
లక్నో: యూపీ ప్రతిపక్ష నేత, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. యూపీ అక్రమ మైనింగ్ కేసులో రేపు విచారణకు తమ ఎదుట హాజరు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
మైనింగ్లకు సంబంధించి ఈ-టెండర్లలో ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే..సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ సీబీఐ నోటీసుల్లో కోరింది.
మైనింగ్పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం ఉన్నప్పటికీ.. 2012-16 సమయంలో అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వాధికారులు అడ్డగోలుగా అక్రమ గనులకు అనుమతులు మంజూరు చేశారని.. చట్టవిరుద్ధంగా లైసెన్లను రెన్యువల్ చేశారనే అభియోగాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment