. అక్కడున్న వారు ఆపేందుకు ప్రయత్నించినా డాక్టర్ ముఖంపై దాడి చేశారు. ఈ దృశ్యాలు వైరల్గా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. మరోవైపు.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మిజోరాం విభాగం వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి శనివారం ఆందోళనకు దిగారు. దీంతో దిగొచ్చిన ముఖ్యమంత్రి జోరంతంగా.. తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా బహిరంగ క్షమాపణలు కోరారు. తాను స్వయంగా రాసిన క్షమాపణ పత్రాన్ని పోస్ట్ చేశారు. తన కుమార్తె అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నట్లు చెప్పారు. Video: Mizoram Chief Minister's @ZoramthangaCM Daughter Hits Doctor, Father Says Sorry @SupriyaShrinate @Ashok_Kashmir pic.twitter.com/5f0EJ2RshZ — Danish Chaudhary (@LaBelleDame7) August 21, 2022 ఇదీ చదవండి: రోజువారీ కూలీకి రూ.37 లక్షల ఆదాయ పన్ను నోటీసులు -
Commonwealth Games 2022: జెరెమీ జయహో...
అంచనాలను నిజం చేస్తూ భారత వెయిట్లిఫ్టర్లు కామన్వెల్త్ గేమ్స్లో తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. పోటీల మూడో రోజు ఆదివారం భారత్కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించింది. అంతర్జాతీయ జూనియర్ స్థాయిలో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న మిజోరం టీనేజర్ జెరెమీ లాల్రినుంగా సీనియర్ స్థాయిలో పసిడి పతకంతో అరంగేట్రం చేయగా... మణిపూర్ మహిళా లిఫ్టర్ బింద్యారాణి దేవి సొరోఖైబమ్ రజత పతకంతో మెరిసింది. ఫలితంగా బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్లిఫ్టర్లు నెగ్గిన ఐదు పతకాలతో పతకాల పట్టికలో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. బర్మింగ్హామ్: ఏ లక్ష్యంతోనైతే భారత టీనేజ్ వెయిట్లిఫ్టర్ జెరెమీ లాల్రినుంగా బర్మింగ్హామ్లో అడుగుపెట్టాడో దానిని సాధించాడు. మూడు నెలల క్రితం కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకం నమూనా ఫొటోను తన ఫోన్ వాల్ పేపర్గా పెట్టుకున్న 19 ఏళ్ల జెరెమీ ఇప్పుడు నిజమైన పసిడి పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల వెయిట్లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్రినుంగా విజేతగా నిలిచాడు. స్నాచ్లో 140 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 160 కేజీలు బరువెత్తి ఓవరాల్గా 300 కేజీలతో జెరెమీ చాంపియన్గా అవతరించాడు. స్నాచ్లో, ఓవరాల్ టోటల్లో జెరెమీ రెండు కామన్వెల్త్ గేమ్స్ కొత్త రికార్డులు సృష్టించాడు. వైపావా లోన్ (సమోవా; 127+166=293 కేజీలు) రజతం... ఎడిడియోంగ్ యుమోఫియా (నైజీరియా; 130+160=290 కేజీలు) కాంస్యం సాధించారు. స్నాచ్ ఈవెంట్లో జెరెమీ తొలి ప్రయత్నంలో 136 కేజీలు, రెండో ప్రయత్నంలో 140 కేజీలు ఎత్తాడు. మూడో ప్రయత్నంలో 143 కేజీలకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక క్లీన్ అండ్ జెర్క్లో తొలి ప్రయత్నంలో 154 కేజీలు, రెండో ప్రయత్నంలో 160 కేజీలు ఎత్తిని జెరెమీ మూడో ప్రయత్నంలో 165 కేజీలకు ప్రయత్నించి తడబడ్డాడు. మూడో ప్రయత్నంలో జెరెమీ తొడ కండరాలు పట్టేశాయి. దాంతో అతను వెయిట్బార్ను వదిలేశాడు. సమోవా లిఫ్టర్ వైపావా క్లీన్ అండ్ జెర్క్లో 166 కేజీలు ఎత్తినా స్నాచ్లో జెరెమీ ఎక్కువ కేజీలు ఎత్తడంతో భారత లిఫ్టర్కు స్వర్ణం ఖాయమైంది. ముందు బాక్సింగ్లో... మిజోరం రాష్ట్రానికి చెందిన జాతీయ జూనియర్ బాక్సింగ్ చాంపియన్ లాల్నెత్లువాంగా కుమారుడైన జెరెమీ ఆరంభంలో తండ్రి అడుగుజాడల్లోనే నడిచాడు. కొన్నాళ్లు బాక్సింగ్లో కొనసాగిన జెరెమీ పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశం పొందాక వెయిట్లిఫ్టింగ్వైపు మళ్లాడు. అటునుంచి జెరెమీ వెనుదిరిగి చూడలేదు. 2016లో ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో 56 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గిన జెరెమీ ఆ తర్వాత 2017 ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో రజతం సాధించాడు. 2018 ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో కాంస్యం... 2018లో అర్జెంటీనా ఆతిథ్యమిచ్చిన యూత్ ఒలింపిక్స్లో పసిడి పతకం గెలిచాడు. గత ఏడాది తాష్కెంట్లో జరిగిన కామన్వెల్త్ చాంపియన్షిప్లోనూ జెరెమీ బంగారు పతకం గెలుపొందాడు. ఒక కేజీ తేడాతో... మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజత పతకం కైవసం చేసుకుంది. మణిపూర్కు చెందిన 23 ఏళ్ల బింద్యారాణి మొత్తం 202 కేజీలు (స్నాచ్లో 86+క్లీన్ అండ్ జెర్క్లో 116) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. అదిజాత్ అడెనికి ఒలారినోయి (నైజీరియా; 92+111=203 కేజీలు) స్వర్ణ పతకాన్ని సాధించింది. ఒలారినోయి, బింద్యారాణి ఓవరాల్ టోటల్ మధ్య కేవలం ఒక కేజీ తేడా ఉండటం గమనార్హం. ఫ్రెయర్ మొరో (ఇంగ్లండ్; 89+109=198 కేజీలు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారమే జరిగిన మహిళల 59 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ పాపీ హజారికా నిరాశపరిచింది. పాపీ హజారికా 183 కేజీలు (స్నాచ్లో 81+క్లీన్ అండ్ జెర్క్లో 102) బరువెత్తి ఏడో స్థానంలో నిలిచింది. నా స్వప్నం సాకారమైంది. నేను కొత్త ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. యూత్ ఒలింపిక్స్ తర్వాత సీనియర్స్థాయిలో నేను పాల్గొన్న పెద్ద ఈవెంట్ ఇదే. నేను 67 కేజీల నుంచి నేను ఒలింపిక్ వెయిట్ కేటగిరీ 73 కేజీలకు మారబోతున్నాను. పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభిస్తాను. –జెరెమీ లాల్రినుంగా -
Russia-Ukraine War: ఇండియన్ నన్స్కు ఇక్కట్లు
ఐజ్వాల్: రష్యా దాడితో రణరంగంగా మారిన ఉక్రెయిన్లో భారత్కు చెందిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సంస్థ మిజోరాం విభాగానికి చెందిన నన్స్ సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. యుద్ధం తీవ్రం కావడంతో రాజధానిలో సేవలనందిస్తున్న ఈ నన్స్ నిత్యావసరాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక శిబిరంలో తాము సేవలనందిస్తున్న నిరాశ్రయులతో కలిసి క్షేమంగా ఉన్నామని, అయితే కనీసావసరాల కోసం బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని వివరించారు. ఎన్ని బాధలైనా పడతామని, సేవా కార్యక్రమం విరమించి వెనక్కురామని సిస్టర్ రోసెలా నూతంగి, సిస్టర్ ఆన్ ఫ్రిదా స్పష్టం చేశారు. వీరితో పాటు వేరే దేశాలకు చెందిన మరో ముగ్గురు నన్స్ కలిసి 37 మంది నిరాశ్రయులను, ఒక కేరళ విద్యార్థిని సంరక్షిస్తున్నారు. వీరంతా క్షేమమేనని, కానీ ఆహారం కొరతతో బాధపడుతున్నారని రోసెలా బంధువు సిల్వీన్ చెప్పారు. కీవ్లో తాము బాగానే ఉన్నామని రోసెలా చెప్పారని సిల్వీన్ తెలిపారు. సంస్థలో రోసెలా 1981లో చేరారు. 1991లో ఒక మిషన్ కోసం సోవియట్కు వెళ్లారు. అక్కడ ఆమె 10 ఏళ్లు పనిచేశారు. 2013లో ఆమె ఉక్రెయిన్ చేరారని, రష్యన్ భాషలో ఆమెకు పట్టు ఉందని సిల్వీన్ తెలిపారు. గతంలో రెండుమార్లు మాత్రమే ఆమె ఇండియాకు వచ్చారన్నారు. మరో నన్ ఫ్రిడా 1995లో సంస్థలో చేరారు. అనంతరం అనేక దేశాల్లో సేవలనందించి 2019లో ఉక్రెయిన్ చేరారు. తమ సంస్థకు చెందిన ఐదుగురు నన్స్ ఉక్రెయిన్లో సేవలనందిస్తున్నారరని సంస్థ సుపీరియర్ జనరల్ సిస్టర్ మేరీ జోసెఫ్ చెప్పారు. వీరిని వెనక్కురమ్మని తాము కోరామని, కానీ సేవను విరమించి వచ్చేందుకు వీరు అంగీకరించలేదని తెలిపారు. స్థానికులకు సాయం అందిస్తూ వీరు కీవ్లో తలదాచుకుంటున్నారన్నారు. వీరి భద్రతపై రష్యా, ఉక్రెయిన్, భారత ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. -
సీఎంను చంపేస్తానంటూ వార్నింగ్.. పోలీసుల ఎంట్రీ.. చివరకు..
ఐజ్వాల్: ఏకంగా ముఖ్యమంత్రినే చంపేస్తానంటూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్ప్డడ్డాడు ఓ వ్యక్తి. మూడు నెలల్లోగా సీఎం పదవికి రాజీనామా చేయాలని లేని పక్షంలో చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. సీఎంను చంపేందుకు ఇప్పటికే ఓ స్పెషలిస్ట్ షూటర్ను సైతం రెడీ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. తీరా పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అరెస్ట్ అయ్యాడు. వివరాల ప్రకారం.. మూడు నెలల్లో రాజీనామా చేయకపోతే చంపేస్తానంటూ మిజోరం సీఎం జొరాంథంగాపై ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్తో ఇలా పోస్టులు పెట్టాడు. బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టి.. సదరు వ్యక్తిని ఖాజ్వల్ ప్రాంతానికి చెందిన రోడిన్లియానా అలియాస్ అపుయా టోచ్ఛాంగ్గా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు ఐజ్వాల్లోని ఛాన్మరీ ప్రాంతంలో నివాసం ఉంటుండుగా.. తింగ్ట్లాంగ్ పా అనే నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా బెదిరింపులకు పాల్పడి వివిధ ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, ముఖ్యమంత్రి జొరాంథంగా రాష్ట్ర బడ్జెట్ను తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నాడని పోలీసులు వెల్లడిస్తూ ఈ కారణంగానే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా సదరు నిందితుడు 2018లో కూడా అప్పటి ముఖ్యమంత్రి లాల్ తన్హావాలాకు లేఖ రాసి ఆయనను కూడా చంపేస్తానని బెదిరించాడు. అప్పుడు కూడా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. -
పరుగుల వరద పారిస్తున్న మరో కోహ్లి.. 3 మ్యాచ్ల్లో 3 సెంచరీలు
Taruwar Kohli Shines In Ranji Trophy 2022: ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో మిజోరం కెప్టెన్ తరువార్ కోహ్లి పేరు మార్మోగిపోతుంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మాజీ సహచరుడైన ఈ కోహ్లి రంజీ ట్రోఫీ 2022లో పరుగుల వరద పారిస్తూ హెడ్లైన్స్లో నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 526 పరుగులు స్కోర్ చేశాడు. ఇందులో ఓ అర్ధ సెంచరీ, 3 సెంచరీలు ఉన్నాయి. బీహార్తో జరిగిన తొలి మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో శతకాలు (151, 101 నాటౌట్, వికెట్) బాదిన కోహ్లి, మణిపూర్తో జరిగిన రెండో మ్యాచ్లో బౌలింగ్లో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, 22 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లతో పాటు అర్ధ సెంచరీ (69 పరుగులు) కూడా సాధించాడు. Found this photograph in our comm box in Ranchi. The boys who lifted the 2008 U19 World Cup.. Two Kohlis, a local boy, a keeper and a southpaw in there. Let’s see who gets all@of them right ... #IndvSA — Jatin Sapru (@jatinsapru) October 19, 2019 ఇక నాగాలాండ్తో జరిగిన మూడో మ్యాచ్లో కోహ్లి మరోసారి రెచ్చిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లతో పాటు 32 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో వికెట్తో పాటు మరో భారీ శతకాన్ని (151 నాటౌట్) బాదాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 49 మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 51.02 సగటుతో 3827 పరుగులు చేశాడు. రంజీల్లో పంజాబ్ తరఫున అరంగేట్రం చేసిన కోహ్లి.. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంకు వలస వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో మిజోరం యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు. కాగా, 33 ఏళ్ల తరువార్ కోహ్లి.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అండర్-19 ప్రపంచకప్ (2008) గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే, జాతీయ స్థాయిలో ఆశించిన అవకాశాలు రాకకపోవడంతో దేశవాళీ క్రికెట్కే పరిమితమయ్యాడు. చదవండి: రోహిత్ శర్మ కెప్టెన్సీపై దిగ్గజ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు -
Krishna: మూడు రోజుల పాటు జాతీయ ఆర్గానిక్ మేళా
సాక్షి, అమరావతి: సేంద్రియ సాగుకు ప్రోత్సాహం, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా విజయవాడలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ‘4వ జాతీయ ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నారు. ఏపీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహించనున్న ఈ మేళాను మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రారంభిస్తారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా రైతులు స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో సాగవుతున్న సేంద్రియ ఆహార ఉత్పత్తులు, మొక్కలు, దుస్తులు, మెడిసిన్స్తో పాటు యంత్ర పరికరాలను ప్రదర్శించనున్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వం కూడా భాగస్వామి కాబోతోంది. రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా సంఘాలు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. అలాగే జై కిసాన్ ఆధ్వర్యంలో ఆదర్శ రైతులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పాత్రికేయులను సత్కరించనున్నారు. శనివారం మిద్దెతోటల సాగుపై వ్యవసాయ, ఉద్యాన రంగ నిపుణులతో సెమినార్ నిర్వహిస్తారు. ఆదివారం ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అనే అంశంపై డాక్టర్ రామచంద్రరావు ప్రసంగిస్తా రు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వహణ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, గో ఆధారి త వ్యవసాయదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామకృష్ణంరాజు, భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షుడు జె.కుమారస్వామి కోరారు. -
ఏ సీఎంకి రాని కష్టం మిజోరాం ముఖ్యమంత్రికే: కేంద్రానికి లేఖ
ఐజ్వాల్: దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని కష్టం మిజోరాం ముఖ్యమంత్రికి వచ్చిపడింది. విషయమేంటంటే.. సాధారణంగా మిజో ప్రజలకు, ఆయన క్యాబినెట్ మంత్రులకు హిందీ తెలియదు. మంత్రి వర్గంలో కొందరికి ఇంగ్లీష్ సమస్య కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో మిజో ప్రజల స్థానిక భాషపై అవగాహన లేని సీనియర్ అధికారి రేణు శర్మను ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా నియమించారు. ఆయన ఏం చేయాలన్నా అన్ని ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లోనే చేస్తున్నారు. అధికారులు కూడా ఇదే ఫాలో అవ్వాలని అంటున్నారు. ఇక్కడ అధికారుల వరకూ ఇబ్బంది లేదు కానీ మంత్రులకు భాషాపరమైన సమస్య తలెత్తింది. దీంతో ఏ పని ముందుకు సాగాలన్నా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జోరంతంగా కేంద్రానికి ఓ లేఖ రాశారు. చదవండి: (అతనితో సన్నిహిత సంబంధాలు.. ఐజీపై సస్పెన్షన్ వేటు) లేఖలో ఏముందంటే.. క్యాబినెట్ మంత్రులకు హిందీ తెలియదు, ఇంగ్లీష్ కూడా అంతంతమాత్రమే. కనుక మిజో భాషపై పరిజ్ఞానం ఉన్న ప్రధాన కార్యదర్శిని నియమించాలని మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్తంగా కేంద్రాన్ని కోరారు. స్థానికపై భాషపై పట్టున్న అధికారి అయితే ప్రభావవంతంగానూ, సమర్థవంతంగానూ ఉండగలరు అని పరిస్థితిని వివరించారు. కేంద్రంలో ఉండేది యూపీఏ ప్రభుత్వమైనా, ఎన్డీఏ ప్రభుత్వమైనా స్థానిక భాషపై ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులనే సీఎస్లుగా నియమిస్తున్నారు. మిజోరాం ఏర్పడి నుంచి ఇది ఆచారంగా వస్తోందని తెలియజేశారు. నేను మొదటి నుంచి ఇప్పటి వరకు ఎన్డీయే భాగస్వామిగా ఉన్నాను. చాలా రాష్ట్రాలు ఒక కూటమి నుంచి మరో కూటమికి మారుతున్నప్పటికీ ఈశాన్య ప్రాంతంలో ఎన్డీయేకు నమ్మకమైన భాగస్వామిగా ఉన్నది నేను మాత్రమే. కాబట్టి, ఎన్డీయేతో ఈ నమ్మకమైన స్మేహానికి నేను ప్రతేకం అని నమ్ముతున్నాను అంటూ లేఖలో రాశారు. తన అభ్యర్థనను ఆమోదించకుంటే ఎన్డీయేలో విశ్వాసపాత్రుడిగా పనిచేసినందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ తనను అపహాస్యం చేస్తుందని ముఖ్యమంత్రి జోరంతంగా లేఖలో పేర్కొన్నారు. -
భార్య మీద కోపంతో మానవ బాంబుగా మారి కౌగిలించుకున్నాడు..
ఐజ్వాల్: సాధారణంగా భార్య మీద కోపం వస్తే విడాకులు ఇవ్వడం చూశాం గానీ ఓ వ్యక్తి ఏకంగా మానవ బాంబుగా మారి తన భార్యని హతమార్చాడు. ఈ ఘటనలో మిజోరాంలోని లుంగ్లేయి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ప్రకారం.. లుంగ్లేయి జిల్లాకు చెందిన రోహ్ మింగ్లైనా(62), ట్లాంగ్థియాన్ఘ్లిమి(61) దంపతులు. ట్లాంగ్థియాన్ఘ్లిమి ఆ ప్రాంతలోనే కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. ఈ జంట ఒక సంవత్సరం క్రితం మనస్పర్థలు రావడంతో అప్పటి నుంచి విడిగా ఉంటున్నారని సమాచారం. అయితే మంగళవారం మధ్యాహ్నం భార్య వద్దకు వచ్చిన అతను ప్రేమ వలకబోస్తూ మాట్లాడాడు. తను జ్వరంతో బాధపడుతున్నట్లు నటిస్తూ, మైకం వచ్చినట్లు అకస్మాత్తుగా తన భార్యను కౌగిలించుకున్నాడు, ఆ తర్వాత పెద్ద పేలుడు సంభవించింది. దీంతో వారిద్దరిని వెంటనే లుంగ్లీ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే, పేలుడులో మృతురాలి కుమార్తె కొంచెం దూరంగా ఉండడంతో ఆమె గాయపడలేదు. ఈ ఘటనపై లంగ్లీ జిల్లా పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. పేలుడులో జెలటిన్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఐఐటీ విద్యార్థి టెక్నాలజీ ఉపయోగించి.. 50 మంది విద్యార్థులు, టీచర్లను.. -
సరి‘హద్దు’లు సామరస్యమేనా?
అస్సాం, మిజోరం మధ్య సరిహద్దు సమస్య చిలికిచిలికి గాలి వానలా మారింది. ఏకంగా కాల్పుల వరకు వెళ్లి అస్సాం పోలీసులు, సామాన్యులను బలితీసుకుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. వివాదాలను పరిష్కరించాల్సిన కేంద్రం చోద్యం చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏడేళ్ల క్రితం ఏర్పడ్డ తెలంగాణకూ సరిహద్దున ఉన్న పలు రాష్ట్రాల నుంచి వివాదాలు ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పలుమార్లు వివాదాలు జరిగాయి. వికారాబాద్లో అంతర్రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన బషీరాబాద్ మండలం క్యాద్గిరా, కర్ణాటకలోని సేడం తాలూకా పోతంగల్ మధ్య కాగ్నా నది ప్రవహిస్తోంది. నదీ తీరంలో ఇసుక తవ్వకాల విషయమై ఇరు రాష్ట్రాల మధ్య పలుమార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 2018లో ఇరు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు జిల్లాల కలెక్టర్లు సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లోనైతే విచిత్ర పరిస్థి తులు నెలకొని ఉన్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలానికి చెందిన 14 గ్రామాలను ఇప్పటికీ రెండు రాష్ట్రాల ప్రభుత్వం తమ పరిధిలోనివే నని చెబుతూ ఉంటాయి. 1983 ఫిబ్రవరిలో రెండు రాష్ట్రాల అధికారులు ఈ గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందినవని నిర్ణయం తీసుకొని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేర్చారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజుర ఎమ్మెల్యే వామనరావు చాటప్ మహారాష్ట్ర శాసనసభలో ఈ అంశంపై మాట్లాడారు. ఈ గ్రామాలపై నిర్ణయం తీసుకునే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంటుందని, మరాఠి మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నందున మహారాష్ట్రలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఈ గ్రామాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ జారీ చేసిన కేబినెట్ ఉత్తర్వులను రద్దు చేస్తూ, 1996లో బీజేపీ –శివసేన ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ గ్రామాలపై హక్కు లేదంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో మహా రాష్ట్ర సుప్రీంకోర్టుకు వెళ్లింది. సరిహద్దు సంగతి తేల్చేవరకూ రెండు రాష్ట్రాలూ ఈ గ్రామాల ప్రజల బాగోగులు చూసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అస్సాం–మిజోరం విషయంలో కేంద్ర ప్రభుత్వం సమస్యను ఆయా రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని, కేవలం తాము సహాయకారిగా మాత్రమే పనిచేస్తామని లోక్సభలో ప్రకటించింది. ఇది సరైంది కాదు. తెలంగాణ ప్రభుత్వం సరిహద్దున ఉన్న రాష్ట్రాలతో సరిహద్దు సమస్యల పరిష్కారానికి అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని సమస్యలకూ పూర్తిస్థాయి పరిష్కారం దొరకక పోవచ్చు. ప్రయత్నలోపం జరగకుండా చూసుకోవాలి. - ఫిరోజ్ ఖాన్ వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్ -
సరిహద్దు వివాదంలో కొత్త ట్విస్ట్
-
Assam-Mizoram: సరిహద్దు వివాదంలో కొత్త ట్విస్ట్
డిస్పూర్: అసోం–మిజోరం సరిహద్దు వివాదానికి సంబంధించి చెలరేగిన హింసలో ఐదుగురు పోలీసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరు రాష్ట్రాల సరిహద్దు వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై మిజోరాంలో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. సీఎంతో పాటు మరో నలుగురు పోలీసు ఉన్నతాధికారులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) అనురాగ్ అగర్వాల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) కచార్ దేవోజ్యోతి ముఖర్జీ, కచార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రకాంత్ నింబాల్కర్, ధోలై పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉద్దీన్, నీహ్లయా మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఈ సందర్భంగా ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘సరిహద్దు పట్టణానికి సమీపంలో మిజోరాం, అసోం పోలీసు బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల తరువాత సోమవారం సాయంత్రం రాష్ట్ర పోలీసులు వైరంగ్టే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కచార్ డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి, కచార్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సన్నీడియో చౌదరిపై కూడా అదే అభియోగాల కింద కేసులు నమోదు చేశాం’’ అని తెలిపారు. వీరితో పాటు మరో 200 మంది అసోం పోలీసు సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు సదరు అధికారి పేర్కొన్నారు. మిజోరాం సరిహద్దులోని అసోం జిల్లాలు కచర్, హైలకండీలో అక్టోబర్ 2020 నుంచి ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో తరచుగా ఇళ్లు తగలబెట్టడం, భూమిని ఆక్రమించుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండు ఈశాన్య రాష్ట్రాలు 164.6 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. అసోంలోని కచార్, హైలకండీ, కరీంగంజ్ జిల్లాలు.. మిజోరంలోని కొలాసిబ్, మమిత్, ఐజ్వాల్ సరిహద్దును పంచుకుంటున్నాయి. ప్రాదేశిక సరిహద్దుకు సంబంధించి రెండు రాష్ట్రాలు భిన్నమైన వివరణలు వెల్లడిస్తున్నాయి . 1875 లో గిరిజనులను బాహ్య ప్రభావం నుంచి కాపాడటానికి రూపొందించిన ఒక అంతర్గత రేఖ వెంబడి తమ సరిహద్దు ఉందని మిజోరాం విశ్వసిస్తుండగా.. అస్సాం 1930 లలో చేసిన జిల్లా సరిహద్దు ద్వారా వెళుతుంది. -
వివాదాస్పద సరిహద్దుల్లో కేంద్ర బలగాల పహారా
న్యూఢిల్లీ: హింస చెలరేగి ఐదుగురు పోలీసుల మరణాలకు కారణమైన అస్సాం–మిజోరం సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర బలగాల మొహరింపునకు అస్సాం, మిజోరం, కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అంగీకరించాయి. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ను బారువా, అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా, మిజోరం సీఎస్ లాల్నున్మా వియా చవుంగో, డీజీపీ ఎస్బీకే సింగ్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాల మధ్య రెండు గంటలపాటు కొనసాగిన చర్చల అనంతరం ఈ నిర్ణయానికొచ్చారు. 306 నంబర్ జాతీయ రహదారి వెంట సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్(సీఏపీఎఫ్)ను రంగంలోకి దించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని హోం శాఖ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది.‡ మిజోరం రాష్ట్రానికి నిత్యావసర సరుకులు సహా అన్ని రకాల రవాణాకు జీవనాడిలాంటి 306 నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలను అస్సామీలు 26వ తేదీ నుంచి మూసేశారని, వెంటనే ఈ దిగ్బంధాన్ని ఎత్తేయాలని మిజోరం డిమాండ్ చేసింది. -
Assam- Mizoram: 150 ఏళ్ల వివాదం
దేశాల మధ్య సరిహద్దు వివాదాలు సహజం కానీ రాష్ట్రాల మధ్య సరిహద్దులు భగ్గుమనడమేంటి ? భూభాగం గురించి సీఎం మధ్య మాటల యుద్ధం ఎందుకు? దాని వెనుకనున్న అసలు కారణాలు తెలుసుకోవాలంటే 150 ఏళ్ల కిందట నాటి చరిత్ర మూలాల్లోకి వెళ్లాలి. ఈశాన్య రాష్ట్రాలంటే పచ్చని కొండలు, సుందరమైన మైదాన ప్రాంతాలు, దట్టమైన అటవీ ప్రాంతాలు, నదీనదాలు.. ఇలా ప్రకృతి అందాలే మన కళ్ల ముందు కదులుతాయి. అవే అటవీ ప్రాంతాలు అస్సాం, మిజోరం మధ్య అగ్గిరాజేశాయి. బ్రిటీష్ పాలకులు తమ దేశం వెళుతూ వెళుతూ కశ్మీర్ను రావణ కాష్టం చేయడమే కాకుండా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్ని కూడా వివాదాస్పదం చేశారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి పెద్ద భూభాగమైన అస్సాం నుంచి మిగిలిన ప్రాంతాలను వేరు చేస్తూ మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాలు 1963–1987 మధ్య కాలంలో ఏర్పాటు అయ్యాయి. ఆ ప్రాంత ప్రజల సంస్కృతి, అలవాట్లు, చరిత్రను ఆధారంగా చేసుకొని ఆనాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. మిజోరం ప్రాంతాన్ని 1972లో కేంద్ర పాలిత ప్రాంతం చేయగా, 1987లో పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కట్టబెట్టారు. అస్సాంలోని మూడు జిల్లాలైన కచర్, హైలకండి, కరీంగంజ్లు, మిజోరంలోని మూడు జిల్లాలైన అయిజ్వాల్, కొలాసిబ్, మమిత్లు 165 కిలోమీటర్ల పొడవునా సరిహద్దుల్ని పంచుకుంటున్నాయి. బ్రిటీష్ ప్రభుత్వం ఏం చేసింది ? అసోం–మిజోరం మధ్య ఉన్న 165 కి.మీ. సరిహద్దు ప్రాంతం వివాదాస్పదం కావడానికి బ్రిటీష్ పాలకులు ఇచ్చిన రెండు వేర్వేరు నోటిఫికేషన్లే కారణం. లుషాయి కొండలు (అవే ఇప్పటి మిజోరం), కచర్ మైదాన ప్రాంతాల (అస్సాం భూభాగం) మధ్య సరిహద్దుల్ని నిర్ణయిస్తూ 1875లో తెల్లదొరలు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. 1873 నాటి బెంగాల్ తూర్పు సరిహద్దు నియంత్రణ చట్టం ప్రకారం ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పీ) పద్ధతి ప్రకారం సరిహద్దుల్ని గుర్తించారు. అప్పట్లో మిజోరం ప్రాంతంలో నేతల్ని కూడా సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ 1933లో మణిపూర్ లుషాయి కొండల సరిహద్దుల్ని నిర్ణయిస్తూ మరో నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో లుషాయి కొండలు అంటే ప్రస్తుత మిజోరంలో కొంత భాగం అస్సాం, మణిపూర్లలో కలిసింది. అయితే 1933 నోటిఫికేషన్ను తమని సంప్రదించకుండా చేశారన్న కారణంతో మిజో నేతలెవరూ దానిని అంగీకరించలేదు. 1875లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 1,318 చదరపు కిలో మీటర్ల భూభాగం తమదేనని మిజోరం వాదిస్తోంది. ఆ ప్రాంతంలో ఇప్పటికీ మిజో ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. మరోవైపు అస్సాం ప్రభుత్వం మిజోరం తమ భూభాగాన్ని దురాక్రమణ చేస్తోందని ఆరోపిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ ఘర్షణలు ఇలా.. ►అస్సాం, మిజోరం మధ్య ఘర్షణలు ఇప్పుడు కొత్తేం కాదు. 1994లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. మిజోరం తమ భూభాగంలోకి చొరబడుతోందంటూ అస్సాం ప్రభుత్వం గగ్గోలు పెట్టింది. అప్పట్నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్యకు ప్రయత్నించినా ఫలించలేదు. ►2018లో మిజోరంకు చెందిన విద్యార్థి సంఘాలు వివాదాస్పద భూభాగంలో రైతులు విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని చెక్క భవనాలు నిర్మించడంతో మళ్లీ వివాదం రాజుకుంది. అస్సాం పోలీసులు వాటిని ధ్వంసం చేశారు. ►2020 అక్టోబర్లో ఇరపక్షాల మధ్య జరిగిన ఘర్షణలతో ఎందరో గాయపడ్డారు. మిజోరంకు గుండెకాయ వంటిదైన జాతీయ రహదారి 306 ఏకంగా 12 రోజులు మూత పడింది. ►జూన్లో మిజోరం ప్రజలు ఆ భూభాగంలో వ్యవసాయం చేస్తూ ఉండడంతో మళ్లీ ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ßోంమంత్రి అమిత్ షా పర్యటన జరిగిన మర్నాడే ఘర్షణల్లో ఐదుగురు అస్సాం పోలీసులు, ఒక పౌరుడు మరణించడంతో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. సరిహద్దు వివాదం పరిష్కా రానికి ఇప్పుడు అస్సాం ప్రభుత్వం సుప్రీం జోక్యాన్ని కోరుతోంది. -
చట్టం చెబితే భూమినీ వదిలేస్తాం
న్యూఢిల్లీ/సల్చార్/గువాహటి: అస్సాం, మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ చట్టం చేస్తే రాష్ట్రానికి చెందిన భూమిని సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. సరిహద్దుల్లోని రక్షిత అటవీ ప్రాంతాన్ని ఆక్రమణల నుంచి, విధ్వంసం నుంచి రక్షించుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని లైలాపూర్ వద్ద సోమవారం జరిగిన కాల్పుల్లో అస్సాంకు చెందిన ఐదుగురు పోలీసులు, ఒక పౌరుడు మృతి చెందగా మరో 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో రిజర్వు ఫారెస్టులో రోడ్ల నిర్మాణం, పోడు వ్యవసాయం కోసం అడవుల నరికివేతను కొనసాగనీయమన్నారు. అటవీ ప్రాంతంలో నివాసాలు లేవు. ఒక వేళ ఉన్నాయని మిజోరం ఆధారాలు చూపితే, వాటిని వెంటనే తొలగిస్తాం’ అని స్పష్టం చేశారు. పార్లమెంట్ చట్టం చేస్తే అస్సాంకు చెందిన ప్రాంతాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు ఒక్క అంగుళం భూమిని కూడా ఆక్రమణకు గురికానివ్వం’ అని ఆయన అన్నారు. నేడు హోం శాఖ కార్యదర్శి సమావేశం అస్సాం, మిజోరం సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా చర్చలు జరపనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఒక రాజీ ఫార్ములా కుదిరే చాన్సుంది. ఘటనకు నిరసనగా సరిహద్దుల్లోని అస్సాంలోని చచార్ జిల్లా ప్రజలు మిజోరం వైపు వాహనాలను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు. హింసాత్మక ఘటనలకు హోం మంత్రి అమిత్ షా వైఫల్యమే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ ధ్వజమెత్తారు. -
హద్దులు దాటిన వ్యవహారం
ఒక రాష్ట్ర పోలీసులు, మరో రాష్ట్ర పోలీసులపై కాల్పులు... ట్విట్టర్లో పొరుగు రాష్ట్రాల సీఎంల పరస్పర ఆరోపణలు... ఇది అంతర్ రాష్ట్ర వివాదమా? అంతర్జాతీయ యుద్ధమా? ఈశాన్య భారతావనిలో అస్సామ్, మిజోరమ్ల సరిహద్దులో సోమవారం రేగిన ఘర్షణలు... మిజోరమ్ కాల్పుల్లో అయిదుగురు అస్సామీ పోలీసులు అమరులవడం... 60 మంది గాయపడడం... ఇవన్నీ చూశాక ఎవరైనా అనే మాట – అనూహ్యం... అసాధారణం. రాష్ట్రాల హద్దులపై దశాబ్దాలుగా సాగుతున్న వివాదం చివరకు ఈ స్థాయిలో ఇరువైపులా భద్రతాదళాలకూ, పౌరులకూ మధ్య హింసాకాండగా మారడం మునుపెన్నడూ ఎరుగని విషయం. కేంద్ర హోమ్ మంత్రి రంగంలోకి దిగి, ఇరు రాష్ట్రాల సీఎంలకూ ఫోన్ చేసి, హితవు పలకాల్సి వచ్చిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదాలు ఈనాటివి కావు. కాకపోతే, ఈసారి ఇలా అంతర్జాతీయ సరిహద్దు యుద్ధాల లాగా పోలీసుల పరస్పర కాల్పులకు విస్తరించడమే విషాదం. ఈశాన్య ప్రాంత సీఎంలతో కేంద్ర హోమ్ మంత్రి షిల్లాంగ్లో సమావేశమై, హద్దుల వివాదాలపై చర్చించి వెళ్ళిన రెండు రోజులకే ఇలా జరగడం మరీ విచిత్రం. మిజోరమ్ భూభాగాన్ని అస్సామ్ ఆక్రమించిందని ఆ ప్రభుత్వం ఆరోపిస్తోంది. రిజర్వు అటవీ భూమిని మిజోరమ్ గ్రామీణులు కబ్జా చేస్తున్నారని అస్సామ్ ప్రత్యారోపణ చేస్తోంది. అస్సామ్ గడ్డపై మిజోలు తరతరాలుగా స్థిరపడి, సాగు చేస్తున్నంత మాత్రాన ఆ ప్రాంతం మిజోలది అయిపోదన్నది అస్సామీల వాదన. తాజా ఘటనలో అస్సామ్ పోలీసులే అత్యుత్సాహంతో సరిహద్దు గస్తీ కేంద్రాన్ని ఆక్రమించి, సామాన్యులపై జులుం చేశారని మిజోరమ్ నేరారోపణ. ఇది ఇంతటితో ఆగేలా లేదు. అటవీ భూమిలో అంగుళం కూడా ఆక్రమించుకోనివ్వకుండా సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేస్తామని అస్సామ్ సీఎం గర్జిస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోస్తూ, 4 వేల మంది కమెండోలను హద్దుల్లో మోహరిస్తామని విస్మయకర ప్రకటన చేశారు. గమ్మత్తేమిటంటే, మూడున్నర కోట్ల పైగా జనాభా ఉన్న అస్సామ్ను పాలిస్తున్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేవలం 11 లక్షల పైచిలుకు జనసంఖ్య ఉన్న మిజోరమ్ ముఖ్యమంత్రి జొరామ్థాంగా – ఇద్దరూ కేంద్రంలోని పాలక బీజేపీ తానుగుడ్డలే! అస్సామ్ సాక్షాత్తూ బీజేపీ ఏలుబడిలో ఉంటే, మిజోరమ్లోని పాలక ‘మిజో నేషనల్ ఫ్రంట్’ (ఎంఎన్ఎఫ్) సైతం కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో భాగం. చరిత్రలోకి వెళితే – 1972 వరకు మిజోరమ్ సైతం అస్సామ్లో భాగమే. ఆదిలో కేంద్రపాలిత ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మిజోరమ్, 1987లో రాష్ట్ర హోదా పొందింది. మిజోరమ్తో దాదాపు 164 కిలోమీటర్ల సరిహద్దున్న అస్సామ్ పెద్దన్న పాత్ర పోషిస్తుండడం మిజోరమ్కు మొదటి నుంచి ఇబ్బందిగా మారింది. 1875లో తమ నేతలను సంప్రతించి, బ్రిటీషు కాలంలో చేసిన హద్దులనే అనుసరించాలని మిజోలు కోరుతున్నారు. కానీ, ఆ తరువాత 1933లో చేసిన హద్దులదే తుది మాట అని అస్సామ్ వాదన. ఇదీ ఎంతకీ తెగని పీటముడిగా మారింది. దీనికి సమర్థమైన రాజకీయ పరిష్కారం అవసరం. కానీ, సాయుధ పోలీసు పరిష్కారం కనుక్కోవాలని తాజాగా ప్రయత్నించి స్థానిక పాలకులు ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. నిజానికి, సహజసిద్ధమైన వనరులతో, అడవులు, పర్వతాలు, లోయలతో సంక్లిష్టమైన భౌగోళిక ప్రాంతం ఈశాన్య భారతం. ఫలితంగా అక్కడి 7 రాష్ట్రాల మధ్య కచ్చితమైన సరిహద్దుల నిర్ణయం మరింత క్లిష్టమైనది. అందుకే అక్కడి భూములు, హద్దులపై ఇన్ని వివాదాలు! దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచీ, వచ్చిన తరువాతా అక్కడ వివిధ జాతుల మధ్య సంఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి. కానీ, తాజా కాల్పుల లాంటివి మాత్రం అరుదు. ఒకే దేశంలో అంతర్భాగమైన రెండు రాష్ట్రాలు కాల్పులు జరుపుకొనే పరిస్థితికి రావడం ఇన్నేళ్ళుగా సమస్యలను మురగబెట్టి, ద్వేషాన్ని పెంచిపోషించిన స్థానిక, కేంద్ర పాలకుల వైఫల్యమే! అందుకే ఇప్పుడు ఆమోదయోగ్యమైన హద్దుల నిర్ణయంతో ఘర్షణలకు ముగింపు పలకడంపై పాలకులు దృష్టి పెట్టక తప్పని పరిస్థితి వచ్చింది. సున్నితమైన అంతర్జాతీయ సరిహద్దులకు దగ్గరలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలలో అంతర్ రాష్ట్ర సంఘర్షణ ఎలా చూసినా అవాంఛనీయం. ఆందోళనకరం. 1995 నుంచి అస్సామ్, మిజోరమ్ల చర్చల్లో కేంద్రం పాలుపంచుకున్నా, ఫలితం రాలేదు. అయితే, వచ్చే 2024 కల్లా ఈశాన్యంలో హద్దుల వివాదాలకు ఫుల్స్టాప్ పెడతామని పాలకుల మాట. అది నిజం చేయాలంటే, కేవలం స్థానిక ఓటుబ్యాంకు రాజకీయాలతో కాక, సువిశాలమైన దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, దౌత్యనైపుణ్యం చూపే నేతలు ఇప్పుడు అవసరం. వారికి కావాల్సిందల్లా సమస్యల సమగ్ర అవగాహన, చిత్తశుద్ధి! ఆ యా ప్రాంతీయుల్ని భాగస్వాములను చేసి, స్థానిక సెంటిమెంట్లనూ, ఆలోచనలనూ పరిగణనలోకి తీసుకొంటే దీర్ఘకాలిక పరిష్కారం, ప్రజల మధ్య శాశ్వత సామరస్యం సాధించడం అసాధ్యమేమీ కాదు. రాష్ట్ర పాలకులతో అది సాధ్యం కాకపోతే, కేంద్రమే పెద్దమనిషి పాత్ర పోషించాలి. అయితే అంతకన్నా ముందుగా తమను పరాయివారిగా చూస్తున్నారని భావిస్తున్న ఈశాన్యంలోని స్థానిక జాతులకూ, అభివృద్ధికి నోచుకోని సుదూర ప్రాంతాలకూ వారూ ఈ దేశంలో అంతర్భాగమనే నమ్మకం కలిగించాలి. పరస్పర సోదరభావం పెంపొందించాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, పడమటి చివరి నుంచి ఈశాన్యం కొస వరకు దేశాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకోవాలని కోరుకొనే పాలకుల నుంచి ఆ మాత్రం ఆశిస్తే అది తప్పు కాదేమో! -
హింసాత్మకంగా మారిన అసోం
-
హింసాత్మకంగా మారిన అసోం, మిజోరాం సరిహద్దు వివాదం
న్యూఢిల్లీ: అసోం, మిజోరాం సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో ఆరుగురు పోలీసులు మృతిచెందారు. మిజోరం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మృతిచెందినట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. పోలీసుల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అలాగే కాచర్ ఎస్పీ నింబల్కర్ వైభవ్ చంద్రకాంత్ సహా కనీసం 50 మంది సిబ్బంది కాల్పులు, రాళ్లు రువ్వడంతో గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ ఘర్షణ అనంతరం రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్షా మాట్లాడారు. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించి, శాంతియుతంగా ఉండాలని సూచించారు అయితే అస్సాం పోలీసులు మిజోరాంలోని కోలాసిబ్ సరిహద్దు దాటి వచ్చిన తరువాతే హింస ప్రారంభమైందని మిజోరాం హోం మినిస్టర్ తెలిపారు. అంతేగాక అస్సాం పోలీసులు జాతీయ రహదారిపై తమ వాహనాలను దెబ్బతీశారని, రాష్ట్ర పోలీసులపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా గత ఏడాది ఆగష్టు మాసంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మొదలవ్వగా. ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా అసోంలోని కచార్, మిజోరాంలోని కోలాసిబ్ సరిహద్దులో ఇవాళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సోమవారం దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరువైపులా వాహనాలను ధ్వంసం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేదాకా సరిహద్దు గుండా ప్రయాణించొద్దంటూ కార్లు, బైకులను చిత్తుచిత్తు చేశారు. దాడుల ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. సదరు వీడియోలను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేస్తూ మిజోరాం, అస్సాం ముఖ్యమంత్రులు ట్విటర్లనే మాటల యుద్ధం చేసుకున్నారు. ‘‘అమిత్షా గారూ... దయచేసి ఈ విషయాన్ని పరిశీలించండి.. దీనికి ముగింపు కావాలి'' అంటూ మిజోరం సీఎం జోరమంతుంగా రాయగా, ‘‘గొడవలు సద్దుమణిగే వరకూ పోలీస్ పోస్టులను వదిలేసి వెళ్లాలని మిజోరాం ఎస్పీ సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మేం ప్రభుత్వాన్ని ఎలా నడుపుతాం?'' అంటూ అస్సాం సీఎం హిమంత శర్మ కూడా అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. -
హర్ష్ గోయాంక షేర్ చేసిన మేఘాల జలపాతం చూస్తే.. మెస్మరైజ్!
ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయాంక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సామాజిక అంశాలు, స్ఫూర్తిని నింపే విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన తన ట్వీటర్ ఖాతాలో షేర్ ఓ మెస్మరైజింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన షేర్ చేసిన ఈ వీడియోలో దట్టమైన తెల్లని మేఘాలు కొండల మీద నుంచి కిందకు ఒకదానిపై నుంచి ఒకటి నీరు ప్రవహిస్తున్నట్లు కదులుతున్నాయి. అచ్చం జలపాతం లాగా మేఘాలు కిందకు కదిలే ఈ దృశ్యాన్ని చూసి మెస్మరైజ్ కాకుండా ఉండలేము. ఈ దృశ్యం మిజోరం రాష్ట్రంలోని ఐజ్వాల్లో చోటు చేసుకుంది. ‘కొండ మీద నుంచి కిందకు దూకుతున్న మేఘాలు.. మీజోరంలోని ఐజ్వాల్ కనువిందు చేస్తున్నాయి. మేఘాలు జలాపాతాన్ని తలపిస్తున్నాయి. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో మేఘాలు ఇలా మారుతాయి. కొండల నుంచి నీరు ప్రవహిస్తున్నట్లు మేఘాలు కదులుతుంటాయి. ఇది చూడడానికి చాలా అరుదైన దృశ్యం’ అని హర్ష్ గోయాంక కామెంట్ జత చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 19వేల మంది వీక్షించారు. ఈ వీడియోను మొదటగా ‘ది బెటర్ ఇండియా’లో ట్విటర్ పోస్ట్ చేసింది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని సైమన్ జేగర్ అనే వ్యక్తి వీడియోలో బంధించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిని నెటిజన్లు... వావ్! అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘కొండల మధ్య అద్భుతమైన దృశ్యం’, ‘ఈ వీడియో షేర్ చేసినందుకు ధన్యవాదాలు, ఇది నిజంగా చాలా మెస్మరైజింగ్ వీడియో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Clouds cascade down the mountains at Aizawl in Mizoram, creating a mesmerizing 'cloud waterfall'! This viral phenomenon requires very specific weather conditions to take shape, making it a rare sight to behold. VC: Simon Jaeger (simon.jaeger.587 on Facebook) pic.twitter.com/VieStWaysA — The Better India (@thebetterindia) July 3, 2021 -
ఎక్కువ పిల్లల్ని కనండి.. లక్ష గెల్చుకోండి!
న్యూఢిల్లీ: ఓవైపు పెరిగిపోతున్న జనాభా దేశ ఆర్థిక అవసరాలను సంక్లిష్టంగా మారుస్తూ వస్తోంది. ఈ తరుణంలో చాలా రాష్ట్రాలు, జనాభా నియంత్రణ పాలసీలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఈశాన్య రాష్ట్రం మిజోరం నుంచి అందుకు విరుద్ధమైన ప్రకటన వెలువడడం చర్చనీయాంశంగా మారింది. ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా ఓ కొత్త ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న కుటుంబాలకు లక్ష రూపాయల ప్రోత్సాహకం ఇస్తానని ప్రకటించారు. దీంతో ఈ మంత్రి ప్రకటన సంచలనంగా మారింది. అస్సాంకి కౌంటర్? మిజోరంకి పోరుగున్న ఉన్న అస్సాం.. జనాభా నియంత్రణలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉండదని ప్రకటించింది కూడా. ఇక ఈమధ్యే మరో జీవో విడుదల చేసింది. ఇద్దరు సంతానం లోపు ఉన్న కుటుంబాలకు మాత్రమే సంక్షేమ పథకాల లబ్ధి దక్కుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి హిమాంత బిస్వా ప్రకటన చేశారు కూడా. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే.. మిజోరం మినిస్టర్ స్టేట్మెంట్ను కౌంటర్ ఇచ్చాడంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చాడు మంత్రి రాబర్ట్. కొడుకు సొమ్మే.. ‘‘మిజోరాం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సరిపోయే స్థాయిలో మిజోరం జనాభాలేదు. మిజోలు లాంటి చిన్న చిన్న తెగల విషయంలో ఇదో పెద్ద సమస్యగా మారింది’’ అని మంత్రి రాబర్ట్ వ్యాఖ్యానించారు. ఫాదర్స్ డే నాడు సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. తల్లిదండ్రుల్లో ఎవరోఒకరికి రూ. లక్ష రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తానని ఆయన ప్రకటించారు. లబ్ధిదారుడికి నగదు ప్రోత్సాహకంతో పాటూ ఓ ట్రోఫిని కూడా పొందుతారు. గరిష్టంగా, కనిష్టంగా ఎంత మంది పిల్లలు అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ స్కీమ్ను తన సొంత కొడుకు కంపెనీ నుంచే ఇస్తానని ప్రకటించడంతో విమర్శలకు తావు ఇవ్వకుండా జాగ్రత్తపడ్డాడు ఆయన. చదవండి: వీపున మామ.. ఎలా మోయగలిగావ్ తల్లీ! -
చనిపోలేదు! బిగ్గెస్ట్ ఫ్యామిలీమ్యాన్ బతికే ఉన్నారు!
ఐజ్వాల్: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి అధిపతిగా రికార్డులకెక్కిన జియాన్ఘాకా మరణించి 36 గంటలు దాటుతున్నా, ఆయన కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఆయన ఇంకా జీవించేఉన్నారని వారు చెబుతున్నారు. 39 మంది భార్యలు, 90 మందికి పైగా సంతానం, 33 మంది మనవళ్లు, మనవరాళ్లున్న 76 ఏళ్ల జియాన్ స్థానిక లాల్పా కోహ్రాన్ ధర్ తెగకు అధిపతి. బీపీ, సుగర్తో బాధపడుతున్న ఆయన ఆదివారం మరణించినట్లు స్థానిక ట్రినిటీ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఆయన శరీరం ఇంకా వెచ్చగానే ఉందని, నాడి కొట్టుకుంటూనే ఉందని చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తెచ్చాక ఆయన నాడి తిరిగి కొట్టుకోవడం ఆరంభించిందని తెగ కార్యదర్శి జతిన్ ఖుమా చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులే కాకుండా స్థానికులు సైతం ఈ పరిస్థితుల్లో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధంగా లేరన్నారు. ఆయన పూర్తిగా మరణించారని తెగ పెద్దలు భావించేవరకు జియాన్ను పూడ్చిపెట్టేదిలేదన్నారు. 70 ఏళ్ల క్రితం ఈ తెగను జియాన్ పూర్వీకులు స్థాపించారు. వీరంతా కుటుంబపోషణకు వడ్రంగి పని చేస్తుంటారు. ప్రస్తుతం దాదాపు 433 కుటుంబాలకు చెందిన 2500 మందికి పైగా తెగలో ఉన్నారు. చదవండి: 38 భార్యల ముద్దుల భర్త ఇక లేరు -
38 భార్యల ముద్దుల భర్త ఇక లేరు
ఐజ్వాల్: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద జియోన చన (78) ఇకలేరు. అతడికి 38 మంది భార్యలు.. 89 మంది మగ పిల్లలు.. 14 మంది కుమార్తెలు.. 33 మంది మనవరాళ్లు.. ఒక మనవడు ఉన్నారు. వీరి కుటుంబంలో మొత్తం 176 మంది సభ్యులు ఉన్నారు. కాగా జియోన మరణంపై మిజోరాం ముఖ్యమంత్రి జోరాంతంగ స్పందించారు. ఆయన కుటుంబం ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద అయిన మిజోరాం వాసి మిస్టర్ జియోన్కు బరువైన హృదయంతో వీడ్కోలు పలుకుతున్నాను. ఆయనకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు ఉన్నారు. ఆయన గ్రామం బక్తంగ్ త్లంగ్నాంతో పాటు మిజోరాంకు కూడా అనేక మంది పర్యాటకులు రావడానికి ఆయన కుటుంబం ఒక కారణం’’ అని సీఎం జోరాంతంగ ట్వీట్ చేశారు. చదవండి: భట్టి: ప్రజల అవసరాల కోసం ఆస్తులు... అమ్మకానికి కాదు -
కొండ చరియలు విరిగిపడి నలుగురు చిన్నారులు మృతి
ఐజ్వాల్: మిజోరంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మృతి చెందినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. ఈ ఘటన బాంగ్కాన్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండ పక్కనే ఉన్న ఇంటిపై అవి పడటంతో ఇల్లు కూలిపోయింది. ఏడుగురు సభ్యులు ఉన్న ఆ ఇంట్లో ఘటన సమయంలో ఆరుగురు ఉన్నారు. అందులో ఇంటి యజమాని లాల్ బయాక్జౌలా (75) ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అనంతరం మరొకరిని కూడా బలగాలు రక్షించగలిగాయి. 3 నుంచి 16 ఏళ్ల వయసున్న నలుగురు శిథిలాల కింద నలిగిపోయి మరణించారు. ముగ్గురు సభ్యులున్న మరో కుటుంబం కొండ పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉన్నారు. అయితే కొండచరియలు విరిగిన శబ్దం రావడంతో వారు బయటకొచ్చి ప్రాణాలు రక్షించుకోగలిగారు. చదవండి: వేప చెట్టు కింద కరోనా మాత.. కూల్చివేతతో ఉద్రిక్తత -
Mizoram: పరీక్షలు రాయాలి.. సిగ్నల్స్ రావడం లేదు
ఐజ్వాల్: కరోనా మహమ్మారితో స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో విద్యార్థులంతా ఆన్లైన్ క్లాసులకే పరిమితమయ్యారు. క్లాసులతో పాటు పరీక్షలు కూడా ఆన్లైన్లో రాయాల్సి వస్తుంది. మహానగరాలు, పట్టణాల్లో అయితే ఇంటర్నెట్ సేవలు బాగుంటాయి.. కాబట్టి ఆన్లైన్లో పరీక్షలు రాయడం కాస్త తేలికే.. అదే మారుమూల గ్రామాల్లో కనీసం సిగ్నల్స్ కూడా అందవు. ఇక గిరిజన ప్రాంతాల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిగ్నల్స్ కోసం కొండలు, గుట్టలు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. తాజాగా మిజోరంలో కొందరు విద్యార్థులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రాజధాని ఐజ్వాల్కు 400 కిమీ దూరంలో సైహా జిల్లాలో మావ్రేయి అనే కూగ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి ఏడుగురు విద్యార్థులు తమ సెమిస్టర్ పరీక్షలు రాయాల్సి ఉంది. గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం.. ఫోన్లో సిగ్నల్స్ కూడా అంతంత మాత్రానే ఉంటుంది. అయితే కాలేజీ యాజమాన్యం పరీక్షలు రాయకపోతే ఫెయిల్ చేస్తారేమోనని ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఎలాగైనా పరీక్షలు రాయాలని ఊరికి దగ్గర్లోని త్లావ్ త్లా కొండపై ఫోన్ సిగ్నల్ వస్తుండడంతో ఆ విద్యార్థులంతా ఎలాగోలా కష్టపడి అక్కడికి చేరుకున్నారు. ఆ కొండపైనే ఒక గుడిసెను ఏర్పాటు చేసుకున్న విద్యార్థుల సమూహం తమ సెమిస్టర్ పరీక్షలను పూర్తి చేస్తున్నారు. '' మా గ్రామం పూర్తిగా కొండల నడుమ ఉంది. గ్రామంలో ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా రావు.. ఇంక ఇంటర్నెట్ సంగతి వేరే చెప్పనవసరం లేదు. అందుకే కొండపైకి చేరుకొని సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేస్తున్నాం'' అంటూ ఒక విద్యార్థి పేర్కొన్నాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: వామ్మో.. ఆ రాష్ట్రంలో లక్ష దాటిన కరోనా మరణాలు -
కరోనా సోకిన భార్య.. భర్త చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
ఐజ్వాల్: కరోనా సోకిన తన భార్యను ఆమె భర్త ఐసోలేషన్ వార్డుకు తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలు.. మిజోరాంకు చెందిన దంపతులలో , సదరు వ్యక్తి భార్యకు కరోనా సోకింది. సాధారణంగా కరోనా సోకిన వారికి దూరంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మహమ్మారి వెంటనే సోకుతుంది. అయితే, తన భార్యను ఐసోలేషన్ సెంటర్కు తీసుకెళ్లాటానికి ఆమె భర్త వినూత్నంగా ఆలోచించాడు. అతని జీప్కు, వెనుకల ఒక చిన్న ట్రాలీని ఏర్పాటు చేశాడు. అందులో ఆమె కూర్చివేసుకొని హాయిగా కూర్చుంది. ఇలా ఐసోలేషన్ వార్డుకు తరలించాడు. అయితే, ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రిపున్ శర్మ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇప్పుడిది వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్.. మీ భార్య అదృష్ట వంతురాలు’, ‘ మీ తెలివికి హ్యాట్సాఫ్’, అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, తాజాగా మిజోరాంలో వైరస్ ఉధృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటలలో 312 కొత్త కేసులు నమోదైయ్యాయి. 41 మంది చనిపోయారు. అదే విధంగా రాష్ట్రంలో 3,144 కేసులు ఆక్టివ్ గా ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు 9,214 మంది ఈ మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. చదవండి: నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ.. కారణం అదేనా.. చదవండి: బ్రిడ్జిపై వింత ఆకారం: పోలీసులు ఏమన్నారంటే.. -
ఆస్పత్రిలో ఫ్లోర్ తుడిచిన మంత్రి.. ‘నేనేం ఎక్కువ కాదు’
ఐజ్వాల్: కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తోంది. పేద, ధనిక తేడాలేకుండా అందరూ ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, మందుల కోసం సోషల్ మీడియాలో వినతులు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల వేళల్లో కనిపించే రాజకీయ నాయకులు ఈ కష్టకాలంలో కంటికి కనిపించడం లేదు. కానీ, ఇందుకు భిన్నంగా మిజోరం విద్యుత్ శాఖ మంత్రి ఆర్ లాల్జిర్లియానా అధికార దర్పం పక్కపెట్టి ఆస్పత్రిలో నేలను శుభ్రం చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మంత్రి ఆర్ లాల్జిర్లియానాను చూసి రాజకీయ నాయకులు కళ్లు తెరవాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. " నేను ఆసుపత్రిలో నేలను శుభ్రంచేసి వైద్యులు, నర్సులను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. ఈ పని చేసి నేనొక ఉదాహరణగా నిలవాలి, అది ఇతరులకు అవగాహన కల్పించాలన్నదే నా ఆలోచన. మేము ఆస్పత్రిలో బాగానే ఉన్నాం. వైద్యులు, నర్సులు బాగా చూసుకుంటున్నారు." అని మంత్రి ఆర్ లాల్జిర్లియానా మీడియాతో అన్నారు. అంతేకాకుండా తానున్న గది అపరిశుభ్రంగా ఉండటంతో స్వీపర్కి ఫోన్ చేయగా, అటువైపు నుంచి స్పందన రాలేదని, దీంతో తానే శుభ్రం చేసినట్లు వివరించారు. "నాకు ఇలాంటి పనులు కొత్తేం కాదు. అవసరం అనుకున్నప్పుడు నేను ఇలాంటి పనులు చేస్తుంటాను. నేను మంత్రి పదవిలో ఉన్నప్పటికీ.. ఇతరుల కంటే ఎక్కువని అనుకోవట్లేదు" అని ఆయన చెప్పారు. మంత్రితో పాటు ఆయన భార్య, కుమారుడు కూడా అదే ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్నారు. గత సంవత్సరం మిజోరంలోని మంత్రులు వీఐపీ సంస్కృతిని పక్కన పెట్టి ఇంటి పనులు చేయడం, ప్రజా రవాణా, మోటారు బైక్లో ప్రయాణించారు. వీరు వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం.. క్రిస్మస్ వంటి పండుగ సీజన్లో వంట మనుషులుగా పనిచేయడం ద్వారా సామాన్యులుగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. (చదవండి: వైరల్: బొమ్మతో చిరుతనే ఆటపట్టించిన చిన్నారి!) -
వామ్మో మరో కొత్త రకం వ్యాధి.. ఈ సారి పందులపై..
ఐజ్వాల్: ఓ పక్క కరోనా మహమ్మారి వీర విహారం చేస్తూ భారతదేశాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో మరో వ్యాధి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ రూపంలో ఈశాన్య రాష్ట్రం మిజోరంను అల్లాడిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ కారణంగా మిజోరంలో పందులు వేల సంఖ్యల్లో మరణిస్తున్నాయి. గత మార్చి 21న ఈ వ్యాధి వల్ల తొలి మరణం నమోదు అయ్యింది. కాగా ఇప్పటి వరకు మొత్తం 1700 పైగా పందులు మృతిచెందినట్లు సమాచారం. ఈ వ్యాధి కరోనా లానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరిస్తోంది. ప్రస్తుతం ఇది మిజోరంలోని పలు ప్రాంతాలని భయపెడుతోంది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా మిజోరంలో గత నెల రోజులకుపైగా వేల సంఖ్యలో పందుల మరణించాయి. దీని వల్ల రూ.6.91 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రధానంగా ఐదు జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపారు. రాష్ట్ర పశుసంవర్ధక, పశువైద్య విభాగం సంయుక్త డైరెక్టర్ డాక్టర్ లాల్మింగ్థంగా మాట్లాడుతూ.. భయంకరమైన ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు మరింత వ్యాప్తి చెందుతోంది, అయితే కేంద్రంలో రోజువారీ మరణాల సంఖ్య కొన్ని వారాలుగా తగ్గుతున్న ధోరణిని చూపించింది. చనిపోయిన పందుల నమూనాలను ఇప్పటికే పరీక్షల కోసం సేకరించాము. ఈ మరణాలకు గల కారణం స్పష్టంగా తెలియాల్సి ఉంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి దిగుమతి చేసుకున్న పందుల వల్ల ఏఎస్ఎఫ్ సంక్రమణ మూలాలు సంభవిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ( చదవండి: వైరల్: రాక్షసుల కన్నా దారుణంగా ప్రవర్తించారు ) -
ఆ మత్తులో ఏంచేశానో.. 20 ఏళ్లకే హెచ్ఐవీ బారినపడ్డా
ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయడం సహజం. అయితే తాము చేసిన తప్పును గ్రహించి సరిదిద్దుకోని భవిష్యత్తును సరికొత్తగా నిర్మించుకునేవారు కొందరే ఉంటారు. ఈ కోవకు చెందిన వారే వాన్లాల్రువాటీ కోల్ని. మిజోరంకు చెందిన కోల్ని బాల్యంలోనే మత్తుపదార్థాలకు బానిసైంది. ఇరవై ఏళ్లకే హెచ్ఐవీ బారిన పడింది. అనేక ఇబ్బందులు ఎదురవ్వడంతో తను ప్రయాణించే మార్గం సరైనది కాదని గ్రహించి తన జీవితాన్ని చక్కదిద్దుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే తనలా బాధపడుతోన్న వారికి అండగా నిలుస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ఐజ్వాల్కు చెందిన 37 ఏళ్ల వాన్లాల్రువాటి కోల్నికి ఎలా అయిందో కానీ చిన్నప్పుడే డ్రగ్స్ అలవాటయింది. ఆ మత్తులో తను ఏం చేస్తుందో తనకి తెలిసేది కాదు. ఫలితంగా 20 ఏళ్లకే హెచ్ఐవీ బారిన పడడంతో శరీరంపై నొప్పితో కూడుకున్న గుల్లలు వచ్చి వాటి నుంచి చీము కారేది. దీంతో తను చికిత్స తీసుకునే ఆసుపత్రి సిబ్బంది ఆమె దగ్గరకు రావడానికి కూడా వెనకాడేవారు. ఒకపక్క శారీరక బాధ, మరోపక్క సమాజం చూపే చీదరింపులు తనని మానసికంగా కుంగదీశాయి. ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి బయటపడాలనుకుంది కోల్ని. పాజిటివ్ ఉమెన్స్ నెట్వర్క్ ఆఫ్ మిజోరం మారాలనుకున్న వెంటనే... డ్రగ్స్ తీసుకోవడం మానేసి ఇంటికి దగ్గర్లో ఉన్న ప్రార్థనామందిరానికి వెళ్లడం ప్రారంభించింది. వాళ్ల బోధలతో తనని తాను మానసికంగా దృఢపరచుకుంది. సమాజంలో ఛీత్కారానికి గురవుతోన్న హెచ్ఐవీ రోగులను ఆదుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే 2007లో ‘పాజిటివ్ ఉమెన్స్ నెట్వర్క్ ఆఫ్ మిజోరం’(పీడబ్ల్యూన్ఎమ్) పేరిట సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా హెచ్ఐవీతో బాధపడుతోన్న మహిళలను ఒక చోటకు చేర్చి వారిని మానసికంగా, ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రోత్సహించడం ప్రారంభించింది. హెచ్ఐవీ రోగుల హక్కులు కాపాడడం, వైద్యసాయం, పునరావాసం ఏర్పాటు చేయడం, వారికి ప్రభుత్వం అందిస్తోన్న పథకాలను అనుసంధానించడం, వివిధ రకాల వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం...ఇలా ఇప్పటి వరకు ఆమె సంస్థ ద్వారా సుమారు పదివేలమందికి పైగా లబ్ధి పొందారు. కోవిడ్–19 మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలోనూ ఎన్జీవో గూంజ్, యూఎన్ ఎయిడ్స్ సంస్థలతో కలిసి డ్రగ్స్ వ్యసనపరులను ఆదుకునేందుకు కృషిచేస్తున్నారు. సమాజంలో ఎదురైన అనేక చీత్కారాలను దాటుకోని నిబద్ధతతో తన పీడబ్ల్యూఎన్ఎమ్ సంస్థను ముందుకు నడిపిస్తోన్న కోల్నికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2019లో హెల్త్ కేటగిరీలో ‘ఉమెన్ ఎక్సెంప్లార్ అవార్డు ఆమెను వరించింది. ‘‘ప్రస్తుత కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ఈ సమయంలోనూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ మా పరిధిలో చేయగలిగిన సాయం చేస్తున్నాం. గత 18 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, ఎన్నో నేర్చుకున్నాను. ఈ అనుభవాలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి’’ అని కోల్ని చెప్పింది. -
బ్రాందీ వద్దు బుక్స్ కావాలి
తెలుగు రాష్ట్రాలలో గ్రంథాలయాలు, పుస్తక పఠనం ఆదరణ కోల్పోతుంటే ‘సెవన్ సిస్టర్స్’గా పిలువబడే ఈశాన్య రాష్ట్రాల్లో ‘రోడ్సైడ్ లైబ్రరీ’ల ఉద్యమం ఊపందుకుంది. మిజోరామ్లో మొదలైన రోడ్సైడ్ లైబ్రరీలు ఇప్పుడు అరుణాచల్ప్రదేశ్కు పాకాయి. నారంగ్ మీనా అనే గిరిజన స్కూల్ టీచర్ అక్కడ ‘వైన్ షాపుల కంటే గ్రంథాలయాలే ఎక్కువ కనపడేలా చేస్తాను’ అంటూ ప్రతిన బూని పని చేస్తోంది. ‘మా అమ్మ నిరక్షరాస్యతే నాకు చదువు అవసరాన్ని తెలియచేసింది’ అని ఆమె అంటోంది. నెల క్రితం వార్తల్లో వచ్చిన మీనా నేడు ఏ విధంగా ఉద్యమాన్ని విస్తరిస్తున్నదో తెలిపే కథనం... రోడ్డు పక్కన పూల చెట్లు కనిపించడం బావుంటుంది. కాని ఆ చెట్లకు పుస్తకాలు కాయడం ఇంకా బాగుంటుంది. ఈశాన్యరాష్ట్రాల్లో కొసాకు ఉండే అరుణాచల్ ప్రదేశ్లో వీధిలో నడుస్తుంటే లైబ్రరీలు కనిపించే ఉద్యమం మొదలైంది. రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో ఒక పుస్తకాల అర, రెండు బల్లలు, రాత్రి పూట చదువుకోవడానికి రెండు లైట్లు... దీనిని ‘రోడ్సైడ్ లైబ్రరీ’ అంటారు. అక్కడ ఎంతసేపైనా కూచుని పుస్తకం చదువుకోవచ్చు. నచ్చిన పుస్తకం పట్టుకుపోవచ్చు. ఇంట్లో తాము చదివేసిన పుస్తకాలను తెచ్చిపెట్టవచ్చు. గొప్ప మెదళ్లు రెండు చోట్ల తయారవుతాయి. ఒకటి తరగతి గదిలో. రెండు గ్రంథాలయంలో. గొప్ప వ్యక్తిత్వాలు కూడా ఈ రెండుచోట్లే రూపు దిద్దుకుంటాయి. ఆ విషయాన్ని కనిపెట్టింది ఇటానగర్కు చెందిన నారంగ్ మీనా అనే గవర్నమెంట్ స్కూల్ టీచర్. వెనుకబడిన తన రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు చైతన్యవంతం కావాలంటే లైబ్రరీలే మార్గం అని ఆమె రోడ్సైడ్ లైబ్రరీల ఉద్యమం మొదలెట్టింది. చదవండి: (వీధిలో విజ్ఞాన వెలుగులు) నారంగ్ మీనా ఏర్పాటు చేసిన రోడ్ సైడ్ లైబ్రరీలు గ్రంథాలయం మనసుకు చికిత్సాలయం ‘ఏ లైబ్రరీ ఈజ్ ఏ హాస్పిటల్ ఫర్ ది మైండ్’ అని ఉంటుంది మీనా నిర్వహిస్తున్న ‘నారంగ్ లెర్నింగ్ సెంటర్’ ఫేస్బుక్ పేజీలో. నాలుగేళ్ల క్రితం మీనా అరుణాచల్ ప్రదేశ్లోని గిరిజన మహిళలు తమ స్వావలంబన కోసం వివిధ ఉపాధి మార్గాలలో నైపుణ్యం పొందే నురంగ్ లెర్నింగ్ సెంటర్ను స్థాపించింది. దాని కార్యకలాపాల్లో భాగంగా రోడ్సైడ్ లైబ్రరీల స్థాపన మొదలెట్టింది. మొదటి లైబ్రరీ నెల క్రితం అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ నుంచి గంట దూరంలో ఉండే నిర్జులి అనే ఊళ్లో ఒక రోడ్డు పక్కన స్థాపించింది. ‘దాని కోసం నేను 20 వేల రూపాయలు ఖర్చు చేశాను. పది వేల రూపాయలు పుస్తకాలకు, పదివేలు స్టాండ్ తయారీకి’ అని నారంగ్ మీనా చెప్పింది. ‘మిజోరంలో ఇద్దరు అధ్యాపకులు (సి.లాంజువాలా, లల్లైసంగ్జూలీ) రోడ్సైడ్ లైబ్రరీలను స్థాపించారు. వారు అమెరికాలో ఇలాంటి లైబ్రరీలు చూసి స్ఫూర్తి పొందారు. వాటికి వచ్చిన ఆదరణ చూసి నేను ప్రేరణ పొందాను’ అని మీనా అంది. మంచి వైపు లాగడానికి ‘మేము పిల్లలకు చాక్లెట్లు ఇచ్చి వాళ్లను ఆకర్షించాము. కాని పెద్దలను లాక్కురావాలంటే పెద్ద పనే అయ్యింది’ అని నవ్వుతుంది మీనా. కాని మెల్లగా పెద్దలు కూడా వచ్చి కూచుంటున్నారు. ‘మా నాన్న రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు. కాని ప్రత్యర్థులు ఆయనను హత్య చేశారు. మా అమ్మ నిరక్షరాస్యురాలు. 13 ఏటే పెళ్లి చేసుకొని బాదరబందీల్లో ఇరుక్కుంది. నేను, నా చెల్లెలు బాగా చదువుకున్నాం. బెంగళూరులో చదివాక అమెరికా వెళ్లే వీలున్నా నా ప్రాంతానికి ఏదైనా చేయాలని వెనక్కి వచ్చాను. చూస్తే దారుణమైన వెనుకబాటుతనం. అవినీతి. విలువల్లేనితనం కనిపించాయి. విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? పుస్తకాలు చదవకుండా వీళ్లు ఏం తెలుసుకుంటారు’ అనిపించి రోడ్సైడ్ లైబ్రరీ స్థాపించాను అందామె. వైన్షాపులు కాదు కావాల్సింది ‘వీధికొక వైన్షాప్ కాదు కావాల్సింది. లైబ్రరీ. మా రాష్ట్రంలో వైన్షాప్స్కు మించి లైబ్రరీలు కనిపించాలనేదే నా తపన.’ అందామె. నారంగ్ మీనా ప్రయత్నం దేశంలోనే కాదు విదేశాలలో కూడా ప్రచారం పొందింది. ఆమె లెర్నింగ్ సెంటర్కు కేరళ నుంచి పంజాబ్ వరకు ఎందరో రచయితలు, పుస్తక ప్రేమికులు పుస్తకాల బండిల్స్ పంపుతున్నారు. ‘మీ లైబ్రరీల్లో వీటిని ఉపయోగించుకోండి’ అని కోరుతున్నారు. నారంగ్కు తానేం చేస్తున్నదో స్పష్టత ఉంది. ‘మా రాష్ట్రంలో తిరప్ జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం. రోడ్సైడ్ లైబ్రరీలు ఎక్కువ కావాల్సింది అక్కడే. అక్షరాస్యతను పెంచాలన్నా చదువు మీద ఆసక్తి కలగాలన్నా లైబ్రరీలు కళ్ల ముందు కనిపిస్తూ ఉండాలి. నేను ఆ ప్రాంతం మీద ఫోకస్ పెట్టాను’ అంది నారంగ్. వాక్యం రాయలేని విద్యార్థులు ‘నేను టీచర్గా మా విద్యార్థులను చూస్తున్నాను. సొంతగా వాక్యం రాయడం రావడం లేదు. పుస్తకాలు చదవకుండా వీరికి భాష ఎలా తెలుస్తుంది. వ్యక్తీకరణ ఎలా పట్టుబడుతుంది? పుస్తకం చదవకపోతే మాతృభాషను కూడా కోల్పోతాం. తల్లిదండ్రులు పిల్లలను పుస్తకాలు చదవడానికి ప్రోత్సహించాలి. ఇందుకు గట్టిగా ప్రయత్నించాలి’ అంటుంది నారంగ్. ఆమెలాంటి వారు ఈ దేశానికి గట్టిగా వంద మంది చాలు... పుస్తకాల చెట్లు వీధి వీధిన మొలవడానికి. ఈశాన్యరాష్ట్రాల ఉద్యమం దేశమంతా పాకాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
ఆ గేయం వెనకనున్న గాయాలెన్నో?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘పాట అనేది అంతర్జాతీయ భాష. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు. ఆస్వాదించగలరు’ అనే నానుడి అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. పాట లేదా సంగీతం మిజోరమ్ ప్రజలకు మాత్రం మాతృభాష. అదే మాతృభూమి భారత్ గురించి ప్రముఖ సంగీతకారుడు ఏఆర్ రెహమాన్ సమకూర్చిన ‘మా తుజే సలామ్’ పాటతో మిజోరమ్కు చెందిన నాలుగేళ్ల పాప ఈస్తర్ హ్నామ్తే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆమె పాడిన పాట వీడియోను ఇప్పటికే సోషల్ మీడియాలో పది లక్షల మందికి పైగా వీక్షించారు. దాన్ని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాప పాటను ‘అద్భతం’ అంటూ ప్రశంసించకుండా ఉండలేక పోయారు. (చదవండి : నాలుగేళ్ల చిన్నారిపై మోదీ ప్రశంసలు) మిజోరమ్లోని లుంగ్లీ ప్రాంతానికి చెందిన ఆ పాప ఇదొక్కటే పాడలేదు. ఇంతకుముందు ఆ పాప పాడిన ‘వన్ డే ఎట్ ఏ టైమ్’, కా ఫాక్ హాంగ్, ఖాపూ మావీ అన్న పాటలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. మిగతా పాటలన్నీ ఒక ఎత్తయితే ‘మా తుజే సలాం’ అనే పాటను ఆ పాప పాడటం, ఆమెతోని ఉద్దేశపూర్వకంగానే ఆ పాటను పాడించడం ఓ సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. ‘మే భారతీయులం, భారతీయులంతా మా సోదర, సోదరీమణులు’ అని మిజోరం ప్రజల తరఫున ఆ పాప బలంగా ఓ సందేశాన్ని ఇచ్చింది. ‘దేశంలోనే అత్యంత ఆనందకర రాష్ట్రం’ అన్న ప్రశంసలు అందుకున్న మిజోరమ్ ప్రజలను మాత్రం భారతీయులు పర జాతిగానే చూశారు. ‘టిబెటో–బర్మన్’ జాతికి చెందిన మిజోలను చూస్తే ఉత్తర, దక్షిణాది ప్రజలకు విదేశీయులుగా కనిపిస్తారు. ‘మా తుజే సలాం’ పాటను పాడిన ఈస్తర్ను తీసుకొని వారి తల్లిదండ్రులు భారత్లో తిరిగితే చైనా లేదా నేపాల్కు చెందిన వారని పొరపాటు పడతారు. అలా చూడడం వల్లనే మిజోలు 1966లో భారత్ నుంచి విడిపోయేందుకు ఆయుధాలు పట్టారు. ‘మిజో నేషనల్ ఫ్రంట్’ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. భారత వైమానిక దళం ఆ తిరుగుబాటును కఠినంగా అణచివేసింది. ఆ సమయంలో దాదాపు 20 ఏళ్లపాటు మిజోలు అష్టకష్టాలు అనుభవించారు. అందుకని మిజోలు తమ ప్రాంతాన్ని స్థానిక భాషలో ‘రాంభూయి (కల్లోల ప్రాంతం)’ అని వ్యవహరించేవారు. 1986, జూన్ 30వ తేదీన మిజో నేషనల్ ఫ్రంట్కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్యన శాంతి ఒప్పందం కుదిరాకా అక్కడ ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడప్పుడు పొరుగునున్న అస్సాంతో సరిహద్దు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ‘మా తుజే సలాం’ పాటను అంత హృద్యంగా పాడినందుకు ప్రజలంతా ఆ పాపకు సలాం చేయాల్సిందే. అక్షరాస్యతలో రెండో స్థానంలో ఉన్న మిజోలను భారత ప్రభుత్వం షెడ్యూల్ తెగలుగా గుర్తించినప్పటికీ వారికి జరగాల్సిన అభివృద్ధి జరగడం లేదన్నది వాస్తవం. -
అమోఘం.. అద్భుతం: మోదీ
న్యూఢిల్లీ: నాలుగేళ్ల చిన్నారి ఎస్తేర్ హమ్నాట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం చిన్నారిపై ప్రశంసలు కురిపించారు. ఇక నెటిజన్ల ప్రశంసలకైతే హద్దే లేకుండా పోయింది. మరి ఇంతకు ఆ చిన్నారి ఏం చేసింది.. ఎందుకు ఇన్ని ప్రశంసలు అందుకుంటుందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. బంకీమ్ చంద్ర చటోపాధ్యాయ వందేమాతం వర్షన్ని ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రఖ్యాత భారతీయ సంగీతకారుడు ఏఆర్ రెహమాన్ చేసి ‘మా తూజే సలాం’ పేరిట రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను మిజోరాంకు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఎస్తేర్ హమ్నాట్ అంతే హృద్యంగా పాడింది. చిన్నారి ప్రతిభకి మిజోరాం ముఖ్యమంత్రి జోరామ్తంగ ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో షేర్ చేశారు. ఇది కాస్త ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించింది. (చదవండి: అప్పులపాలై ఇంటికి తిరిగొచ్చిన పిల్లి!) మోదీ కూడా హమ్నేట్ టాలెంట్కు ముగ్దుడయ్యారు. ‘ఎస్తేర్ హమ్నేట్ వందేమాతర ప్రదర్శన అమోఘం.. అద్భుతం’ అని ప్రశంసిస్తూ జోరామ్తంగ ట్వీట్ని రీ ట్వీట్ చేశారు. ఇప్పటికే అమితాబ్ వంటి పెద్దల ప్రశంసలు పొందిన హమ్నేట్.. ఇప్పుడు ఏకంగా ప్రధాని మెప్పు కూడా పొందింది. దాంతో సోషల్ మీడియాలో తెగ వైరలయిన ఈ వీడియో.. మోదీ ప్రశంసలతో మరో సారి వెలుగులోకి వచ్చింది. ‘ప్రియమైన సోదర సోదరీమణులారా, మీరు భారతీయులని గర్వపడండి, ఇది ప్రేమ, సంరక్షణ, ఆప్యాయతలకు పుట్టిల్లు. మనోహరమైన వైవిధ్యత దీని సొంతం’ అనే క్యాప్షన్తో యూట్యూబ్లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
అస్సాం, మిజోరాంల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు
గువాహటి: అస్సాం, మిజోరాం మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. చెట్లు నరికేసే విషయంలో రెండు రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల్లో ఇటీవల ఘర్షణ చోటుచేసుకుంది. తాజాగా తమ భూభాగంలో మిజోరాం పోలీసులు బంకర్ల లాంటి నిర్మాణాలు చేపట్టారని అస్సాం ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు అస్సాంలోని చాచర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లీ అస్సాంలోని కొలాషిబ్ జిల్లా అధికారులకు లేఖ రాశారు. కులిచెరా ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాల వల్ల స్థానికంగా శాంతి భద్రతలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేశారు. వాటిని వెంటనే తొలగించాలని కోరారు. జాతీయ రహదారి 306 పక్కన జేసీబీలతో బంకర్లు నిర్మించారని అస్సాం సర్కారు చెబుతోంది. -
అస్సాం–మిజోరం సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
ఐజ్వాల్/సిల్చార్/గువాహటి: అస్సాం, మిజోరం సరిహద్దులో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సరిహద్దులోని ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని అధికారులు చెప్పారు. భద్రతా సిబ్బంది రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు. ఘర్షణకు దారి తీసిన పరిణామాలు, తక్షణం చేపట్టాల్సిన కార్యాచరణపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్కుమార్ భల్లా సోమవారం ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. (అత్యంత సంక్లిష్ట దశలో ప్రజాస్వామ్యం) అస్సాంలోని లైలాపూర్, మిజోరంలోని వైరెంగ్టే గ్రామ ప్రజల మధ్య ఘర్షణ మొదలైంది. ఇరు వర్గాల ప్రజలు కర్రలతో దాడి చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. దాదాపు 20 గుడిసెలకు నిప్పుపెట్టారు. సరిహద్దులో చెట్లు కొట్టే విషయంలో వీరి మధ్య వివాదం మొదలైందని స్థానికులు అంటుండగా బయటి వారి జోక్యం ఉందని అధికారులు అంటున్నారు -
గర్భిణికి పురుడు పోసిన ఎమ్మెల్యే
ఐజ్వాల్: ప్రసవ వేదనతో బాధపడుతున ఓ మహిళకు మిజోరాంకు చెందిన శాసనసభ్యుడు పురుడుపోశారు. సమయానికి ఎమ్మెల్యే స్పందించడంతో బాధిత మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎమ్మెల్యే చొరవతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. సోమవారం తన సొంత నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో శాసనసభ్యుడు, డాక్టర్ జెడ్ఆర్ థియామ్సంగ పర్యటించారు. ఈ సమయంలోనే నాగూర్ గ్రామంలో నెలలు నిండిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యేకు సమాచారం అందింది. వృత్తిరీత్యా గైనకాలజీ డాక్టర్ అయిన థియామ్సంగ చాంఫై ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పురుడు పోశారు. చాంఫై ఆస్పత్రి డాక్టర్ అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉండటంతో గర్భిణికి ఎమ్మెల్యే సీజేరియన్ చేశారు. (మెసేజ్ చూశారని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య!) అయితే గతంలో కూడా థియామ్సంగ మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న సిబ్బందికి వైద్యం సాయం అందించేందుకు 7 కిలోమీటర్లు నడిచి వార్తలో నిలిచారు. కాగా.. 2018 ఎన్నికలలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) టికెట్పై పోటీ చేసి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టిటి జోతన్సంగను ఓడించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నారు. -
మరోసారి వార్తల్లో మిజోరం ఎమ్మెల్యే
ఐజ్వాల్ : మిజోరాం శాసనసభ్యుడు డాక్టర్ జెడ్ఆర్ థియామ్ సంగ (62) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రజాప్రతినిధిగానే గాకుండా, ఒక వైద్యుడిగా కూడా మెడలో స్టెత్ తో ఎపుడూ సిద్ధంగా ఉండే ఆయన మరోసారి డాక్టర్ అవతారమెత్తారు. ఛాంపై జిల్లాలోని భూకంపం సంభవించిన ప్రాంతాల పర్యటన సందర్భంగా ఒక గర్భిణీ ప్రాణాలను కాపాడిన వైనం ప్రశంసలందుకుంటోంది. ఇటీవలి భూకంపాల నష్టాలను అంచనా వేయడంతోపాటు, కరోనా పరిస్థితిని తెలుసుకునేందుకు మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని తన నియోజకవర్గం, ఛాంపై నార్త్ను ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మారుమూల ఎన్గూర్ గ్రామానికి చెందిన లాల్మంగైహ్సంగి (38)కు పురిటి నొప్పులు ప్రారంభమైనాయి. మరోవైపు ఆరోగ్య సమస్యల కారణంగా చంపై ఆసుపత్రి వైద్య అధికారి సెలవులో ఉన్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో విషయం తెలుసుకున్న గైనకాలజీ స్పెషలిస్టు అయిన ఎమ్మెల్యే వెంటనే ఒక వైద్యుడిగా రంగంలో దిగారు. అత్యవసరంగా సిజేరియన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు. అవసరమైన వారికి సహాయం చేయడం, పేద ప్రజలకు సహాయం చేయడం తన ముఖ్యమైన కర్తవ్యంగా భావించానని థియామ్ సాంగ్ తెలిపారు. అందుకే తాను ఎమ్మెల్యేగా ఎన్నికైందని చెప్పారు. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐజాల్కు ప్రయాణించే స్థితిలో లేపోవడంతో తానే ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ బాగానే ఉన్నారని చెప్పారు. కాగా గతనెలలో భారతదేశం-మయన్మార్ సరిహద్దు కాపలా సిబ్బందికి వైద్యం సాయం అందించేందుకు వాగు దాటి 7 కిలోమీటర్లు నడిచి వార్తలో నిలిచారు. 2018 ఎన్నికలలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) టికెట్పై పోటీ చేసి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టిటి జోతన్సంగను ఓడించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్ కూడా ఉన్నారు. -
కరోనా కట్టడిలో ఆ రాష్ట్రం ఆదర్శం
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి చేయడంలో పేద ప్రజల ఆకలిదప్పులను తీర్చడంలో మిజోరం అన్ని రాష్ట్రాలకన్నా ముందుంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 145 కాగా, వారిలో 30 మంది పూర్తిగా కోలుకున్నారు. ఒక్కరు కూడా మృత్యువాత పడలేదు. ఇతర రాష్ట్రాలు లేదా దేశాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరే ఒక్కరు కరోనా వైరస్ బారిన పడ్డారు. మిజోరమ్ రాష్ట్రంలో జూన్ 22వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు లాక్డౌన్ను ఏడవ సారి పొడిగించారు. అందుకని దాన్ని వారు ‘లాక్డౌన్ 7.0’ అని వ్యవహరిస్తున్నారు. అధికారంలోఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో మాత్రం ‘యంగ్ మిజో అసోసియేషన్, మిజో వర్తకుల సంఘం, పంపిణీదారుల సంఘం’ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర సరిహద్దుల గుండా దేశంలోకి ఎవరు చొరబడకుండా మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులో మిజో అసోసియేషన్ సభ్యులే పహరా కాస్తున్నారు. అక్కడి అసోసియేషన్ సభ్యుల జోలికి వెళ్లాలంటే భారత సైనికులే భయపడతారని స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు. ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడంలో, ముఖానికి మాస్క్లు ధరించడంలోనే కాకుండా రోజు విడిచి రోజుకు ఎన్ని వాహనాలను రోడ్లపైకి అనుమతించాలి, ఎన్ని దుకాణాలను తెరచి ఉంచాలనే విషయంలో అక్కడి వారు క్రమశిక్షణ పాటిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యాపారాలు మూత పడడం వల్ల ఉపాధి కోల్పోయిన పేద ప్రజలకు వర్తకుల సహకారంతో మిజో యూత్ అసోసియేషన్ సభ్యులు ఆదుకుంటున్నారు. మొదట్లో లాక్డౌన్ కారణంగా అన్ని వ్యాపారాలు స్తంభించి పోవడం వల్ల రోజుకు రాష్ట్రానికి 9 కోట్ల రూపాయల నష్టం జరిగిందట. ఆ నష్టాన్ని సామాజిక సంస్థల సహకారంతో రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యదర్శి సీ. వన్లాల్ రామ్సంగా ఐదు కోట్ల రూపాయలకు తగ్గించగలిగారట. (భారత్లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు) రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ, భవన నిర్మాణ పనులను పరిమితంగా అమలు చేస్తున్నట్లు రామ్సంగా తెలిపారు. రాష్ట్రంలో సీరియస్ రోగులకు చికిత్స అందించేందుకు కేవలం 37 పడకలే ఉండడం, ఆక్సిజన్ వెంటిలేటర్లు కేవలం 27 మాత్రమే ఉండడంతో ముందు జాగ్రత్తలు పాటించడంలో తాము ముందున్నామని ఆయన చెప్పారు. భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటిస్తూనే తామంతా కలసి మెలసి ఉంటున్నామని, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని అక్కడి కుటుంబాలు తెలియజేశాయి. ఓ కుటుంబ సభ్యుల మధ్య ఉండే సఖ్యత కొన్ని కుటుంబాల మధ్య ఎలా ఉంటుందని ప్రశ్నించగా తామంతా ఒకే జాతివాళ్లమని, ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరికి తెల్సిన వాళ్లేనని వారు చెప్పారు. (వినూత్న ఆలోచన.. విద్యార్థులకు బోధన!) -
మిజోరంలో భూకంపం
ఐజ్వాల్ : ఈశాన్య భారతంలో 12 గంటల వ్యవధిలోనే రెండవ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4:10 గంటలకు మిజోరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ( (ఎన్సిఎస్ )పేర్కొంది. దీని ప్రభావం ఎక్కువగా ఛంపాయ్ జిల్లాలో నమోదైందని దాదాపు 27 కిలోమీటర్ల లోతు వరకు భూమి కంపించినట్లు తెలిపింది. అయితే దీని ద్వారా ఎటువంటి ప్రాణనష్టం జరగలేని అధికారులు వెల్లడించారు. వరుస భూకంపాల వల్ల రాష్ర్టంలోని పలు చోట్ల ఇళ్లు ధ్వంసం అవడంతో పాటు రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఆదివారం 4:16 గంటలకు మణిపూర్లో భూకంపం సంభవించగా, రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్లు మణిపూర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎర్త్ సైన్స్ విభాగం వెల్లడించిన సంగతి తెలిసిందే. (ముంబైకి మరో ముప్పు ) జూన్ 18న ఐదు ఈశాన్య రాష్ర్టాల్లో భూకంపం సంభవించింది. ఛంపాయ్, షిల్లాంగ్ సహా ఐదు ప్రధాన నగరాల్లో భూకంపం భూ ప్రకంనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. వరుస భూకంపాలపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు . ప్రభుత్వానికి అన్నివిధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన మిజోరాం ముఖ్యమంత్రి జొరామ్తంగా కృతఙ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకున్నా ఆస్తినష్టం జరిగిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. (రైతు వేషంలో మంత్రి: సినిమా సీన్ను తలపించేలా.. ) -
వింత ఆచారం : షాపులకు ఓనర్లు ఉండరు
ఐజ్వాల్ : సాధారణంగా కిరాణషాపు నుంచి మొదలుకొని ఏ షాపుకైనా సరే యజమానులు కచ్చితంగా ఉంటారు. వారి ఆధ్వర్యంలోనే షాపు మొత్తం నడుస్తుంటుంది. కాని మిజోరాం రాజధాని ఐజ్వాల్ దగ్గరలో ఉన్న కొన్ని షాపులు మాత్రం యజమానులు లేకుండానే నడుస్తున్నాయి. అక్కడ నివసించే స్థానికులు ఒక ప్రత్యేక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.' న్ఘా లౌ డావర్ సంస్కృతి'గా పిలవబడే సంప్రదాయం ప్రకారం అక్కడ ఉండే దుకాణాలన్ని యజమానులు లేకుండానే నడుస్తుంటాయి.(ధార్వాడ పేడాపై కరోనా నీడ) ఇదంతా ఎందుకంటే చేస్తున్నారంటే.. ఈ ప్రాంతంలో నిజాయితీలో కూడిన మనుషులు నివసిస్తారట. ఎవరు ఎవరిని మోసం చేయరట. వారికి నచ్చినవి కొనుక్కొని ఆ షాపులోనే ఏర్పాటు చేసిన మనీ డిపాజిట్ బాక్సులో డబ్బులు వేసి వెళ్లిపోతారట. ముఖ్యంగా ఇక్కడి షాపులన్ని నమ్మకం పైనే పనిచేస్తాయట. ఇంత ఆధునిక కాలంలో కూడా ఇలాంటి సంప్రదాయాలు పాటించే మనుషులు ఉన్నారా అని ఆశ్చర్యమనిపిస్తే వెంటనే మిజోరాం వచ్చేయండి అంటున్నారు మై హోమ్ ఇండియా ఎన్జీవో సంస్థ. ఎందుకంటే ట్విటర్లో ఈ విషయాన్ని ఆ ఎన్జీవో సంస్థనే షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ' ఒక భారతీయునిగా గర్వపడుతున్నా'.. ' ఐ లవ్ దిస్ పీపుల్ వెరీ మచ్'..' ఇదంతా నమ్మకంపైనై ఆధారపడి ఉంటుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు.