Central Bureau of Investigation (CBI)
-
ఇదేం గ్యాంగ్ రేప్ కేసు కాదు.. ఆర్జీకర్ ఘటనపై సీబీఐ
కోల్కతా: సంచలన ఆర్జీకర్ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కోల్కతా హైకోర్టుకు తన నివేదిక సమర్పించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెబుతూనే.. సామూహిక హత్యాచారం జరిగిందన్న వాదనను తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో యువ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందనే అనుమానాలు అప్పట్లో వ్యక్తం అయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని తాజాగా సీబీఐ ధృవీకరించింది. -
వేల కన్నీళ్లను మేం తుడవలేకపోవచ్చు, కానీ.. : సుప్రీం కోర్టు
‘‘ఏ సంస్థను మేం ఇక్కడ నిందించడం లేదు. అలాగే వాటి పని తీరును మేం తప్పుబట్టడం లేదు. దేశంలో వేల మంది కన్నీళ్లు పెడుతున్నారు. అంతమంది కన్నీళ్లను మేం తుడవలేకపోవచ్చు. కానీ, వాళ్ల సమస్యలను మేం ప్రస్తావిస్తాం. కచ్చితంగా సీబీఐ విచారణ జరిపిస్తాం. ఇది మాత్రం స్పష్టం’’ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. న్యూఢిల్లీ: బ్యాంకులకు, బిల్డర్లు.. డెవలపర్లు మధ్య నలిగిపోతూ ఏళ్ల తరబడి సొంతింటి కల కోసం ఆశగా ఎదురు చూస్తున్న కొందరు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్లను ఒక్కటిగా విచారణ జరిపిన జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. బిల్డర్లు, డెవలపర్లు తమ చేతికి ఇంటి తాళాలు ఇవ్వకపోయినా.. ఇంకోవైపు నుంచి బ్యాంకులు ఈఎంలు కట్టాలని వేధిస్తున్నాయని పలువురు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో హోంబయ్యర్లను లోన్లకు మాధ్యమంగా ఉపయోగించుకుంటున్నారని.. ఒకవేళ బయ్యర్లు గనుక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే బ్యాంకులు వాళ్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ తరుణంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కాలపరిమితితో కూడిన సీబీఐ దర్యాప్తునకు కచ్చితంగా ఆదేశిస్తామని తెలిపింది. అలాగే.. ఈ పనిని ఎలా చేపట్టాలనే దానిపై ఒక ప్రణాళికను దాఖలు చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థను కోరింది. ఈ క్రమంలో ఫైనాన్షియర్ల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీపై జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు.బ్యాంకులు ఎలా పనిచేస్తాయో మాకు తెలుసు. సైట్లో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని మీకు తెలుసు. అయినా కూడా 60 శాతం పేమెంట్ చేసేశారు. సైట్లో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా ఇలా ఏలా చేశారు? అని ప్రశ్నించారు. ఇది ఇది లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశమని, అవసరమైతే మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తామని, సహాయం కోసం అమీకస్ క్యూరీని నియమించుకునే అవకాశాలు కూడా పరిశీలిస్తామని పేర్కొంటూ తదుపురి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సాధారణంగా కేసులు ఎక్కువగా ఉన్నప్పుడే అమీకస్ క్యూరీని కోర్టు నియమించుకుంటుంది.ఇదిలా ఉంటే.. నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని హోంబయ్యర్లకు కిందటి ఏడాది జులైలో తన ఆదేశాల ద్వారా భారీ ఊరట ఇచ్చింది సుప్రీం కోర్టు. ఇంటి తాళాలు అందుకోని యాజమానులపై ఈఎంఐ రికవరీ సహా బలవంతపు చర్యలు ఉండకూడదని స్పష్టం చేసింది. అయితే ఆ దేశాల ఆచరణకు నోచుకోవడం లేదు. పైగా ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న సందర్భాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. -
కోల్కతా: నిందితుడికి బెయిల్ ఇవ్వమంటారా? సీబీఐపై కోర్టు ఫైర్
కోల్కతా: కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్రాయ్ను సీబీఐ విచారిస్తోంది. ఈ కమ్రంలో సంజయ రాయ్ బెయిల్ కోరుతూ కోల్కతా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు సీబీఐపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. నిందితుడి తరఫున న్యాయవాది కవితా సర్కార్ వాదనలు వినిపించారు. అనంతరం వాదనలు వినిపించాల్సిందిగా సీబీఐ తరఫున న్యాయవాదిని కోర్టు కోరింది. సీబీఐ న్యాయవాది దీపక్ పోరియా అందుబాటులో లేకపోవటంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో.. ‘నిందితుడు నిందితుడు సంజయ్ రాయ్కు బెయిల్ ఇవ్వమంటారా? న్యాయవాది కోర్టు హాలులో లేకపోవటం సీబీఐ చట్టవ్యతిరేక ప్రవర్తనకు నిదర్శనం. ఇలా చేయటం చాలా దురదృష్టకరం’’ అని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పమేలా గుప్తా సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సుమారు 40 నిమిషాల ఆలస్యం తర్వాత సీబీఐ తరఫున న్యాయవాది కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. నిందితుడు సంజయ్ రాయ్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించారు. సున్నితమైన ఈ కేసులో సీబీఐ చేసే దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తుందని కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న కోర్టు సంజయ్ రాయ్ బెయిల్ పటిషన్ తిరస్కరించింది.ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ను పోలీసులు ఆగస్టు 10వ తేదీన అరెస్ట్ చేశారు. కోర్టు నిందితుడికి సెప్టెంబర్ 20 వరకు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సీబీఐ విచారణలో భాగంగా నిందితుడుకి గత నెలలో పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. -
Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, విపక్షాలను లక్ష్యంగా చేసుకొని వేధించడానికి వాడుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచి్చన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. తమ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు ఇచి్చన సాధారణ సమ్మతిని బెంగాల్ ప్రభుత్వం 2018 నవంబర్ 16న ఉపసంహరించుకుంది. దాంతో రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయలేదు. కొన్ని నెలల క్రితం బెంగాల్లో ఈడీ అధికారుల బృందంపై జరిగిన దాడిపై సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. సందేశ్ఖాలీ అక్రమాలపై దర్యాప్తు చేపట్టింది. దీనిపై బెంగాల్ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి తీసుకోకుండానే సీబీఐ తమ రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసులు దర్యాప్తు చేస్తోందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 131 కింద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. బెంగాల్లో కేసులను భారత ప్రభుత్వం నమోదు చేయలేదని, సీబీఐ నమోదు చేసిందని తెలిపారు. సీబీఐపై ప్రభుత్వæ నియంత్రణ ఉండదన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ దర్యాప్తులో కేంద్రం జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. -
CBI: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారణ కోసం అయిదు రోజుల కస్టడీ కోరుతూ సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో రిమాండ్ పత్రాలను సమర్పించింది. కవిత రిమాండ్ రిపోర్టులో సీబీఐ అధికారులు పలు సంచలన విషయాలు పొందుపర్చారు. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. కవితకు చెందిన జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు చెల్లించినట్లు అభియోగం మోపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని తెలిపింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని పేర్కొంది. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించినట్లు పేర్కొంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని రిపోర్టు రిపోర్టులో వెల్లడించింది. మహబూబ్నగర్లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ. 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తను రూ.14కోట్లు ఇవ్వలేనని అన్నారు శరత్. మొత్తం డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు పేర్కొంది. చదవండి: కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు ఒక్కో రిటైల్ జోన్కు రూ.5 కోట్ల చొప్పున 5 రిటైల్ జోన్లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని సీబీఐ చెబుతోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్ చేశారని, తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారని తెలిపింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్కు కవితే రూ.100కోట్లు చెల్లించారని చెప్పింది. ఇండోస్పిరిట్లో కవిత 65 శాతం వాటా పొందారని, గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారని సీబీఐ పేర్కొంది. ఈ డబ్బును కవిత పీఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడని, ఈ విషయాలన్నింటిపైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలిపింది. ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాలని ప్రత్యేక కోర్టును కోరింది సీబీఐ. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఆమెను అరెస్టు చేయగా జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో గతంలోనూ సీబీఐ ఆమెను హైదరాబాద్లో ఆమెనుప్రశ్నించింది. ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న తీహార్ జైలులో మరోసారి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచింది. విచారణ నిమిత్తం కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కాసేపట్లో న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. మరోవైపు సీబీఐ ప్రశ్నించడం, అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. -
సీబీఐ అరెస్ట్.. కోర్టులో కవితకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్లు.. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలు.. బెయిల్ పిటిషన్లతో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురైంది. లిక్కర్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. కవిత తరపున ఆమె లాయర్ మోహిత్ రావు.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా పిటిషన్ విచారించాలని కోరారు. ఎలాంటి నోటీసులు లేకుండా కవితను జైల్లో సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇది అత్యవసరంగా విచారించాల్సిన పిటిషన్ కాదని స్పెషల్ కోర్టు తెలిపింది. కవిత పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది. రెగ్యులర్గా లిక్కర్ కేసు విచారణ జరిపే కావేరి భవేజా కోర్టులోనే వాదనలు వినిపించాలని జడ్జి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. కాగా లిక్కర్ కేసులో నిందితురాలుగా ఉన్న కవిత ఇప్పటికే తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో గతంలో హైదరాబాద్లో ఆమెను ప్రశ్నించింది. ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న తీహార్ జైలులో మరోసారి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే నేడు అరెస్ట్ చేసింది. ఇవాళ కోర్టులకు సెలవు కావడంతో రేపు(శుక్రవారం) తీహార్ జైలు నుంచి కోర్టుకు కవితను తీసుకెళ్లనుంది. ఉదయం 10:30 కు కోర్టు ముందు ప్రవేశపెట్టనుంది. కవితను వారం రోజుల పోలీస్ కస్టడీకి కోరనుంది. చదవండి: లిక్కర్ స్కాంలో ట్విస్ట్.. కవితను అరెస్ట్ చేసిన సీబీఐ -
సీబీఐ ఇంటరాగేషన్.. కవిత పిటిషన్పై నేడు విచారణ
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన తనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఇంటరాగేషన్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కోర్టు కవితను తీహార్ జైల్లోనే విచారించేందుకు సీబీఐకు ఏప్రిల్ 5వ తేదీన ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే.. ఆమెను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా కోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో.. గడువు ఇస్తూ పిటిషన్పై విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్టైన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే కోర్టు అనుమతి అవసరం. అలా తీహార్ జైల్లో ఉన్న కవితను కోర్టు అనుమతితో సీబీఐ బృందం ప్రశ్నించాలనుకుంది. ఇప్పటికే.. శనివారం తీహార్ జైలుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ అధికారులు కవితను ప్రశ్నించినట్లు సమాచారం. -
బాబు.. బిల్లీ.. లక్ష కోట్లు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు నిజంగా విజనరీయే. 20 ఏళ్ల కిందటే రూ. లక్ష కోట్లు కొట్టేయడానికి పన్నాగం పన్నారంటే... అందుకోసం ఎవ్వరి దృష్టీ పడని క్రీడా రంగాన్ని ఎంచుకున్నారంటే ఏమనుకోవాలి. 2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో తన బినామీ బిల్లీరావు అలియాస్ అహోబిలరావు చేత ‘ఐఎంజీ అకాడెమీస్ భారత్’ అనే కంపెనీని పెట్టించి... అది అమెరికాలో ఉన్న ఐఎంజీ అకాడెమీకి చెందిన కంపెనీ అని నమ్మించి... హడావుడిగా దానికి గచ్చిబౌలిలోని 400 ఎకరాలు కేటాయించి, సేల్డీడ్ కూడా చేసేశారంటే ఏమనుకోవాలి? శంషాబాద్ పక్కన మరో 450 ఎకరాలు కూడా కేటాయించటంతో పాటు... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ ఆ కంపెనీకి 45 ఏళ్ల పాటు లీజుకిచ్చేసి... వాటి నిర్వహణ ఛార్జీలను కూడా ప్రభుత్వమే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారంటే ఏమనుకోవాలి? క్రీడల ద్వారా, వాటి అడ్వర్టయిజ్మెంట్లు, స్పాన్సర్షిప్ల ద్వారా వచ్చే డబ్బులన్నీ ఐఎంజీ అకాడెమీస్కే చెందేలా భారీ దోపిడీకి పథకం వెయ్యగలిగారంటే ఆయన విజనరీయే కదా? ఇప్పటి విలువల ప్రకారం చూస్తే ఈ స్కామ్ విలువ లక్ష కోట్లపైనే. స్పై కెమెరాకు పట్టుబడిన బిల్లీ... ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుంది కాబట్టే 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి గెలిచారు. బాబు ఓడిపోయారు. వైఎస్సార్ ప్రభుత్వం ఐఎంజీ కేటాయింపుల్ని సమీక్షించినపుడు మొత్తం బోగస్ కంపెనీలేనని తేలటంతో ఒప్పందాన్ని రద్దు చేసి, భూమిని వెనక్కి తీసుకుంది. కానీ బాబు గారి ముఠా ఊరుకోలేదు. తమకు కోర్టుల్లో బలం ఉంది కనక... న్యాయస్థానంలో సవాల్ చేశారు. 2009 ఎన్నికల ముందు... ఈ కేసులో తీర్పు వెలువడవచ్చని బిల్లీరావు భావించారు. ఆ సమయంలో ఆయన సన్నిహితుడొకరు ఆయన్ను కలిసి.. తమ సంభాషణను స్పై కెమెరాతో రికార్డు చేశారు. వ్యవస్థ నిర్ఘాంతపోయే నిజాల్ని అప్పట్లో బిల్లీరావు వెల్లడించారు. వాటిని ‘సాక్షి’ ప్రచురించింది కూడా. అప్పట్లో అది సంచలనం కావటంతో... తీర్పు వాయిదా పడింది. న్యాయమూర్తులు మారటంతో సుదీర్ఘకాలం కొనసాగింది. తాజాగా గురువారంనాడు బిల్లీరావు తమకే కేటాయించిన భూముల్ని తమకు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అంతేకాదు... అది మొత్తం వ్యవస్థ నివ్వెరపోయే కుంభకోణమని తేల్చింది. చంద్రబాబు దోపిడీని బయటపెట్టింది. దీనిపై వైఎస్సార్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించగా... అప్పట్లో ఇన్ఛార్జిగా ఉన్న సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ... తమకు తగిన సిబ్బంది లేరన్న సాకుతో దాన్ని చేపట్టలేదు. తాజాగా గురువారంనాడు హైకోర్టు ఈ వ్యవహారంపై వ్యాఖ్యానిస్తూ... దీనిపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించలేదో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేదంటే తామే ఆదేశిస్తామని కూడా స్పష్టంచేసింది. ఈ అంశంపై సమాధానమివ్వాలంటూ అక్కడి ప్రభుత్వానికి వారం రోజుల గడువునిచ్చింది. నిజానికి అప్పట్లోనే సీబీఐ దర్యాప్తు జరిపి ఉంటే.. ఈ పాటికే బాబు దోపిడీ బయటపడి, చంద్రబాబు జైల్లో ఊచలు లెక్కబెడుతుండేవారని స్పష్టంగా చెప్పొచ్చు. బాబు... నా జేబులో ఉంటారన్న బిల్లీ తాజా పరిణామాల నేపథ్యంలో... అప్పట్లో బిల్లీరావు స్పై కెమెరాల సాక్షిగా ఏమన్నారు... బాబు ఎంత ఎంత పెద్ద దోపిడీకి స్కెచ్ వేశారు? వ్యవస్థలో ఎంతమందిని వాడేశారు? వంటి వివరాలు మరొక్కసారి చూద్దాం. ‘‘ఇదిగో తీర్పు ...ఇదే మనకు అనుకూలంగా రాబోతున్న కోర్టు తీర్పు కాపి. ఈ తీర్పును నేనే రాశాను. నేను ఏది రాస్తే అదే తీర్పుగా వస్తుంది. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. ––– కు ఎంత డబ్బులు ఇవ్వాలో చంద్రబాబే చెప్పారు. అసలు ఆయనకు ఉన్న జ్ఞాపక శక్తి అలాంటిది. ఆయనే అన్నీ చూస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు నిద్రలేపి అడిగినా ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ఆయన చెప్పేస్తారు. నేను ఏం చెబితే చంద్రబాబు అది చేస్తారు’’. వాస్తవానికి నాటి వీడియోలో న్యాయ వ్యవస్థలోని పలువురి పేర్లను బిల్లీ వాడేశారు. ‘సాక్షి’ వాటిని ప్రచురించలేదు. ఆ వీడియో కాపీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపింది కూడా. క్రీడా వ్యవస్థను చెరబట్టేందుకు పన్నాగం కేవలం కాగితాలకే పరిమితమైన ఐంఎంజీ భారత్ కంపెనీకి ఉమ్మిడి ఆంధ్ర ప్రదేశ్లోని యావత్ క్రీడా వ్యవస్థను ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు కుతంతం్ర పన్నారు. 2004 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం గెలిచినా, వైఎస్సార్ ప్రభుత్వం నాటి ఒప్పందాన్ని రద్దు చేయకపోయినా... రాష్ట్రంలో క్రీడా వ్యవస్థ మొత్తం ఓ మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోయేది. సామాన్యులెవ్వరూ క్రీడల్లోకి ప్రవేశించే ఆలోచన కూడా చేయలేకపోయేవారు. ఎందుకంటే ఐఎంజీ భారత్ కంపెనీతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అలాంటిది. కేవలం హైదరాబాద్ గచ్చిబౌలిలోని 850 ఎకరాలను కేటాయించడమే కాదు. 16 స్టేడియంలు సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని యావత్ క్రీడా వ్యవస్థను తన బినామీ బిల్లీ రావుకు 45 ఏళ్లపాటు లీజు పేరిట కట్టబెట్టేశారు. ఆ సమయంలో ఆ స్టేడియంలు, వాటి ఆస్తుల నిర్వహణ అంతా ఐంఎంజీ భారత్ పెత్తనం కిందకే వస్తాయి. కానీ ఏటా నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. బీమా ప్రీమియాన్నీ చెల్లిస్తుంది. స్టేడియాల నిర్వహణ కోసం ఆ కంపెనీకి ఉచిత నీరు, ఉచిత విద్యుత్, వినోద పన్ను రాయితీ, విదేశీ సుంకం రాయితీలు అన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది. టీవీ ప్రసార హక్కుల ఆదాయం ఆ కంపెనీకే దక్కుతుంది. అంతేకాదు.. మరో ప్రమాదకరమైన నిబంధననూ చేర్చారు. స్టేడియంలు, వాటి ఆస్తులను ఐఎంజీ భారత్ తన విచక్షణ మేరకు నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసుకోవచ్చనే క్లాజును చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తే ఆ క్లాజు కింద ఆ స్టేడియంలను ఐఎంజీ భారత్ తన సొంతం చేసుకునే హక్కు కల్పించడమన్న మాట. అంటే రాష్ట్రంలో 45 ఏళ్ల పాటు క్రీడా వ్యవస్థ అంతా ఐఎంజీ భారత్ కంపెనీ ముసుగులో చంద్రబాబు గుత్తాధిపత్యం కింద ఉంటుంది. ఏదో ఒక సాకు చూపించి స్టేడియంలు, వాటి ఆస్తులన కూడా ఆ కంపెనీ తాను నిర్ణయించిన నామమాత్రపు ధర కింద కొనుగోలు చేసేసుకోవచ్చు. అంటే ప్రస్తుతం చంద్రబాబు భాషలో చెప్పాలంటే... రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను చంద్రబాబు కుర్చీ మాదిరి మడతపెట్టేస్తారన్నది సుస్పష్టం. కాగా న్యాయ వ్యవస్థ తన నిబద్ధతను, విశ్వసనీయతను మరోసారి చాటిచెప్పింది. చంద్రబాబు, ఐఎంజీ భారత్ కంపెనీ కుతంత్రాలను తిప్పికొట్టింది. ఐంఎంజీ భారత్కు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్లో 850 ఎకరాలను కేటాయించడాన్ని రద్దు చేస్తూ వైఎస్రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఆ భూకేటాయింపులు సరైన నిర్ణయమేనని తీర్పునిచ్చింది. దాంతో చంద్రబాబు భూబాగోతం బెడిసికొట్టింది. ఇపుడు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశిస్తే... చంద్రబాబు ఊచలు లెక్కబెట్టడం ఖాయమనేది న్యాయవర్గాల మాట. -
820 కోట్ల స్కామ్! 67 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: ఐఎంపీఎస్ లావాదేవీల ముసుగులో జరిగిన భారీ కుంభకోణాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో తాజాగా సీబీఐ సోదాలు నిర్వహించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యూకో బ్యాంక్లో జరిగిన భారీ కుంభకోణంలో కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ గురువారం పలుచోట్ల తనిఖీలు చేపట్టింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని ఏడు నగరాల్లో 67 చోట్ల సోదాలు జరుపుతోంది. యూకో బ్యాంక్లోని వివిధ ఖాతాల్లో సుమారు 820 కోట్ల అనుమానాస్పద ఐఎంపీఎస్ లావాదేవీలకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ దాడులు చేస్తోంది. వివిధ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయిన సొమ్మును మళ్లీ వెనక్కి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈ సోదాల్లో భాగంగా యూకో బ్యాంక్, ఐడీఎఫ్సీకి చెందిన 130 పత్రాలను అధికారులు సీజ్ చేశారు. అలాగే మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. 30 మంది అనుమానితులను కూడా విచారించినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు పేర్కొన్నారు. కాగా గత ఏడాది నవంబర్ 10 నుంచి13 మధ్య ఏడు ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 14,600 ఖాతాల నుంచి తమ బ్యాంక్కు చెందిన 41,000 ఖాతాలలో ఐఎంపీఎస్ అంతర్గత లావాదేవీలు తప్పుగా జరిగినట్లు గుర్తించిన యూకో.. సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా నవంబర్ 21న కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. దీని ఫలితంగా బదిలీ చేసిన బ్యాంక్ ఖాతాల నుంచి డెబిట్ కాకుండానే యూకో బ్యాంక్ ఖాతాల్లో రూ. 820 కోట్లు జమ అయ్యాయి. దీంతో డబ్బులు పడ్డాయని తెలిసిన చాలా మంది ఖాతాదారులు వారి ఖాతాలలోని ఆకస్మిక మొత్తాన్ని విత్డ్రా కూడా చేసుకున్నారు. ఇక 2023 డిసెంబర్లోనూ కోల్కతా, మంగళూరులోని యూకో బ్యాంక్ అధికారులకు చెందిన 13 ప్రదేశాలలో సీబీఐ సోదాలు జరిపింది. చదవండి: సవాల్ విసిరితే.. దేనికైనా సిద్ధమే: రాజ్నాథ్ సింగ్ -
Sandeshkhali: షాజహాన్ను సీబీఐకి అప్పగించిన బెంగాల్ పోలీసులు
పశ్చిమ బెంగాల్లోని ‘సందేశ్ఖాలీ’ అరాచకాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన సస్పెండెడ్ టీఎంసీ నేత షాజహాన్ షేక్ను కస్టడీకి అప్పగించే విషయంలో బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ మధ్య రసవత్తర రాజీకీయం నడుస్తోంది. తాజాగా షాజహాన్ను సీబీఐకి అప్పగించేందుకు బెంగాల్ పోలీసులకు కలకత్తా హైకోర్టు కొత్త డెడ్లైన్ విధించింది సందేశ్ఖాలీ కేసుపై జస్టిస్లను హరీష్ టండన్, హిరన్మయి భట్టాచర్యాలతో కూడా ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా షాజహాన్ను నేటి సాయంత్రం 4.15 నిమిషాల వరకు సీబీఐకి అప్పగించాల్సిందేనని ఆదేశించింది. సీఐడీపై కోర్టు ధిక్కారం నమోదు చేయాలని సీబీఐ కోరిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో సీబీఐ అధికారులు బెంగాల్ పోలీసు హెడ్క్వార్టర్కు చేరుకున్నారు. ఎట్టకేలకు షాజహాన్ను పోలీసులు సీబీఐకి అప్పజెప్పారు. ఇక ఈ కేసులో షాజహాన్ షేక్ను సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టు మంగళవారమే ఆదేశాలు ఇచ్చింది. కానీ దీనిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లెక్కచేయలేదు. అతడిని అప్పగించబోమని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారులు కోల్కతాలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా.. షాజహాన్ను అప్పగించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో సీబీఐ అధికారులు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు. చదవండి: Rajasthan : డబుల్ జీరో! కాంగ్రెస్ ‘సున్నా’ రాత మారేనా? అనంతరం సీబీఐ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం నాటి ఆదేశాలపై సుప్రీం ఎటువంటి స్టే ఇవ్వలేదని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం షాజహాన్ షేక్ను అప్పగించడం లేదని ఈడీ చెప్పడంతో నేటి సాయంత్రానికి నిందితుడు షాజహాన్ షేక్ను అప్పగించి తీరాల్సిందేనని హైకోర్టు డెడ్లైన్ విధించింది. కాగా గత కొంతకాలంగా సందేశ్ఖాలీ పేరు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై అతడి అనుచరులు దాడి చేశారు. అనంతరం అతడు స్థానికుల నుంచి భూములు లాక్కోవడం, ఇవ్వని పక్షంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆకృత్యాలపై, టీఎంసీ గుండాలకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు రోడ్డెక్కారు. ఈ ఉద్యమానికి బీజేపీతో సహా ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో జనవరి 5 నుంచి షేక్ షాజహాన్ పరారీలో ఉన్నాడు. దాదాపు 55 రోజుల తర్వాత గవర్నర్, హైకోర్టు అల్టిమేటంతో బెంగాల్ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వమే షాజహాన్ని కాపాడుతోందని బీజేపీ విమర్శిస్తోంది. ఈ వివాదం పెద్దది కావడంతో టీఎంసీ అతడిని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఇతడికి బెయిల్ ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరిస్తూ.. అతడిపై తమక సానుభూతి లేదని ప్రకటించింది. -
1993 పేలుళ్ల కేసులో ‘డాక్టర్ బాంబ్’ తుండాకు ఊరట!
జైపూర్: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలింది. లష్కరే తోయిబా ప్రధాన సభ్యుడు అబ్దుల్ కరీమ్ తుండాను రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. పేలుళ్ల కేసులకు సంబంధించి.. తుండాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. .. అదే సమయంలో ఈ కేసులో అమీనుద్దీన్, ఇర్ఫాన్ అనే ఇద్దరికి జీవితఖైదు విధించింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కరీం తుండా బాగా దగ్గర. బాంబుల తయారీలో నైపుణ్యం ఉన్నందునే కరీం తుండాను ‘మిస్టర్ బాంబ్’గా పేర్కొంటారు. గతంలో.. లష్కరే తోయిబా, ఇండియన ముజాహిద్దీన్, జైషే మహమ్మద్, బబ్బర్ ఖాల్సా సంస్థలకు పని చేశాడు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా పేర్కొంటూ పలు ఉగ్రసంస్థలు దేశంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాయి. 1993లో కోటా, కాన్పూర్, సూరత్, సికింద్రాబాద్ స్టేషన్ల పరిధిలో రైళ్లలో జరిగిన పేలుళ్లు యావత్ దేశాన్ని షాక్కి గురి చేశాయి. ఈ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. అయితే వివిధ నగరాల్లో నమోదైన ఈ కేసులంటిని ఉగ్రవాద నిరోధక చట్టం ఆధారంగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. కరీం తుండాను నిర్దోషిగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించడాన్ని.. సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని సీబీఐ భావిస్తోంది. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. కార్పెంటర్ పని చేసే తుండా.. ముంబై పేలుళ్ల తర్వాతే నిఘా సంస్థల పరిశీలనలోకి వచ్చాడు. ఉత్తరాఖండ్ నేపాల్సరిహద్దులో 2013లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశాయి. 1996 పేలుడు కేసుకు సంబంధించి హర్యానా కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. ఇక.. బాంబు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి కరీం తన ఎడమ చేతిని కోల్పోయాడు. -
అఖిలేష్ యాదవ్కు సీబీఐ నోటీసులు
లక్నో: యూపీ ప్రతిపక్ష నేత, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. యూపీ అక్రమ మైనింగ్ కేసులో రేపు విచారణకు తమ ఎదుట హాజరు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మైనింగ్లకు సంబంధించి ఈ-టెండర్లలో ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే..సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ సీబీఐ నోటీసుల్లో కోరింది. మైనింగ్పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం ఉన్నప్పటికీ.. 2012-16 సమయంలో అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వాధికారులు అడ్డగోలుగా అక్రమ గనులకు అనుమతులు మంజూరు చేశారని.. చట్టవిరుద్ధంగా లైసెన్లను రెన్యువల్ చేశారనే అభియోగాలు ఉన్నాయి. -
‘ఒక్క కేసులో అయినా సీబీఐ విచారణకు సిద్ధమా?’
గుంటూరు, సాక్షి: చంద్రబాబుకి నీతిమంతుడని నిరూపించుకునే అవకాశం ఇచ్చారు ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి. బాబుపై ఉన్న కేసుల్లో ఓ ఒక్కదానికైనా సీబీఐ విచారణకు సిద్ధపడాలని.. 24 గంటల్లో దీనికి స్పందించాలని మంత్రి కాకాణి చంద్రబాబుకి సవాల్ విసిరారు. నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్లు గల్లంతైన కేసులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి దర్యాప్తు సంస్థ సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ తేల్చినా కూడా తనపై తప్పుడు రాతలు ఆగడం లేదని అన్నారాయన. ‘‘గతంలో నాపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ ఛార్జిషీట్ ని కూడా కొన్ని పత్రికలు తప్పుపడుతున్నాయి. సీబీఐ విచారణకి ఎటువంటి అభ్యంతరం లేదని హైకోర్టుకి చెప్పా. సీబీఐ విచారణ గత ఏడాదిగా విచారణ జరిపింది. ఛార్జి షీట్లో స్పష్టంగా నా ప్రమేయం లేదని తేలింది. పోలీసులపై సోమిరెడ్డి పదేపదే చేసిన ఆరోపణలు అవాస్తవాలని స్పష్టమైంది. సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్.. అంతేగానీ చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ కాదు. రెండేళ్లగా పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రుజువైంది. దీనిపై చంద్రబాబు, లోకేష్ నేల టిక్కెట్ సమాధానం చెప్పాలి.. నేల టిక్కెట్ అంటే సోమిరెడ్డి. మీకు అనుకూలంగా వస్తే అత్యున్నత సంస్ధ అంటారు. అదే వ్యతిరేకంగా వస్తే సీబీఐ సరిగ్గా విచారించలేదని చెప్తారు. మీ వారికి బెయిల్ వస్తే న్యాయస్ధానాలు న్యాయం జరిగినట్లు.. లేకపోతే న్యాయస్ధానాలపై దాడులకి సిద్దపడతారు. చంద్రబాబుపై అనేక ఆరోపణలు వచ్చాయి..ఎన్నో కేసులలో స్టే లు తెచ్చుకున్నారు. చంద్రబాబూ.. నీపై నమోదైన కేసులలో ఒక్క కేసులోనైనా నువ్వు సీబీఐ విచారణకి సిద్దమా?. మీ(చంద్రబాబు) పాత్ర లేకుంటే ఎందుకు సీబీఐ విచారణ కోరటం లేదు. నీపై వచ్చిన అభియోగాలపై ఎటువంటి విచారణకి సిద్దమా? లేదా? స్పష్టత ఇవ్వాలి. నువ్వు నీతిమంతుడివైతే సీబీఐ విచారణ జరిపించుకోవాలి. 24 గంటల లోపుల నా సవాల్ కి స్పందించాలి. నా సవాల్ స్వీకరించకపోతే తాను అవినీతిపరుడని చంద్రబాబే ఒప్పుకున్నట్లే అని మంత్రి కాకాణి అన్నారు. చంద్రబాబు, టీడీపీ హయాం కంటే రైతులకు మేం ఎక్కువ మేలు చేశాం. టీడీపీ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణపై సీబీఐ విచారణకి సిద్దమా?. చంద్రబాబు మోసగాడని ప్రజలు భావిస్తున్నట్లుగానే.. ఇప్పుడు మోసపూరిత హామీలు ఇస్తున్నారు అంటూ మంత్రి కాకాణి చురకలు అంటించారు. -
అక్రమ ఆస్తుల కేసులో డీకేఎస్కు ఎదురుదెబ్బ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదు అయిన అక్రమ ఆస్తుల కేసు కొట్టేయాలని ఆయన వేసిన పిటిషన్ను హైకోర్టు గురువారం కొట్టేసింది. అంతేకాదు సీబీఐ విచారణ నిలుపుదల పేరిట గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వుల్ని ఎత్తేస్తూ.. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి పూర్తి నివేదిక సమర్పించాలని కోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ఆదాయానికి మించిన ఆస్తుల్ని కలిగి ఉన్నారంటూ డీకే శివకుమార్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. గతంలో సమన్లు ఇచ్చి ఆయన్ని విచారించింది కూడా. ఈ క్రమంలో శివకుమార్ కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదు అయ్యాయి. అయితే కర్ణాటక ఎన్నికల సమయంలో(ఫిబ్రవరిలో) శివకుమార్ అభ్యర్థన పిటిషన్ ఆధారంగా హైకోర్టు సీబీఐ విచారణపై స్టే విధించింది. ఈ స్టేపై సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లగా.. జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తాజాగా కేసు కొట్టేయాలని ఆయన వేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. సీబీఐ దర్యాప్తునకు మార్గం సుగమం చేసింది హైకోర్టు. In a setback to Karnataka Deputy CM #DKShivakumar, #KarnatakaHC has refused to quash a corruption case registered against him by the #CBI for allegedly possessing assets worth ₹74.93 crore disproportionate to his known sources of income | @Kpsagri reportshttps://t.co/jw0MOK5o6I — The Hindu-Bengaluru (@THBengaluru) October 19, 2023 -
ఒకరిది ఓర్పు.. పిరికితనం మరొకరిది!
తెలుగుదేశం పార్టీ చేస్తున్న విన్యాసాలు గమ్మత్తుగా ఉన్నాయి. వారికి ఎప్పుడు ఏ నిరసన చేపట్టాలో కూడా తెలియనట్లుగా ఉంది. గతంలో యూపీఏ ఛైర్ పర్సన్ గా ఉన్న సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమ్మక్కై ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, అప్పట్లో ఎంపీగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూరిత కేసులు పెట్టినప్పుడు ఆయన ఎదుర్కున్న తీరు.. అవినీతికి పాల్పడి ప్రభుత్వ నిధులు కైంకర్యం చేశారన్న ఆరోపణలకు గురై జైలు పాలైన చంద్రబాబు నాయుడు వైనానికి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. జగన్ కనీసం ప్రభుత్వంలో మంత్రి కాదు. ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్ చేపట్టిన కొన్ని పరిశ్రమలలో కొందరు పెట్టుబడులు పెట్టడాన్నే అవినీతిగా చూపించి, దానికి క్విడ్ ప్రోకో అని పేరుపెట్టి ఆయనను నిర్భంధించారు. విశేషం ఏమిటంటే ఆనాడు మంత్రివర్గం వివిధ పరిశ్రమలకు సాధారణంగా ఇచ్చిన రాయితీలను సైతం తప్పుపట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అందుకు విరుద్దంగా మాట్లాడుతున్నారు. మంత్రివర్గ నిర్ణయాలకు తనను బాధ్యుడిగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినీతికి పాల్పడ్డారని సీఐడీ పలు ఆధారాలు చూపుతోంది. అయినా చంద్రబాబు అవినీతిపరుడు కాడని తెలుగుదేశం అంటోంది.ఆ పార్టీ వాదనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంత పాడుతున్నారు. ✍️ఇక ఆయన కుటుంబ సభ్యులు అబ్బే! మాకు ఎంతో ఆస్తి ఉంది. హెరిటేజ్ లో రెండు శాతం షేర్లు అమ్ముకుంటే రూ.400 కోట్లు వస్తాయి.. అని చెబుతున్నారు. అలాంటప్పుడు ఎంత పద్దతిగా ,ఎంత నిజాయితీగా పాలన సాగించి ఉండాలి. కాని అందుకు విరుద్దంగా నానా రకాల స్కామ్ లకు చంద్రబాబు బృందం పాల్పడింది.జగన్ పై కేసులు పెట్టడం కోసం ఆనాడు న్యాయ వ్యవస్థను వాడుకున్నారని పలువురు మేధావులు బహిరంగంగానే వ్యాఖ్యానించేవారు. ఎందుకంటే జగన్ తో కాని, ఆయన సంస్థలతో కాని సంబంధం లేని వ్యక్తి ఒకరు హైకోర్టుకు లేఖ రాస్తే.. దానిపై కనీసం సంతకం లేకపోయినా విచారణకు తీసుకున్న తీరు విమర్శలకు గురి అయింది. దానిని అత్యంత వేగంగా సీఐబీకి అప్పగించారు. ఆ తర్వాత ఆ న్యాయమూర్తికి ఉమ్మడి ఏపీలో ఒక ఉన్నత పదవి కూడా ఇవ్వడంతో పలు విమర్శలు వచ్చాయి. సీబీఐని అడ్డుపెట్టుకుని జగన్ పై ఒక కేసు కాదు.. పదకొండు కేసులు పెట్టి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అప్పట్లో ఎంతగానో నష్టపోయింది. సోనియాగాంధీ, చంద్రబాబు, ఆ సీబీఐ అధికారి అందుకు కారణం అని నిర్వివాదాంశంగా అంతా భావిస్తారు. పరిశ్రమలు పెట్టకుండా బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసినవారేమో దర్జాగా బయట తిరుగుతుంటే వారి జోలికి వెళ్లని సీబీఐ.. ఏపీలో మాత్రం పరిశ్రమలు పెట్టేవారిని అరెస్టు చేసింది. వీరి కుట్ర కారణంగా చీరాల,రేపల్లె ప్రాంతంలో రావాల్సిన పలు భారీ పరిశ్రమలు ఆగిపోయాయి. పదమూడువేల ఎకరాలు సేకరించినప్పటికీ వాటిని నిరుపయోగంగా ఉంచేయవలసి వచ్చింది. అది వినియోగంలోకి వచ్చి ఉంటే వేలాది మందికి ఉపాది కల్పిస్తున్న మరో శ్రీసిటీ తయారయ్యే అవకాశం ఉండేది. అలా జరగనివ్వకుండా అభివృద్దిని అడ్డుకోవడమే కాకుండా ,జగన్ ను ఎలాగైనా రాజకీయాలలో లేకుండా చేయాలని సోనియా, చంద్రబాబులు విపరీతమైన కృషి చేశారు. అప్పట్లో హైకోర్టులో ఈ కేసు రాగానే ఇదేదో కుట్రేమో అని చాలామంది అనుకున్నారు. అలాగే ఆ వ్యవహారం కొనసాగింది. ✍️సీబీఐ జగన్కు నోటీసు ఇస్తే.. ఆయన దానిపై విమర్శలు చేయలేదు. మాచర్ల వద్ద ఆయన ప్రచార సభలో ఉన్నప్పటికీ, నిర్దిష్ట తేదీ ప్రకారం సీబీఐ విచారణకు వెళ్లారు. కొన్ని రోజులు ఆ విచారణ చేశాక ఆయన్ని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఉమ్మడి ఏపీ అంతటా అలజడి ఏర్పడింది. కాని గొడవలు జరగలేదు. ప్రజలంతా ఇది కుట్ర అని నమ్మారు. అందుకే ఆ టైమ్ లో జరిగిన ఉప ఎన్నికలలో జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 ఉప ఎన్నికలకుగాను.. పదిహేను చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు చోట్ల, టీఆర్ఎస్ ఒక చోట గెలిచాయి. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడింది. కొన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అలా ప్రజల మద్దతు జగన్ కు లభించింది. ✍️ఆయన జైలులో ఉన్న పదహారు నెలలు న్యాయ పోరాటం చేశారే కాని, రోడ్లపై ఆందోళనలు జరపలేదు. కేవలం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతపార్టీ పెట్టుకున్నందుకే జగన్ అన్ని కష్టాలు పడవలసి వచ్చింది. తనకు సమస్యలు వస్తాయని తెలిసినా.. జగన్ ధైర్యంగా తట్టుకుని నిలబడ్డారే కాని, ఎక్కడా తగ్గలేదు. డప్పులు కొట్టడాలు, ఈలలు ఊదడాలు వంటివి చేయలేదు. ఆ రోజుల్లో జగన్ పై ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు ఎంత ఘోరమైన కధనాలు రాసేవో తలచుకుంటే చీదర వేస్తోంది. సీబీఐ విచారణ పేరుతో ఉన్నవి.. లేనివి రాసేవారు. పలుమార్లు జగన్ను తీహారు జైలుకు పంపేస్తారని, ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదని వార్తలు వండేవారు. తెలుగుదేశం పార్టీ ఎంత నీచంగా విమర్శలు చేసేది అంటే.. వ్యక్తిగత ఆరోపణలకు కూడా దిగేది. చివరికి జగన్ సతీమణి భారతి వెళ్లి ఆయనను జైలులో కలిస్తే కూడా టీడీపీ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేసేవారు..అయినా జగన్ ఓర్పు వహించారు. సహించారు. ధైర్యంతో నిలబడ్డారు. తదుపరి 2014లో అనూహ్యంగా తన పార్టీ గెలవకపోయినా ఆయన చలించకుండా తనదైన శైలిలో ప్రజలలో తిరిగి వారి ఆదరణ పొందారు. అది జగన్ ధైర్యం. ప్రస్తుతం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై వచ్చిన ఆరోపణలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలానివి. జగన్ ప్రభుత్వం రాగానే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి వాటిలో వాస్తవాలను వెలికితీయించింది. అవినీతికి ఆధారాలను కనుగొంది. రాష్ట్ర ప్రభుత్వమే కాదు. కేంద్రానికి చెందిన ఆదాయపన్ను శాఖ చంద్రబాబు కు ఒక నోటీసు పంపి రూ. 118 కోట్ల రూపాయల నల్లధనం ఆయన ఖాతాలలోకి వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపి వివరణ కోరింది. అంతకుముందు చంద్రబాబు పీఎస్గా ఉన్న శ్రీనివాస్ ఇంటిలో సోదాలు జరపడం, చంద్రబాబు టైమ్ లో కాంట్రాక్టులు పొందిన షాపూర్ జీ సంస్థలలో దొరికిన ఆధారాలతో రెండువేల కోట్ల అవకతవకతలు జరిగినట్లు అధికారికంగానే సీబీటీడీ ప్రకటించింది. అయినప్పటికీ చంద్రబాబు అత్యంత నీతిమంతుడని తెలుగుదేశం కాని, ఆయన కుటుంబ సభ్యులు కాని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కాని అవినీతిని సహించను అంటూ బీరాలు పలికిన రామోజీరావు కూడా చంద్రబాబు అసలు అవినీతికి పాల్పడలేదని డబాయిస్తూ కధనాలు ఇస్తున్నారు. తెలుగుదేశం కరపత్రికగా ఈనాడు మీడియాను ఆయన మార్చేశారు. ఆయన పత్రిక చూసినా, ఆయన టీవీని చూసినా నిత్యం అబద్దాలు తప్ప ఇంకేవీ కనిపించడం లేదు. పూర్తిగా విశ్వసనీయతను రామోజీ కోల్పోయారు. ✍️ఇక ఆంద్రజ్యోతి ,టివి 5 వంటి వాటి గురించి రాయడం వృధా. వారు ఎప్పటినుంచో బట్టలు ఊడదీసుకుని శరభ,శరభ అంటూ వేప రెమ్మలు కట్టుకుని తిరుగుతున్నారు. సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో చంద్రబాబును అరెస్టు చేసింది. తెలుగుదేశం వారంతా తమ అధినేత దొరికిపోయారే అని మదనపడుతున్న తరుణంలో ,ఎల్లో మీడియా మాత్రం అసలు ఏమీ జరగలేదని, స్కిల్ కార్పొరేషన్ ద్వారా చాలా మందికి శిక్షణ ఇచ్చారంటూ పిచ్చి ప్రచారం ఆరంభించింది. అంతే తప్ప 240 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు, లోకేష్ లకే చేరిందన్న సీఐడీ వాదనకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నాయి. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు,అమరావతి అస్సైన్డ్ భూములు మొదలైన స్కాములన్నిటిపైన సాక్ష్యాధారాలతో ఏపీ సీఐడీ కేసులు పెడుతుంటే.. వీరికి గుక్క తిరగడం లేదు.గతంలో జగన్ పై కేసులు పెట్టి సీబీఐ విచారణ పేరుతో తంతు సాగిస్తే, ఇప్పుడు సీఐడీ పూర్తి విచారణ చేపట్టి, ఆధారాలు దొరికిన తర్వాతే ,వందల కోట్లు స్వాహా అయ్యాయని నమ్మిన తర్వాతే చంద్రబాబుపై, ఆయన అనుచరులపై కేసులు పెట్టింది. ✍️గతంలో న్యాయ వ్యవస్థలో తాము ఏమి అనుకుంటే అది జరుగుతుందని భావించిన తెలుగుదేశం పార్టీవారికి ఇప్పుడు ఎదురుదెబ్బలు తగులుతుంటే వాటిని తట్టుకోలేకపోతున్నారు. జగన్ కేసుల్లో కాని, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వివిధ విషయాలలో న్యాయ వ్యవస్థ అనుసరించిన వైఖరిపై కూడా విమర్శలు వస్తే , ఆ వ్యవస్తనే తప్పు పడతారా అంటూ తెలుగుదేశం దీర్ఘాలు తీసేది.కాని తన విషయానికి వచ్చేసరికి మాత్రం జడ్జిలను వ్యక్తిగతంగా దూషించడానికి వెనుకాడలేదు. కోర్టులు అన్నిటిని పరిశీలించి చంద్రబాబును రిమాండ్ ద్వారా జైలుకు పంపింది. కింది కోర్టులలో సానుకూల తీర్పులు రాకపోవడంతో ప్రస్తుతం సుప్రింకోర్టుకు చంద్రబాబు వెళ్లారు.ఈలోగా కేసులకు భయపడి చంద్రబాబు కుమారుడు లోకేష్ ఢిల్లీకి చిత్తగించి ఇరవై రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఇంతకాలం మమ్మల్ని ఏమీ చేయలేరు.. ఏం పీకారు..అంటూ రోతరోతగా మాట్లాడిన వీరు ఇప్పుడు హడలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అక్రమ కేసులు అంటూ నిరసనలు, ర్యాలీలు తీస్తున్నారు. క్యాండిళ్లు వెలిగిస్తున్నారు. డప్పులు కొడుతున్నారు. విజిల్స్ ఊదుతున్నారు.వాటిని చూసేవారు ఆశ్చర్యపోయే పరిస్థితి. ✍️చంద్రబాబు జైలుకు వెళితే వీరు సంబరాలు చేసుకున్నట్లు ఉంది తప్ప బాధపడుతున్నట్లు లేదని సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి. నిజంగానే చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఆ డప్పు కొట్టడం ఏమిటి? విజిల్ ఊదడం ఏమిటి? శాసనసభలో ఆమె తండ్రి బాలకృష్ణ అలాగే విజిల్ ఊది నవ్వులపాలైతే, అదే దారిలో ఆమె కూడా వ్యవహరించడం విడ్డూరంగానే ఉంది. వీరు ప్లేట్లు తీసుకుని మోత చేస్తుంటే, గతంలో చంద్రబాబు పాలనలో కాపు రిజర్వేషన్ ఆందోళనకారులు కంచాలు కొట్టినప్పుడు ఆ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించింది అందరికి గుర్తుకు వచ్చింది.గతంలో జగన్ ను కోర్టు జైలుకు పంపింది కనుక అవన్ని సక్రమ కేసులని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేసేవారు. మరి ఇప్పుడు అదే కోర్టు తనను జైలుకు పంపితే మాత్రం అది అక్రమం అని అంటున్నారు.ఆయన నిరసన దీక్ష చేశారట ఆయనకు సంఘీబావంగా ఆయన భార్య భువనేశ్వరి కూడా దీక్ష చేశారు.ఇవి నిరసనలతో పోయే కేసులా? కోర్టులలో రుజువు చేసుకోవలసిన కేసులు కదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. కాకపోతే చంద్రబాబు జైలుకు వెళితే వెళ్లారు ..కనీసం సానుభూతి అయినా సంపాదించాలన్న యావలో ఇలా చేస్తున్నట్లుగా ఉంది. ✍️అప్పట్లో జగన్ ముందుగా బెయిల్ కోసం ప్రయత్నించారు.కాని దానికి కూడా అడుగడుగునా అడ్డుపడేవారు. మామూలుగా అయితే మూడు రోజులలో బెయిల్ రావల్సిన కేసుల్లో జగన్ ను కాబట్టి పదహారు నెలలు ఉంచారని ఒక సీనియర్ న్యాయవాది అప్పట్లో నాతో చెప్పారు. ఇప్పుడు బెయిల్ కోసం కాకుండా కేసును కొట్టివేయించుకోవాలని చంద్రబాబు లాయర్ల ప్రయత్నమట.అందుకే కేసు లోతుల్లోకి వెళ్లకుండా సాంకేతిక అంశాలకే పరిమితమై వాదనలు చేస్తున్నారు. అప్పట్లో జగన్ లాయర్లు ఎక్కడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదు. కాని చంద్రబాబు లాయర్ మాత్రం తాము కోరుకున్న న్యాయం దొరకకపోతే కత్తిపట్టాలన్న ఒక సూక్తిని ప్రచారంలోకి తెచ్చారు.తద్వారా వారు ఎంత డిస్పరేట్ గా ఉందీ తెలియచెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా న్యాయ వ్యవస్థలో తన ఇష్టం వచ్చినట్లు చెలామణి చేసుకున్న చంద్రబాబుకు ఇప్పుడు కాలం మారిందన్న సంగతి అర్దం అవుతుండాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
లాలూ హుషారే చిక్కుల్లో పడేయనుందా?
ఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(75) హుషారుగా ఉండడం.. ఆయన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. గడ్డి కుంభకోణం కేసుల్లో ఒకదాంట్లో అనారోగ్య కారణం చూపించి బెయిల్పై బయట ఉన్న ఆయన.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ, సుప్రీం కోర్టును కోరింది. ఇందుకు ఆయన హుషారుగా బ్యాడ్మింటన్ ఆడుతున్న ఫొటోలను చూపించింది కూడా!. దాణా స్కాంలోని కేసులో లాలూకు జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఈ పిటిషన్పై జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు వింది. లాలూ తరపు సీనియర్ కపిల్ సిబాల్ వాదిస్తూ.. బెయిల్ రద్దు చేయాలనే సీబీఐ అభ్యర్థనను తిరస్కరించాలని బెంచ్ను కోరారు. ఈమధ్యే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిందన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. అలాగే.. 42 నెలలపాటు లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో గడిపిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే.. సీబీఐ తరపున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. ‘‘లాలూకు బెయిల్ మంజూరు విషయంలో జార్ఖండ్ హైకోర్టు న్యాయపరిధికి తగ్గటుగా వ్యవహరించలేదని.. తప్పిదం చేసిందని వాదించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, బ్యాడ్మింటన్ ఆడుతున్న ఫొటోలు ప్రముఖంగా వైరల్ అయిన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘దాణా స్కాం దొరండ ట్రెజరీ కేసులో లాలూకు ఐదేళ్ల శిక్షపడింది. ఈ కేసులో దోషిగా తేలిన తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది. బెయిల్ తర్వాత ఆయన బ్యాడ్మింటన్ ఆడుతూ ఆరోగ్యంగా కనిపించారు. అలాగే.. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలనే హైకోర్టు ఆదేశం తప్పని నిరూపించేందుకు సీబీఐ సిద్ధం. ఆయన మూడున్నరేళ్ల శిక్షను ఏకకాలంలో అనుభవించలేదు. అయితే హైకోర్టు ఆయన శిక్షను ఏకకాలంలోనే అనుభవించారని పొరపడి బెయిల్ మంజూరు చేసింది’’ అని అదనపు సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. వాదనలు ముగియడంతో.. అక్టోబర్ 17వ తేదీకి విచారణ వాయిదా వేసింది సుప్రీం కోర్టు. 1992 నుంచి 1995 మధ్య కాలంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. ఆర్థిక, పశుసంవర్థకశాఖ పోర్ట్ఫోలియోలను తన వద్దే ఉంచుకున్నారు. ఆ సమయంలోనే 950 కోట్ల రూపాయల దాణా కుంభకోణం జరిగిందని.. ఫేక్, ఫోర్జ్డ్ బిల్లులతో ఖజానా నుంచి సొమ్ము తీశారనే అభియోగాలు నమోదు అయ్యాయి. ఇందుకు సంబంధించి ఐదు కేసులు నమోదు అయ్యాయి. ఇందులో దొరండా ట్రెజరీ కేసుకు సంబంధించి 2022 ఫిబ్రవరిలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 60 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన అనారోగ్య కారణాలు చూపించడంతో జార్ఖండ్ హైకోర్టు లాలూకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే.. బెయిల్పై బయట ఉన్న లాలూ.. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత హుషారుగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. లాలూ ఆడుతున్న వీడియోని ఆయన కొడుకు తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘దేనికీ భయపడరు. దేనికీ తలవంచరు. పోరాడారు. పోరాడుతూనే ఉంటారు. జైల్లో పెట్టినా బెదరలేదు. అంతిమంగా విజయమే సాధించారు’’ అని క్యాప్షన్ కూడా ఉంచారు. -
అజేయ కల్లం పిటిషన్ విచారణకు స్వీకరణ
హైదరాబాద్: వివేకా హత్య కేసుకు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. తాను ఇచ్చిన స్టేట్మెంట్ను సీబీఐ అబద్ధాల మయంగా మార్చేసిందన్నది ఆయన వాదన. ఈ క్రమంలో.. గత వారం ఆయన వేసిన పిటిషన్ విచారణ అర్హతకు సంబంధించిన ఆదేశాలను రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఇవాళ(శుక్రవారం) విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో.. రిజిస్ట్రీ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్కు మెయిన్ నంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ‘‘సీఆర్పీసీ సెక్షన్-161 ప్రకారం నోటీస్ ఇవ్వలేదు. మెస్సేజ్ చేసి విచారణకు పిలిచారు. నా స్టేట్మెంట్ రికార్డు చేయలేదు. అప్పటి విచారణాధికారి వికాస్ సింగ్. స్టేట్మెంట్పై సంతకం మాత్రం ముఖేష్ శర్మది ఉంది. సీనియర్ ఐపీఎస్లు అయ్యిఉండి ప్రొసీజర్ ఫాలో కాలేదు. నేను చెప్పింది యధాతథంగా రికార్డు చేయలేదు. దర్యాప్తు వెనకాల దురుద్దేశం కనిపిస్తోంది. సీబీఐ తన ఛార్జిషీట్లో తన స్టేట్మెంట్ తొలగించాలి. తిరిగి తనస్టేట్మెంట్ రికార్డు చేయాలి’’ అని గత వారం హైకోర్టులో వాదనలు సందర్భంగా అజేయ కల్లం న్యాయవాదులు వాదించారు. నాడు చెప్పింది ఇదే.. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ఏప్రిల్ 29, 2023న సీబీఐ అజేయ కల్లం నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. ‘‘మార్చి 15, 2019న జగన్గారి నివాసంలో ఉదయం మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్ షాక్కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారు’’. ఇది తాను సీబీఐకి చెప్పింది.. అంతకు మించి తానేం చెప్పలేదు అని అజేయ కల్లాం అంటున్నారు. స్టేట్మెంట్ అంతా అబద్ధాలమయమే! జగన్ గారి భార్య ప్రస్తావనకాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదు. సీబీఐ తాను ఒకటి చెబితే.. దాన్ని మార్చేసి ఛార్జిషీట్లో మరోలా ప్రస్తావించింది. తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అబద్ధాలే ఉన్నాయి. దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తోంది. తన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్మెంట్గా పేర్కొన్న అంశాలను కొట్టేయాలి. అవసరమైతే తన నుంచి మరోసారి స్టేట్మెంట్ను రికార్డు చేసేలా ఆదేశించాలి. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా వివేకా కేసులో విచారణ సాగాలని తన పిటిషన్లో అజేయ కల్లం కోరారు. -
మణిపూర్ హింస: సీబీఐ దర్యాప్తు బృందంలో 29 మంది మహిళా అధికారులు
మణిపూర్ అల్లర్లలో వెలుగుచూసిన లైంగిక హింస వీడియో కేసును సీబీఐకి కేంద్రం అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించడానికి సీబీఐ దేశవ్యాప్తంగా ఉన్న తన యూనిట్ల నుంచి 53 మంది అధికారులను నియమించింది. వీరిలో 29 మంది మహిళా అధికారులు ఉన్నారు. ముగ్గురు డీఐజీలు లవ్లీ కతియార్, నిర్మలాదేవి, మోహిత్ గుప్తాతోపాటు ఒక ఎస్పీ రాజ్వీర్ సైతం ఉన్నారు. ఇద్దరు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, ఆరుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీస్లు 53 మంది సభ్యుల బృందంలో ఉన్నారు. వీరంతా మొత్తం దర్యాప్తును జాయింట్ డైరెక్టర్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్కు తమ నివేదికను నివేదించనున్నారు. కాగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఒకే కేసులో ఇంత భారీ సంఖ్యలో మహిళా అధికారులను తీసుకోవడం ఇదే తొలిసారని అధికారులు భావిస్తున్నారు. సీబీఐ విచారిస్తున్న ఈ కేసుల్లో చాలా వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989లోని నిబంధనలకు సంబంధించినవని, వీటిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి దర్యాప్తు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే ఇలాంటి కేసుల్లో డీఎస్పీలు పర్యవేక్షకులుగా ఉండటం సాధ్యం కానందున దర్యాప్తును పర్యవేక్షించడానికి సీబీఐ ముగ్గురు డీఐజీలను ఒక ఎస్పీని నియమించినట్లు పేర్కొన్నారు. చదవండి: మధ్యప్రదేశ్లో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’.. దిగ్విజయ్ హాట్ కామెంట్స్ ఈ బృందంలో 16 మంది ఇన్స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు కూడా ఉంటారని అధికారులు తెలిపారు. సాధారణంగా ఇంత పెద్ద సంఖ్యలో కేసులను సీబీఐకి అప్పగించాల్సి వస్తే సిబ్బందిని సమకూర్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సంబంధిత రాష్ట్రంపై ఆధారపడి ఉంటుందని, అయితే కానీ మణిపూర్ విషయంలో దర్యాప్తులో పక్షపాత ఆరోపణలు రాకుండా స్థానిక అధికారుల పాత్రను తగ్గించడానికి సీబీఐ ప్రయత్నిస్తోందని అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇరు వర్గాల వ్యక్తుల ప్రమేయం ఉండకుండా ఉందేందుకు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే సీబీఐ ఎనిమిది కేసులు నమోదు చేసింది. ఇందులో రెండు కేసులో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుకు సంబంధించినవి. మణిపూర్ హింసాకాండకు సంబంధించి మరో తొమ్మిది కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. దీంతో సంస్థ విచారించనున్న మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది.ఈ కేసులో కాకుండా మహిళలపై నేరాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన మరే ఇతర కేసులను కూడా ప్రాధాన్యత ఆధారంగా విచారిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో చురచంద్పూర్ జిల్లాలో జరిగిన లైంగిక వేధింపుల కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ స్వీకరించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మార్చి 3న మణిపూర్ హింస మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు.మే 4న కుకి జాతికి చెందిన ఓ గ్రామంపై దాడి చేసిన దుండగులు.. ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి, ఊరేగించారు. ఓ ఫేక్ వీడియోను చూసి, కోపంతో ఈ దారుణానికి ఒడిగనట్టు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరిపై సామూహిక అత్యాచారం కూడా జరిగింది, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు జులై 26 వెలుగులోకి రాగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చదవండి: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం.. -
‘వివేకా కేసు దర్యాప్తులో దురుద్దేశం కనిపిస్తోంది!’
సాక్షి, హైదరాబాద్: వివేకా కేసులో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. తన స్టేట్మెంట్ను యధాతథంగా రికార్డు చేయలేదని.. తిరిగి తన స్టేట్మెంట్ను రికార్డు చేయించేలా దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలో ఇవాళ వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును రిజర్వ్ చేసింది. వివేకా కేసులో సీనియర్ అధికారి అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ‘‘సీబీఐ సీఆర్పీసీ సెక్షన్-161 ప్రకారం నోటీస్ ఇవ్వలేదు. మెస్సేజ్ చేసి విచారణకు పిలిచారు. నా(అజేయ కల్లం) స్టేట్మెంట్ రికార్డు చేసింది అప్పటి విచారణాధికారి వికాస్ సింగ్. స్టేట్మెంట్పై సంతకం మాత్రం ముఖేష్ శర్మది ఉంది. సీనియర్ ఐపీఎస్లు అయ్యిఉండి ప్రొసీజర్ ఫాలో కాలేదు. నేను చెప్పింది యధాతథంగా రికార్డు చేయలేదు. దర్యాప్తు వెనకాల దురుద్దేశం కనిపిస్తోంది. సీబీఐ తన ఛార్జిషీట్లో తన స్టేట్మెంట్ తొలగించాలి. తిరిగి తనస్టేట్మెంట్ రికార్డు చేయాలి’’ అని అజేయ్ కల్లం తరపు న్యాయవాదులు వాదించారు. దీంతో పిటిషన్ విచారణ అర్హతపై తీర్పు రిజర్వ్ చేసింది ధర్మాసనం. నాడు చెప్పింది ఇదే.. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ఏప్రిల్ 29, 2023న సీబీఐ అజేయ కల్లం నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. ‘‘మార్చి 15, 2019న జగన్గారి నివాసంలో ఉదయం మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్ షాక్కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారు’’. ఇది తాను సీబీఐకి చెప్పింది.. అంతకు మించి తానేం చెప్పలేదు అని అజేయ కల్లాం అంటున్నారు. స్టేట్మెంట్ అంతా అబద్ధాలమయమే! జగన్ గారి భార్య ప్రస్తావనకాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదు. సీబీఐ తాను ఒకటి చెబితే.. దాన్ని మార్చేసి ఛార్జిషీట్లో మరోలా ప్రస్తావించింది. తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అబద్ధాలే ఉన్నాయి. దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తోంది. తన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్మెంట్గా పేర్కొన్న అంశాలను కొట్టేయాలి. అవసరమైతే తన నుంచి మరోసారి స్టేట్మెంట్ను రికార్డు చేసేలా ఆదేశించాలి. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని తన పిటిషన్లో అజేయ కల్లం కోరారు. ఇదీ చదవండి: బతికున్నోళ్లను సునీతమ్మ బజారుకీడుస్తోంది -
ఒడిశా ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదానికి సంబంధించి.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముగ్గురు రైల్వే ఉద్యోగుల్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ రాత్రిపూట జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 290 మంది దాకా మృతి చెందిన సంగతి తెలిసిందే. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. పలువురిని విచారించింది. ఘటనకు కారకులు అవ్వడంతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు అనే అభియోగాల మీదే వీళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ మగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వాళ్లు అరుణ్ కుమార్ మహంత, ఎండీ అమీర్ ఖాన్ , పప్పు కుమార్గా తెలుస్తోంది. వీళ్లపై హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్య కింద, అలాగే.. సాక్ష్యాలను నాశనం చేసిన అభియోగాలు మోపింది సీబీఐ. ఈ ముగ్గురి చర్యలు.. ప్రమాదానికి దారితీశాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. తాము చేసిన పని పెనుప్రమాదానికి.. విషాదానికి దారి తీస్తుందనే అవగాహన వాళ్లకు ఉందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. ఇదీ చదవండి: ఒడిశా దుర్ఘటన.. అమీర్ ఖాన్ ఇంటికి సీల్ -
ఒడిశా దుర్ఘటన.. అతడి ఇంటికి సీబీఐ సీల్
ఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా దుర్ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఓ ఇంటికి సోమవారం సీల్ వేసింది దర్యాప్తు సంస్థ. అదే టైంలో బాలాసోర్ యాక్సిడెంట్ హ్యాష్ ట్యాగ్తో అమీర్ఖాన్ అనే పేరు ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. భారతీయ రైల్వేస్లో సిగ్నల్ జూనియర్ ఇంజినీర్గా పని చేస్తున్న అమీర్ ఖాన్, అతని కుటుంబంతో సహా ఘటన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో సోమవారం హడావిడిగా అతను ఉంటున్న ఇంటికి చేరుకున్న అధికారులు తాళం గమనించాక.. సీల్ వేసి మరీ వెళ్లడం గమనార్హం. ఆపై సోరోలోని తెంటెయ్ ఛక్లో ఉన్న బాహానాగా స్టేషన్ మాస్టర్ ఇంటికి సైతం సీబీఐ బృందం వెళ్లింది. అయితే.. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సిగ్నల్ జేఈ అయిన అమీర్ ఖాన్ బాలాసోర్ ప్రమాద ఘటన జరిగిన రీజియన్లోనే పని చేస్తున్నాడు. జూన్ 2వ తేదీ రాత్రి బాలాసోర్ రైలు ప్రమాద ఘటన జరగ్గా.. రంగంలోకి దిగిన సీబీఐ సిగ్నల్ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థకు అతనిపై అనుమానాలు ఉన్నాయి. అందుకే నిఘా వేసింది. ఆ తర్వాతే అతను కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. భారతీయ రైల్వేస్లో జూనియర్ సిగ్నల్ ఇంజినీర్ పని ఏంటంటే.. పాయింట్ మెషీన్లు, ఇంటర్లాకింగ్ సిస్టమ్లు, సిగ్నల్లతో సహా సిగ్నలింగ్ పరికరాల ఇన్స్టాలేషన్, నిర్వహణ, మరమ్మత్తును చూసుకుటారు. రైలు సేవలను సాఫీగా మరియు సురక్షితంగా నిర్వహించడంలో ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరీ జేఈ అమీర్ ఖాన్ ఈ ఉదయం నుంచి ట్విటర్లో బాలాసోర్ ప్రమాదం మళ్లీ ట్రెండ్ అవుతోంది. అందుకు జేఈ అమీర్ ఖాన్ కూడా ఓ కారణం. అతని గురించి వివరాలు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. సోరోలో అన్నపూర్ణ రైలు మిల్లు దగ్గర అతని అద్దె ఇల్లు ఉంది. ఒడిశా ఘోర ప్రమాదం తర్వాత అతని కదలికలపై నిఘా వేసింది సీబీఐ. అతని స్వస్థలం ఏంటి? నేపథ్యం ఏంటన్న విషయాలనూ సీబీఐ వెల్లడించడం లేదు. ఇదీ చదవండి: పోస్ట్మార్టం చేస్తుండగా.. గుండె కొట్టుకుంది! -
బహనాగా బజార్ దుర్ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ
భువనేశ్వర్: రాష్ట్రంలో సంభవించిన ట్రిపుల్ రైలు ప్రమాదం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) మంగళవారం వెల్లడించింది. ఈనెల 2న బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్లో కోరమాండల్ ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్–హౌరా ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలుకు మధ్య జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడేందుకు సీబీఐకి చెందిన 10మంది సభ్యుల బృందం సోమవారం రాత్రి ఒడిశాకు చేరుకుంది. ఈ మేరకు ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. రైల్వేశాఖ అభ్యర్థన మేరకు, ఒడిశా ప్రభుత్వ సమ్మతితో కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు వర్గం సభ్యులు తెలిపారు. ఈ దుర్ఘటనకు సంబంధించి బాలాసోర్ ప్రభుత్వ రైల్వే పోలీసు(జీఆర్పీఎస్)లో నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేపట్టిందన్నారు. సీఆర్ఎస్ విచారణ.. రైలు దుర్ఘటనలో ప్రాణహాని సంభవించే పరిస్థితుల్లో రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్ఎస్) దర్యాప్తు చేపట్టడం నిబంధన. ఈ నేపథ్యంలో ఇటీవల బహనాఘా బజార్ రైల్వే స్టేషన్లో జరిగిన ట్రిపుల్ రైలు దుర్ఘటనలో మృతులు సంభవించిన ఘటనపై సీఆర్ఎస్ విచారణ కోసం రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో ప్రత్యక్షంగా సందర్శించిన అనుబంధ అధికార, సిబ్బంది వర్గాలతో ముఖాముఖి సంప్రదించింది. ఆదివారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన రైల్వే భద్రతా కమిషనర్ శైలేష్కుమార్ పాఠక్.. కొంతమంది వ్యక్తుల వాంగ్మూలం నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఇదో ఉద్దేశపూర్వక ట్యాంపరింగ్ సంఘటనగా ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ రింకేష్రాయ్ మీడియాతో అన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్లో మార్పు కారణంగా రైలుప్రమాదం సంభవించిందని.. అయితే ప్రమాదానికి గురైన రైళ్లలో ఒకటైన చైన్నెకి వెళ్లే కోరమండల్ ఎక్స్ప్రెస్ లోకోపైలట్(ఎల్పీ), అసిస్టెంట్ లోకోపైలట్ వివరణ ప్రకారం గ్రీన్సిగ్నల్ వచ్చినట్లు వెల్లడైందన్నారు. ఈ ఘటనకు వీరివురు ప్రత్యక్ష సాక్షులు. ఈ పరిస్థితుల దృష్ట్యా సిగ్నలింగ్ వ్యవస్థలో ‘ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్‘ ఉండవచ్చని డీఆర్ఎం సందేహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు రైల్వేబోర్డు ఆదివారం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు, పరిసరాలు, నిర్వహణ ఇతరేతర అనుబంధ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని రైల్వేబోర్డు తదుపరి విచారణ, దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు సిఫార్సు చేసినట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం స్పష్టం చేశారు. ఈ ఘటనలో 21 కోచ్లు ఢీకొని పట్టాలు తప్పడంతో 288 మృతులు నమోదయ్యాయి. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. సమ్మతించిన రాష్ట్రప్రభుత్వం రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు ఒడిశా ప్రభుత్వం సమ్మతి తెలిపింది. సీబీఐ విచారణకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి సంతకం చేసిన సమ్మతి లేఖ జారీ చేశారు. ఈనెల 2న బహనాగా బజార్లో కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి దారితీసిన కారణాలపై సీబీఐ విచారణకు ఒడిశా ప్రభుత్వం తర ఫున అదనపు చీఫ్ సెసీ(హోమ్) డీకే సింగ్ సమ్మతి తెలిపారు. ఈ ప్రమాదం యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లోని 2 కోచ్లను కూడా ప్రభావితం చేసింది. గుర్తించాల్సినవి.. 83 బహనాగా బజార్ స్టేషన్ కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్యలో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. మృతుల జాబితా విస్తృత ధ్రువీకరణ, అనుబంధ వర్గాల సమాచారం, ఘటనా స్థలం ఇతరేతర రంగాల్లో 2రౌండ్ల కూబింగ్ నిర్వహించిన అనంతరం 288మరణాలను నిర్థారించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్కుమార్ జెనా మంగళవారం సాయంత్రం వెల్లడించారు. 205 మృతదేహాలను గుర్తించి బంధు వర్గాలకు అప్పగించగా, మరో 83 ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. భువనేశ్వర్లో 110, బాలాసోర్లో 94, భద్రక్లో 1 గుర్తించిన వాటిలో ఉన్నాయి. పలు ప్రాంతాలకు మృత దేహాలను ప్రభుత్వ ఖర్చులతో తరలించారు. అయితే గుర్తించని మృతదేహాల్లో పలు సందర్భాల్లో వివాదం తలెత్తుతోంది. ఒక్కో మృతదేహం కోసం ఒకరి కంటే ఎక్కువ మంది ముందుకు రావడంతో ఈ పరిస్థితి నెలకొంటుంది. వివాదం నుంచి బయట పడేందుకు సందిగ్ధ 83 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అనుబంధ వర్గాల నుంచి సహాయ, సహకారాలు అభ్యర్థించారు. రాష్ట్ర మృతులు 39.. కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటనలో రాష్ట్రం నుంచి 39మంది ప్రయాణికులు మృతిచెందారు. వీరిలో బాలాసోర్ జిల్లా నుంచి 14, మయూర్భంజ్ 9, భద్రక్ 8, కటక్ 3, జాజ్పూర్ 2, ఖుర్దా 2, కెంజొహర్ జిల్లా నుంచి ఒకరు మృతి చెందినట్లు ఖరారు చేశారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటన మేరకు మృతుల కుటుంబీకులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1.95 కోట్ల పరిహారం మంజూరు చేశారు. ఒక్కో మృతుని కుటంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. పరిహారం పొందడం ఇలా.. ఈనెల 2న బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు రైల్వేశాఖ నష్టపరిహారం ప్రకటించింది. వాస్తవ బాధిత, పీడిత వర్గాలు ఈ పరిహారం లబ్ధిదారులు. పరిహారం పొందేందుకు దశలవారీ క్రమ విధానం ఇలా ఉంది. మృతులు, గాయపడిన వారు, గుర్తు తెలియని మృతదేహాల చిత్రాలతో కూడిన వెబ్సైట్ల లింక్లను రైల్వేశాఖ విడుదల చేసింది. మృతదేహాలను ఉంచిన ఆస్పత్రులు, చికిత్స పొందుతున్న, గాయపడిన వ్యక్తుల పేర్లు, చిరునామాలను కూడా ఈ సైట్లో పేర్కొంటాయి. రైల్వేశాఖ మృతుల కుటుంబీకులకు రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తుంది. ఈ మొత్తంలో రూ.50వేల నగదు, రూ.9.5 లక్షల చెక్కు అందిస్తారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం పంపిణీ చేస్తారు. మృతుల గుర్తింపు చర్యలు ముమ్మరం కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటనలో మృతుల గుర్తింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. మృతుల బంధువులు, ఆత్మీయులు సులువుగా గుర్తించేందుకు పలు రకాల సన్నాహాలు చేశారు. ఈ చర్యలు అంతంత మాత్రంగా ఫలప్రదమయ్యాయి. ఇదిలా ఉండగా మృతదేహాల కోసం పలువురు ముందుకు రావడంతో పరిస్థితి మరింత బిగుసుకుంది. ఈ నేపథ్యంలో మృతదేహాలను దీర్ఘకాలం తాజాగా ఉంచేందుకు శక్తివంతమైన కంటైనర్లు వంటి సాంకేతిక సదుపాయాలతో మృతుల వివరాలు ప్రదర్శన వంటి సన్నాహాలు చేపట్టారు. వీటిపై వివాదం తలెత్తడంతో మృతులు, బంధువర్గాల డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్థానిక అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ప్రాంగణంలో డీఎన్ఏ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. 10మంది వ్యక్తులు డీఎన్ఏ పరీక్షలకు ముందుకు వచ్చారు. వీరిలో 5మంది పరీక్షలు పూర్తి చేసినట్లు అనుబంధ వర్గాలు తెలిపాయి. సచివాలయ సేవాసంఘం.. బాధితుల సహాయార్థం రాష్ట్ర సచివాలయ సేవాసంఘం రూ. 2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ మేరకు సేవాసంఘం సభ్యుల బృందం ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయంలో సీఎస్ ప్రదీప్ జెనాతో భేటీ అయ్యారు. బాధితులకు సాయం.. రైలు ప్రమాద బాధితుల సహాయార్థం ఒడిశా వెటర్నరీ సర్వీసెస్ అసోసియేషన్ రూ.20 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ ప్రదీప్కుమార్ జెనాకు దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు. వెబ్పోర్టల్ వివరాలు: ► ఘోర ప్రమాదంలో మరణించిన వ్యక్తుల చిత్రాలను https://srcodisha.nic.in వెబ్సైట్లో చూడవచ్చు. ► వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న, గాయపడిన ప్రయాణికుల పేర్లను తెలుసుకునేందుకు https://www.bmc.gov.in ► కటక్ ఎస్సీబీ మెడికల్ కశాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తుల ఫోటోల వివరాలు ఈ క్రింది వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ► https://www.bmc.gov.in/train&accident/ download/Un&identified&person&under&treatment&atSCB&Cuttack.pdf ► ప్రభావిత వర్గలు ప్రటకించిన నష్టపరిహారం పొందేందుకు క్రమ పద్ధతిలో అనుబంధ వర్గాలను సంప్రదించాల్సి ఉంది. ► తొలుత మృతదేహం భద్రపరిచిన ఆస్పత్రిని సంప్రదించాలి. ఈ మేరకు రైల్వేశాఖ జారీ చేసిన జాబితాను పరిగణలోకి తీసుకోవాలి. ► బాధితులతో తమ సంబంధాన్ని ధ్రువీకరించే పత్రాలు దాఖలు చేయాలి. ► అభ్యర్థన మేరకు దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన మేరకు ధ్రువీకరించిన తరువాత మృతదేహాన్ని అప్పగిస్తారు. ► ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులు డిశ్చార్జి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ► తదుపరి పరిహారం పొందేందుకు డిశ్చార్జ్ సర్టిఫికెట్తో పాటు అవసరమైన దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది. ► మృతుల రక్త సంబంధీకులకు మాత్రమే పరిహారం చెల్లిస్తారు. వివాహిత జంట(దంపతులు) విషయంలో భర్త లేదా భార్యకు మాత్రమే పరిహారం ముడుతుంది. రైల్వే సిబ్బంది ప్రస్తావన లేదు: సీబీఐ 288 మంది మృతికి కారణమైన బాలాసోర్ రైలు ప్రమాదంలో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) లోతుగా పరిశీలించినట్లు మంగళవారం తెలిపింది. ఎఫ్ఐఆర్ దాఖలు సమయానికి నిర్దిష్ట రైల్వే ఉద్యోగుల నేరం నిర్థారించలేదు. తదుపరి దర్యాప్తు సమయంలో ఈ అంశం నిర్థారిస్తామని పేర్కొంది. కటక్ ఓపీఎస్ ఎస్డీఆర్పీఓ రంజిత్ నాయక్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్సీబీలో ఎల్ఈడీ ప్రదర్శన కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి ప్రాంగణంలో ఎల్ఈడీ టీవీ ప్రదర్శన ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో హెల్ప్డెస్క్, సమాచార కేంద్రాలు పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ గుర్తించని బాధితుల బంధు వర్గాలు ముందుకు వచ్చేందుకు వీలుగా ఆస్పత్రి ఆవరణలో చికిత్స పొందుతున్న వారి ఫొటోలను ఎల్ఈడీ టీవీలో ప్రదర్శిస్తున్నారు. బాధితుల వివరాలతో సమగ్ర జాబితా ఈ ప్రదర్శనలో లభ్యమవుతోంది. -
బాలాసోర్ ఘటనపై సీబీఐ ఎఫ్ఐఆర్
భువనేశ్వర్: బాలాసోర్ రైలు ప్రమాద దుర్ఘటనపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి టెక్నికల్ టీంతో పాటుగా చేరుకున్నారు సీబీఐ అధికారులు. ఆపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల ప్రకారం.. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఉదయం ప్రమాదం జరిగిన రైల్వే ట్రాక్, సిగ్నల్ రూమ్ను సీబీఐ అధికారుల బృందం పరిశీలించింది. ఆపై ప్రమాద స్థలికి దగ్గర్లో ఉన్న బహనాగా బజార్ రైల్వే స్టేషన్కు చేరుకుని.. అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించింది. ఆపై రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఒడిశా పోలీసులు ఇదివరకే ఈ ప్రమాద ఘటనపై కేసు ఫైల్ చేశారు. నిర్లక్ష్యం, ప్రాణ హాని తలపెట్టడం లాంటి అభియోగాలను అందులో నమోదు చేశారు.ఇంటర్ లాకింగ్ సిస్టమ్ మార్చడమే ప్రమాదానికి కారణమని రైల్వే శాఖ ఇదివరకే ప్రకటించుకుంది. ఈ కోణంలోనే సీబీఐ దర్యాప్తు కొనసాగనుందని తెలుస్తోంది. సిగ్నల్ ఫెయిలా? మరేదైనా కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై భద్రతా కమిషన్ విచారణ కొనసాగుతోంది. మానవ తప్పిదమా? విధ్వంసమా? లేదంటే సాంకేతిక తప్పిదామా?.. సీబీఐ దర్యాప్తులో ఏం తేలనుందో చూడాలి. జూన్ 2వ తేదీ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో జరిగిన మూడు రైళ్ల ఢీ ఘోర ప్రమాదం.. 278 మంది బలిగొంది(ఇప్పటివరకు). మరో 800 మంది గాయలపాలయ్యారు. ఇదీ చదవండి: ఒడిశా ఘటన.. అయినవాళ్లు ఎక్కడ? -
ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి.. తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఉన్నత న్యాయస్థానం. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై ఇవాళ తుది తీర్పు వెలువరించిన హైకోర్టు వెకేషన్ బెంచ్.. బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అవినాష్రెడ్డి లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్.. షరతులతో కూడిన బెయిల్ అవినాష్రెడ్డికి మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో వివేకా కేసులో అవినాష్ రెడ్డి కస్టడీ విచారణ అవసరం లేదని బెంచ్ సీబీఐ తరపు న్యాయవాదులతో స్పష్టం చేసింది. హైకోర్టు ఆర్డర్కాపీలో ఏముందంటే.. 30 పేజీల హైకోర్టు ఆదేశాల్లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాష్రెడ్డిపై ఆరోపణలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవినాష్రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. సీబీఐ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. సాక్ష్యాలను తారుమారు చేశారనడానికి కూడా ఎవిడెన్స్ లేవు. చెప్పుడు మాటల ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేసింది. ఊహాజనితమైన విచారణ మాత్రమే సాగింది. ఈ తరుణంలో.. కస్టోడియల్ విచారణ అవసరం లేదని భావిస్తున్నాం. అవినాష్రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నాం. హైకోర్టు షరతులివే ► అవినాష్రెడ్డిని గనుక అరెస్టు చేసినట్లయితే.. రూ. 5 లక్షల పూచీకత్తుతో బెయిల్ పై విడుదల చేయాలి ► సీబీఐ అనుమతి లేకుండా అవినాష్ రెడ్డి దేశం విడిచి వెళ్లరాదు. ► సాక్షులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేయకూడదు. ► సీబీఐ దర్యాప్తునకు అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరించాలి. ► ప్రతి శనివారం ఉ.10 నుంచి సా.5 వరకు అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాలి ► అవసరమని CBI భావించినప్పుడు విచారణకు అవినాష్ రెడ్డిని పిలవచ్చు పైషరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చు. ఆ ఛానెల్స్ డిబేట్పై అభ్యంతరం ఇక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహా టీవీ ఛానెల్స్లో తాజాగా వివేకా కేసు పరిణామాలపై జరిగిన డిబేట్లో న్యాయమూర్తికి డబ్బుల సంచులు వెళ్లాయంటూ ఓ సస్పెండెడ్ మెజిస్ట్రేట్ చేసిన వ్యాఖ్యలపైనా.. హైకోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఆ చర్చకు సంబంధించిన వీడియోలను కోర్టును సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ‘‘నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచారం చేశాయి. మీడియా ఛానల్ డిబేట్ లో కొంత మంది వ్యక్తుల ద్వారా నాపై ఆరోపణలు చేయించారు’’ అంటూ ఆర్డర్ కాపీలో వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. ‘‘‘మీడియా అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీడియా స్వేచ్చకు మేం అడ్డంకి కాదు. కానీ, కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయి. మీడియా కథనాలు చూసి ఒక స్థాయిలో నేను ఈ కేసు విచారణ నుండి తప్పుకోవాలనుకున్నాను. సస్పెండ్ అయ్యి ఒక జడ్జ్ నాకు డబ్బు సంచులు వచ్చాయని అసత్య ప్రచారం చేయడం బాధాకరం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి విచారణ జరిపి తీర్పు వెల్లడించాను. ఆయా డిబేట్ల వీడియోలను కోర్టుకు సమర్పించండి. చీఫ్ జస్టిస్ ఆ వీడియోలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారు అని హైకోర్టు జడ్జి పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్ చేయండి అనేక మలుపులు.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏప్రిల్ 17వ తేదీన అవినాష్రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటి నుంచి ఆ పిటిషన్పై విచారణ అనేక మలుపులు తిరిగింది. చివరికి.. సుప్రీం కోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఆయన ఊరట లభించింది. అవినాష్రెడ్డికి బెయిల్ పిటిషన్ వేసే హక్కు ఉందని, పిటిషన్పై వాదనలు వినాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా వాదనలు వింది తెలంగాణ హైకోర్టు వేకేషన్ బెంచ్. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా.. సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి ఇప్పటికే ఏడుసార్లు హాజరయ్యారు. అయితే తల్లి అనారోగ్యం కారణంగా ఈ నెల 22వ తేదీన విచారణకు మాత్రం హాజరు కాలేదు. సీబీఐ విచారణలో ఇప్పటిదాకా తాను సహకరిస్తూ వస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. తల్లి బాగోగులు చూసుకోవడానికి గడువు కోరుతూ సీబీఐకి విజ్ఞప్తి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి పలు ప్రశ్నలను సంధించింది. ఇదీ చదవండి: అవినాష్రెడ్డిని టార్గెట్ చేయడం సరికాదు! -
ఓఆర్ఆర్ టెండర్పై రఘునందన్ సంచలన ఆరోపణలు, సీబీఐకి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ లో అవినీతి అక్రమాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఓఆర్ఆర్ టెండర్ పైన సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేటీఆర్, మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ లు అప్పనంగా ఐఆర్బీ సంస్థకు టెండర్ అప్పగించారని దుయ్యబట్టారు. ఔటర్ రింగు రోడ్డు టెండర్ లో అవినీతి జరిగిందని గతంలోనే ఈడీకి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఐఆర్బీ డెవలపర్స్ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే మనుషుల్నే లేకుండా చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ఆ సంస్థకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే బెదిరిస్తున్నారని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ విషయంపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందిచడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. (చదవండి: ప్రైవేటుకు ఓఆర్ఆర్!.. 30 ఏళ్లకు లీజుకిచ్చిన కేసీఆర్ సర్కార్) 'ఓఆర్ఆర్ టెండర్ అంశంపై బీజేపీ ఎందుకు ప్రశ్నించట్లేదని ఇటీవల కొందరు విమర్శిస్తున్నారు. ఓఆర్ఆర్ టోల్గేట్ అంశంపై మా పార్టీ చాలారోజులుగా ప్రశ్నిస్తోంది' అని రఘునందన్ రావు చెప్పారు. వేసవి సెలవుల తరువాత దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఇటీవల ఓఆర్ఆర్ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ అనే సంస్థ ఈ టెండర్ను దక్కించుకుంది. అయితే ఈ ఎపిసోడ్లో భారీ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐఆర్బీ సంస్థ నేర చరిత్ర కలిగిందని విమర్శిస్తున్నాయి. మరోవైపు పారదర్శకంగానే టెండర్ల ప్రక్రియ జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. (చదవండి: HYD ORR: ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు) -
సీబీఐ నూతన డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ సూద్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతకుముందు కర్ణాటక డీజీపీగా పనిచేశారు. సీబీఐ డైరెక్టర్ గురించి మరిన్ని విషయాలు ► 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్, నిన్నటివరకు కర్ణాటక డీజీపీగా సేవలందించారు. ► సీబీఐ కొత్త డైరెక్టర్ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ► ప్రవీణ్ సూద్ ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత UPSC ద్వారా IPS సర్వీసులోకి వచ్చారు. ► కర్ణాటక పోలీస్ శాఖలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. ► 1989లో మైసూరు ఏఎస్పీగా బాధ్యతలు, అనంతరం బళ్లారి, రాయచూరు ఎస్పీగా, ఆ తర్వాత బెంగళూరు డీసీపీగా పని చేశారు. ► 1999లో డిప్యుటేషన్ మీద మారిషస్ లో మూడేళ్ల పాటు పనిచేశారు. ► 2004-2007 మధ్య మైసూరు కమిషనర్ గా పని చేశారు. ► ఆ తర్వాత కర్ణాటక హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, అడిషనల్ డీజీపీగా, రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గానూ వ్యవహరించారు. ► ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 కింద CBI (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఏర్పాటు అయింది కాబట్టి ఆ చట్టం 4A కింద డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ► ప్రవీణ్ సూద్కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సూద్ అల్లుడే టీం ఇండియా క్రికెట్ బ్యాట్స్మన్ మయాంక్ అగర్వాల్. ► ప్రవీణ్ సూద్ పలు విశిష్ట పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. సంవత్సరం పురస్కారం 1996 చీఫ్ మినిస్టర్ గోల్డ్ మెడల్ 2002 పోలీస్ మెడల్ 2006 ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ 2011 ప్రిన్స్ మైఖైల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు 2011 నేషనల్ e-గవర్నెన్స్ గోల్డ్ మెడల్ -
ఓవరాక్షన్ సరే!.. అప్పుడేమైంది గురివింద బాబు?
‘ఆంధ్రప్రదేశ్లో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. అది బయటి వారికి చాలా అసహ్యంగానూ అనిపిస్తోంది. రాజకీయాలు మరీ ఇంతలా దిగజారిపోవాలా? అనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. అవినాష్ రెడ్డిని సిబిఐ ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటి? సిబిఐ ఇంత బలహీనంగా ఉందా? అంటూ ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. టిడిపి అనుకూల మీడియాల్లో డిబేట్స్ చూస్తోంటే సీబీఐ అరెస్ట్ చేయకపోతే మీడియా ప్రతినిథులే వెళ్లి అవినాష్ ను అరెస్ట్ చేసేలా కనిపిస్తున్నారు. ఇటువంటి ట్రెండ్ గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.‘ ఏపీలో 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వయానా చిన్నాన్న అయిన వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఈ హత్య జరిగే నాటికి ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. కొంతకాలంగా ఈ హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. హత్యకేసులో ప్రధాన నిందితులను విచారించిన సీబీఐ.. ఆ తర్వాత మరి కొందరిని పిలిచి విచారిస్తోంది. ఈ క్రమంలో భాగంగా వివేకా మరో సోదరుడు వైఎస్ భాస్కర రెడ్డి తో పాటు ఆయన తనయుడు.. కడప ఎంపీ అయిన అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. భాస్కర రెడ్డిని రిమాండ్ లో తీసుకున్న సీబీఐ.. అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలు దఫాలు విచారించింది. తాజాగా మరోసారి విచారణకు పిలిచింది. అయితే.. అవినాష్ రెడ్డి తల్లికు గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించేందుకు వెళ్లాల్సి రావడం.. తాను విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సిబిఐ కి లేఖ రాశారు. అదే సమయంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తన బెయిల్ పిటిషన్ ను విచారించాల్సిందిగా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరారు. అవినాష్ రెడ్డి తల్లికి కర్నూలు లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు కూడా బులెటిన్ విడుదల చేశారు. ఐసీయూ లో కొద్ది రోజులు చికిత్స అందించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు. తన తండ్రి భాస్కర రెడ్డి అరెస్ట్ అయి ఉన్నందున తన తల్లిని తానే చూసుకోవాలి కాబట్టి ఈ నెల 27 వరకు తనకు గడువు నివ్వాలని.. ఆ తర్వాత తాను విచారణకు హాజరవుతానని అవినాష్ రెడ్డి సిబిఐకి రాసిన లేఖలో కోరారు. అంతే.. ఈ వార్తలు మీడియాలో ప్రసారం అవుతుండగానే అటు టీడీపీ నేతలు, ఇటు టీడీపీ అనుకూల ఛానెళ్లూ కూడా.. ‘‘అదేంటీ?.. అవినాష్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటి?.. ఏం! సీబీఐ మరీ అంత బలహీనంగా ఉందా?’’ అంటూ డిబేట్స్ నడపడం మొదలు పెట్టారు. అటు టిడిపి నేతలు అవినాష్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలంటే డిమాండ్లు చేయడం మొదలు పెట్టారు. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోగా.. వ్యతిరేకంగా పావులు కదుపుతోందంటూ కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. దీనిపై న్యాయ రంగ నిపుణులు మండి పడుతున్నారు. 👉 ‘అసలు ఎవరిని అరెస్టు చేయాలి?..’ అది చెప్పడానికి మీడియా ఎవరు? సీబీఐ ఎవరిని అరెస్ట్ చేయాలో ఎప్పుడు అరెస్ట్ చేయాలో అసలు చేయాలో చేయకూడదో మీడియా చెప్పడం ఏంటి? దర్యాప్తు సంస్థకు దమ్ము ఉందా లేదా అన్నది కూడా మీడియానే తేల్చేయడం ఏంటి? తమ రాజకీయ ప్రత్యర్ధులు అయితే వెంటనే అరెస్ట్ చేసేయాలి అదే తమపై కేసులు వచ్చి తమని అరెస్ట్ చేస్తే రాజకీయంగా కక్షసాధిస్తారా? అంటూ దబాయింపు సెక్షన్ విరుచుకు పడిపోతారు . ఇదేం పద్ధతి? అంటున్నారు న్యాయ రంగ నిపుణులు. 👉 వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు కారు. ఆయనపై ఉన్న అభియోగం అల్లా హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలు తారు మారు చేయించారని. అది కూడా ఆయన చేశారని కాదు. అసలు వివేకానంద రెడ్డిని హత్య చేసిన ప్రధాన నిందితుడు దస్తగిరి బెయిల్ పై హాయిగా బయట తిరుగుతున్నాడు. అనుమానాలు మాత్రమే ఉన్న అవినాష్ రెడ్డిని మాత్రం.. తక్షణమే అరెస్ట్ చేసేయాలంటూ టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ ఓ పత్రిక రాసి పారేసింది. నిజానికి సీబీఐ ఇంత వరకు దీనిపై ఎలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. ప్రభుత్వంపై కానీ అవినాష్ రెడ్డిపై కానీ ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు. అవినాష్ రెడ్డి అడిగింది కూడా నాలుగు రోజుల పాటు విచారణకు గడువు ఇమ్మనమనే. అది కూడా తల్లి ఆరోగ్యం బాగా లేదు కాబట్టి. అయితే టీడీపీ నేతలు.. వారి అనుకూల ఛానెళ్లు సీబీఐకి ఏదో అపచారం జరిగిపోతోన్నట్లు.. ధర్మాన్ని ఎవరో అడ్డుకుంటోన్నట్లు గగ్గోలు పెట్టేస్తున్నారు. 👉 కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి సహకరించకపోవడం క్షమించరాని నేరం అంటున్న ఆ పత్రిక.. గతంలో చంద్రబాబు నాయుడు, ఇదే సీబీఐ ఏపీలో అడుగు పెట్టనివ్వకుండా ఏకంగా జీవో జారీ చేస్తే అపుడు సిబిఐ దుర్మార్గమైన దర్యాప్తు సంస్థ అన్నట్లు.. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తోందన్నట్లు కథనాలు వండి వార్చింది. అపుడు టిడిపి నేతలు కూడా సీబీఐని పనికిమాలిన సంస్థగా ఏకి పారేశారు. ఇపుడు తాము ప్రతిపక్షంలోకి వచ్చే సరికి తమ ప్రత్యర్ధులపై ఓ కేసు వచ్చింది కాబట్టి టిడిపి నేతలు ఇపుడు సిబిఐని కీర్తిస్తున్నారని న్యాయ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందని అవినాష్ అంటోంటే ‘అదంతా నాటకం.. డ్రామా..’ అంటూ టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ‘‘2019లో టిడిపి ప్రతిపక్షంలోకి జారుకున్నాక వారి హయాంలో చేసిన అవినీతికి సంబంధించిన కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసే సందర్భాల్లో టిడిపి నేతలు కూడా ఆసుపత్రుల్లో చేరారు. అచ్చెంనాయుడు అయితే తనకి పైల్స్ ఆపరేషన్ అయ్యిందని నెలల తరబడి ఆసుపత్రి బెడ్ దిగలేదు. అది కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోనని చెప్పి టిడిపి అనుకూల వర్గీయులది అయిన రమేష్ హాస్పిటల్ లో ఆయన కాలక్షేపం చేసి విచారణ నుండి తప్పించుకున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచి.. టిడిపి తరపున వ్యవహారాలు నడుపుతోన్న రఘురామ కృష్ణం రాజు కులాల మధ్య చిచ్చు రేపేలా వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే తనని కొట్టేశారంటూ ఆరోపణలు చేసి బెయిల్ తెచ్చుకుని తనకు అనుకూలంగా ఉండే ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందారే తప్ప ఏపీలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందలేదు. మార్గదర్శి చిట్స్ లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సిఐడీ అధికారులు సోదాలకు వెళ్లినపుడు ఆ సంస్థ అధినేత రామోజీ రావు అమాంతం మంచం పై పడుక్కుని ఆరోగ్యం బాగా లేదని చెప్పుకున్నారు. విచారణకు కూడా సిద్ధంగా లేనని చెప్పించారు. అయితే అలాగని లిఖిత పూర్వకంగా రాసి ఇస్తారా అని డాక్టర్లను సిఐడీ అధికారులు అడగడంతో వాళ్లు నీళ్లు నమిలి విచారణకు హాజరు కావచ్చునని ఒప్పుకున్నారు. టిడిపి నేత సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసంలో ఓ సినీ నిర్మాతపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనలో బాలయ్యను అరెస్ట్ చేయాల్సి వచ్చినపుడు అమాంతం బాలయ్యకు మానసిక పరిస్థితి బాగా లేదని మతి చలించిందని వైద్యుల చేత సర్టిఫికెట్ పుట్టించుకుని అరెస్ట్ నుండి తప్పించుకున్నారు.’’ ఇపుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు వీటినే గుర్తు చేస్తున్నారు. అప్పట్లో.. ఆస్పత్రిలో అచ్చెన్న 👉 టిడిపి నేతలను అరెస్ట్ చేసే సందర్భాల్లో వాళ్లకి మాయరోగాలు వస్తాయి.. వాళ్లు తమకు అనుకూలమైన ఆసుపత్రులనే ఆశ్రయిస్తారు.. చివరకు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు.. అదే అవినాష్ రెడ్డి తల్లి పరిస్థితి బాగా లేక విచారణకు సమయం కావాలని అడిగితే ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయరు? అంటూ టిడిపి నేతలు, టిడిపి అనుకూల పత్రికలు ప్రశ్నించడంలో అర్ధం లేదని పాలక పక్ష నేతలు అంటున్నారు. చంద్రబాబు నాయుడిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుల్లో విచారణలు జరక్కుండా చంద్రబాబు స్టేలు తెచ్చుకుని కాలక్షేపం చేస్తున్నారు. అటువంటి చంద్రబాబు నాయుడి పార్టీ నేతలు గురివింద గింజలాగా నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు. 👉 ప్రస్తుతానికి అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా తెలంగాణా హై కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. హై కోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించాల్సిందిగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులను సూచించింది. ఈఘటనలో టిడిపి నేతలతో సమానంగా మీడియా ప్రతినిథులు కూడా తామే న్యాయమూర్తులు అయినట్లు, దర్యాప్తు సంస్థల అధికారులు అయినట్లు విచారించేసి తీర్పులు ఇచ్చేస్తున్నారనే చర్చ కూడా ఒకటి నడుస్తోంది. ఈ పద్ధతి మారాలని అంటున్నారు కొందరు. అసలు సీబీఐని ఏపీలోకి అనుమతించాలా? అడ్డుకోవాలా? అన్న అంశంపై టిడిపి నేతలు తమ వైఖరి ఏంటో ఇప్పటికైనా స్పష్టం చేయాలంటున్నారు పాలక పక్ష నేతలు. అధికారంలో ఉంటే ఒకలాగ ప్రతిపక్షంలో ఉంటే అందుకు పూర్తి భిన్నంగా యూటర్నులు తీసుకోవడం చంద్రబాబు నాయుడికి మొదట్నుంచీ అలవాటే అంటున్నారు రాజకీయ పండితులు. ::: CNS యాజులు, సాక్షి టీవీ ఇదీ చదవండి: ఆ టీడీపీ ఎమ్మెల్యే వస్తే ఊరంతా హడల్! -
వివేకా లేఖపై సునీతకు సీబీఐ ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. కేసులో కీలకంగా భావిస్తున్న వివేకా రాసిన లేఖపై ఇవాళ వివేకా కూతురు సునీతారెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. వివేకా కేసులో సునీతారెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి సునీతను పిలిపించుకుని లేఖపై ఆరా తీశారు సీబీఐ అధికారులు. ఆమె కూడా భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఆమెను పిలిపించుకుని స్టేట్మెంట్ నమోదు చేసింది సీబీఐ. మరోవైపు వివేకా కేసులో పలువురు సాక్షులను సైతం సీబీఐ ప్రశ్నిస్తోంది. రక్తపు మరకల లేఖ.. ఎందుకు గోప్యంగా ఉంచారు? వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకుగాను పక్కా కుట్ర ఒకటి జరిగినట్టు ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆరోపించారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్రెడ్డి దీని వెనక ఉన్నట్టు కొన్ని ఆధారాలు బయటపెట్టారు. వైఎస్ వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించినట్టు తేలింది. హంతకులు బెదిరించడంతో.. డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను మొదటగా అంటే ఆ రోజు ఉదయం 6.10లోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి.. ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మరకలున్న ఆ లేఖ చూసినవారెవరికైనా.. వివేకాది హత్యేనని తెలిసిపోతుంది. కానీ లేఖ విషయాన్ని కృష్ణారెడ్డి చెప్పగానే.. తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేకా సెల్ఫోన్ను ఎవ్వరికీ ఇవ్వవద్దని, దాచి ఉంచాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పినట్టు కృష్ణారెడ్డి వెల్లడించారు, అదే విషయాన్ని దర్యాప్తులోనూ చెప్పారు. ఆ తరవాతే నర్రెడ్డి మరో అడుగు ముందుకేసి శివ ప్రకాశ్ రెడ్డి ద్వారా అవినాష్రెడ్డికి చెప్పించారు. అవినాష్ కాల్ డేటా చూస్తే ఈ విషయం నిర్ధారణ అవుతుంది కూడా. అవినాశ్ అక్కడకు చేరాక కూడా ఆయనకు లేఖ చూపించలేదు. అసలు లేఖ ఉందన్న విషయం కూడా చెప్పలేదు. వాస్తవానికి వారు గనక ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇవ్వాలని చెప్పి ఉంటే వివేకా హత్యకు గురయ్యారన్నది వెంటనే అందరికీ తెలిసిపోయేది. హత్య జరిగిందని తెలిస్తే ఎవ్వరూ మృతదేహాన్ని తాకేవారే కాదు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆ లేఖతోపాటు వివేకా సెల్ఫోన్ను కృష్ణారెడ్డి ఇచ్చారు. ఆ లేఖను చదివారు కానీ.. వెంటనే పోలీసులకు ఇవ్వలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్ఫోన్ను పోలీసులకు అప్పగించారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నదే ఈ హత్య కేసులో కీలకం కానుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎంపీ అవినాష్రెడ్డి సిబీఐ దృష్టికి తీసుకెళ్లారు కూడా. -
సమీర్ వాంఖడేపై సీబీఐ అవినీతి కేసు
ముంబై: సమీర్ వాంఖడే గుర్తున్నాడా?.. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్పై డ్రగ్స్ ఆరోపణలను దర్యాప్తు చేసిన ఉన్నతాధికారి. అదిగో ఆ ఆఫీసర్పై శుక్రవారం సీబీఐ అవినీతి కేసు ఫైల్ చేసింది. అదీ ఆర్యన్ ఖాన్ వ్యవహారంతో ముడిపడిన ఆరోపణలపైనే కావడం గమనార్హం. సమీర్తో పాటు ఇతర అధికారులు.. ఆర్యన్ను డ్రగ్స్ కేసులో ఇరికించకుండా ఉండేందుకు పాతిక కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు అభియోగాలు నమోదు చేసింది సీబీఐ. ఈ మేరకు ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో సీబీఐ సోదాలు కూడా నిర్వహించింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు రెయిడ్ సమయంలో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ముంబై జోనల్ చీఫ్గా సమీర్ వాంఖేడే ఉన్నాడు. షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్పై ఆరోపణలు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసింది కూడా తొలుత ఈయనే. అయితే ఈ విచారణ సమయంలో ఆయన తీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కేసు నుంచి తప్పించి.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు పంపారు. ఆపై ముంబైలోని అనలైటిక్స్ అండ్ రిస్క్మేనేజ్మెంట్కు బదిలీ చేశారు. కిందటి ఏడాది నాన్-సెన్సిటివ్ పోస్టింగ్ మీద చెన్నైకు బదిలీ చేశారు. ఇక ఆర్యన్ వ్యవహారంలో వాంఖడే వ్యవహరించిన తీరుపైనా దర్యాప్తు కోసం యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ(NCB) ఒక సిట్ ఏర్పాటు చేయించింది. ఈ విజిలెన్స్ టీమ్ వాంఖడేను పలుమార్లు ప్రశ్నించింది కూడా. మరోవైపు ఈ వ్యవహారంలో నాలుగు వారాలపాటు జైల్లో గడిపిన షారూక్ ఖాన్ తనయుడు .. సరైన ఆధారాలు లేకపోవడంతో మే 2022లో క్లీన్ చిట్ దక్కించుకున్నాడు. సంబంధిత వార్త: సమీర్ అంటే ఒకప్పుడు వాళ్లకు ‘సింహస్వప్నం’ -
లిక్కర్ కేసు: అప్రూవర్గా గోరంట్ల బుచ్చిబాబు!
సాక్షి, ఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో నిందితుడు, హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఛార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గోరంట్ల.. అప్రూవర్గా మారినట్లు సమాచారం. బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దగ్గర ఆడిటర్గా పని చేశాడు. లిక్కర్ కేసులో.. సౌత్ గ్రూప్ తరపున బుచ్చిబాబు మధ్యవర్తిత్వం వహించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఇదీ చదవండి: కారు చీకటి బతుకులు.. అంతరం ఇంకా అలాగే! -
వివేకా కేసు.. ఏ1 గంగిరెడ్డి బెయిల్ రద్దు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి ఊరట లభించింది. ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు వచ్చే నెల 5వ తేదీలోగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ లొంగిపోకపోతే.. గంగిరెడ్డిని అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి తెలిపింది న్యాయస్థానం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు ప్రధాన నిందితుడు (ఏ–1) ఎర్ర గంగిరెడ్డి. అయితే.. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కేసు విచారణ జరుపుతున్న తెలంగాణ హైకోర్టులో సీబీఐ ఓ పిటిషన్ దాఖలు చేసింది. వివేకా హత్యకు కుట్ర పన్నింది ఎర్ర గంగిరెడ్డేనని, దాన్ని అమలు చేయడంలోనూ అతనిది కీలక పాత్ర అని దర్యాప్తు సంస్థ వాదనలు వినిపించింది. అంతేకాదు.. సాక్ష్యాలు తారుమారు చేయడంలోనూ అతను కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. గంగిరెడ్డి గనుక బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వాదించింది. అయితే.. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ను రద్దు చేయించాలని సీబీఐ పలుమార్లు ప్రయత్నించి విఫలమైందని అతని తరపున న్యాయవాది వాదించారు. సీబీఐ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్లను.. కడప కోర్టు, ఏపీ హైకోర్టు కూడా కొట్టివేశాయని ప్రస్తావించారు. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ హత్యతో గంగిరెడ్డికి సంబంధం లేదని, బెయిల్ను రద్దు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు బెంచ్కు విజ్ఞప్తి చేశారు. అయితే వాదనలు విన్న ఏకసభ్య బెంచ్.. సీబీఐ వాదనతోనే ఏకీభవించింది. దర్యాప్తు దశలో.. గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మే 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో గంగిరెడ్డి లొంగిపోవాలని, లేకుంటే అరెస్ట్ చేసుకోవచ్చని దర్యాప్తు సంస్థకు సూచించింది హైకోర్టు. అలాగే.. రెండు నెలల్లోపు వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తి చేయాలని, జూన్ 30వ తేదీ వరకు మాత్రమే గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జులై 1వ తేదీ తర్వాత గంగిరెడ్డికి తిరిగి బెయిల్ ఇవ్వొచ్చని ట్రయల్ కోర్టుకు తెలిపింది హైకోర్టు. 2019 అక్టోబర్లో వివేకా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి డీఫాల్ట్ బెయిల్ ఇచ్చింది పులివెందుల కోర్టు. ఆపై 2021లో ఎర్ర గంగిరెడ్డిపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఏ1గా కేసును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందునా.. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరుతూ వస్తోంది. ఇదీ చదవండి: వివేకా రెండో భార్య సంచలన స్టేట్మెంట్ -
వివేకా కేసు దర్యాప్తు జూన్ 30 వరకు పొడిగింపు
► వివేకా హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ హత్య కేసులో దర్యాప్తు గడువును జూన్ 30 వరకు పొడిగించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ గడువు ఏప్రిల్ 30కి ముగియాల్సి ఉంది. తాజా ఉత్తర్వులతో సీబీఐకి మరో రెండు నెలల అదనపు గడువు వచ్చినట్టయింది. ► ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ గురించి ఈ సమయంలో అడగాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయలేదు. ఒక వేళ నిజంగానే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సీబీఐ భావించి ఉంటే.. ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసి ఉండేది. లిఖిత పూర్వకంగా ప్రశ్నలు, సమాధానాలు ఇవ్వాలన్న హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తున్నాం- చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పూర్తి ఆదేశాలు 1. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను పరిశీలించాం. కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ ఆధారంగా ఆదేశాలిచ్చారు. 2. వైఎస్ వివేకానందారెడ్డి ఆయన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఆయన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి సోదరుడు. 3. హత్య గురించి వివేకా పీఏ MV కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఒక సిట్ ఏర్పాటయింది. అలాగే కేసును అడిషనల్ డైరెక్టర్ నేతృత్వంలో సిబిఐ దర్యాప్తు చేస్తోంది. 4. వివేకా కూతురు విజ్ఞప్తి మేరకు కేసును బదిలీ చేశాం. సిబిఐ వేసిన ఛార్జ్షీట్లో నలుగురి పేర్లు ఉన్నాయి. నవంబర్ 17, 2021న శివశంకర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. జనవరి 31, 2022న సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది 5. ఏప్రిల్ 16న దర్యాప్తుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్రెడ్డికి సిబిఐ నోటీసులిచ్చింది. దీనిపై తెలంగాణ హైకోర్టును ఎంపీ అవినాష్రెడ్డి ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన హైకోర్టు..లాయర్ సమక్షంలో విచారణ జరపాలని సిబిఐకి సూచించింది. 6. అలాగే ఏప్రిల్ 19 నుంచి 25 వరకు దర్యాప్తుకు హాజరు కావాలని ప్రశ్నలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను మేం కొట్టివేస్తున్నాం. 7. ఈ సమయంలో అరెస్ట్ చేయాలా వద్దా అన్న అంశాల జోలికి వెళ్లడం లేదు. నిజంగా అవినాష్రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయాలని భావించి ఉంటే ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేవాళ్లు. సిబిఐ కూడా ఒక పద్ధతిలో దర్యాప్తు చేస్తోంది. సీబీఐ అరెస్టు చేస్తుందని మీరెందుకు ఊహిస్తున్నారు?. 8. కేసు దర్యాప్తు గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నాం. 9. ఏప్రిల్ 25న తెలంగాణ హైకోర్టు ముందుకు రానున్న పిటిషన్ లో ముందస్తు బెయిల్ కు సంబంధించి ఎంపీ అవినాష్ తన వాదనలు వినిపించుకోవచ్చు 10. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రభావం అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ప్రభావం చూపరాదు. వైఎస్ అవినాష్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు అవినాష్ రెడ్డి ఎంపీగా బాధ్యత గల పదవిలో ఉన్నారు, ఎక్కడికి వెళ్లడం లేదు సిబిఐ ముందు ఇప్పటివరకు ఏడుసార్లు విచారణకు హాజరయ్యారు విచారణకు అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నాడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులలోని పేరా 18 తప్పుడు గా అన్వయం చేస్తున్నారు అవినాష్ రెడ్డి ఎలాంటి సాక్ష్యం ధ్వంసం చేయలేదు, పైగా అన్ని వైపులా అవినాష్ పై దాడి జరుగుతోంది ► అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై రేపు(మంగళవారం) తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాము ఇవాళ ఇచ్చిన తీర్పు ప్రభావం ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణపై ఉండకూడదని పేర్కొంది. ఇదీ చదవండి: ఏది నిజం? వివేకా హంతకులను నడిపిస్తుందెవరు? -
సత్యపాల్ మాలిక్కు సీబీఐ సమన్లు
Satya Pal Malik News: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(76)కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) శుక్రవారం సమన్లు జారీ చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్పై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో సత్యపాల్ మాలిక్ను ప్రశ్నించాలని సీబీఐ భావించింది. ఈ మేరకు ఏప్రిల్ 28వ తేదీన ఈ కేసులో సాక్షిగానే తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ సమన్లలో కోరింది. 2018లో కంపెనీ కాంట్రాక్ట్ను ఆ సమయంలో జమ్ము కశ్మీర్ గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఆ ఫైల్స్ను స్వయంగా పర్యవేక్షించానని చెబుతూ ఒప్పందాన్ని రద్దు చేశారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ల కుటుంబ సభ్యుల మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్కు సంబంధించి స్కాం ఇది. దాదాపు మూడున్నర లక్షల ఉద్యోగులు 2018 సెప్టెంబర్లో ఇందులో చేరారు. అయితే.. అవకతవకలు ఉన్నాయంటూ నెలకే ఈ కాంట్రాక్ట్ను రద్దు చేస్తూ సంచలనానికి తెర తీశారు అప్పుడు గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్తో పాటు ట్రినిటీ రీఇన్సూరెన్స్ బ్రోకర్స్ను నిందితులుగా చేర్చింది సీబీఐ. ఇందులో మోసం జరిగిందని మాలిక్ ఆరోపించడంతో.. ఆయన నుంచి అదనపు సమాచారం సేకరించేందుకే సీబీఐ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. CBI has asked me to come to their Delhi office to give clarification regarding the alleged insurance scam in J&K on 27th or 28th April: Former J&K Governor Satyapal Malik on alleged insurance scam involving Reliance General Insurance (file photo) pic.twitter.com/t9kLr3Dvrp — ANI (@ANI) April 21, 2023 ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఏప్రిల్లో మాలిక్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది సీబీఐ. అందులో ఒకటి పైన చెప్పుకున్న ఇన్సూరెన్స్ స్కీమ్ది కాగా, రెండోది జమ్ము కశ్మీర్ దాదాపు రూ.2,200 కోట్ల వ్యయంతో చేపట్టిన కిరూ హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలు. రిలయెన్స్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని, పేపర్ వర్క్ కూడా పూర్తయిన ఆ స్కీమ్ను రద్దు చేయడం ఆయనకు అసంతృప్తిని కలిగించిందని సత్యపాల్ మాలిక్ ఏప్రిల్ 14న కరణ్ థాపర్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనికి ముందు, డీబీ లైవ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మాలిక్ ఈ ప్రస్తావన చేశారు. ఈ లైవ్ ప్రసారం కాగానే సత్యపాల్ మాలిక్కు రామ్ మాధవ్ పరువునష్టం నోటీసు పంపారు కూడా. సంచలనంగా సత్యపాల్ మాలిక్ చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సత్యపాల్ మాలిక్. ఆ తర్వాత భారతీయ లోక్దల్ పార్టీలో చేరి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మాలిక్.. 2012లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు కూడా. ఆపై బీహార్, జమ్ము కశ్మీర్, గోవా, మేఘాలయాకు గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను కేంద్రం వెనక్కి తీసుకున్న సమయంలో ఈయనే గవర్నర్గా ఉన్నారు. రైతుల ఉద్యమ సమయంలో ఈయన రైతులకు మద్దతు ప్రకటించడం, కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. పుల్వామా దాడి, నరేంద్ర మోదీ మీద తాజాగా (ఏప్రిల్ 14వ తేదీన) కరణ్ థాపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనానికి తెర తీసింది. అవినీతిపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకోరని, ఎందుకంటే అందులో ఆరోపణలు ఎదుర్కొనేవాళ్లు ఆయనకు సన్నిహితులేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు పుల్వామా దాడి సమయంలో మోదీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గవర్నర్గా ఉన్న తనకు చేసిన సూచనలపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం పుట్టించాయి. పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, 300 కేజీల ఆర్డీఎక్స్ పాక్ నుంచి రావడం, జమ్ము కశ్మీర్లో పది నుంచి పదిహేను రోజులపాటు చక్కర్లు కొట్టడం, దానిని అధికారులు గుర్తించలేకపోవడం పైనా మాలిక్ వ్యాఖ్యలు చేశారు. -
అవినాశ్ను అరెస్టు చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ నెల 25వ తేదీ వరకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ఆయన రోజూ సీబీఐ కార్యాలయానికి వస్తారని, ఏ విచారణ చేయాలన్నా చేపట్టవచ్చని సూచించింది. అయితే సీబీఐ అడిగే ప్రశ్నలు లిఖితపూర్వకంగా ఉండాలని... వీడియో, ఆడియో రికార్డు చేయాలని స్పష్టం చేసింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా అరెస్టులు చేయడం సరికాదని, 25వతేదీలోగా సాక్ష్యాలు సేకరించాలని పేర్కొంటూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ నాటికి అన్ని అంశాలను పరిశీలించి తుది ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 30లోగా విచారణ పూర్తి చేయాలని సీబీఐకి నిర్దేశించింది. వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ అవినాశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ఆ వివరాలు ఇవీ... ఏది ప్రామాణికం..? ‘హత్య జరిగిన రోజు నిందితుల కదలికలకు సంబంధించి భాస్కర్రెడ్డి రిమాండ్ రిపోర్టులో ఒకలా.. ఏ–4 దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో మరోలా.. సీబీఐ గూగుల్ టేకౌట్లో ఇంకోలా ఉంది. ఇందులో ఏది ప్రామాణికం? దేనిని పరిగణలోకి తీసుకోవాలి? కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) సోమవారం ప్రెస్మీట్ పెట్టి మాట్లాడితే ఈనాడు పత్రిక ప్రచురించింది. గతంలో ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రామ్సింగ్ను పలుకుబడితో మార్చేశారంటూ వ్యాఖ్యలు చేశాడు. దీన్ని సీబీఐ సమర్థిస్తుందా? విచారణాధికారిని మార్చింది సుప్రీంకోర్టు. అంటే దస్తగిరి ఉద్దేశం సుప్రీంకోర్టు ద్వారా మార్పించారనా? అత్యున్నత న్యాయస్థానంపై ఇలాంటి వ్యాఖ్యలను స్వాగతిస్తామా? ఈ కేసులో ఇంప్లీడ్ అయిన సునీత న్యాయవాది దస్తగిరి వ్యాఖ్యలను సమర్థించడం సరికాదు. అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డి, మరో ఇద్దరు తమ వెనుక ఉన్నారని గంగిరెడ్డి పేర్కొన్నట్లు దస్తగిరి చెప్పాడు. అయితే గంగిరెడ్డి మాత్రం తాను ఎవరి పేర్లు చెప్పలేదని వాంగ్మూలంలో పేర్కొన్నాడు. కిరాయి హంతకుడు చెప్పిన ఓ మాటను పట్టుకుని అవినాశ్, భాస్కర్రెడ్డిని ఈ కేసులో ఇరికించేందుకు సీబీఐ శతవిధాలా ప్రయత్నిస్తోంది. గూగుల్ కూడా సర్టిఫికెట్ ఇవ్వదు.. వైఎస్ వివేకా హత్య వెనుక ఉన్న ప్రధాన కారణాలపై సీబీఐ దర్యాప్తు సాగించడం లేదు. గంగిరెడ్డితో వివేకాకు భూమికి సంబంధించిన వివాదం ఉంది. తనకు రావాల్సిన వాటా ఇవ్వడం లేదని గంగిరెడ్డి ఆగ్రహంతో ఉండేవాడు. వివేకా రెండో భార్య, ఆమె కుమారుడి ఉదంతంలో మొదటి భార్య, కుమార్తె సునీత, అల్లుడితో తీవ్ర విభేదాలున్నాయి. సునీల్ యాదవ్(ఏ–2) తల్లిని వివేకా అసభ్యకరంగా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలున్నాయి. వివేకాకు కొందరు రాజకీయ శత్రువులు కూడా ఉన్నారు. ఈ నాలుగు అంశాలపై సీబీఐ విచారణ జరపలేదు. సీబీఐ దర్యాప్తు అంతా అవినాశ్, భాస్కర్రెడ్డిని ఇరికించేందుకే సాగుతూ ఇతర కారణాల జోలికి వెళ్లడం లేదు. గూగుల్ టేక్ అవుట్ ప్రామాణికం కాదు. ఇది సీబీఐకి కూడా తెలిసినా అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డిని ఇరికించే ఉద్దేశంతో దాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. గూగుల్ టేక్ అవుట్ ప్రామాణికమని గూగుల్ కూడా అధికారికంగా సర్టిఫికెట్ ఇవ్వదు.. ఇప్పటివరకు ఇవ్వలేదు కూడా. అలాంటిది సీబీఐ దాన్ని ఆధారంగా పేర్కొనడం తప్పుబట్టాల్సిన అంశం. ఆధారాలు లేకుండా అరెస్టులు... 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమికి అవినాశ్, భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డి కారణమని వివేకా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రిమాండ్ పిటిషన్లో సీబీఐ పేర్కొంది. దీనికి ఎలాంటి ఆధారం, సాక్ష్యం లేదు. ఎలాంటి ఆధారం లేకుండా ఓ యువ ఎంపీని అరెస్టు చేస్తే ఆయన భవిష్యత్, పరువు ప్రతిష్టలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కడప పార్లమెంట్ స్థానం నుంచి అవినాశ్ రెండుసార్లు ఎంపీగా పోటీ చేశారు. వివేకా జీవించి ఉండగా అవినాశ్ విజయం కోసం ప్రచారం నిర్వహించారు. గెలుపు బాధ్యతంతా ఆయనే తీసుకుని పనిచేశారు. అత్యంత సన్నిహితులైన వివేకా, అవినాశ్ మధ్య సంబంధాలు ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక కారణంగా హత్యలు చేసుకునే స్థాయికి వెళ్లాయనడం సరికాదు. సీబీఐ కంటే ముందు సిట్ మెటీరియల్ అంతా సేకరించింది. దీన్ని సీబీఐకి అందజేసింది. దస్తగిరి బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో గానీ, అప్రూవర్గా పేర్కొన్న సమయంలో గానీ ఈ మెటీరియల్ను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టలేదు. అసలు హత్యలో కీలక పాత్ర పోషించిన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిని వదిలేశారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుకు ఎందుకు పిటిషన్ వేయలేదని న్యాయస్థానం ప్రశ్నించడంతో తర్వాత దాఖలు చేశారు. దీనిపై కూడా వాయిదాలు కోరుతూ జాప్యం చేస్తూ వస్తున్నారు. హత్య చేసిన తర్వాత తాను బీరువా పగుల కొట్టానని, గంగిరెడ్డి ఏవో డాక్యుమెంట్ల కోసం వెతికి తీసుకెళ్లాడని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. ఆ డాక్యుమెంట్లు ఏమిటి? ఎక్కడి తీసుకెళ్లాడో దర్యాప్తు అధికారులు ఇంతవరకు తెలుసుకోలేదు. అసలు మెటీరియల్ను దర్యాప్తు అధికారులు ఎందుకు పరిశీలించడం లేదో తెలియదు. వివేకా మృతి విషయాన్ని ఆయన అల్లుడికి చెప్పింది ఎవరు? వారికి ఈ విషయం ఎలా తెలిసింది? దీని గురించి కూడా విచారణ చేయడం లేదు. ఆధారాలు లేకుండానే భాస్కర్రెడ్డిని అరెస్టు చేశారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు.. తన వీడియో, ఆడియో రికార్డును చేస్తున్నారో లేదో చెప్పాలని అవినాశ్ పలుమార్లు సీబీఐని కోరారు. ఓ చిన్న నోట్ ఇచ్చేందుకు కూడా వారు నిరాకరించారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించి ఆ వివరాలు తెలుసుకోవాల్సి వచ్చింది. విలువైన కోర్టు సమయం వృథా అయింది. దర్యాప్తు పారదర్శకంగా లేదు. విచారణ ముగిసిందని భాస్కర్రెడ్డి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అవినాశ్కు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు వారి వద్ద ఆధారాలు, సాక్ష్యాలు ఏమీ లేవు.. ఒక్క దస్తగిరి వాంగ్మూలం మినహా. సీబీఐ విచారణకు సహకరించేందుకు అవినాశ్రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు, ఎక్కడికి పిలిచినా ఆయన వస్తారు. ఇప్పటికే పలుమార్లు 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. దాదాపు 20 గంటలకుపైగా విచారించి 161 సీఆర్పీసీ కింద స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. అవినాశ్ను అరెస్టు చేయాలని సీబీఐ అతృతతో ఉంది. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలి’ ఇంకా సాక్ష్యాలు సేకరిస్తున్నాం: సీబీఐ పీపీ ‘వివేకా హత్య వెనుక కుటుంబ తగాదాలు, వ్యాపార తగాదాలు లేవు. అవినాశ్రెడ్డి విచారణకు సహకరించడం లేదు. ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేశారు. ఇంకా కొందరిని విచారించాల్సి ఉంది. సమాచారం, డాక్యుమెంట్లు సేకరిస్తున్నాం. గంగిరెడ్డి తీసుకువెళ్లిన డాక్యుమెంట్లను సేకరించలేదు’ అని సీబీఐ పీపీ తెలిపారు. కిక్కిరిసిన కోర్టు హాల్లో సుదీర్ఘ వాదనల అనంతరం అవినాశ్రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. -
వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయ్: అవినాష్రెడ్డి న్యాయవాది
సాక్షి, హైదరాబాద్: వివేకా కేసులో వైఎస్ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. కేవలం దస్తరిగి ఇచ్చిన కన్ఫెషన్ తప్ప.. సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, పైగా దస్తగిరిని కూడా బెదిరించి ఆ స్టేట్మెంట్ తీసుకుందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. ఆపై పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. అవినాష్రెడ్డి తరపు న్యాయవాది వాదనలు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. భాస్కర్రెడ్డి పిటిషన్ పెండింగ్లో ఉండగానే అరెస్ట్ చేశారు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి దస్తగిరి కన్ఫెషన్ తప్ప సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరిని బెదిరించి.. చిత్రహింసలకు గురిచేసినట్లు ఎర్ర గంగిరెడ్డి చెప్పాడు. దస్తగిరి కూడా సీబీఐకి భయపడి భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయి. ఒకటి కుటుంబం, రెండోది వ్యాపార సంబంధాలు, మూడోది వివాహేతర సంబంధాలు, నాలుగోది పొలిటికల్ గెయిన్. వీటిపై సీబీఐ ఫోకస్ పెట్టలేదని అవినాష్ రెడ్డి తరపున న్యాయవాది వాదించారు. అలాగే.. వైఎస్ అవినాష్రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని, రాజకీయ కోణంలో భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డిలను ఇరికించే కుట్రలో భాగమే ఇదంతా అని వాదించారు. ఈ తరుణంలో అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది తెలంగాణ హైకోర్టు. అంతేకాదు.. వివేకా కేసులో అవినాష్రెడ్డి ఇవాళ్టి విచారణను రేపటికి సీబీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. రేపు సాయంత్రం నాలుగు గంటల తర్వాతే అవినాష్రెడ్డిని విచారణకు పిలవాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇదీ చదవండి: వివేకాపై అందుకే సునీత కక్షగట్టింది -
దర్యాప్తు సంస్థలపై కేసులు వేస్తా-కేజ్రీవాల్
దర్యాప్తు సంస్థలపై కేసులు వేస్తా-కేజ్రీవాల్ -
కేజ్రీవాల్ సీబీఐ ఎదుట హాజరవుతారు: ఆప్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో పాటు రాజకీయ ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కాంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి తమ ఎదుట హాజరు కావాలని సమన్లలో సీబీఐ ఆయన్ని కోరింది. ఏప్రిల్ 16న విచారణకు రావాలని సీబీఐ తన సమన్లలో పేర్కొంది. ఈ కుంభకోణం మొత్తానికి కారణమైన.. కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఆయన్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆదివారం ఆయన సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సీబీఐ ఈ స్కాంలో సిసోడియాను విచారణకు పిలిచి.. అటు నుంచి అటే అరెస్ట్ చేసింది. సిసోడియా రిమాండ్ రిపోర్ట్లో కేజ్రీవాల్ పేరు ఉంది కూడా. ‘‘జాతీయ పార్టీ హోదా దక్కించుకున్న నేపథ్యంలోనే ఆప్పై ఒత్తిడి చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. కానీ, ఆయన సీబీఐ ఎదుట హాజరు అవుతారు. పై నుంచి కిందిదాకా అవినీతిలో కూరుకుపోయింది మీరు(ప్రధాని మోదీని ఉద్దేశించి), మీ ప్రభుత్వమే. సీబీఐ సమన్లతో కేజ్రీవాల్ తన పోరాటం ఆపరు. సీబీఐ ఎదుట హాజరవుతారు. అరెస్ట్ చేసినా, జైల్లో పెట్టినా, ఎలాంటి చర్యలు తీసుకున్నా ఆయన తన గళం వినిపించడం ఆపరు’’ అంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
‘వివేకా హత్యలో దస్తగిరి పాల్గొన్నాడు’
సాక్షి,హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. గురువారం వైఎస్ భాస్కరరెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించగా, ఆపై సీబీఐ కూడా తమ వాదనలు వినిపించింది. వివేకా కేసులో దర్యాప్తును సీబీఐ పక్కదారి పట్టించిందని.. భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డిలను కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని భాస్కర్రెడ్డి తరపున లాయర్ నిరంజన్రెడ్డి వాదించారు. కేసుతో భాస్కర్రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డిలను ఇరికించే కుట్ర జరుగుతోంది. సీబీఐ ఉద్దేశపూర్వకంగానే.. మా క్లయింట్లను లాగే ప్రయత్నం చేస్తున్నారు. దస్తగిరి అప్రూవర్గా మారడాన్ని వ్యతిరేకిస్తున్నాం. వివేకా హత్యలో దస్తగిరి పాల్గొన్నాడు. అలాంటిది నిందితుడు దస్తగిరిని అప్రూవర్గా మార్చేసి.. దర్యాప్తును సీబీఐ పక్కదారి పట్టించింది. ఒక నిందితుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మా క్లయింట్లను ఈ కేసులోకి ఎలా లాగుతారు. గూగుల్ టేక్అవుట్ ఫొటోలను ఎలా ఆధారంగా చూపిస్తారు?. ఇది ముమ్మాటికీ మా క్లయింట్స్ను ఇరికించే ప్రయత్నమే అంటూ లాయర్ నిరంజన్రెడ్డి వాదించారు. ఇక సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మాజీ మంత్రి వివేకానందరెడ్డిది హత్యేనేని, వివేకాను ఎవరు హత్య చేశారన్నది తేలాల్సి ఉందని, సుప్రీం కోర్టు ఈ కేసును దగ్గరగా పర్యవేక్షిస్తోందని వాదించింది. ఈ తరుణంలో ఈ కేసులో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. -
2014 తర్వాతే సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది: ప్రధాని మోదీ
ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా(CBI) తాజాగా అరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో.. డైమండ్ జూబ్లీ వేడుకలను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. సీబీఐ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించడంతో పాటు షిల్లాంగ్, పూణే, నాగ్పూర్లలో కొత్తగా ఏర్పాటు చేసిన సీబీఐ కాంప్లెక్స్లను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్తో పాటు ఉత్తమ దర్యాప్తు అధికారులకు మెడల్స్ ప్రదానం చేశారు. అలాగే.. డైమండ్ జూబ్లీ ఉత్సవాల స్మారకార్ధం పోస్టల్ స్టాంపు, నాణెం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోనే సీబీఐ కొత్త ట్విటర్ హ్యాండిల్ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘సీబీఐ పరిధి పెరిగింది. చాలా నగరాల్లో సీబీఐ ఆఫీసులు నెలకొల్పుతున్నాం. అవినీతి సాధారణ నేరం కాదు. దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన శత్రువు. అవినీతిని కొందరు వారసత్వంగా భావిస్తున్నారు. 2014లో మేము అవినీతిపై యుద్ధం ప్రారంభించాము. 2014 తర్వాత సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది. అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలకపాత్ర. ఇప్పుడు అవినీతిపరులు భయపడుతున్నారు. గత ప్రభుత్వాలు అవినీతిని వ్యవస్థీకృతం చేశాయి. ఒక కుంభకోణానికి మించి మరో కుంభకోణం చేశాయి. 2జీ స్కామ్ అతిపెద్ద కుంభకోణం. ఆర్థిక నేరగాళ్లు వేలకోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయారు. బీజేపీ ప్రభుత్వం అవినీతిపై యుద్ధం చేస్తోంది’ అని స్పష్టం చేశారు. ఇక, నాటి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీర్మానం మేరకు.. 1963, ఏప్రిల్ 1వ తేదీన సీబీఐ ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ పర్యవేక్షణలో.. సీబీఐ పని చేస్తుంది. దేశంలో ఇప్పటిదాకా ఎన్నో హైప్రొఫైల్తో పాటు సంక్లిష్టమైన కేసుల్ని పరిష్కరించిన కేంద్రం అత్యున్నత దర్యాప్తు సంస్థగా సీబీఐకంటూ ఓ పేరు ఉండిపోయింది. #WATCH | 10 years ago, there was a competition to do more and more corruption. Big scams took place during that time but the accused were not scared because the system stood by them… After 2014, we worked on a mission mode against corruption, black money: PM Narendra Modi pic.twitter.com/LOqxd6mCbz — ANI (@ANI) April 3, 2023 ఇదీ చదవండి: ఆలయంలోకి బుల్డోజర్లు.. అక్రమ కట్టడం కూల్చివేత -
సీబీఐ అప్పుడు నాపై ఒత్తిడి చేసింది: అమిత్ షా
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం తప్పుదోవలో తమలో కొందరిపై ప్రయోగిస్తోందంటూ విపక్షాలు, కేంద్రంలోని బీజేపీపై గుప్పిస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో.. సీబీఐ తనపైనా ఓ కేసు దర్యాప్తు విషయమై ఒత్తిళ్లు చేసిందని, నరేంద్ర మోదీని అందులో ఇరికించే యత్నమూ చేసిందని ఆరోపించారాయన. బుధవారం ఓ మీడియా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో కూడా సీబీఐ నా మీద కూడా ఒత్తిళ్లకు పాల్పడింది. గుజరాత్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో ప్రధాని మోదీని ఇరికించేందుకు యత్నించింది. ఆ సమయంలో ఆయన(మోదీ) గుజరాత్ సీఎంగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో నన్ను ప్రశ్నించిన సీబీఐ.. మోదీ పేరును ప్రస్తావించాలని సీబీఐ నాపై(షా తనను తాను ఉద్దేశించుకుని) ఎంతో ఒత్తిడి తీసుకొచ్చింది అని పేర్కొన్నారాయన. కానీ, ఆ సమయంలో దర్యాప్తు సంస్థ ఒత్తిళ్లకు నేను తలొగ్గలేదు. అలాగని సీబీఐ తీరును బీజేపీ బహిరంగంగా ఎండగట్టలేదు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అవినీతికి మద్దతుగా రాద్ధాంతం చేస్తోందని, దర్యాప్తు సంస్థలపై విమర్శలు గుప్పిస్తోందని పేర్కొన్నారాయన. ఇక రాహుల్ గాంధీ అనర్హత పరిణామంపై స్పందిస్తూ.. రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఆయన కోర్టుకు వెళ్లొచ్చు. కానీ, తన తలరాతకు ప్రధాని మోదీనే కారణమంటూ రాజకీయ రచ్చ చేస్తున్నాడు.. కన్నీళ్లు కారుస్తున్నాడు అంటూ షా తప్పుబట్టారు. ఇంకా పలు అంశాలపైనా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇదీ చదవండి: ఆ పథకానికి పీఎం మోదీ కన్వీనర్.. కాంగ్రెస్ చీఫ్ ఎద్దేవా -
వివేకా కేసు విచారణకు నూతన సిట్
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సీబీఐ ఏర్పాటు చేసింది. బృందంలోని సభ్యుల పేర్లను సీబీఐ అందజేయగా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దర్యాప్తును వేగవంతం చేసి ఏప్రిల్ 30 లోగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న రాంసింగ్ను తప్పించింది. వివేకా హత్య కేసులో ఏ5గా ఉన్న శివశంకర్రెడ్డి భార్య తులశమ్మ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. నూతన సిట్ బృందానికి సీబీఐ డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వం వహించనున్నారు. ఈ బృందంలో ఎస్పీ వికాస్సింగ్, అదనపు ఎస్పీ ముకేష్కుమార్, ఇన్స్పెక్టర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పూనియా, ఎస్ఐ అంకిత్ యాదవ్ ఉన్నారు. ఇలా ఎంతకాలం? దర్యాప్తు అధికారి మార్పు/కొనసాగింపుపై సీబీఐ డైరెక్టర్ నిర్ణయాన్ని వెల్లడించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ తాజాగా జాబితాను అందజేశారు. చౌరాసియా నేతృత్వంలోని నూతన సిట్ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా జస్టిస్ ఎంఆర్ షా తెలిపారు. ఈ సందర్భంగా దర్యాప్తు ఆలస్యం అవుతోందని అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం వేగంగా పూర్తి చేయాలని పేర్కొంది. చదవండి: వివేకా హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు? భారీ కుట్ర కారణంగా ట్రయల్ కోర్టులో అదనపు చార్జిషీటు దాఖలు చేసేందుకు స్వేచ్ఛ కావాలని సీబీఐ కోరడంతో ఇలా ఎంతకాలం సాగదీస్తారని జస్టిస్ సీటీ రవికుమార్ ప్రశ్నించారు. ‘విచారణ వేగవంతం చేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించాయి. మేం మరోసారి అదే చెబుతున్నాం. బెయిలు పిటిషన్ దరఖాస్తు చేసుకునేందుకు ఏ5 (శివశంకర్రెడ్డి) భార్య అనుమతి కోరారు. ఈరోజు నుంచి ఆర్నెళ్ల వరకూ విచారణ ప్రారంభం కాకుంటే రెగ్యులర్ బెయిల్కు ఏ 5 దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు వర్తించవు. కేవలం మెరిట్స్ ప్రకారమే హైదరాబాద్లోని ట్రయల్ కోర్టు విచారిస్తుంది. ఈ పిటిషన్పై విచారణ ముగిస్తున్నాం’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. చదవండి: ఏది నిజం.. పచ్చపైత్యం ముదిరిపోయింది.! -
సుప్రీం కోర్టులో నేడు వివేకా కేసు పిటిషన్పై విచారణ
సాక్షి, ఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి దాఖలైన ఒక పిటిషన్పై సుప్రీం కోర్టులో నేడు(మార్చి 27, సోమవారం) విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టనుంది కోర్టు. సీబీఐ తరపున దర్యాప్తు అధికారిని మార్చాలంటూ పిటిషన్ వేశారు తులసమ్మ. గతంలో ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా.. సుప్రీం కోర్టు దర్యాప్తు సంస్థ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారని దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. ఈ మేరకు కేసు పురోగతిపై సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సీబీఐని ఆదేశించించింది కూడా. -
manish sisodia: సిసోడియాపై మరో కేసు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మనీష్ సిసోడియాకు మరో షాక్ తగిలింది. ఢిల్లీ ప్రభుత్వ ఫీడ్బ్యాక్ విభాగంలో(FBU) అవినీతి ఆరోపణలకుగానూ ఆయనపై తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరో కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఆయన లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయ్యారు. ఫీడ్బ్యాక్ యూనిట్ను ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక ఆప్ ప్రభుత్వం 2015లో ఏర్పాటు చేసింది. అయితే ఈ విభాగం ఏర్పాటు, నిర్వాహణ అంతా చట్టానికి విరుద్ధంగా నడిచిందని, సుమారు రూ.36 లక్షల నష్టంతో అవకతవకలు జరిగాయని సీబీఐ పేర్కొంది. ఈ అవినీతి ఆరోపణలకుగానూ సిసోడియాపై కేసు నమోదు చేస్తున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఈ పరిణామంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఇదంతా ప్రధాని ప్లాన్ అని, సుదీర్ఘకాలం మనీష్ సిసోడియాను జైల్లో ఉంచేందుకు తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ ట్వీట్ చేశారాయన. PM’s plan is to slap several false cases against Manish and keep him in custody for a long period. Sad for the country! https://t.co/G48JtXeTIc — Arvind Kejriwal (@ArvindKejriwal) March 16, 2023 ఎఫ్బీయూను తప్పుడు దోవలో రాజకీయ అవసరాల కోసం సిసోడియా ఉపయోగించారని, ఇతరుల వ్యక్తిగత సమాచార సేకరణ యత్నం జరిగిందని(Snooping Case) సీబీఐ తన నివేదికలో పొందుపరిచింది. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. అవినీతి నిరోధక చట్టం కింద సిసోడియాను విచారించేందుకు సీబీఐను అనుమతించింది కూడా. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి అయిన సిసోడియాను సీబీఐ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పనలో జరిగిన అవినీతి కుంభకోణానికిగానూ ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్ చేసింది. -
Delhi Liquor Scam: సీబీఐ అరెస్ట్పై సుప్రీంకోర్టుకు సిసోడియా..
న్యూఢిల్లీ: లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ అరెస్ట్ను సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. సిసోడియా పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నేటి మధ్యాహ్నం 3.50 గంటలకు విచారిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వెల్లడించింది. సిసోడియా అరెస్టు, మద్యం పాలసీ కేసులో సీబీఐ దర్యాప్తు తీరును సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సీజేఐ ముందు కేసును ప్రస్తావించనున్నారు. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆదివారం సీబీఐ అధికారులు మనీష్సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎనిమిది గంటలపాటు సిసోడియాను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సరిగా చెప్పడం లేదని డిప్యూటీ సీఎంను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సోమవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనను విచారించాల్సి ఉందని... తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరింది. దీనికి అంగీకరించిన కోర్టు.. సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఈ పరిమాణాల నేపథ్యంలో ఆయన సుప్రీం మెట్లెక్కారు. మరోవైపు సిసోడియా అరెస్టును వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నేతలపై దాడులకు ఉపయోగిస్తోందని విమర్శించాయి. -
విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారు: అవినాష్ రెడ్డి
-
మాకు వ్యతిరేకంగా కేంద్రం సీబీఐ, ఈడీని వాడుకుంటోంది: సిసోడియా
-
విశాఖ సీబీఐ అధికారులకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు వినతిపత్రం
-
చిత్రా రామకృష్ణ విచారణకు గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: కో–లొకేషన్ స్కామ్ కేసులో మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండీ, సీఈవో) చిత్రా రామకృష్ణను విచారించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు వీలుకల్పిస్తూ ప్రముఖ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఎన్ఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7వ తేదీన ఈ మేరకు బోర్డ్ ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఎక్సే్ఛంజ్ ఆదాయ అంశాలను కూడా బోర్డ్ ఈ సందర్భంగా ఆమోదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. గత ఏడాది మార్చి 6వ తేదీన చిత్రా రామకృష్ణ అరెస్టయ్యారు. అటు తర్వాత ఆమెను విచారించేందుకు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) బోర్డు ఆమోదం కోసం సీబీఐ వేచి చూస్తోంది. నిజానికి ఈ కేసులో 2018 మేలో సీబీఐ ఎఫ్ఐఆర్ను నమోదుచేసింది. అనంతరం దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె అరెస్టయ్యారు. స్కామ్ ఏమిటి? మార్కెట్ ఎక్సే్ఛంజీల కంప్యూటర్ సర్వర్ల నుంచి కొందరు స్టాక్ బ్రోకర్లకు చట్ట విరుద్ధంగా కీలక ముందస్తు సమాచారం లభించేలా చిత్రా రామకృష్ణ అవకతవకలకు పాల్పడ్డారన్న ప్రధాన ఆరోపణపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఎక్సే్ఛంజ్ ప్రాంగణంలో ఆయా స్టాక్ బ్రోకర్లు తమ సర్వర్లు, సిస్టమ్స్ లోకేట్ చేయడానికి, నిర్దిష్ట రాక్లను రెంట్కు తీసుకోడానికి అనుమతించారన్నది క్లుప్తంగా కో–లొకేషన్ స్కామ్ ప్రధానాంశం. ఈ కో– లెకేషన్ స్కామ్ ద్వారా కొంతమంది బ్రోకర్లు అధిక ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్లో ప్రిఫరెన్షియల్ యాక్సెస్ను పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణ 2009లో ఎన్ఎస్ఈ జాయింట్ మనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. 2013 మార్చి 31 వరకు ఆ స్థానంలో కొనసాగారు. 2013 ఏప్రిల్ 1న ఆమె ఎండీ, సీఈఓగా పదోన్నతి పొందారు. ఎన్ఎస్ఈలో ఆమె పదవీకాలం డిసెంబర్ 2016లో ముగిసింది. కో–లొకేషన్ కుంభకోణం వ్యవహారంలో క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ 2019లో ఏప్రిల్ చిత్రారామకృష్ణ అలాగే ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా పనిచేసిన రవి నారాయణ్లను లిస్టెడ్ కంపెనీ లేదా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్తో లేదా మరే ఇతర మార్కెట్ ఇంటర్మీడియేటరీతో సంబంధం లేకుండా ఐదేళ్ల పాటు నిషేధించింది. నిర్ణీత వ్యవధిలో తీసుకున్న జీతాల్లో 25 శాతాన్ని డిపాజిట్ చేయాలని కూడా వారిని ఆదేశించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రామకృష్ణ, నారాయణ్లపై మార్కెట్ రెగ్యులేటర్ జారీ చేసిన ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది. సుప్రీంకోర్టులో మాజీ సీఈఓకు ఊరట ఢిల్లీ హైకోర్టు బెయిల్పై జోక్యానికి నో... ఇదిలావుండగా, చిత్రరామకృష్ణకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సీబీఐ కేసులో చిత్రారామకృష్ణకు ఢిల్లీ హైకోర్టు గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాలు చేస్తూ, సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీనిని విచారించిన జస్టిస్ అజయ్ రస్తోగీ, బేల ఎం త్రివేదిలతో కూడిన డివిజన్ బెంచ్ సీబీఐ అప్పీల్ను తిరస్కరిస్తూ, అరెస్టయిన 60 రోజుల్లో రావాల్సిన బెయిల్కు సంబంధించి మాత్రమే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. విచారణను ఈ బెయిల్ ప్రభావితం చేయబోదని తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 24న ఈ కేసులో అరెస్టయిన ఎక్సే్ఛంజ్ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (జీఓఓ) ఆనంద్ సుబ్రమణియన్కు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా, కో–లొకేషన్ కేసుకు సంబంధించి అక్రమ ధనార్జన (మనీలాండరింగ్) ఆరోపణలపై గత ఏడాది జూలై 14న చిత్రా రామకృష్ణఅను అరెస్ట్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చూపించింది. ఈ కేసులో కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 9 ఢిల్లీ హైకోర్టు చిత్రా రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఎస్ఈ ఉద్యోగుల అక్రమ ఫోన్ ట్యాపింగ్, రహస్య సమాచార సేకరణ వంటి ఆరోపణలు కూడా ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఉన్నాయి. -
బుచ్చిబాబు మద్యం విధానం కుట్రలో భాగస్వామి: సీబీఐ
-
Custom Milling Rice: సీఎంఆర్పై సీబీ'ఐ'
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగింతల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దృష్టి పెట్టింది. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) అధికారుల సహకారంతో చాలా రాష్ట్రాల్లో రైస్ మిల్లర్లు, వ్యాపారులు, రాష్ట్ర అధికారులు కలిసి వ్యవస్థీకృత సిండికేట్ నడుపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో సీబీఐ విచారణ చేపట్టి తనిఖీలు నిర్వహిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడటం, నాసిరకం బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించడం, నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చి బియ్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటికే ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. 74 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఇదే క్రమంలో త్వరలోనే తెలంగాణలోనూ ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, సీఎంఆర్ అప్పగింతల్లో అవకతవకలపై దర్యాప్తుకు సీబీఐ రంగంలోకి దిగనున్నట్లు కేంద్రప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ నేతల అండతో మిల్లర్లు సీఎంఆర్ కేటాయింపుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లుగా ఢిల్లీకి ఉప్పందినట్లు తెలిసింది. మిల్లర్లకు పౌరసరఫరాల శాఖ అధికారుల సంపూర్ణ సహకారం కూడా ఉందని భావిస్తున్న సీబీఐ ఆ దిశగా దర్యాప్తుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 4 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో తనిఖీలు.. విశ్వసనీయ సమాచారం మేరకు.. ధాన్యం ఉత్పత్తి అధికంగా ఉండే పంజాబ్, హరియాణా, ఛత్తీస్గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. దీనితో పాటు సకాలంలో కేంద్రానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ ఇవ్వకుండా మిల్లర్లు ప్రైవేటుకు అమ్ముకోవడం, దీనికి కొందరు ఎఫ్సీఐ అధికారులతో పాటు ఆయా రాష్ట్రాల ఆహార, పౌరసరఫరాల శాఖల అధికారులు సహకరిస్తుండటాన్ని కూడా గుర్తించింది. సెంట్రల్ పూల్కు ఇచ్చే బియ్యంలో నాణ్యత లోపిస్తున్నా, ఎఫ్సీఐ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వినియోగదారులకు నాణ్యత లేని బియ్యం సరఫరా అవుతున్నట్లు నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే మూడ్రోజుల కిందట ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఎఫ్సీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజీవ్కుమార్ మిశ్రా సహా 74 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో 37 మంది ఎఫ్సీఐ అధికారులు కాగా మిగతావారిలో మిల్లర్లు, దళారులు, గోదాముల నిర్వాహకులు ఉన్నారు. ఉత్పత్తి సామర్థ్యానికి మించి కొనుగోళ్లు మిశ్రా ఎఫ్సీఐ ప్రధాన కార్యాలయంలో పనిచేసిన సమయంలోనే తెలంగాణ, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉత్పత్తి సామరŠాధ్యనికి మించి ధాన్యం కొనుగోళ్లు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. మిశ్రా చాలా రాష్ట్రాల మిల్లర్లతో కుమ్మక్కై, కేంద్రానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ కోటా గడువు పెంపునకు ఆదేశాలు ఇచ్చారని, ఈ క్రమంలో కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు రాగా విచారణ జరుగుతోంది. తెలంగాణకు సంబంధించి ఎఫ్సీఐలో గతంలో పనిచేసిన ఓ అధికారి హయాంలో కూడా సీఎంఆర్ కోటా సేకరణ విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే గత సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్ల సీఎంఆర్ గడువు దాటినా ఎఫ్సీఐకి అందకపోవడం, లెక్కల్లో తేడాలుండటం వంటి అంశాలు సీబీఐ దృష్టిలో ఉన్నట్లు చెబుతున్నారు. సీఎంఆర్ అప్పగింతలో అవకతవకలు రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తుంటుంది. సుమారు 3 వేల మిల్లుల ద్వారా ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్పూల్ కింద ఇచ్చిన టార్గెట్కు అనుగుణంగా సీఎంఆర్ను ఎఫ్సీఐ గోడౌన్లకు పంపిస్తుంటుంది. అయితే మిల్లర్లు వ్యాపారమే లక్ష్యంగా రాజకీయ అండదండలతో అవకతవకలకు పాల్పడుతున్నారు. వచ్చిన ధాన్యాన్ని ఆరునెలల్లోగా మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి అప్పగించాల్సిన మిల్లర్లు ఆ తర్వాత రెండు, మూడు సీజన్లు గడిచినా అప్పగించడం లేదు. మిల్లుల్లోని నాణ్యమైన సర్కారు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకుంటున్నారని, ప్రజా పంపిణీ బియం కొని, రీసైక్లింగ్ చేసి లోటును భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆధారాలు సేకరించిన దర్యాప్తు సంస్థ! రాష్ట్రంలో ఉన్న సుమారు 3 వేల రైస్ మిల్లులకు గత మూడేళ్లుగా ప్రతి సీజన్లో సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం అప్పగించి, సీఎంఆర్ తీసుకుంటోంది. ధాన్యాన్ని మిల్లింగ్ చేసినందుకు లేబర్ ఖర్చుతో సహా ప్రతి పైసా మిల్లర్లకు చెల్లిస్తోంది. అయినా.. 33 జిల్లాల్లోని పలువురు పౌరసరఫరాల శాఖ అధికారుల అండతో మిల్లర్లు సర్కారు ధాన్యాన్ని సొంత వ్యాపారానికి వినియోగించుకుంటున్నట్టుగాసీబీఐ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. 2019–20లో 118 మంది మిల్లర్లు రూ.230 కోట్ల విలువైన 1,00,427 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి బకాయి పడగా, వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సదరు మిల్లులకు మరోసారి సీఎంఆర్ గడువు పెంచడం అనుమానాలకు తావిచ్చింది. 2020–21లో కూడా వందల సంఖ్యలో మిల్లర్లు బకాయిలు పడగా వారిని డిఫాల్టర్లుగా ప్రకటించి, 2021–22 సీజన్లలో ధాన్యం కేటాయింపును నిలిపివేశారు. అయితే ఆ తర్వాత రాజకీయ జోక్యంతో సదరు మిల్లులకు కూడా యధాతథంగా ధాన్యం సరఫరా అయింది. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరగ్గా.. పౌరసరఫరాల శాఖ అధికారుల అండతో సాగుతున్న అడ్డగోలు వ్యవహారాలన్నింటిపై సీబీఐ ప్రాథమికంగా సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఇప్పటికీ పెండింగ్లో 2021–22 వానాకాలం బియ్యం రాష్ట్రంలో ప్రస్తుతం 2022–23 వానకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు సాగుతుండగా, మరో నెలలో కస్టమ్ మిల్లింగ్ ప్రారంభం కావలసి ఉంది. కానీ ఇప్పటికీ 2021–22 వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యం 8.65 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) ఎఫ్సీఐకి రావలసి ఉండటం గమనార్హం. ఆ సీజన్లో 70.21 ఎల్ఎంటీల ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించగా, 47.04 ఎల్ఎంటీల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటికి పలుమార్లు గడువు పెంచినా ఎఫ్సీఐకి ఇచ్చిన బియ్యం 38.39 ఎల్ఎంటీలే. ఇక గత యాసంగి సీజన్కి సంబంధించి 50.39 ఎల్ఎంటీ ధాన్యం మిల్లులకు పంపించి, 34.07 ఎల్ఎంటీ సీఎంఆర్ తీసుకోవలసి ఉండగా, ఇప్పటివరకు కేవలం 16 ఎల్ఎంటీల బియ్యం మాత్రమే ఎఫ్సీఐకి అందింది. 2020–21 యాసంగి సీజన్కు సంబంధించి మిర్యాలగూడలోని వజ్ర పారాబాయిల్డ్ రైస్మిల్లు రూ.5.90 కోట్ల విలువైన బియ్యాన్ని ఎగవేయడంతో ఈ నెల 9న ఆ రైస్మిల్లు యజమానులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇలాంటి కేసులు ప్రతి జిల్లాలో ఉన్నప్పటికీ అధికారుల అండతో అక్రమాలు యధేచ్చగా కొనసాగుతూనే ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ‘సీబీఐ’కి నో ఎంట్రీ
న్యూఢిల్లీ: ముందస్తు అనుమతిలేకుండా తమ రాష్ట్రాల్లో కేసులను దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని తొమ్మిది రాష్ట్రాలు నిరోధించాయని కేంద్రం బుధవారం వెల్లడించింది. తెలంగాణ, పశ్చిమబెంగాల్, కేరళ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరం, పంజాబ్ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని మంత్రి జితేంద్రసింగ్ సభలో పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంతో బేదాభిప్రాయాలు, ఇతరత్రా ప్రత్యేక కారణాలను చూపుతూ కొన్ని రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతికి నిరాకరించిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని కేంద్రం బుధవారం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. ఇదీ చదవండి: Tawang dominates Parliament: ‘చైనా’పై చర్చించాల్సిందే -
ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి?.. అసలు కథ ఎప్పుడు మొదలైంది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు సృష్టిస్తోంది. లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని కవితకు సీబీఐ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే లిక్కర్ స్కాంలో తెలంగాణకు చెందిన అభిషేక్ బోయినపల్లి అరెస్టయ్యారు. ఢిల్లీ ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం పాలసీని మార్చింది. ►ఢిల్లీలో ఉన్న మద్యం దుకాణాలకు సంబంధించి ముందుగా ఒక ఎక్స్పర్ట్ కమిటి వేసిన ఢిల్లీ ప్రభుత్వం ►ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో ముగ్గురితో కమిటి వేసిన ప్రభుత్వం ►అయితే ఎక్స్పర్ట్ కమిటి సిఫార్సులపై మళ్లీ ముగ్గురు మంత్రులతో కమిటీ వేసిన ఢిల్లీ ప్రభుత్వం ►చాలా కాలంగా ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని నిర్ణయించిన ఢిల్లీ ప్రభత్వం ►ఫిబ్రవరి 2021లో మంత్రులతో కమిటీ వేసిన ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ►నెల రోజుల్లో రిపోర్టు ఇచ్చిన మంత్రుల కమిటి... మార్చి 2021లో మంత్రుల కమిటి సిఫార్సును ఓకే చేసిన ఢిల్లీ క్యాబినెట్ ►ఢిల్లీలో మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం వేసిన కమిటీ సిఫార్సు చేసింది ►ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం 9500కోట్లు పెరుగుతుందని ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం ►ఢిల్లీ క్యాబినెట్ ఓకే చేసిన కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ ఎల్జీకి పంపిన ప్రభుత్వం ►దాదాపు నాలుగు నెలలు పెండింగ్ పెట్టిన తరువాత 2021 నవంబర్లో కొత్త పాలసీకి ఓకే చెప్పిన ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ ►అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్మెంట్ అధారిటీతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అనుమతి తప్పనిసరి అని ఎల్జీ మెలిక పెట్టారు. ►కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో తెరుచుకున్న 849 మద్యం దుకాణాలు ►కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ►తెల్లవారుజామున 3గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కల్పించిన లిక్కర్ పాలసీ ►ఇక కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు అవకాశం ►కొత్త చీఫ్ సెక్రెటరీ రాకతో... వెలుగులోకి స్కాం ►2022 ఎప్రిల్లో నరేష్ కుమార్... ఢిల్లీ చీఫ్ సెక్రెటరీగా నియామకం ►ఉద్యోగంలో చేరగానే లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసిన నరేష్ కుమార్ ►లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని... మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగినట్లు గుర్తించిన చీఫ్ సెక్రెటరీ ►కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లబ్ది చేకూరేలా విధానపరమైన మార్పులు చేసినట్లు డిల్లీ సీఎస్ నివేదిక రూపొందించారు ►ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టనెంట్ గవర్నర్ ఈ ఏడాది జులైలో సీబీఐ విచారణకు ఆదేశించారు ►ఓ వైపు చీఫ్ సక్రెటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే లిక్కర్ పాలసీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం ►తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదని అందుకే కొత్త పాలసీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం ►తొలి త్రైమాసికానికి బడ్జెట్ అంచనాల కన్నా దాదాపు 35శాతం తక్కువ ఆదాయం వచ్చినట్లు అసెంబ్లీలో ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ స్కాం.. ఆరోపణలు ►మద్యం దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి ►మద్యం దుకాణాల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించింది. ►మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145కోట్ల రూపాయల నష్టం చేశారు. ►మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసింది. ►ప్రతీ బీర్ కేస్కు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం మాపీ చేసింది. ►ఎల్-1 కేటగిరి లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారు. ►ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు తరలించినట్లు గుర్తించి సీబీఐ ►రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీచేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్లు గుర్తించిన సీబీఐ ►మనిష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించిన అధికారులు -ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
ముగిసిన కవిత సీబీఐ విచారణ.. అవసరమైతే మళ్లీ ప్రశ్నించే అవకాశం
06:30PM ►ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ ముగిసింది. ►అవసరమైతే మళ్లీ విచారించే అవకాశం ►ఏడు గంటలపాటు కవితను సీబీఐ విచారించింది. ► ఉదయం 11 గంటల నుంచి కవితను సీబీఐ ప్రశ్నించింది. ►సీఆర్పీసీ 161కింద కవిత స్టేట్మెంట్ను రికార్డు చేసింది. 06:00PM ►లిక్కర్ స్కామ్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న సీబీఐ ►7 గంటలకు పైగా కవితను ఆమె నివాసంలోనే ప్రశ్నిస్తున్న సీబీఐ 03:00PM ►ఢిల్లీ లిక్కర్ స్కామ్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నిస్తోంది. ► రాఘవేంద్ర వత్స ఆధ్యర్యంలో ఆరుగురు సభ్యుల బృందం కవితను ప్రశ్నిస్తోంది. ►కవిత నివాసంలో సీబీఐ విచారణ 4 గంటలుగాపైగా కొనసాగుతోంది. ►కవిత న్యాయవాది సమక్షంలోనే సీబీఐ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తోంది. ►సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. 12:28AM ►కవిత నివాసంలో మూడు గంటలకు కొనసాగుతున్న సీబీఐ విచారణ ►సీబీఐ టీమ్ను లీడ్ చేస్తున్న రాఘవేంద్ర వత్స ►సీబీఐ అడిగే ప్రశ్నలు, కవిత ఇచ్చే సమాధానాలపై ఉత్కంఠ 11:28AM ►సీబీఐ డీఐజీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో కవిత విచారణ ►సీబీఐ బృందంలో 11మంది అధికారులు ►కవిత స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్న సీబీఐ అధికారులు 11:11AM ►ప్రారంభమైన కవిత సిబిఐ విచారణ ►సిబిఐ ఉన్నతాధికారులు సిద్ధం చేసిన ప్రశ్నావళిని ముందుంచి ప్రశ్నించే అవకాశం ►మొదటి రోజు ఓరల్ విచారణ ►కొన్ని డాక్యుమెంట్లు, కాల్ లిస్ట్ పై ప్రశ్నించనున్న అధికారులు ►సిసోడియా, అరోరా, అభిషేక్ విషయంలో కవితను విచారించనున్న సిబిఐ 10:51AM కవిత నివాసానికి చేరుకున్న డిల్లీ సిబిఐ అధికారులు ►మహిళా అధికారులతో సహా ఆరుగురు అధికారులు ►న్యాయనిపుణుల సమక్షంలో విచారించాలని కోరే అవకాశం ►ఇప్పటికే చేరుకున్న న్యాయవాదులు ►160 సీఆర్పీసీ నోటీస్ కింద విచారణ ►గ్రౌండ్ ఫ్లోర్ లోనే ప్రత్యేక గదిని సిద్దం చేసిన సిబ్బంది 10:38AM ►మరికాసేపట్లో కవిత నివాసానికి రానున్న సిబిఐ బృందం ►సిబిఐ గెస్ట్ హౌస్ నుంచి కవిత నివాసానికి బయల్దేరిన ఢిల్లీ సీబీఐ టీం. ►మూడు వెహికల్స్ లో బయలు దేరిన అధికారులు ►ఢిల్లీ మద్యం కేసులో కవిత స్టేట్మెంట్ రికార్డు చేయనున్న సిబిఐ బృందం ►కవిత ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీస్ భద్రత ఏర్పాటు ►ఎయిర్పోర్ట్ నుంచి తమ అధికార గెస్ట్ హౌస్ లో దిగిన సిబిఐ టీమ్స్ సాక్షి, హైదరాబాద్: లిక్కర్ స్కామ్కు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై నమోదు చేసిన కేసులో.. ఈ రోజు(ఆదివారం) ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ విచారించనుంది. ఈ నెల 11న విచారణకు తన నివాసంలో అందుబాటులో ఉంటానని కవిత తెలియజేయగా, సీబీఐ కూడా అందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యం వందలాది మంది కార్యకర్తలతో కళకళలాడే కవిత నివాసం ప్రాంగణం బోసిపోయింది. భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు.. మరోవైపు పార్టీ శ్రేణులు వారం రోజులుగా పెద్ద ఎత్తున బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. దీంతో పోలీసులు అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. ‘డాటర్ ఆఫ్ ఫైటర్.. విల్ నెవర్ ఫియర్’(యోధుడి కుమార్తె.. ఎప్పుడూ భయపడదు), ‘వుయ్ ఆర్ విత్ యూ కవితక్కా..’(మేము నీతో ఉన్నాం కవితక్కా..) అంటూ కవిత నివాస పరిసర ప్రాంతాలతో పాటు పలుచోట్ల పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఇలావుండగా కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించేలా కృషి చేసినందుకు గాను కవితకు ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ఈఓ, పూజారులు కవితకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. తెలంగాణాలో ప్రకపంనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం ►లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులిచ్చిన సీబీఐ ►160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ ►ఇప్పటికే లిక్కర్ స్కాంలో అరెస్టైన తెలంగాణాకు చెందిన అభిషేక్ బోయినపల్లి ►ఢిల్లీ ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ►గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగే మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తూ పాలసీని మార్చిన ఢిల్లీ ప్రభుత్వం -
డిసెంబర్ 11న సీబీఐ విచారణకు సిద్ధమన్న కవిత
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన వివరణ ఇవ్వడానికి డిసెంబర్ 11న ఉదయం 11 గంటలకు సిద్ధమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సీబీఐ అధికారులతో సమావేశం కావడానికి ఆరోజున అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ అధికారులకు కవిత ఈ- మెయిల్ ద్వారా సమాచారం అందించారు. కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్పీసీ కింద సీబీఐ అధికారులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే తాను ఆ రోజు అందుబాటులో ఉండటం లేదని విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐకి లేఖ రాశారు. దీంతో అధికారులు మరో రోజు విచారణకు అంగీకరించారు. చదవండి: (ఎమ్మెల్సీ కవిత లేఖకు సమాధానమిచ్చిన సీబీఐ) -
ఎమ్మెల్సీ కవిత లేఖకు సమాధానమిచ్చిన సీబీఐ
న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ జవాబు ఇచ్చింది. డిసెంబర్ 11న కవితతో సమావేశానికి సీబీఐ అంగీకరించింది. ఈ మేరకు ఈ మెయిల్ ద్వారా కవితకు సమాచారం ఇచ్చింది. డిసెంబర్ 11న విచారణకు అందుబాటులో ఉండాలని తెలిపింది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని కవిత ఇంట్లో ఆమె స్టేట్మెంట్ రికార్డు చేయనుంది సీబీఐ. కాగా మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్పీసీ కింద సీబీఐ అధికారులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే తాను ఆ రోజు అందుబాటులో ఉండటం లేదని విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐకి లేఖ రాశారు. ఈనెల 11, 12, 14, 15 తేదీన విచారించేందుకు సమయం కోరారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత సమాచారం మేరకు సీబీఐ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: శంషాబాద్కు భారీ ‘తిమింగలం’! -
తప్పు చేయకుంటే భయం ఎందుకు?
-
మంత్రి గంగుల, ఎంపీ గాయత్రీ రవికి సీబీఐ నోటీసులు
-
సీబీఐ అధికారినంటూ విశాఖవాసి మోసాలు.. ఏకంగా ఏడీజీపీగా నటన.. చివరకు
న్యూఢిల్లీ: సీబీఐ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి బాగోతం బట్టబయలైంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో సీనియర్ ఆఫీసర్ని అని చెప్పుకుంటూ అనేక మంది వ్యక్తుల నుంచి డబ్బు వసూలు చేసిన కొవ్విరెడ్డి శ్రీనివాసరావును సీబీఐ అరెస్టు చేసి కేసు నమోదు చేసింది. ఈ నకిలీ అధికారి విశాఖపట్నం చిన్నవాల్తేరుకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. సీబీఐలో సీనియర్ ఐపీఎస్ అధికారిగా నటిస్తూ అతను భారీగా కూడబెట్టినట్టు తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అతని ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.21లక్షల నగదు, గోల్డ్ స్టోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఢిల్లీలోని తమిళనాడు హౌస్లో ఉంటున్నాడు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ)గా అందరినీ నమ్మించాడు. శ్రీనివాసరావును అరెస్ట్ అనంతరం ఢిల్లీలోని కాంపిటెంట్ కోర్టు ముందు హాజరుపరచగా, రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. -
నెల్లూరు కోర్టులో చోరీ కేసు విచారణను సీబీఐకి అప్పగించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ కోర్టులో చోరీ కేసుకు సంబంధించి సుమోటో పిల్పై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కేసు విచారణను సీబీఐకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఏస్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించిన తమకు అభ్యంతరం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కోర్టుకు తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు) -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీబీఐకి నో చెప్పిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్ట్ సింగిల్ జడ్జి విజయ్సేన్రెడ్డి అధ్వర్యంలోనే దర్యాప్తు జరగాలని ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది. నివేదికను నవంబర్ 29లోగా సింగిల్ జడ్జికి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రాజకీయ లబ్ధి కోసమే బిజేపీపై ఆరోపణలు: గుజ్జుల ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఏమీ లేని కేసులో రాజకీయ లబ్ధి కోసమే బిజేపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ విచారణ చేపట్టాలని లేదా సీబీఐ విచారణ జరగాలని బీజేపీ కోరింది. న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ విచారణ జరగాలని విచారణ పూర్తిగా సీల్డ్ కవర్లో న్యాయమూర్తికి ఇవ్వాలన్న తీర్పును స్వాగతిస్తున్నామని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. చదవండి: (Hyderabad: రెస్టారెంట్ ఇన్ ఫ్లైట్.. పాత విమానాన్ని కొనుగోలు చేసి మరీ..) -
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్గా దినేష్ అరోరా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్గా మారిపోయారు. దినేష్ అరోరాను సాక్షిగా పరిగణించాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ క్రమంలో దినేష్ అరోరా వాంగ్మూలం నమోదు చేసింది ధర్మాసనం. ఎవరైనా బెదిరించారా, ఏమైనా ఇబ్బందులకు గురి చేశారా? అని దినేష్ అరోరాను సీబీఐ కోర్టు న్యాయమూర్తి అడిగారు. కేసులో తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేశారు. కీలక నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త దినేష్ అరోరాకు గత వారమే ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ సమయంలో సీబీఐ అభ్యంతరం చెప్పకపోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో దినేష్ను సాక్షిగా చూడాలని కోరుతూ సోమవారం సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తు అధికారులకు దినేష్ సహకరిస్తున్నారని, ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని అందించారని కోర్టుకు తెలిపింది. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు ముగ్గురు అరెస్టయ్యారు. అందులో అరోరా ఒకరు. ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్ర.. రాధా ఇండస్ట్రీస్ ఖాతా నుంచి రూ.కోటి బదిలీ చేసినట్లు సీబీఐ తేల్చింది. రాధా ఇండస్ట్రీస్ దినేష్ అరోరాకి చెందినది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, దినేష్ అరోరా సహా నిందితులపై ఐపీసీ సెక్షన్ 120బీ, 477ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7కింత సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో దినేష్ అరోరా అప్రూవర్గా మారినట్లు సీబీఐ ప్రకటించటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇదీ చదవండి: వీళ్లు ఆడవాళ్లా లేక రౌడీలా?.. తప్పతాగి నడిరోడ్డులో యువతిపై దాడి -
శ్రీసత్యసాయి జిల్లా: టీడీపీ నేత సవిత ఇంట్లో తనిఖీలు చేస్తున్న సీబీఐ
-
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో నెం. 51ని జారీ చేసింది. గతంలో ఏ కేసు దర్యాప్తుకైనా సీబీఐకి ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకుంది. ఈమేరకు ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం. 51ని జారీచేసింది. దీంతో ఇకపై సీబీఐ రాష్ట్రంలో ఏ కేసు దర్యాప్తు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే. -
ఇండియా సిమెంట్స్పై సీబీఐ కేసు కొట్టివేత
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల నుంచి తెలంగాణ హైకోర్టు శుక్రవారం మరొకరికి విముక్తి కలిగించింది. ఇండియా సిమెంట్స్కు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చినందుకు ప్రతిగా జగన్ కంపెనీల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టిందని ఆరోపిస్తూ సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. ఇండియా సిమెంట్స్పై సీబీఐ నమోదు చేసిన అభియోగ పత్రాన్ని (చార్జిషీట్) విచారణ నిమిత్తం పరిగణనలోకి (కాగ్నిజెన్స్) తీసుకొనేటప్పుడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం యాంత్రికంగా వ్యవహరించిందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ ఎన్ శ్రీనివాసన్పై ఇదే ఆరోపణలతో సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు ఇప్పటికే కొట్టేసిందని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా సిమెంట్స్పై కేసు కొనసాగించడం న్యాయం కాదని స్పష్టం చేశారు. సీబీఐ చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు సీబీఐ కోర్టు ఎలాంటి కారణాలను రికార్డ్ చేయలేదని సీజే జస్టిస్ భుయాన్ ఆక్షేపించారు. అందువల్ల ఇలాంటి ఉత్తర్వులు న్యాయ సమీక్షకు నిలబడవని తేల్చి చెప్పారు. గతంలో శ్రీనివాసన్పై కేసును కొట్టేసిన న్యాయమూర్తి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తీర్పులో పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీ ఓ కృత్రిమ వ్యక్తి అని, కంపెనీ వ్యవహారాలను చూసుకొనే వ్యక్తులు చేసే తప్పులకు కార్పొరేట్ కంపెనీ బాధ్యత వహించాలనడానికి వీల్లేదన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పిందని తెలిపారు. చట్టం స్పష్టంగా నిర్దేశిస్తే తప్ప వ్యక్తులు చేసే తప్పులకు కంపెనీ బాధ్యత వహించాలనడానికి వీల్లేదన్నారు. క్విడ్ ప్రో కో ఆరోపణలతో సీబీఐ కేసు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఇండియా సిమెంట్స్కు కృష్ణా జలాలను అదనంగా కేటాయించడంతోపాటు కడపలో ఆ సంస్థ ఫ్యాక్టరీకి ఉన్న 2.5 ఎకరాల స్థలం లీజును పొడిగించినందుకు ప్రతిఫలంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన కంపెనీల్లో ఇండియా సిమెంట్స్ పెట్టుబడి పెట్టిందని ఆరోపిస్తూ ఆ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తు అనంతరం చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఈ చార్జిషీట్ను విచారణకు స్వీకరిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఇండియా సిమెంట్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ విచారణ జరిపారు. కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి, న్యాయవాది చల్లా గుణరంజన్ వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ భుయాన్... శుక్రవారం ఆ వివరాలను వెలువరించారు. -
ఢిల్లీ లిక్కర్ స్కాం: సీబీఐ విచారణకు సీఏ బుచ్చిబాబు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, ఢిల్లీ రాజకీయాల్లో లిక్కర్ స్కాంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లు దూకుడు పెంచాయి. లిక్కర్ పాలసీ ముడుపుల వ్యవహారంలో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా మరికొందరికి నోటీసులు పంపించాయి. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సోమవారం విచారించింది ఈడీ. ఇదే కేసులో హైదరాబాద్ వాసి అరుణ్ రామచంద్ర పిళ్లైని సీబీఐ విచారిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుకు నోటీసులు పంపించగా.. ఈరోజు(మంగళవారం) సీబీఐ ముందు హాజరుకానున్నారు సీఏ బుచ్చిబాబు. రాబిన్ డిస్టిలరీస్తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురికి చార్టర్డ్ అకౌంటెంట్గా పని చేశారు బుచ్చిబాబు. ఇప్పటికే ఢిల్లీలో ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు, సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్ను ఈడీ అరెస్ట్ చేసి విచారిస్తోంది. ఇదీ చదవండి: Delhi Liquor Scam: అభిషేక్ ఇచ్చిన సమాచారంతో అతడి విచారణ.. మరిన్ని అరెస్టులకు ఛాన్స్! -
Delhi Liquor Scam: సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం
-
Delhi Liquor Scam: సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం.. ఆ ఆరే కీలకం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పటికే అరెస్టు అయిన విజయ్ నాయర్, సమీర్ మహేంద్ర, అభిషేక్ రావు తదితరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగుతుంది. మద్యం విధానం, లైసెన్స్ల వ్యవహారంపై సీబీఐ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా ఆరు అంశాలపై సీబీఐ అధికారులు ప్రశ్నలు అడుగుతున్నారు. 1. మద్యం విధాన మార్పులలో అవకతవకలు 2. లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి చేకూర్చడం 3. లైసెన్సు ఫీజులు మినహాయించడం లేదా తగ్గించడం 4. అనుమతి లేకుండా ఎల్ -1 లైసెన్సులు పొడిగించడం 5. అక్రమాల ద్వారా వచ్చిన డబ్బును ప్రభుత్వ అధికారులకు చెల్లించడం 6. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఖాతా పుస్తకాలలో తప్పుడు ఎంట్రీలు రాయడం. చదవండి: ‘సూపర్ హీరో’గా సిసోడియా.. కేజ్రీవాల్ ట్వీట్కు బీజేపీ కౌంటర్ -
ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైస్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియాకు సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. సీబీఐ సమన్లు జారీ చేయటంపై స్పందించారు సిసోడియా. గతంలో సీబీఐ దాడులు చేపట్టగా తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. అయితే, దర్యాప్తు సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ‘నా ఇంటిలో సీబీఐ 14 గంటల పాటు సోదాలు నిర్వహించింది. కానీ, ఏమీ లభించలేదు. వారు నా బ్యాంకు లాకర్ను సైతం తనిఖీ చేశారు. అక్కడా ఏమీ లభించలేదు. మా గ్రామంలోనూ వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. నేను వెళ్లి వారికి పూర్తిగా సహకారం అందిస్తాను.’ అని తెలిపారు సిసోడియా. ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం 15 మంది నిందితుల్లో మనీశ్ సిసోడియా పేరును కూడా చేర్చింది. ఇప్పటికే ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించింది. అవినీతి ఆరోపణలను ఆప్ మొదటి నుంచి ఖండిస్తోంది. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వేలేకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. ఇదీ చదవండి: రైతులకు శుభవార్త.. రేపే పీఎం కిసాన్ 12వ విడత నిధుల విడుదల -
అభిషేక్ లింకులపై ఆరా.. ఏం చెబుతాడో!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్రావును లోతుగా విచారిస్తే కేసులో కీలకమైన అంశాలు, రాజకీయ ప్రముఖుల పాత్ర తెలుసుకోవచ్చని సీబీఐ భావిస్తోంది. పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారిన వ్యవహారంలో అభిషేక్ ప్రమేయం కన్పిస్తున్నట్టు సీబీఐ ప్రాథమిక విచారణ ద్వారా తేల్చింది. ఈ క్రమంలో ఆయనకు గల రాజకీయ సంబంధాలు ఈ కేసులో అత్యంత కీలకమని, వీటిపై సమగ్ర సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కోర్టు అనుమతితో అభిషేక్రావును కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. ఆ బంధమేంటి?: ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో కొందరు కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రాథమిక సమాచార నివేదికలో 16 మంది ప్రమేయాన్ని ప్రస్తావించింది. ఈ క్రమంలో అరుణ్ రామచంద్రన్ పిళ్ళైని నిందితుడిగా చేర్చింది. అభిషేక్తో పాటు పిళ్ళై కూడా రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్గా ఉన్నారు. ఈ లింక్తో ముందుకెళ్ళిన సీబీఐ అనేక విషయాలను రాబట్టినట్టు తన రిమాండ్ రిపో ర్టులో పేర్కొంది. అభిషేక్ బ్యాంకు ఖాతాలపై సీబీఐ వర్గాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సహ నిందితుడు సమీర్ మహేంద్రుకు భారీగా ముడుపులు చేరడం, అక్కడ్నుంచి ఇతరులకు పంపిణీ అవ్వడంపై స్పష్టత కోసం అభిషేక్ను సీబీఐ ప్రశ్నించే వీలుంది. లిక్కర్ స్కాంలో కీలకమైన వ్యక్తులు ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్లో సమావేశమవ్వడం, ఇందులో అభిషేక్ కూడా పాల్గొనడంతో స్కామ్తో అభిషేక్కు ఉన్న లింకులేమిటో తెలుసుకునేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. అభిషేక్ గుట్టు విప్పేనా? లిక్కర్ కుంభకోణంలో సీబీఐ ఇప్పటికే డాక్యుమెంటరీ ఆధారాలు సేకరించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడిగా భావిస్తున్న అర్జున్ పాండేకు విజయ్ నాయర్ తరఫున మహేంద్రు ముడుపులు అందించినట్టు సీబీఐ భావిస్తోంది. ఇందులో అభిషేక్ పాత్రను బ్యాంకు లావాదేవీలు, నిందితులతో జరిగిన సమావేశాల ద్వారా గుర్తించారు. అయితే ఈ కుంభకోణంలో రాజకీయ ప్రము ఖుల హస్తం ఉందనేది ప్రధాన ఆరోపణ. కాగా అభిషేక్కు రాష్ట్రంలోని ప్రముఖ నేతలతో వాణిజ్యపరమైన లావాదేవీలున్నాయని సీబీఐ ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో.. పెద్ద మొత్తంలో చేతులు మారిన ముడుపులు ఏ రాజకీయ ప్రముఖుడి నుంచి ఎవరికి వెళ్లాయనే అనే అంశంపై సీబీఐ దృష్టి పెట్టినట్లు తెలిసింది. దర్యాప్తు సంస్థకు లభించిన డాక్యుమెంటరీ ఆధారాలు, హవాలా మార్గంలో నిధులు చేతులు మారడం, ఎవరు లబ్ధి పొందారు? అనే కోణాల్లో అభిషేక్ను సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది. కాగా అభిషేక్ను సీబీఐ ప్రశ్నించడం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఆపరేషన్ గరుడ: డ్రగ్స్ ముఠాలపై సీబీ‘ఐ’.. 175 మంది అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: మత్తుపదార్థాల(డ్రగ్స్) దందా నిర్వహిస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతోంది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఇంటర్పోల్, రాష్ట్రాల పోలీసుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టింది. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు నెరుపుతూ దేశంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిపై కేసులు, అరెస్టులు చేపట్టింది. ఆపరేషన్ గరుడలో భాగంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 127 కేసులు నమోదు చేసి 175 మందిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ గరుడ ఏమిటి? అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు పెట్టుకుని డ్రగ్స్ దందా చేస్తున్న నెట్వర్క్లను నిరోధించేందుకు ఆపరేషన్ గరుడ పేరుతో పలు దఫాలుగా తనిఖీలు చేపట్టింది సీబీఐ. ఇంటర్పోల్ ద్వారా క్రిమినల్ ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి డ్రగ్ ట్రాఫికింగ్లను గుర్తించేందుకు ఈ ఆపరేషన్ను నిర్వహిస్తోంది. ఇంటర్పోల్ ద్వారా అంతర్జాతీయ చట్టాల పరిధిలోనూ ఈ తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీబీఐ తెలిపింది. ఇంటర్పోల్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)ల సమన్వయంతో గ్లోబల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ముఠాలతో లింక్స్ ఉన్న నెట్వర్క్లే లక్ష్యంగా ఈ ఆపరేషన్ గరుడ కొనసాగిస్తోంది సీబీఐ. దీని ద్వారా డ్రగ్స్ నిర్వహణ, సరఫరా, తయారీ జోన్స్, వారికి మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు బలగాల సమన్వయంతో సమాచారం సేకరించి డ్రగ్స్ ముఠాలపై చర్యలు చేపట్టింది. 6600 అనుమానితులపై.. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ దాడులు నిర్వహించింది సీబీఐ. సుమారు 6600 అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసింది. 127 కొత్త కేసులు నమోదు చేసి.. 175 మందిని అరెస్ట్ చేసింది. అందులో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులు సైతం ఉన్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా 5.1 కిలోల హెరాయిన్, 33.4 కిలోల మరిజున, 3.29 కిలోల చరాస్, 1365 గ్రాముల మెఫెడ్రోన్, 33.8 గ్రాముల స్మాక్, బుప్రెనోర్ఫిన్కు చెందిన 87 సిరంజీలు, 122 ఇంజెక్షన్లు, 87 ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకుంది. అలాగే 946 అల్ప్రాజోలమ్ ట్యాబ్లెట్లు, 106 కిలోల ట్రామడోల్, 10 గ్రాముల హాష్ ఆయిల్, 0.9 గ్రాముల ఎక్స్టాసీ పిల్స్, 1.15 కిలోల ఓపియమ్, 30 కిలోల పప్పీ హక్, 1.43 కిలోల ఇటోక్సికాంట్ పౌండర్, 11039 పిల్, క్యాప్సల్స్ సీజ్ చేసింది. ఇదీ చదవండి: పెళ్లితో సంబంధం లేదు.. అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
ఆపరేషన్ మేఘ్చక్ర: సీబీ‘ఐ’ మెరుపు దాడులు
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో పలు చోట్ల ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మెరుపు దాడులకు దిగింది. పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్ను గుర్తించేందుకు, ఆ కంటెంట్తో మైనర్లపై బ్లాక్మెయిల్కు దిగుతున్న ముఠాల పని పట్టేందుకు ఆపరేషన్ ‘మేఘ్చక్ర’ను నిర్వహిస్తోంది. ఈ మేరకు శనివారం దేశవ్యాప్తంగా సోదాలు మొదలుపెట్టింది. మొత్తం పంతొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి దాదాపు 56 చోట్ల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాడులు కొనసాగుతున్నాయి. మైనర్లపై లైంగిక వేధింపుల మెటీరియల్కు సంబంధించిన సమాచారం అందిన నేపథ్యంలోనే ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమందిని అదుపులోకి తీసుకుంది.. ఇతరత్ర పరిణామాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సింగపూర్ ఇంటర్పోల్ విభాగం నుంచి అందిన పక్కాసమాచారం మేరకే ఈ సెర్చ్ ఆపరేషన్ను మొదలుపెట్టింది సీబీఐ. పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్ను పంపిణీ చేయడం, వాటి ఆసరాగా మైనర్లను బ్లాక్మెయిల్ చేసే వ్యక్తులను, ముఠాలను గుర్తించడం.. చర్యలు తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది సీబీ‘ఐ’. పిల్లల అశ్లీల విషయాలను ప్రసారం చేయడానికి ఉపయోగించే క్లౌడ్ స్టోరేజీ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని నిరుడు సీబీఐ చేపట్టిన ‘ఆపరేషన్ కార్బన్’కు మేఘ్చక్ర కొనసాగింపు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని గత వారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది కూడా. ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. గోడ కూలి 10 మంది దుర్మరణం! -
‘నేను మగవాడిని.. నా శరీరాన్ని ఈడీ, సీబీఐ తాకలేవు’
కోల్కతా: మహిళా పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారంటూ ఇటీవల పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకొని.. సువేందు అధికారిని వ్యాన్లోకి ఎక్కిస్తున్న తరుణంలో మహిళా పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు మహిళా అధికారి. నన్ను టచ్ చేయొద్దు.. పురుష సిబ్బందిని పిలవండి’ అని వారించారు. తాజాగా సువేందు అధికారి వ్యాఖ్యలకు టీఎంసీ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. టీఎంసీ శాసన సభ్యుడు ఇద్రిస్ అలీ ‘ఈడీ, సీబీఐ నా శరీరాన్ని తాకలేవు.. నేను మగవాడిని’ అని రాసి ఉన్న కుర్తా ధరించి అసెంబ్లీ లోపలికి వెళ్లాడు. టీఎంసీ ఎమ్మెల్యే ఇలాంటి డ్రెస్ ధరించి అసెంబ్లీకి ఎందుకు వచ్చారని మీడియా ప్రశ్నించగా.. ‘తనను సీబీఐ, ఈడీ తాకలేవని భావించే ఓ బీజేపీ నేత ఉన్నారు’ అంటూ సువేందు అధికారిని ఉద్ధేశిస్తూ చురకలంటించారు. చదవండి: సహనం కోల్పోతున్నాం: హిజాబ్ వాదనలపై సుప్రీం కాగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ‘నబానా ఛలో’ పేరుతో బీజేపీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఓ మహిళా పోలీస్ తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది మహిళా పోలీసులు అతన్ని వ్యాన్లోకి ఎక్కిస్తున్న తరుణంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నన్ను టచ్ చేయొద్దు’ అని వారించారు. అనంతరం ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళా కళ్లల్లో దుర్గామాతను చూస్తానని, మహిళలంటే ఎంతో గౌరవమని తెలిపారు. -
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కుట్ర.. క్విడ్ ప్రోకో!
సాక్షి, హైదరాబాద్: కుట్ర, క్విడ్ ప్రోకో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ రెండు అంశాలపైనే సీబీఐ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఎక్సైజ్ పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించి వ్యాపారులకు మేలు చేశారని ఆరోపిస్తున్న సీబీఐ, ఇందులో కుట్ర కోణంతో పాటు క్విడ్ ప్రో కో ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. మరోవైపు నిందితులుగా ఆరోపణలెదుర్కొంటున్న వారితో పాటు బినామీ కంపెనీలు సృష్టించి లిక్కర్ టెండర్లు దక్కేలా సిండికేట్ వ్యవహారం సాగించిన చీకటి వ్యక్తులకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో బయటపెట్టే దిశగా సీబీఐ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఈ కేసులో 16 మందిని నిందితులుగా చేర్చిన ఢిల్లీ సీబీఐ, ఆ జాబితాలో ఉన్న హైదరాబాద్కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసంలో గత నెలలో సోదాలు నిర్వహించింది. సీబీఐ దాడుల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండు సార్లు సోదాలు నిర్వహించారు. పిళ్లైతో పాటు ఆయన సంస్థ రాబిన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్న అభిషేక్ బోయినిపల్లి, గండ్ర ప్రేమ్సాగర్, ఆడిటర్ బుచ్చిబాబు, మరో 25 మంది నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ సోదాల్లో లభించిన కీలక ఆధారాలతో ప్రముఖులకు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. వెలుగులోకి సంచలనాత్మక విషయాలు... రెండు దర్యాప్తు సంస్థల విచారణలో బినామీ కంపెనీల గుర్తింపు, ఆ కంపెనీల టెండర్లు, లంచాలకు ఇచ్చిన నగదు.. ఇలా అనేక సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుట్ర పూరితంగానే ఈ విధంగా వ్యవహరించి కంపెనీలకు లాభం చేర్చేలా చేశారని, అదేవిధంగా భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారినట్టు సీబీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బినామీ కంపెనీలను సృష్టించడంతో పాటు సిండికేట్ రూపంలో తమ వారికి దక్కేలా చేసిన చీకటి నేతలు, ప్రముఖ వ్యక్తులపై ఇప్పుడు సీబీఐ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రెండు దఫాలుగా నోటీసులు.. అరుణ్ రామచంద్ర పిళ్లైతో పాటు ఆయన కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, గండ్ర ప్రేమ్సాగర్, ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించిన ఆడిటర్ బుచ్చిబాబును మొదటి దఫాలో విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్టు విశ్వసీనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ప్రత్యేక బృందాలు రెండు రోజుల్లో హైదరాబాద్కు వచ్చి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలున్నాయని తెలిసింది. అయితే విచారణ ఇక్కడ చేస్తారా లేకా ఢిల్లీలో చేస్తారా అన్న అంశాలపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. వీరితో పాటు రెండో దఫాలో ప్రముఖ ఫార్మా కంపెనీ ఎండీతో పాటు ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించిన 16 కంపెనీలు, వాటిలోని డైరెక్టర్లు 8మందికి నోటీసులిస్తారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇలావుండగా ఎక్సైజ్ స్కామ్లో ఆరోపణలెదుర్కొంటున్న సిండికేట్లోని ఇద్దరు వ్యాపారులు తాము ఈ టెండర్ల వ్యవహారంలో రూ.250 కోట్లకు పైగా నష్టపోయినట్టుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. భారీ నష్టంతో పాటు సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కోవడం ఇబ్బందికరంగా మారిందని ఓ ప్రముఖ నేత వద్ద గోడు వెల్లబోసుకున్నట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎన్ఐఏ పంజా.. నిజామాబాద్ కేంద్రంగా ఉగ్రవాద శిక్షణపై ఫోకస్ -
Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో లోన్ తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. తాజాగా రుణాల పేరిట బ్యాంక్ను మోసం చేసిన కేసులో ఈ శిక్ష ఖరారైంది. ఇదే కేసులో గీతతో పాటు ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించారు. మాజీ ఎంపీకి సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. విశ్వేశ్వర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు సీబీఐ కోర్టు రూ.2లక్షల జరిమానా విధించింది. శిక్షలు ఖరారు కావడంతో కొత్తపల్లి గీత సహా నిందితులను బుధవారం సీబీఐ అదుపులోకి తీసుకుంది. -
గోవుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నేత అరెస్టు
గోవుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నేత అరెస్టు -
.. కేంద్రంతో సంబంధాలు ఇంకా వేగవంతం చేయాలేమో మేడం
.. కేంద్రంతో సంబంధాలు ఇంకా వేగవంతం చేయాలేమో మేడం -
వాన్పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్కు ఊరట
-
వాన్పిక్ ప్రాజెక్ట్స్పై కీలక తీర్పు వెలువరించిన సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. వాన్పిక్ ద్వారా పలు ప్రయోజనాలు కల్పించినందుకు నిమ్మగడ్డ ప్రసాద్ జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తూ వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్పై సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టి వేసింది. చట్టం అనుమతినిస్తే మినహా కంపెనీపై వచ్చిన నేరారోపణలకు, కంపెనీ చర్యలకు దాని చైర్మన్నుగానీ, ఆ కంపెనీని నడుపుతున్న వ్యక్తులను గానీ బాధ్యులుగా చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వాన్పిక్ ప్రాజెక్ట్స్పె సీబీఐ నమోదు చేసిన అభియోగ పత్రాన్ని (చార్జిషీట్) విచారణ నిమిత్తం పరిగణలోకి (కాగ్నిజెన్స్) తీసుకునేటప్పుడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం యాంత్రికంగా వ్యవహరించిందని హైకోర్టు తేల్చి చెప్పింది. అభియోగపత్రాన్ని విచారణకు స్వీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసే సమయంలో సీబీఐ కోర్టు మెదడు ఉపయోగించలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వాన్పిక్ ప్రాజెక్ట్స్ అనేది ఓ వ్యక్తి కాదనే విషయాన్ని సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంది. అంతేకాక వాన్పిక్ ప్రాజెక్ట్స్పైగానీ, దానికి నేతృత్వం వహిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్పైగానీ సీబీఐ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు సీబీఐ కోర్టు ఎలాంటి కారణాలను నమోదు చేయలేదని తేల్చి చెప్పింది. చార్జిషీటు, దానితో జత చేసిన డాక్యుమెంట్లు, ఆఫీసు నోటు, కోర్టు తీర్పులను మాత్రమే సీబీఐ కోర్టు పరిశీలించిందని తెలిపింది. సీబీఐ ఆరోపణలకు ఓ కార్పొరేట్ సంస్థగా వాన్పిక్స్ ప్రాజెక్ట్స్ లేదా దాని చైర్మన్గా ప్రాథమిక ఆధారాలున్నాయా? కార్పొరేట్ సంస్థ చేసినట్లు ఆరోపిస్తున్న నేరాలకు చైర్మన్ మాత్రమే బాధ్యత వహించాలా? అన్న విషయంలో సీబీఐ ఎలాంటి కారణాలను నమోదు చేయలేదని హైకోర్టు స్పష్టం చేసింది. కార్పొరేట్ సంస్థ ఓ వ్యక్తి కాదని, అలాంటి కంపెనీ లేదా కార్పొరేషన్ నేరస్తుడైతే, అందుకు సంబంధించిన బాధ్యతను దాని డైరెక్టర్లకు గానీ, ఆ కంపెనీని నడుపుతున్న వ్యక్తులకుగానీ యాంత్రికంగా ఆపాదించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నేరస్తులు కంపెనీకి చెందిన వారన్న కారణంతో కంపెనీ తప్పులకు వారిని యాంత్రికంగా బాధ్యులుగా చేయడానికి వీల్లేదంది. చైర్మన్గా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేట్ సంస్థ అయిన వాన్పిక్ ప్రాజెక్ట్స్పై క్రిమినల్ ప్రాసిక్యూషన్కు అనుమతినిచ్చినట్లయితే అంతిమ న్యాయం చేసినట్లు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గురువారం కీలక తీర్పు వెలువరించారు. నిరంజన్రెడ్డి వాదనలతో ఏకీభవించిన సీజే... సీబీఐ తమపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గురువారం తీర్పు వెలువరించారు. సహేతుక కారణాలు చూపకుండానే సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ను సీబీఐ కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకుందన్న వాన్పిక్ ప్రాజెక్ట్స్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ ఏకీభవించారు. వాన్పిక్ ప్రాజెక్టŠస్ లాంటి కృత్రిమ వ్యక్తిని ప్రాసిక్యూట్ చేసేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు లేవని, ఈ విషయాన్ని కింది కోర్టు పూర్తిగా విస్మరించిందన్న నిరంజన్రెడ్డి వాదనను సైతం జస్టిస్ భుయాన్ పరిగణలోకి తీసుకున్నారు. చార్జిషీట్ను కాగ్నిజెన్స్లోకి తీసుకోవడం అన్నది మెదడు ఉపయోగించి చేయాల్సిన ప్రక్రియ అని, అది యాంత్రికంగా చేసే ప్రక్రియ ఎంత మాత్రం కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అలాంటప్పుడు నేరాన్ని ఆపాదించరాదు... ‘కాగ్నిజెన్స్ తీసుకునే విషయంలో మేజిస్ట్రేట్కు విస్తృత అధికారం ఉన్నప్పటికీ న్యాయపరంగా సహేతుక రీతిలో ఉపయోగించాలి. నేరం గురించి నిందితులకు అవగాహన కల్పించే విషయంలో కాగ్నిజెన్స్ అన్నది ఓ ప్రక్రియ అంటూ సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది. కాగ్నిజెన్స్ అన్నది మేజిస్ట్రేట్ ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలను, నమోదు చేసిన వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకుని, నిందితులు చట్టాన్ని ఉల్లంఘించారా? లేదా? అన్న దానిపై దృష్టి సారించడానికే తప్ప, వ్యక్తులను కోర్టు ముందు హాజరుపరచడానికి, కోర్టు ముందుకు పిలిచేందుకు ఉపయోగించే యాంత్రిక ప్రక్రియ ఎంతమాత్రం కాదు. నేరపూరిత ఉద్దేశంతో కంపెనీ లేదా దానిని నడిపిస్తున్న వ్యక్తులు నేరం చేసినట్లైతే ఆ నేరానికి ఆ కంపెనీని, ఆ వ్యక్తులను బాధ్యులుగా చేయవచ్చు. అయితే ఏ ఏ సందర్బాల్లో అలా బాధ్యులుగా చేయవచ్చో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కంపెనీ చేసిన నేరానికి ఆ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తులను బాధ్యులుగా చేయాలంటే అందుకు చట్టం అనుమతినించి ఉండాలి. నేరంలో ఆ వ్యక్తుల పాత్ర ఉన్నట్లు నిర్దిష్ట ఆధారాలు ఉంటే, నేరానికి ఆ వ్యక్తులను బాధ్యులుగా చేయవచ్చు. ఈ సందర్భాల్లో మినహా మిగిలిన సందర్భాల్లో కంపెనీ చేసిన నేరానికి ఆ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తులను యాంత్రికంగా బాధ్యులుగా చేయడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా చాలా స్పష్టంగా చెప్పింది.’అని జస్టిస్ భుయాన్ స్పష్టం చేశారు. స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించొచ్చు... ‘క్రిమినల్ కేసుల్లో నిందితులకు సమన్లు జారీ చేయడం అన్నది చాలా తీవ్రమైన విషయం. క్రిమినల్ లాను అమలు చేసే చర్య ఇది. సమన్లు జారీ చేయాలంటే, సంబంధిత మేజిస్ట్రేట్ నిందితులైన మేనేజింగ్ డైరెక్టర్, కంపెనీ సెక్రటరీ, ఇతర డైరెక్టర్లకు వ్యతిరేకంగా ప్రాథమికాధారాలు ఉన్నాయని సంతృప్తి చెందుతూ అందుకు కారణాలను నమోదు చేయాలి. ప్రస్తుత కేసులో కూడా సీబీఐ కోర్టు వాన్పిక్ ప్రాజెక్ట్స్, దాని చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు ఎలాంటి కారణాలను నమోదు చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కంపెనీ చేసిన నేరాన్ని దాని చైర్మన్కు ఆపాదించడానికి ఎంత మాత్రం వీల్లేదు. అంతిమ న్యాయం అందించేందుకు, న్యాయ ప్రక్రియ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు హైకోర్టు సీఆర్పీసీ సెక్షన్ 482 కింద తనకున్న స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించవచ్చు. ఈ అధికారాన్ని ఉపయోగించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టేయవచ్చు. చైర్మన్గా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేట్ సంస్థ అయిన వాన్పిక్ ప్రాజెక్టులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్కు అనుమతినిచ్చినట్లయితే అంతిమ న్యాయం చేసినట్లు అవదు. అందువల్ల వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వాన్పిక్ ప్రాజెక్టులపై పెండింగ్లో ఉన్న కేసును కొట్టి వేస్తున్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ తన తీర్పులో పేర్కొన్నారు. -
రూ.100 కోట్లకు రాజ్యసభ సీటు లేదా గవర్నర్ పదవి! రాకెట్ గుట్టు రట్టు
సాక్షి,న్యూఢిల్లీ: రూ.100 కోట్లిస్తే రాజ్యసభ సీటు ఇప్పిస్తామని దందా నడుపుతున్న ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. నిందితులకు ఓ వ్యక్తికి మధ్య డబ్బులు చేతులు మారడానికి క్షణాల ముందు వారిని పట్టుకుంది. రూ.100 కోట్లిస్తే గవర్నర్ పదవి కూడా ఇప్పిస్తామని నిందితులు ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు వారాలుగా గుర్తు తెలియని నెంబర్ల నుంచి వెళ్తున్న కాల్స్పై నిఘా వహించిన అధికారులు ఎట్టకేలకు నలుగురు నిందితులను గుర్తించి పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహారాష్ట్రకు చెందిన కర్మలాకర్ ప్రేమ్కుమార్ బండ్గార్, కర్ణాటకకు చెందిన రవీంద్ర విఠల్ నాయక్, ఢిల్లీకి చెందిన మహేంద్ర పాల్, అభిషేక్ బూరాగా గుర్తించారు అధికారులు. వీరంతా చాలా కాలంగా ఈ రాకెట్ నడుపుతున్నారు. డబ్బులిస్తే రాజ్యసభ సీటు, గవర్నర్ పదవితో పాటు ప్రభుత్వ సంస్థలకు ఛైర్మన్గా నియమిస్తామని నమ్మించి మోసానికి పాల్పడుతున్న తెలుస్తోంది. అంతేకాదు తాము సీబీఐ అధికారులమని చెప్పి పోలీసు శాఖలో అధికారులను కూడా బురిడీ కొట్టించి పనులు చేయించుకున్నట్లు సమాచారం. నిందితుడు ప్రేమ్కుమార్ తనకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంబంధాలున్నాయని చెప్పి అభిషేక్ బూరాతో కలిసి కుట్రలు చేసినట్లు సీబీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు. చదవండి: కడుపులో బంగారం మాయం.. భార్య ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి! -
సీఎం కేసీఆర్పై సీబీఐకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్
-
సీఎం కేసీఆర్పై సీబీఐకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బుధవారం సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణలో రూ.9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని కేఏ పాల్ ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి అవినీతి చూడలేదు. తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారు. కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కు రూ.60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. కేసీఆర్ సర్కార్ నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవితలు భారీ అవినీతికి పాల్పడ్డారు. తెలంగాణతో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారు. యాదాద్రి అభివృద్ధిలోనూ అవినీతి జరిగింది. రూ.2 వేల కోట్లు అంచనాలో రూ.200 కోట్లు ఖర్చు చేసి మిగిలింది అంతా దోచుకున్నారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలి. ప్రభుత్వ ఖజానాను కాపాడాలి. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీలపై కూడా విచారణ జరపాలి. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు నాపై దాడులు చేస్తున్నారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై జరిగే దర్యాప్తుకు నా పూర్తి సహకారం అందిస్తానని కేఏ పాల్ అన్నారు. ఫిర్యాదు కాపీలను సీబీఐతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలాకు కూడా పంపారు. చదవండి: ('ఫోన్ నెంబర్ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం') -
ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ
న్యూఢిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 20 నిమిషాలపాటు ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరిగిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్సీపీ, శివసేన నేతలపై ఈడీ, సీబీఐ చర్యలపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. మహారాష్ట్ర మజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ను ఉదయం సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. సేన ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తులను నిన్న ఈడీ అటాచ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధానితో పవార్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: (ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారత వైద్యవిద్యార్థులకు తీపి కబురు) -
బెంగాల్ సీఎం లేఖ.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
న్యూఢిల్లీ: ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి అధికార బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ విమర్శించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీల నేతలకు, బీజేపీయేతర సీఎంలకు మంగళవారం మమత లేఖ రాశారు. ఈ లేఖలో విపక్ష పార్టీలన్నీ కలిసొచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ ప్రత్యక్ష దాడులు చేస్తోందని మమత ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు వెళ్లే మార్గం గురించి చర్చించడానికి కలిసొచ్చేవారంతా సమావేశమవ్వాలని మమత పిలుపునిచ్చారు. బీజేపీ అణచివేత పాలనపై ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. Koo App Our Hon’ble Chairperson Mamata Banerjee writes to all Opposition leaders & CMs, expressing her concern over BJP India’s direct attacks on Democracy. BJP has repeatedly attacked the federal structure of our country and now, it’s time to unitedly fight this oppressive regime. View attached media content - All India Trinamool Congress (@AITCOfficial) 29 Mar 2022 దేశంలో ఎక్కడైనా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ఏజెన్సీలు చర్యలకు దిగుతాయి అంటూ మమత విమర్శలు గుప్పించారు. ఈ దేశ సమాఖ్య నిర్మాణంపై దాడి చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను అణచివేయాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఈ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయాలనే అధికార బీజేపీ దురుద్దేశాన్ని మనమందరం ప్రతిఘటించాలని మమత లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ సమావేశానికి ఎవరెవరు వెళ్తారనే దానిపై మాత్రం పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. చదవండి: (రాహుల్ గాంధీ తెలుగు ట్వీట్.. కల్వకుంట్ల కవిత కౌంటర్) -
జాప్యం చేస్తే న్యాయాన్ని నిరాకరించినట్లే
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వద్ద వెయ్యికి పైగా కేసులు పెండింగ్లో ఉండడం పట్ల పార్లమెంటరీ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందులో 66 కేసులు గత ఐదేళ్లకుపైగా పెండింగ్లోనే ఉండిపోవడం ఏమిటని ప్రశ్నించింది. న్యాయం చేకూర్చడంలో జాప్యం చేస్తే న్యాయాన్ని నిరాకరించినట్లేనని ఉద్ఘాటించింది. కేసుల విచారణను సుదీర్ఘకాలం కొనసాగించడం సరైంది కాదని పేర్కొంది. పెండింగ్ కేసుల పరిష్కారంపై ఒక కచ్చితమైన రోడ్మ్యాప్ రూపొందించాలని సీబీఐకి సూచించింది. ఈ మేరకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్కుమార్ మోదీ నేతృత్వంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం తాజాగా తన నివేదికను పార్లమెంట్కు సమర్పించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి 1,025 కేసులు పెండింగ్లో ఉన్నట్లు, ఇందులో 66 కేసులు ఐదేళ్లకుపైగా పెండింగ్ ఉన్నట్లు సీబీఐ లిఖితపూర్వకంగా తెలిపిందని నివేదికలో పేర్కొంది. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడానికి సీబీఐలో ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. డిప్యూటేషన్లపై ఆధారపడడం తగ్గించుకోవాలని, స్వస్తి పలకాలని, కనీసం డీఎస్పీ స్థాయి వరకు అధికారులను శాశ్వత ప్రాతిపాదికన నియమించుకొనేందుకు చర్యలు తీసుకోవాలని సీబీఐకి పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. -
హత్య, కుట్ర రాజకీయాలే చంద్రబాబు నైజం
సాక్షి, అమరావతి: హత్య, కుట్రలు, కుతంత్రపు రాజకీయాలతో ప్రత్యర్థులను దెబ్బ తీయడం తన నైజమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి చాటి చెప్పుకున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 1999 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డిని.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డిని టీడీపీ నేతలు అంతమొందించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర చేశారని మండిపడ్డారు. 2009 సెప్టెబరు 2న హెలికాఫ్టర్ దుర్ఘటనలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడంపైనా తమకు అనుమానాలున్నాయని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయాల్లోకి వైఎస్ జగన్ రాక ముందే.. ఆయన్ను మొగ్గలోనే తుంచేయాలనే కుట్రతో అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. ఇప్పుడు అదే రీతిలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. అధికారాన్ని చేజిక్కించుకుని, కుంగిపోయేలా చేసి.. ఆయన మరణానికి చంద్రబాబు కారకుడయ్యాడనే విమర్శలను గుర్తు చేశారు. ‘వైఎస్ వివేకా, వైఎస్ అవినాష్రెడ్డిలు వైఎస్సార్ కుటుంబ సభ్యులు. ప్రేమ, అభిమానాలకు వైఎస్ కుటుంబం పెట్టింది పేరు. నువ్వు మాత్రం కుటుంబమంటే నువ్వు, నీ భార్య, నీ కుమారుడు లోకేష్ మాత్రమే అనుకుంటావు’ అంటూ దుయ్యబట్టారు. వైఎస్ వివేకా హత్య కేసుపై సిట్ విచారణ చేస్తున్నా.. సీబీఐ విచారణ చేయిస్తామని హైకోర్టు ప్రతిపాదిస్తే.. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సీఎం వైఎస్ జగన్ అందుకు ఒప్పుకున్నారని గుర్తు చేశారు. బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఓ ఘటనపై నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోవాలని సూచించారు. బాబుకు మళ్లీ ఓటమి తప్పదు ►అబద్ధానికి మనిషి రూపమే చంద్రబాబు. జగన్పై ఎన్నో కుట్రలు చేశారు. అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టించారు. అంతా చేసి, 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో మాత్రమే అధికారం చేజిక్కించుకున్నారు. ►ఆ తర్వాత ఎన్ని కుట్రలు చేసినా 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని ఆపలేకపోయారు. ‘నిజం నిప్పులాంటిది. ఆ నిప్పే చంద్రబాబును రాజకీయంగా దహించి వేసింది. 2024 ఎన్నికల్లోనూ చంద్రబాబును ఇదే రీతిలో ప్రజలు చెత్తబుట్టలో పడేస్తారు. చంద్రబాబులానే లోకేష్ కూడా పనికి రాకుండా తయారయ్యారు. ఈ ప్రశ్నలకు సీబీఐ, సీబీఎన్ సమాధానం చెప్పాలి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి.. అదే నిజమని నమ్మించే కుట్రలో భాగంగా వైఎస్ అవినాష్పై సీబీఐ చార్జిషీట్ను పట్టుకుని చంద్రబాబు, ఎల్లో మీడియా నీచాతి నీచమైన రీతిలో దుష్ప్రచారం చేస్తున్నాయి. సీబీఐ కంటే చంద్రబాబే మెరుగైన రీతిలో దర్యాప్తు చేస్తాడేమో! ఈ నేపథ్యంలో సీబీఐకి వేసిన ప్రశ్నలే.. చంద్రబాబుకూ వేస్తున్నాం. వాటికి సరైన సమాధానాలు చెప్పగలరా? ►మరణానికి ముందు వైఎస్ వివేకా స్వహస్తాలతో రాసిన లేఖ ఆయన పీఏ కృష్ణారెడ్డికి ఉదయమే దొరికితే.. అప్పుడే ఎందుకు బయట పెట్టలేదు? అప్పుడే బయట పెట్టి ఉంటే అది హత్య అని అప్పుడే బహిర్గతమయ్యేది కదా? అప్పుడు మృతదేహాన్ని కదపడానికి గానీ, రక్తపు మరకలను తుడవటానికి గానీ ఎవరైనా సాహసించి ఉండేవారా? ఎదురుగా కన్పించే ఈ ఆధారాన్ని సీబీఐ ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదు? ►వైఎస్ వివేకా వద్ద లేఖ దొరికిందని పీఏ కృష్ణారెడ్డి.. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. తానొచ్చే వరకూ లేఖను బయటపెట్టవద్దని అతను చెబితేనే లేఖను దాచిపెట్టారు. ఈ అంశంలో రాజశేఖరరెడ్డిని ఎందుకు విచారించలేదు? దీనిపై సమాధానం చెప్పాలని సీబీఐని అడిగాం. సీబీఎన్నూ అడుగుతున్నాం. ►వైఎస్ వివేకా గుండెపోటుతో మృతి చెందారని ఆయన బావమరిది శివప్రకాష్ రెడ్డే తనకు ఫోన్ చేసి చెప్పారని.. అప్పట్లో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి.. మంత్రి పదవి దక్కించుకున్న చంద్రబాబు ఏజెంటు, ఇటీవల బీజేపీలో చేరిన ఆదినారాయణరెడ్డి సిట్ విచారణలో స్పష్టంగా చెప్పారు. మరి గుండెపోటు అంశాన్ని తెరపైకి తెచ్చిన శివప్రకాష్రెడ్డిని ప్రశ్నించరేం? ►ఆ శివప్రకాష్రెడ్డే.. వైఎస్ అవినాష్రెడ్డికి కూడా ఫోన్ చేసి వివేకా మరణించిన విషయం చెప్పారు. దాంతో జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తున్న అవినాష్రెడ్డి వెనక్కి తిరిగొచ్చి.. వైఎస్ వివేకా ఇంటికి చేరుకున్నారు. దీన్ని బట్టి చూస్తే వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారని తొలుత ప్రచారం చేసింది శివప్రకాష్రెడ్డి కాదా? కానీ.. సీబీఐ ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి.. వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారని తొలుత ప్రచారం చేసింది అవినాషేనని ఎలా అనుమానిస్తుంది? సిట్ విచారణలో వెల్లడైన వాస్తవాలను పరిగణనలోకి తీసుకోరా? ►అవినాష్రెడ్డి వివేకా ఇంటికి చేరుకోక ముం దే.. అప్పటికే అక్కడున్న ఎర్ర గంగిరెడ్డి తదితరులు రక్తపు మరకలను తుడిచారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న అవినాష్.. సీఐ శంకరయ్యను రప్పించారు. సీబీఐ ఆరోపించినట్లుగా అవినాష్రెడ్డి హత్య చేయించి ఉంటే ఆయనే పోలీసులనెందుకు పిలుస్తారు? సీబీఐ, బాబు సమాధానం చెప్పాలి. అవినాష్ను గెలిపించాలని వివేకా ప్రచారం ►వైఎస్ విజయమ్మ, షర్మిలమ్మ, లేదా తనకు కడప ఎంపీ టికెట్ ఇవ్వాలని వైఎస్ వివేకా కోరారని.. దాంతో తనకు టికెట్ దక్కదనే నెపంతోనే అతడిని డి.శంకర్రెడ్డి ద్వారా వైఎస్ అవినాష్ హత్య చేయించి ఉంటారనే కోణంలో విచారణ చేస్తున్నామని సీబీఐ చా ర్జిషీట్లో పేర్కొంది. కానీ.. వైఎస్ అవినాష్ అప్పటికే కడప సిటింగ్ ఎంపీ. కడప ఎంపీగా అవినాష్ను గెలిపించాలని కాలికి బలపం కట్టుకుని వైఎస్ వివేకా ప్రచారం చేశారు. హత్యకు ముందు రోజు కూడా ప్రచారం చేశారు. వైఎస్ వివేకా హత్యకు గురైన పది రోజుల తర్వాత ఆయన కూతురు సునీతమ్మ కూడా వైఎస్ జగన్ను సీఎం చేయడం, కడప ఎంపీగా వైఎస్ అవినాష్ను గెలిపించడం కోసం వైఎస్ వివేకా చివరి క్షణం వరకూ ప్రయత్నించారని చెప్పారు. కావాలంటే అప్పటి వీడియోలు చూడండి. ►దీనిని బట్టి వైఎస్ వివేకా టికెట్టే ఆశించలేదన్నది స్పష్టమవుతోంది. కానీ.. ఓ కట్టుకథ అల్లి చార్జిషీట్ వేయడం సమంజసమా? అని సీబీఐని ప్రశ్నించాం. ఇప్పుడు చంద్రబాబునూ నిలదీస్తున్నాం. -
హిందుస్తాన్ జింక్ వాటా విక్రయాలపై... సీబీఐ విచారణకు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్మెంట్) వ్యవహారాల్లో (26 శాతం వాటా విక్రయాలకు సంబంధించి) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఆదేశిస్తూ గత ఏడాది నవంబర్18వ తేదీన ఇచ్చిన ఉపసంహరించుకోవాలని దాఖలు చేసిన రికాల్ పిటిషన్ను కేంద్రం సోమవారం ఉపసంహరించుకుంది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన ప్రాథమిక అంశాలు వాస్తవంగా తప్పని, రీకాల్ కోసం చేసిన అభ్యర్థన అవసరమైనదని, సమర్థించదగినదని తొలుత ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అవసరమైతే ఈ కేసు విచారణకు కేంద్రం చట్టాల ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అయితే ఈ వాదనలతో న్యాయమూర్తులు డి వై చంద్రచూడ్, సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం విభేదించింది. పిటిషన్ను కొట్టివేస్తారన్న సంకేతాలతో వెంటనే దీనిని ఉపసంహరించుకోడానికి అనుమతించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. దీనికి బెంచ్ అంగీరిస్తూ, ‘డిస్మిస్డ్ విత్ విత్డ్రాన్’గా రూలింగ్ ఇచ్చింది. నేపథ్యం ఇదీ... గత ఏడాది నవంబర్లో ఈ అంశం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. హిందుస్తాన్ జింక్లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్ క్లియర్ చేసింది. అయితే హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్మెంట్) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ధర్మాసనం ఆదేశించింది. ‘మేము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నాము. తద్వారా ఈ విషయం యొక్క దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని అత్యున్నత స్థాయి ధర్మాసనం గతంలో వ్యాఖ్యానించింది. 2002లో జరిగిన హిందుస్తాన్ జింక్ డిజిన్వెస్ట్మెంట్ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణలకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయా లని ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్ జింక్ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటాలు ఇలా... ప్రస్తుతం ఎస్ఓవీఎల్ (అనిల్ అగర్వాల్ నడుపుతున్న స్టెరిలైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్) వద్ద హిందుస్తాన్ జింక్లో మెజారిటీ 64.92% వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5% వాటా ఉంది. ఎన్ఎస్ఈలో హిందుస్తాన్ జింక్ షేర్ ధర 4% పైగా పెరిగి రూ.334. 05 వద్ద ముగిసింది. హిందుస్తాన్ జింక్పై ఎన్జీటీ రూ.25 కోట్ల జరిమానా రాజస్తాన్లోని భిల్వారా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పర్యావరణ సంబంధ నియమావళిని ఉల్లంఘించినందుకుగాను వేదాంతా గ్రూప్ సంస్థ హిందుస్తాన్ జింక్పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.25 కోట్ల జరిమానా విధించింది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి హిందుస్తాన్ జింక్ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణ. మూడు వారాల్లో జరిమానా మొత్తాలను జిల్లా మేజిస్ట్రేట్ వద్ద డిపాజిట్ చేయాలని ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ ఏకే గోయెల్ ఆదేశించారు. కాగా, ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించడంసహా, బాధిత గ్రామాల్లో చెట్లునాటడం తదితర చర్యలు తీసుకుంటామని హిందుస్తాన్ జింక్ ప్రకటించడం గమనార్హం. -
ఈడీ, సీబీఐ చీఫ్ల ‘పొడిగింపు’పై సుప్రీం తలుపుతట్టిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అధినేతల పదవీకాలం పొడగింపునకు వీలుకల్పిస్తూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్పై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకెక్కింది. ఆయా అత్యున్నత పదవుల్లోని ఉన్నతాధికారులను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై పక్షపాత ధోరణిలో దాడులు, దర్యాప్తులకు ఆదేశించేందుకే సర్కార్ వారి పదవీకాలాన్ని పొడిగించిందంటూ విపక్షాలు నిరసన వ్యక్తంచేస్తుండటం తెలిసిందే. ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలం ఐదేళ్లవరకు పొడిగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తేవడం వివాదమైంది. దీంతో కాంగ్రెస్ నేత రణ్దీప్ సూర్జేవాలా గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దర్యాప్తు సంస్థల స్వతంత్రత కాపాడేలా గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించేలా ఈ ఆర్డినెన్స్లను తెచ్చారని, దర్యాప్తు సంస్థలపై ప్రభుత్వ ఒత్తిడి తొలగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోర్టును కోరారు. -
అది సభా హక్కుల ఉల్లంఘనే
కోల్కతా: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీఐబీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన ఇద్దరు అధికారులపై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బుధవారం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హక్కుల తీర్మానం ప్రవేశపెట్టింది. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసేటప్పుడు ముందస్తుగా సమాచారం అందివ్వలేదని అది సభాహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆ తీర్మానం పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ మంత్రి తపస్ రాయ్ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నారద స్టింగ్ ఆపరేషన్ కేసుకి సంబంధించి ఈ ఏడాది మొదట్లో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిరాద్ హకీమ్, మదన్ మిత్రా, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని, వారిని అరెస్ట్ చేయడానికి ముందు స్పీకర్ బిమన్ బెనర్జీ అనుమతి తీసుకోలేదని, ఆయనకు ఏ విధమైన సమాచారాన్ని కూడా అందివ్వలేదని తపస్ రాయ్ చెప్పారు. ఈడీ కూడా వారి ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసిందని వెల్లడించారు. సీబీఐ, ఈడీ సభా హక్కుల్ని ఉల్లంఘించారని, స్పీకర్కు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదన్నారు. సీబీఐ డిప్యూటీ ఎస్పీ సత్యేంద్ర సింగ్, ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రతిన్ బిశ్వాస్పై సభా హక్కుల ఉల్లంఘనను ప్రవేశపెడుతున్నట్టుగా వెల్లడించారు. ఈ అంశాన్ని స్పీకర్ బిమన్ బెనర్జీ హక్కుల కమిటీ పరిశీలనకు పంపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా దీనిపై విచారణ జరిపి నివేదిక అందించాలని విజ్ఞప్తి చేశారు. -
దేశంలో మరో భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన సీబీఐ
వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో సంబంధం ఉన్న గార్విట్ ఇన్నోవేటివ్ ప్రమోటర్స్ లిమిటెడ్(జీఐపీఎల్), ఆ కంపెనీ యజమాని సంజయ్ భాటిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన బైక్ బాట్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ భాటి, మరో 14 మంది కలిసి దేశవ్యాప్తంగా సుమారు రూ.15,000 కోట్ల మేర పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులను మోసం చేశారని ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొంది ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన సంజయ్ భాటి బైక్ బాట్ పేరుతో బైక్-టాక్సీ సర్వీసులను ప్రారంభించాడు. ఈ బైక్ సర్విస్ ముసుగులో లాభదాయకమైన మోసపూరిత ఆర్థిక పథకాలను రూపొందించాడు. ఈ బైక్ టాక్సీ సర్వీసుల్లో బైక్ బాట్ వాహనాన్ని ఎవరైనా కొనుగోలుదారుడు తమ వద్ద ఉన్న డబ్బుతో ఒకటి, మూడు, ఐడు లేదా ఏడు బైక్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ బైక్లను తమ కార్పొరేట్ కార్యాలయమే నడుపుతుందని నమ్మించారు. ఇలా పెట్టుబడి పెట్టినవారికి నెలవారీ అద్దె, ఈఎంఐతో పాటు ఎక్కువ బైక్లపై పెట్టుబడి పెడితే బోనస్ కూడా ఇస్తామంటూ ఆసక్తికరమైన ప్రోత్సాహకాలతో ఆకట్టుకున్నారు. కంపెనీ వివిధ నగరాల్లో ఫ్రాంచైజీలను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ నగరాల్లో బైక్లు టాక్సీలు పెద్దగా పనిచేయడం లేదని సీబీఐ పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా బైక్ టాక్సీల్లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడి దారులు మోసపోయినట్టు సీబీఐ గుర్తించింది. (చదవండి: అమెజాన్ బంపర్ ఆఫర్: బంగారం, వెండి నాణేలపై భారీ డిస్కౌంట్!) 2017లో ఈ పథకాలను ప్రారంభించిన ఈ సంస్థ.. పెట్టుబడిదారుల నుంచి డబ్బు వసూలు చేయడం, వేరేవారికి తిరిగి చెల్లించడం వంటివి చేస్తూ 2019 జనవరి వరకు చేసింది. నవంబర్ 2018లో పెట్రోల్ బైక్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొంటూ ఎలక్ట్రిక్-బైక్ కోసం కంపెనీ ఇదే విధమైన ప్రణాళికను ప్రవేశపెట్టింది. సాధారణ పెట్రోల్ బైక్ లతో పోలిస్తే ఈ-బైక్ల సబ్ స్క్రిప్షన్ మొత్తం దాదాపు రెట్టింపు అని ఎఫ్ఐఆర్లో తెలిపింది. పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించడానికి 'బైక్ బాట్ - జీఐపీఎల్ పథకం ద్వారా నడిచే బైక్ టాక్సీ అతి త్వరలో వేయనున్నాము. ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలనే వ్యక్తులు త్వరగా డబ్బును డిపాజిట్ చేయాలి' అని కంపెనీ ప్రచారం చేసింది. కేవలం రూ.62,200 పెట్టుబడి పెట్టి అద్దె పొందవచ్చునని, ఏడాదిలోగా బైక్ ఓనర్గా మారవచ్చు అని అందరినీ నమ్మించింది. ఇలా రూ.62,000 పెట్టుబడి పెట్టిన వారికి 12 నెలలపాటు నెలకు రూ.9,765 చొప్పున అందిస్తామని ఆశపెట్టింది. ఇలా ఏడాదికి రూ.1,17,000 సంపాదించవచ్చు అని తెలిపింది. ఈ ప్రకటన చూసి సుమారు 2,25,000 మంది ఇందులో పెట్టుబడి పెట్టారు. అయితే, కొన్నాళ్ల తర్వాత నెలలు గడుస్తున్నా అద్దెతో పాటు ఈఎంఐ చెల్లింపులు, బోనసులు రాకపోవడంతో పెట్టుబడిదారుల్లో అనుమానాలు వచ్చాయి. అప్పుడిస్తాం, ఇప్పుడిస్తాం అని భారీ మొత్తం లాగేసుకున్నాక బోర్డు తిప్పేశారు. అయితే, ఈ కంపెనీ నోయిడా జిల్లా అథారిటీ, పోలీసు అధికారుల పరిధిలో ఉంది. (చదవండి: రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్లు) ఇంత జరుగుతున్న అక్కడి పోలీసు అధికారులు ఈ విషయంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. "బదులుగా, ఎస్ఎస్ పి, ఎస్ పీ క్రైమ్ బ్రాంచ్ ఫిర్యాదుదారుల ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్లు" సీబీఐ తెలిపింది. సంజయ్ భాటి, అతని సహచరులు పెట్టుబడిదారులను నుంచి ముందస్తు కుట్రలో భాగంగా దేశవ్యాప్తంగా కనీసం 15,000 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించింది. అయితే, ఇంతకు ముందు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జీఐపీఎల్, దాని ప్రమోటర్ భాటి, ఇతరులకు వ్యతిరేకంగా గౌతమ్ బుద్ధనగర్ లోని దాద్రీ పోలీస్ స్టేషన్ లో నమోదైన వివిధ ఎఫ్ఐఆర్ల ఆధారంగా బైక్ బాట్ కుంభకోణం మనీ లాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. ఈ కేసులో ఆర్థిక దర్యాప్తు సంస్థ 216 కోట్లకు పైగా ఆస్తులను కూడా అటాచ్ చేసింది. -
దేశ ద్రోహులకు విదేశాల్లో..
కేవాడియా: మన దేశానికి ద్రోహం చేసినవారికి ప్రపంచంలో ఇంకెక్కడా స్వర్గధామాలు లేకుండా చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులకు ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు. భారత్లో నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయి తలదాచుకొనే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. ‘దేశానికి ద్రోహం చేసిన వారికి, ఇక్కడ నేరాలకు పాల్పడిన వారికి విదేశాల్లో నిలువ నీడ లేకుండా చేయాలి’ అని అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. గుజరాత్లోని కేవాడియాలో బుధవారం సీవీసీ, సీబీఐ ఉమ్మడి సదస్సులో మోదీ వర్చువల్గా మాట్లాడారు. దేశ ప్రయోజనాలకు, దేశ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే వారు ఎంతటి బలవంతులైనా ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారిని వెనక్కి రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అవినీతి.. పేదల హక్కులను హరిస్తుంది కేంద్ర ప్రభుత్వం గత ఆరేడేళ్లుగా సాగిస్తున్న నిరి్వరామ కృషితో దేశ ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందని, అవినీతిని అడ్డుకోవడం సాధ్యమేనని వారు నమ్ముతున్నారని ప్రధాని మోదీ చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాల బెడద లేకుండా ప్రభుత్వ పథకాలతో నుంచి తమకు రావాల్సిన ప్రయోజనాలు పొందవచ్చని ప్రజలు భావిస్తున్నారని గుర్తుచేశారు. అవినీతి.. అది చిన్నదైనా, పెద్దదైనా పేద ప్రజల హక్కులను హరిస్తుందని అన్నారు. దేశ అభివృద్ధి నిరోధిస్తుందని చెప్పారు. మన సమ్మిళిత శక్తిని ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. అవినీతిని నియంత్రించే దిశగా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రస్తుతం రాజకీయ సంకల్పం, పాలనాపరమైన సంస్కరణలతో అవినీతికి చెక్ పెడుతున్నామని మోదీ తెలియజేశారు. ప్రజలపై నియంత్రణ చర్యలను తగ్గిస్తున్నామని, తద్వారా వారి జీవితాలను సరళతరం చేస్తున్నామని చెప్పారు. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన అనే విధానాన్ని తాము విశ్వసిస్తున్నాని వెల్లడించారు. -
సీబీఐ సక్సెస్ రేటు అంతంత మాత్రం: సుప్రీం
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాను విచారణ చేపట్టిన కేసుల్లో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటోందని సుప్రీం కోర్టు పేర్కొంది.సీబీఐ తమ లోటుపాట్లను గుర్తించి సంస్థని బలోపేతం చేయడానికి ఏయే చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎస్.కె.కౌల్, ఎంఎం సుందరేశ్ల డివిజన్ బెంచ్ ట్రయల్ కోర్టు, హైకోర్టుల్లో నిందితులకు శిక్ష పడేలా ఎన్ని కేసుల్ని విజయవంతంగా వాదించిందో ఆ వివరాలను ఆరు వారాల్లోగా అందించాలని సీబీఐ డైరెక్టర్ని ఆదేశించింది. -
బెంగాల్ అల్లర్లపై 9 సీబీఐ కేసులు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింస, అల్లర్లకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తొమ్మిది కేసులను నమోదుచేసింది. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు నిమిత్తం నాలుగు ప్రత్యేక బృందాలను సీబీఐ ఆయా చోట్లకు పంపినట్లు గురువారం విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్ ప్రభుత్వం తమకు అప్పజెప్పిన కేసులతోపాటు మరికొన్ని కేసుల నమోదు ప్రక్రియను సీబీఐ కొనసాగిస్తోంది. పలు హత్యలు, అత్యాచారాలు జరిగాయన్న ఆరోపణలపై ఐదుగురు జడ్జిల కలకత్తా హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు కేసుల విచారణ బాధ్యతలను సీబీఐ తీసుకుంది. మే 2న ఎన్నికల ఫలితాలొచ్చాక జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని హైకోర్టు గతంలో ఈ ఆదేశాలిచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీపై అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. పలు వినతుల నేపథ్యంలో కేసుల దర్యాప్తునకు బెంగాల్ పోలీసుల నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు హైకోర్టు గతంలో ఆదేశించింది. సీబీఐ, సిట్ వేర్వేరుగా 6 వారాల్లోగా దర్యాప్తు నివేదికలను సమర్పించాలని హైకోర్టు సూచించింది. కేసులు ఉపసంహరించుకోండంటూ బెదిరించారని, చాలా హత్యలను సహజ మరణాలుగా చిత్రీకరించి కనీసం ఎఫ్ఐఆర్లు నమోదు చేయించలేదని హైకోర్టుకు బాధితులు గతంలో విన్నవించుకున్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించనందునే స్వతంత్ర దర్యాప్తు అవసరమనే నిర్ణయానికొచ్చామని కోర్టు వ్యాఖ్యానించింది. -
సిబిఐ కి స్వయం ప్రతిపత్తి కల్పించాలి
-
సీబీఐపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
చెన్నై: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పంజరంలో బధించపడిన చిలక అని.. కేంద్రం ఎన్నికల కమిషన్, కాగ్ మాదిరి దానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని సూచించింది. ఈ క్రమంలో సీబీఐకి అధిక అధికారాలు, అధికారంతో కూడిన చట్టబద్ధమైన హోదాను అందించే ప్రత్యేక చట్టాన్ని పరిగణలోకి తీసుకుని, అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘పార్లమెంటుకు మాత్రమే జవాబుదారీగా ఉండే భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐకి స్వయంప్రతిపత్తి ఉండాలి. అప్పుడే ప్రజలకు సీబీఐ మీద విశ్వాసం పెరుగుతుంది’ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుత వ్యవస్థను సరిదిద్దడానికి తాము చేసిన 12 పాయింట్ల సూచనలలో ‘పంజరంలోని చిలుకలా ఉన్న సీబీఐని’ విడుదల చేసే ప్రయత్నం అని కోర్టు పేర్కొంది. చట్టబద్ధమైన హోదా ఇచ్చినప్పుడు మాత్రమే సంస్థ స్వయంప్రతిపత్తిని నిర్ధారించగలమని గమనించిన న్యాయస్థానం.. ‘చట్టబద్ధమైన హోదాను పరిగణనలోకి తీసుకుని భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి మరింత అధికారం కల్పించాలి.. దీని వల్ల సీబీఐపై ప్రభుత్వ పరిపాలనా నియంత్రణ లేకుండా క్రియాత్మక స్వయంప్రతిపత్తి కలుగుతుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. తమిళనాడులోని పోంజి కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. జస్టిస్ ఎన్ కిరుబకరన్, జస్టిస్ బీ పుగళేందిల ధర్మాసనం ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. ‘ఎలక్షన్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐ మరింత స్వయంప్రతిపత్తిగా ఉండాలి.. సీబీఐ డైరెక్టర్కు ప్రభుత్వ కార్యదర్శిగా అధికారాలు ఇవ్వబడతాయి.. డీఓపీటీ ద్వారా కాకుండా నేరుగా మంత్రి/ ప్రధాన మంత్రికి నివేదించాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, సంస్థలో మానవవనరుల కొరతతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించలేమని కేంద్రం పేర్కొంది. దీంతో ఈ అంశంపై నెల రోజుల్లోగా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. 1941లో ఏర్పడిన సీబీఐ.. ప్రధాన మంత్రి కార్యాలయం అధీనంలో ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీఓపీటీ)కు బాధ్యత వహిస్తోంది. దీని డైరెక్టర్ను ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం ఎంపిక చేస్తుంది. -
సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై క్రమశిక్షణా చర్యలు!
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ డిపార్ట్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ)కి సిఫారసు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, సర్వీసు రూల్స్ ఉల్లంఘించడం వంటి ఆరోపణల నేపథ్యంలో హోంశాఖ ఈ మేరకు సిఫారసు చేస్తూ డీఓపీటీకి లేఖ రాసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆరోపణలు రుజువైతే అలోక్ పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా జప్తు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అలోక్ 2017 ఫిబ్రవరి 1న సీబీఐ చీఫ్గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కొనసాగారు. అప్పుడే తన కింద పని చేసే మరో అధికారి రాకేశ్ ఆస్తానాతో తగాదా పెట్టుకున్నారు. ఇరువురు అధికారులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ చేసిన సిఫార్సును డీఓపీటీ యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్కి పంపించింది. -
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం
సాక్షి, కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన సునీల్కుమార్ యాదవ్ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది. ఈ నెల 2న గోవాలో అతడు పారిపోతుండగా ట్రాన్సిట్ అరెస్టు చేసి అక్కడి కోర్టులో హాజరుపరిచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అతడిని పలుమార్లు సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. అరెస్టు చేశాక అతడిని ప్రత్యేక వాహనంలో బెంగళూరు మీదుగా కడప కేంద్ర కారాగారానికి తరలించింది. అక్కడ సీబీఐ ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక కార్యాలయానికి సునీల్ను తీసుకొచ్చింది. మంగళవారం సాయంత్రం అతడిని కడప కోర్టులో హాజరుపరుస్తారనే ప్రచారం సాగినా రాత్రి వరకు కోర్టుకు తీసుకురా లేదు. బుధవారం ఉదయం సీబీఐ అధికారులు సునీల్ కుమార్ను కడప లేదా పులివెందుల లేదా జిల్లాలోని ఏదైనా కోర్టు లేదా మెజిస్ట్రేట్ ఎదుట నేరుగా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా, కడప కేంద్ర కారాగారంలో ఇదే కేసుకు సంబంధించి వైఎస్ వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో సునీల్తోపాటు ఈ ముగ్గురిని ప్రధాన అనుమానితులుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఎవరీ సునీల్కుమార్ యాదవ్? పులివెందుల మండలం మోటునూతలపల్లెకు చెందిన కృష్ణయ్య కుటుంబం ప్రస్తుతం భాకారాపురంలో నివాసం ఉంటోంది. కృష్ణయ్య స్థానిక ఆటోఫైనాన్స్లో వాటాదారుగా ఉండగా, ఆయన కుమారుడు సునీల్కుమార్ యాదవ్ ఇసుక రీచ్లో పనిచేసేవాడు. ఈ క్రమంలో తొండూరు మండలం రావులకొలనులో ఉన్న వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించిన పొలాలను పర్యవేక్షించే ఉమాశంకర్ రెడ్డితో సునీల్కు స్నేహం ఏర్పడింది. అతడి ద్వారా వైఎస్ వివేకాకు సునీల్ కుటుంబం మొత్తం దగ్గరైంది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో తొలుత సిట్, ఆ తర్వాత సీబీఐ సునీల్ను, అతడి తల్లిదండ్రులు, సోదరుడు కిరణ్కుమార్ను పలు మార్లు విచారించింది. సునీల్ను సీబీఐ ఢిల్లీలోని తమ కార్యాలయంలో నెల పాటు ఉంచింది. దీంతో సీబీఐ తనతోపాటు తన కుటుంబ సభ్యులను విచారణకు పిలిపించి వేధిస్తోందని సునీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి సీబీఐ కౌంటర్ పిటిషన్ వేసింది. హైకోర్టులో పిటిషన్ వేసినప్పటి నుంచి గోవాలోనే సునీల్కుమార్ యాదవ్ మకాం వేశాడు. దీంతో విచారణకు సహకరించకపో వడంతో అతడిని అనుమానితుడిగా నిర్ధారించిన సీబీఐ అరెస్టు చేసింది. -
Lalu Prasad Yadav: లంచం కేసులో లాలూకి క్లీన్ చీట్?
సాక్షి, న్యూఢిల్లీ: డీఎల్ఎఫ్ గ్రూప్ లంచం కేసులో మాజీమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కి సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చినట్టు సమాచారం. లాలూ ప్రసాద్ యాదవ్కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో సీబీఐ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో ఇప్పటికే మూడున్నరేళ్లు లాలూ జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చినా... ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ తమ విచారణ కొనసాగించనుంది. రైల్వే ప్రాజెక్ట్లులో ... యూపీఏ 2 ప్రభుత్వ హయంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ముంబై, ఢిల్లీలలో రైల్వే ప్రాజెక్టులు దక్కించుకునేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ లాలూకి లంచం ఇచ్చిందనేది ప్రధాన ఆరోపణ. డీఎల్ఎఫ్కి లబ్ధి చేకూర్చినందుకు 2007లో దక్షిణ ఢిల్లీలో రూ. 30 కోట్లు విలువ చేసే స్థలాన్ని లాలుకి కట్టబెట్టారని, ఆ తర్వాత 2011లో లాలూ కుటుంబ సభ్యులకు నామమాత్రపు ధరకే విలువైన షేర్లు అందించారనే ఆరోపణలు వచ్చాయి. మూడేళ్ల విచారణ లంచం తీసుకుని డీఎల్ఎఫ్ సంస్థకు అనుకూలంగా లాలూ తన పవర్స్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై 2018 జనవరిలో కేసు నమోదు చేసింది సీబీఐ, ఆర్థిక నేరాల విభాగం. కేసు నమోదైన కొత్తలో పూర్వపు స్టాంపు పేపర్లు ఫోర్జరీ చేశారని, లాలూ కుటుంబ సభ్యులు ఆయాచితంగా లబ్ధి పొందారని... ఇలా అనేక ఆధారాలు ఆయనకి వ్యతిరేకంగా తమ వద్ద ఉన్నాయంటూ బెయిల్కి నిరాకరించింది. దాదాపు రెండున్నరేళ్ల పాటు విచారించిన తర్వాత ఆరోపణలకు తగ్గట్టు సరైన ఆధారాలు సంపాదించలేక పోయింది సీబీఐ. దీంతో లాలూకి క్లీన్చీట్ ఇచ్చింది. డీఎల్ఎఫ్ లంచం కేసులో 2008 జనవరి నుంచి 2021 ఏప్రిల్ వరకు లాలూ జైలులోనే ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో బెయిల్ రావడంతో లాలూ బయటకు వచ్చారు. -
నారద కేసును రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయాలి: సీబీఐ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వల్లే సీబీఐ కార్యాలయంపై తృణమూల్ పార్టీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని సీబీఐ కోల్కతా హైకోర్టుకు వివరించింది. నారదా కేసును రాష్ట్రం వెలుపల విచారించేలా కేసు బదిలీకి అనుమతివ్వాలని, అరెస్టయిన నలుగురు నిందితులనూ పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ బుధవారం కోర్టును కోరింది. నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో రెండు రోజుల క్రితం సీబీఐ నలుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అదే రోజు స్థానిక కోర్టు వారికి బెయిల్ మంజూరు చేయడంతో, వెంటనే సీబీఐ హైకోర్టుకు వెళ్లింది. దాంతో నిందితుల బెయిల్పై హైకోర్టు స్టే విధించింది నేడు కోల్కతా హైకోర్టు ఈ కేసును విచారించింది. సీబీఐ ఆఫీసు ముందు ముఖ్యమంత్రి అధ్వర్యంలో తృణమూల్ కార్యకర్తలు భయోత్పాతం సృష్టించడం వల్లే సోమవారం కోర్టుకు వచ్చి నిందితుల కస్టడీని కోరలేకపోయామని సీబీఐ వివరించింది. భారీ గుంపులను తీసుకొని వచ్చిన మమత.. సీబీఐ ఆఫీసు ముందు నానా రచ్చ చేశారని ఆరోపించింది. ఆమె రెచ్చగొట్టడం వల్లే వేలాది మంది దుండగులు సీబీఐ ఆఫీసుపైకి రాళ్లు విసిరారని పేర్కొంది. సీబీఐ అధికారులను బెదిరించి, భయపెట్టాలన్న ఉద్దేశంతోనే ఆమె ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించింది. తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా మమత సర్కార్ అడ్డుకుంటోందని ఆక్షేపించింది. అలాంటి సందర్భంలో నిందితులను కోర్టుకు తీసుకొస్తే.. దారి మధ్యలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తొచ్చన్న ఉద్దేశంతోనే సోమవారం కోర్టుకు రాలేదని సీబీఐ పేర్కొంది. చదవండి: West Bengal: ఇద్దరు మంత్రుల అరెస్ట్, టీఎంసీలో కలవరం -
నారదా స్టింగ్ ఆపరేషన్: మంత్రులకు బెయిల్
కోల్కతా: నారదా స్టింగ్ ఆపరేషన్లో భాగంగా సీబీఐ అధికారులు ఉదయం ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే, మాజీ మేయర్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కూడా అరెస్ట్ చేయాలంటూ దాదాపు ఆరు గంటలుగా సీబీఐ కార్యాలయం నిజాం ప్యాలెస్ ఎదుట కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మంత్రుల అరెస్ట్కు వ్యతిరేకంగా టీఎంసీ కార్యకర్తలు భారీ ఎత్తున సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకుని, బ్యారికేడ్లు తొలగించడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కార్యకర్తలను చెదరగొట్టానికి రంగంలోకి దిగిన పారామిలిటరీ సిబ్బంది, పోలీసులపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ కార్యకర్తలు అన్యాయంగా ప్రవర్తిస్తూ.. అరాచకాలకు పాల్పడుతున్నారని.. రాజ్యాంగ నిమయాలను పాటించాలని కోరారు. ఈ ఘటనపై మమతా బెనర్జీ అల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ.. బెంగాల్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని.. లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించే చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని.. చట్టబద్దంగానే ఈ యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. Concerned at alarming situation. Call upon @MamataOfficial to follow constitutional norms & rule of law. Police @WBPolice @KolkataPolice @HomeBengal must take all steps to maintain law & order. Sad- situation is being allowed to drift with no tangible action by authorities. — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 17, 2021 ఇటీవల బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ నారద న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో విచారణ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో స్పెషల్ కోర్టులో చార్జ్షీట్ సీబీఐ దాఖలు చేసింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి ఫిర్మాద్ హకీమ్ ఇంటికి కేంద్ర బలగాలు వెళ్లాయి. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. చదవండి: West Bengal: ఇద్దరు మంత్రుల అరెస్ట్, టీఎంసీలో కలవరం -
West Bengal: ఇద్దరు మంత్రుల అరెస్ట్, టీఎంసీలో కలవరం
కలకత్తా: పశ్చిమబెంగాల్లో ఇద్దరు మంత్రులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. నారద స్టింగ్ ఆపరేషన్లో సీబీఐ అధికారులు సోమవారం తెల్లవారుజామున ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేయడం కలకలం రేపింది. మంత్రుల అరెస్ట్పై ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కూడా అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి ఫిర్మాద్ హకీమ్ ఇంటికి కేంద్ర బలగాలు వెళ్లాయి. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. దీంతో ఒక్కసారిగా పశ్చిమబెంగాల్లో కలకలం రేపింది. ఈ సంఘటనతో అగ్గి మీద గుగ్గిలమైన మమతా వెంటనే సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. వారిద్దరితో పాటు తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మేయర్ సోవన్ ఛటర్జీ నివాసాలకు కూడా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. విచారణ చేపడుతున్నాయి. ఇటీవల బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ నారద న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో విచారణ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో స్పెషల్ కోర్టులో చార్జ్షీట్ సీబీఐ దాఖలు చేసింది. దీంతో సీబీఐ దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకుంది. మొత్తం నలుగురిని అరెస్ట్ చేయడం పశ్చిమ బెంగాల్లో రాజకీయంగా కీలక మలుపు తిరిగింది. దీనిపై కొద్దసేపట్లో సీబీఐ అధికారికంగా వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. 2016 ఎన్నికల సమయంలో నారద న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో వీరంతా కెమెరా ముందే డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ వ్యాపారవేత్త నుంచి నలుగురు ఎంపీలు, నలుగు మంత్రులు, ఓ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటున్నట్లు వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కేంద్రం కక్షపూరితంగా మంత్రులను అరెస్ట్ చేసిందని.. ఓటమితో బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బొల్లినేని అక్రమాలు ఇన్నిన్ని కాదయా!
సాక్షి, హైదరాబాద్: సీజీఎస్టీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ అక్రమాలు బోలెడు. అవి ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసుతోపాటు రూ.5 కోట్ల లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసగాంధీని మంగళవారం సీబీఐ నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసింది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన గాంధీ దాదాపు రూ.200 కోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన విధులు నిర్వహించిన చోటల్లా వివాదాలతో సావాసం చేసేవారన్న ఆరోపణలకు క్రమంగా బలం చేకూరుతోంది. ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని వివిధ కేంద్ర సంస్థలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీబీఐ అరెస్టు చేసే సందర్భంలో కూడా ఆయన తన కుటుంబసభ్యులకు కరోనా సోకిందంటూ దొంగపత్రాలు సృష్టించి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. సీవీసీ, ఆర్థికశాఖ, సీజీఎస్టీ వద్ద.. పోస్టింగ్ల విషయంలో గాంధీకి తెరవెనుక అనేక శక్తులు సాయం చేశాయని విమర్శలున్నాయి, ఈ విషయంపై గతంలో ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. 2019లో శ్రీనివాసగాంధీ బేగంబజార్ జీఎస్టీ సూపరింటెండెంట్గా ఉన్న సమయంలో కూలింగ్ పీరియడ్లో ఉన్నారు. వాస్తవానికి కూలింగ్ పీరియడ్లో ఉన్నవారికి ఎలాంటి కేసులు అప్పగించరు. నిబంధనల ప్రకారం... కూలింగ్ పీరియడ్లో కనీసం రెండు సంవత్సరాలపాటు పనిచేయాలి. కానీ, ఆయన కూలింగ్ పీరియడ్లో మూడు నెలలు కూడా పనిచేయలేదని సొంత కార్యాలయం సిబ్బందే అంటున్నారు. కొందరు రాజకీయ నేతలు, సొంత శాఖలోని ఇద్దరు వివాదాస్పద ఉన్నతాధికారులు ఆయన్ను తాత్కాలిక డిప్యుటేషన్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా బషీర్బాగ్లోని యాంటీ ఈవేషన్ వింగ్–జీఎస్టీకి బదిలీ చేశారు. సాధారణ ఉద్యోగులకు ఇలాంటి బదిలీలు దాదాపుగా అసాధ్యం. ఈ వివాదాస్పద బదిలీ వ్యవహారంపై కొందరు వ్యక్తులు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ), డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్–ఢిల్లీ, జీఎస్టీ చీఫ్ కమిషనర్ హైదరాబాద్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను కేంద్ర ఆర్థికమంత్రికి కూడా పంపారని సమాచారం. గాంధీ అక్రమాలకు సహకరించిన చిలుక సుధారాణి, ఇద్దరు జీఎస్టీ ఉన్నతాధికారులపై త్వరలోనే అధికారిక విచారణ ప్రారంభం కానుందని సమాచారం. హైదరాబాద్లోని ఓ వ్యాపారి నుంచి 2020లో రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన కేసు తెరపైకి రానుంది. ఈ కేసులోనూ సీబీఐ అధికారులు చురుగ్గా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రూ.10 లక్షల లంచం తీసుకున్నారని సీబీఐ అధికారులు నిర్ధారించారు. మిగిలిన సాంకేతిక, డాక్యుమెంటెడ్ ఆధారాలు కూడా సేకరించేపనిలో సీబీఐ నిమగ్నమైంది. మోకాలి, కడుపునొప్పి సాకుగా చూపి! సీబీఐ అధికారులు వచ్చిన సమయంలో గాంధీ బంధువునంటూ ఓ వృద్ధుడు ఆయన ఇంటికి వచ్చాడు. లోపల కొన్ని బట్టలు సర్దుకుని బైక్పై బయలుదేరడం అక్కడే వున్న అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ వృద్ధుడిని రహస్యంగా ఫాలో అయి పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న ఫోన్లో బొల్లినేని శ్రీనివాస్తో మరోఫోన్తో జరిపిన సందేశాలు లభించాయి. అలా అతని ఆచూకీ కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చిక్కింది. అక్కడికెళ్లిన తరువాత బొల్లినేని ఐసీయూలో మోకాలి, కడుపునొప్పులతో చికిత్స పొందుతుండటం చూసి సీబీఐ అధికారులు అవాక్కయ్యారు. అతని సమస్యలు తీవ్రమైనవి కావని, ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ఇంట్లో ఆన్చేసి.. పరారీ సీబీఐ అరెస్టును తప్పించుకునేందుకు గాంధీ విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యవహారాలు చూసిన సీబీఐ అధికారులు ముక్కున వేలేసుకున్నారు. మంగళవారం సీబీఐ అధికారులు బొల్లినేనిని అరెస్టు చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా.. అక్కడ తన తెలివితేటలు ప్రదర్శించారని తెలిసింది. తన ఫోన్ స్విచ్చాన్ చేసి (తన లొకేషన్ అక్కడే కనిపించేలా) ఇంటి నుంచి పరారయ్యారు. పట్టు వీడని అధికారులు గాంధీ ఇంటి దగ్గరే మకాం వేశారు. అయితే గాంధీ కుటుంబంలోని మహిళలంతా ఆయనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ డ్రామా క్రియేట్ చేసి తమను దుర్భాషలాడారని సీబీఐ అధికారులు వాపోయారు. -
కోవిడ్ పేరుచెప్పి.. సీబీఐని ఏమార్చబోయిన బొల్లినేని
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీని సీబీఐ అరెస్టు చేసింది. ఆయనను మంగళవారమే అదుపులోకి తీసుకుని, పలు అంశాలపై ప్రశ్నించినా.. బుధవారం సాయంత్రం అధికారికంగా అరెస్టును ప్రకటించింది. తర్వాత సీబీఐ మేజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్టింది. కోర్టు బొల్లినేని గాంధీకి వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కోవిడ్ పేరుతో డ్రామా తన అరెస్టును అడ్డుకోవడానికి బొల్లినేని శ్రీనివాసగాంధీ చివరి నిమిషం వరకు విశ్వప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అరెస్టును ఆపాలంటూ తన ఆంతరంగికులకు ఫోన్లు చేసి ఒత్తిడి తెచ్చాడని తెలిసింది. సీబీఐ అధికారులు ఇంటికి వచ్చేసరికి.. తన కుటుంబ సభ్యులకు కోవిడ్–19 పాజిటివ్ వచ్చిందంటూ నకిలీ రిపోర్టులు సిద్ధం చేసి ఉంచినట్టు సమాచారం. అవి నకిలీవని తేల్చిన సీబీఐ అధికారులు..బొల్లినేని గాంధీని అదుపులోకి తీసుకున్నా రు. బొల్లినేని గాంధీపై గతేడాది సీబీఐ మరో కేసు ను నమోదు చేసింది. బొల్లినేని ఓ వ్యవహారంలో హైదరాబాద్కు చెందిన వ్యాపారి నుంచి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. రూ.10 లక్షలు నగదు, మిగతా రూ.4.90 కోట్లకు సిటీ శివారులో భూములు గిఫ్ట్గా ఇవ్వాలని షరతు విధించాడు. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఇలా లంచం కేసు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నప్పటికీ బొల్లినేనికి గత డిసెంబర్లో పదోన్నతి రావడం గమనార్హం. అయి తే వరుస ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఫిబ్రవరి 24న సెంట్రల్ జీఎస్టీ నుంచి బొల్లినేని గాంధీని సస్పెండ్ చేస్తూ..సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ట్యాక్సెస్ ఉత్తర్వులు ఇచ్చింది. నోటీసులకు స్పందనే లేదు! 2019 జూలై 8న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బొల్లినేని శ్రీనివాసగాంధీ, అతని భార్యపై సీబీఐ కేసు నమోదు చేసింది. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి.. రూ.3.74 కోట్ల ఆస్తులు గుర్తించింది. ఆ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. సీబీఐ నమోదు చేసిన కేసు, ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. 2010 నుంచి 2019 మధ్య శ్రీనివాస గాంధీ ఆస్తులు ఏకంగా 288 శాతం పెరిగాయి. ఈ కేసుకు సంబంధించి పలుమార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా.. గాంధీ స్పందించలేదని, ఒక్కరోజు కూడా విచారణకు రాలేదని సీబీఐ అధికారులు తెలిపారు. అసలు సీబీఐ అడిగిన ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వివరించారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారిపై బెదిరింపులు, ప్రలోభాలకు దిగాడని, వారు విచారణకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. ఈ మేరకు బాధితులు సీబీఐ అధికారులకు మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అరెస్టు చేశారు. చదవండి: (బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్) -
కోస్టల్ ప్రాజెక్ట్స్ సురేంద్రపై సీబీఐ కొరడా
సాక్షి, అమరావతి: బ్యాంకులను బురిడీ కొట్టించి వేల కోట్లు కొల్లగొట్టిన మరో బడా సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ కొరడా ఝుళిపించింది. పవర్ ప్రాజెక్టులు, మినీ డ్యామ్లు, వాటర్ సప్లయి స్కీమ్స్, రహదారులు వంటి నిర్మాణాలు చేపట్టే ప్రముఖ సంస్థ అయిన కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్పై సీబీఐ దాడులు నిర్వహించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కన్సార్టియం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సోదాలు జరిపింది. ప్రధానంగా విజయవాడ, హైదరాబాద్లలో శనివారం, ఆదివారం దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, హార్డ్డిస్క్లు, పలు ముఖ్యమైన ఆధారాలు సేకరించింది. వివరాలివీ.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ కేంద్రంగా ఉన్న కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ.. ఎస్బీఐ నేతృత్వంలోని ఐడీబీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూబీఐ, ఎగ్జిమ్ బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.4,736.57 కోట్లు రుణం తీసుకుంది. వీటిని తిరిగి చెల్లించకుండా అవకతవకలకు పాల్పడింది. ఈ సంస్థ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరుల సహకారంతో పథకం ప్రకారం బ్యాంకుల కన్సార్టియంను మోసం చేసింది. 2013 అక్టోబర్ 28 నుంచి అక్రమాలకు తెరలేపింది. 2013–18 మధ్య కాలంలో తప్పుడు లెక్కలు, నకిలీ పత్రాలు, ఫేక్ ఖాతాలతో మోసాలకు పాల్పడడమే కాక తీసుకున్న రుణాలను తప్పుడు మార్గంలో ఇతర ఖాతాలకు మళ్లించిందని సీబీఐ తెలిపింది. కాగా, సంస్థ చైర్మన్ సబ్బినేని సురేంద్రతోపాటు మేనేజింగ్ డైరెక్టర్ హరిహరరావు, డైరెక్టర్లు శ్రీధర్ చంద్రశేఖరన్, శరద్ తదితరులపై కేసు నమోదు చేశారు. -
భారీ కుంభకోణం: రూ.4,837 కోట్లు ఎగవేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో భారీ బ్యాంకు రుణాల ఎగవేత కుంభకోణం వెలుగుచూసింది. దాదాపు రూ.4,837 కోట్లు రుణంగా పొంది, తిరిగి చెల్లించడంలో విఫలమైందనే ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఎఫ్.ఐ.ఆర్లో ఐవీఆర్సీఎల్ లిమిటెడ్, హైదరాబాద్, కంపెనీ ఎండీ ఇ.సుధీర్రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.బలరామిరెడ్డితోపాటు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులపై నేరపూరిత కుట్ర, నిధుల అక్రమ తరలింపు అభియోగాలను పేర్కొంది. నగరంలోని సంస్థ కార్యాలయంతోపాటు నిందితుల ఇళ్లలో బుధవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకుంది. తమకు లోను కావాలంటూ ఐవీఆర్సీఎల్ పలు బ్యాంకులను ఆశ్రయించింది. దీంతో వీరికి స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేతృత్వంలో ఐడీబీఐ, కెనరా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్, యూనియన్, ఎగ్జిమ్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులతో కలిపి కన్సార్షియంగా ఏర్పడ్డాయి. కంపెనీకి పలు దఫాలుగా భారీ రుణం ఇచ్చాయి. కానీ, తీసుకున్న రుణం తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. ఈ క్రమంలో బ్యాంకు ఫోరెన్సిక్ ఆడిట్లో కంపెనీ లావాదేవీల్లో పలు అవకతవకలు వెలుగుచూశాయి. దీంతో దాదాపు రూ.4,837 కోట్లు నష్టం వాటిల్లిందంటూ ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేస్తోంది. (చదవండి: ‘డీఎల్ఎఫ్’ భూ వ్యవహారంపై కౌంటర్ వేయండి) మహేష్ బ్యాంకు కేసులో తీర్పు రిజర్వు సాక్షి, హైదరాబాద్: ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఎన్నికకు పోలింగ్ నిర్వహించి, కౌంటింగ్ ప్రారంభించిన తర్వాత కొన్ని ఓట్లను లెక్కించకుండా నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ డైరెక్టర్ల బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఓట్లు లెక్కిం చి ఫలితాలు ప్రకటించేలా ఆదేశించాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బుధవారం వాదనలు వినిపించారు. -
కుంభకోణంలో బాబే ప్రధాన సూత్రధారి
సాక్షి, అమరావతి: బ్యాంక్ ఆఫ్ బరోడా ట్రాన్స్ట్రాయ్ రుణాన్ని నిరర్థక ఆస్తిగా ప్రకటించినప్పుడే గత సర్కారు ఆ సంస్థపై వేటు వేసి పోలవరం పనుల నుంచి తొలగిస్తే ఇంత భారీ కుంభకోణానికి అవకాశమే ఉండేది కాదని 14 బ్యాంకుల కన్సార్షియం, ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ కుంభకోణాన్ని చంద్రబాబు చేత.. చంద్రబాబు కోసం.. చంద్రబాబే పాల్పడిన స్కాంగా అభివర్ణిస్తున్నారు. ఎక్కడా లేని రీతిలో కేబినెట్ తీర్మానం ద్వారా పోలవరం పనుల్లో ట్రాన్స్ట్రాయ్కి సిమెంట్, స్టీలు ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేసేలా నాటి సీఎం చంద్రబాబు చక్రం తిప్పారు. కానీ రాయపాటి వాటిని కొనుగోలు చేయకుండానే నకిలీ బిల్లులతో రూ.1,527.10 కోట్ల బ్యాంకు రుణాన్ని దారి మళ్లించి స్వాహా చేయడాన్ని బట్టి ఈ కుంభకోణంలో బాబే ప్రధాన సూత్రధారి అనేది స్పష్టమవుతోంది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ట్రాన్స్ట్రాయ్ వాటా 13 శాతమే.. పోలవరం హెడ్వర్క్స్ను ట్రాన్స్ట్రాయ్–జేఎస్సీ– ఈసీ–యూఈఎస్ (జేవీ) రూ.4,054 కోట్లకు దక్కించుకుని 2013 మార్చి 2న నాటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ జేవీలో రష్యా, ఉక్రెయిన్కు చెందిన జేఎస్సీ–ఈసీ–యూఈఎస్ వాటా 87% కాగా రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ వాటా కేవలం 13 శాతమే. జేఎస్సీ–ఈసీ–యూఈఎస్ సంస్థలో తన సమీప బంధువు చెరుకూరి శ్రీధర్ను డైరెక్టర్గా చేర్చి ఆ సంస్థకు కమీషన్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. చిన్న ప్రాజెక్టుల పనులే చేయలేని ట్రాన్స్ట్రాయ్కి 194.6 టీఎంసీల సామర్థ్యం ఉన్న పోలవరం పనులను ఎలా అప్పగిస్తారని అప్పట్లో విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాయపాటి భారీగా ముడుపులు ఇవ్వడం వల్లే ట్రాన్స్ట్రాయ్కి పోలవరం కాంట్రాక్టు దక్కిందని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన రాయపాటి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. దివాలా తీసిన సంస్థకే దన్ను.. పోలవరం కాంట్రాక్టు ఒప్పందాన్ని చూపించిన ట్రాన్స్ట్రాయ్కి కెనరా బ్యాంక్ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియం బ్యాంకు గ్యారెంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్, రుణం రూపంలో రూ.7,926.01 కోట్లు ఇచ్చేందుకు 2013లో అంగీకారం తెలిపాయి. ఆ మేరకు రుణాలిచ్చాయి. ఇందులో కొంత భాగాన్ని 2014 ఎన్నికల్లో టీడీపీకి ఇం‘ధనం’గా మళ్లించారనే ఆరోపణలున్నాయి. తీసుకున్న రుణాన్ని ఇతర సంస్థలకు మళ్లించి స్వాహా చేయడంతో 2014 అక్టోబర్ 5న ట్రాన్స్ట్రాయ్ రుణాన్ని ఎన్పీఏగా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఆ తర్వాత 13 బ్యాంకులు ట్రాన్స్ట్రాయ్ రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించాయి. చదవండి: (పురిటి గడ్డ రుణం.. సీఎం జగన్ సంకల్పం) పోలవరం పనులు దక్కించుకుని ఒప్పందం చేసుకున్నాక జేవీలోని విదేశీ సంస్థలైన జేఎస్సీ, యూఈఎస్ సంస్థలు పత్తా లేకుండా పోయాయి. కేవలం కాంట్రాక్టు దక్కించుకోవడానికి మాత్రమే విదేశీ సంస్థలను కాగితాలపై చూపిన ట్రాన్స్ట్రాయ్పై వేటు వేయాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు నాడు సీఎంగా ఉన్న చంద్రబాబుకు సూచించినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2015 మార్చి 12న తొలి సారిగా సమావేశమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) విదేశీ సంస్థలు పత్తా లేకపోవడాన్ని ప్రశ్నించింది. దివాలా తీసిన ట్రాన్స్ట్రాయ్కి పోలవరం పనులు చేసే సత్తా లేదని, దాన్ని తప్పించాలని సూచించినా చంద్రబాబు వినలేదు. ట్రాన్స్ట్రాయ్ని ముందు పెట్టి దోపిడీ.. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు పీపీఏతో ఒప్పందం చేసుకోవాలని గత సర్కారుకు కేంద్రం పలుదఫాలు సూచించింది. అయితే పీపీఏతో ఒప్పందం చేసుకుంటే సత్తాలేని రాయపాటి సంస్థపై వేటు పడటం ఖాయం. ప్రాజెక్టును కేంద్రం చేపడితే కమీషన్లు రావని ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ 2016 సెప్టెంబర్ 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు దక్కించుకున్నారు. తర్వాత డయాఫ్రమ్ వాల్ పనులను ఎల్ అండ్ టీ–బావర్(జేవీ), జెట్ గ్రౌటింగ్ పనులను కెల్లర్, మట్టి తవ్వకం పనులను త్రివేణి, కాంక్రీట్ పనులను పూట్జ్మీస్టర్, పెంటా, గేట్ల పనులను బీకెమ్ సంస్థలకు అప్పగించి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. దీన్నేమంటారు బాబూ..? డయాఫ్రమ్ వాల్ పనులు చేస్తున్న సంస్థలకు ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లించేలా 2015 అక్టోబర్ 10న కేబినెట్లో చంద్రబాబు తీర్మానం చేయించారు. ఈ మేరకు ట్రాన్స్ట్రాయ్, సబ్ కాంట్రాక్టర్లు, పోలవరం ఈఎన్సీల పేరు మీద బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎస్క్రో అకౌంట్ను గత సర్కార్ తెరిపించింది. బిల్లులు చెల్లించేటప్పుడు ఎస్క్రో అకౌంట్లో జమ చేయాలి. పోలవరం ఈఎన్సీ సూచనల ప్రకారం వాటిని ఆయా సంస్థలకు బ్యాంకు విడుదల చేస్తుంది. ట్రాన్స్ట్రాయ్కి బిల్లులు వస్తాయని నాటి సీఎం చంద్రబాబు చెప్పడంతో నిబంధనలను పక్కన పెట్టి మరీ ఆ సంస్థకు రూ.300 కోట్ల రుణాన్ని ఇచ్చామని బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి బ్యాంకులను రాయపాటి దోచేయడంలో బాబు ప్రధాన పాత్ర పోషించారన్నది స్పష్టమవుతోంది. కేబినెట్ తీర్మానం తుంగలోకి.. ఎస్క్రో అకౌంట్ తెరిచిన కొద్ది రోజులకే దివాలా తీసిన ట్రాన్స్ట్రాయ్ 2018 అక్టోబర్ 10న ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)ని ఆశ్రయించింది. ట్రాన్స్ట్రాయ్కి ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తే బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటాయని, కమీషన్లు రావని పసిగట్టిన గత సర్కారు పెద్దలు నేరుగా ట్రాన్స్ట్రాయ్కే చెల్లింపులు జరపాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారిపై ఒత్తిడి తెచ్చారు. ట్రాన్స్ట్రాయ్కి రూ.2,362.22 కోట్లను చెల్లించగా కేవలం రూ.95 కోట్లను మాత్రమే ఎస్క్రో అకౌంట్ ద్వారా చెల్లించారు. రూ.2,267.22 కోట్లను నేరుగా ట్రాన్స్ట్రాయ్కే చెల్లించడం ద్వారా కేబినెట్ తీర్మానాన్ని ఉల్లంఘించారు. ఇందులో సింహభాగం చంద్రబాబు జేబులోకి చేరినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది కాదా సహకారం? ►నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ మాల్యాలను తలదన్నేలా బ్యాంకుల నుంచి రూ.7,926.01 కోట్లను రాయపాటి లూటీ చేయడంలో ప్రధాన సూత్రధారి ఎవరు? దివాళా తీసిన ట్రాన్స్ట్రాయ్ని పోలవరం కాంట్రాక్టు నుంచి తొలగించకుండా కొనసాగించడం ద్వారా ఈ లూటీకి చంద్రబాబు సహకరించలేదా? ►బ్యాంక్ ఆఫ్ బరోడా 2014లోనే ట్రాన్స్ట్రాయ్ రుణాన్ని నిరర్ధక ఆస్థి (ఎన్పీఏ)గా ప్రకటించినందున నిబంధనల ప్రకారం ఆ సంస్థకు మళ్లీ రుణం ఇవ్వకూడదు. కానీ ట్రాన్స్ట్రాయ్, జలవనరుల శాఖలతో అదే బ్యాంకులో ఎస్క్రో అకౌంట్ తెరిపించిన చంద్రబాబు దాన్ని హామీగా చూపి 2017లో కొత్తగా రూ.300 కోట్ల రుణం ఇప్పించడంలో ఆంతర్యం బ్యాంకులను లూటీ చేయడం కాదా? -
9 కంపెనీలు.. 9 బ్యాంకులు.. రూ.9వేల కోట్లు
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఆ నిధులు మళ్లించిన కేసులో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థపై సీబీఐ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇక విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.7వేల రూపాయల కోట్ల స్కాంకు తెరలేపిన రాయపాటి కంపెనీ.. తన వద్ద పనిచేసే సిబ్బంది పేర్లపై నకిలీ కంపెనీలు ఏర్పాటు చేశాడు. ఇక నిధులు దారి మళ్లించేందుకు ఈ కంపెనీలకు డైరెక్టర్లను సైతం నియమించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. (చదవండి: ‘అదే రాయపాటి సాంబశివరావుకు గౌరవం’) పద్మావతి, బాలాజీ, యూనిక్ ఎంటర్ప్రైజర్, రుత్విక్ అసోసియేట్ వంటి నకిలీ కంపెనీల పేరుతో రాయపాటి 7వేల కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడ్డాడు. 9 నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి కెనరా బ్యాంక్తోపాటు మరో 9 బ్యాంక్ల నుంచి.. 9వేల కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు తెలిసింది. ఈ క్రమంలో ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, సతీష్పై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
రాయపాటి.. చంద్రబాబు.. ఆర్థిక సంబంధాలపై కన్ను!
సాక్షి, అమరావతి/పట్నంబజార్/నగరంపాలెం (గుంటూరు): బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఆ నిధులు మళ్లించిన కేసులో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థపై సీబీఐ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. 2013లోనే తమ వద్ద రూ.300 కోట్ల రుణం తీసుకుని ట్రాన్స్ట్రాయ్ ఎగ్గొట్టిందంటూ కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు చేసిన ఫిర్యాదుపై సీబీఐ అధికారులు కూపీలాగుతున్నారు. అంతేకాక.. రాయపాటి సంస్థ మొత్తం రూ.8,836.45 కోట్ల రుణం తీసుకుని, ఎగ్గొట్టిందంటూ 18 బ్యాంకుల కన్సార్టియం చేసిన ఫిర్యాదుపై డిసెంబర్ 30, 2018న సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. ఆ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా శుక్రవారం రాయపాటి, ట్రాన్స్ట్రాయ్ ఎండీ శ్రీధర్, డైరెక్టర్లను సీబీఐ అధికారులు విచారించి.. వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు రుణాల వసూలుకు సహకరించాలని బ్యాంకర్ల విజ్ఞప్తికి స్పందించకపోవడం.. ఎస్క్రో అకౌంట్ హామీ ఇచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.300 కోట్ల రుణం ఇప్పించడం.. అంతటితో ఆగకుండా ఖజానా నుంచి రూ.144 కోట్లను స్పెషల్ ఇంప్రెస్ట్ అమౌంట్ రూపంలో దోచిపెట్టడం.. ఈ వ్యవహారంలో రాయపాటి, చంద్రబాబుకు ఉన్న ఆర్థిక సంబంధాలపై కూడా సీబీఐ ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిసింది. (చదవండి: ఇదేమి నీచ రాజకీయం! ) విదేశాలకు నిధుల మళ్లింపు నిబంధనల ప్రకారం కన్సార్టియం బ్యాంకుల నుంచే ఏ సంస్థ అయినా రుణం తీసుకోవాలి. కానీ.. ట్రాన్స్ట్రాయ్ మాత్రం కన్సార్టియం బ్యాంకుల కళ్లుగప్పి ఇతర బ్యాంకుల నుంచి రూ.2,267.22 కోట్ల రుణం తీసుకుంది. కన్సార్టియం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం రూ.8,836.45 కోట్లు, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.2,267.22 కోట్లలో సంబంధిత పనులకు కాకుండా ఇతర కార్యకలాపాలకు రూ.3,822 కోట్లను ట్రాన్స్ట్రాయ్ దారిమళి్లంచినట్లు ఈడీ ఇప్పటికే నిర్ధారించి కేసులు నమోదు చేసింది. సింగపూర్, రష్యా, ఉక్రెయిన్, మలేసియాల్లోని సంస్థలకు ఈ నిధులను మళ్లించినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. దీంతో ట్రాన్స్ట్రాయ్ నుంచి నిధులు మళ్లించిన సంస్థల ప్రమోటర్లు, డైరెక్టర్లపై ఇటు సీబీఐ.. అటు ఈడీ దృష్టిసారించాయి. ‘పోలవరం’తో బ్యాంకులకు టోకరా పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ను దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్.. వాటిని చూపి 2013 నుంచి 2018 వరకూ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. ట్రాన్స్ట్రాయ్కి 18 బ్యాంకుల కన్సార్టియం రూ.8,836.45 కోట్ల రుణం ఇచ్చింది. నిజానికి దివాలా తీసిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ పోలవరం పనులు చేయలేదని.. దాన్ని తొలగించాలని 2014 నుంచి 2016 వరకూ అనేకమార్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సూచించినా నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. అంతేకాక.. ట్రాన్స్ట్రాయ్ తీసుకున్న రుణాలు చెల్లించడంలేదని.. పోలవరం బిల్లులు చెల్లించే సమయంలో అప్పుల వసూలుకు సహకరించాలంటూ జూలై 31, 2015న బ్యాంకుల కన్సార్టియం విజ్ఞప్తినీ సీఎం హోదాలో చంద్రబాబు తోసిపుచ్చారు. దాంతో ట్రాన్స్ట్రాయ్ ఆ రుణాలను ఎగ్గొట్టింది. ‘ఎస్క్రో’ అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని అప్పటి టీడీపీ సర్కార్ హామీ ఇస్తేనే రూ.300 కోట్ల రుణం 2017లో ఇచ్చామని.. కానీ బిల్లులను ఎస్క్రో అకౌంట్ ద్వారా చెల్లించకపోవడంతో తమ వద్ద తీసుకున్న రుణాన్ని ట్రాన్స్ట్రాయ్ ఎగ్గొట్టిందని సీబీఐకి 2018లోనే బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై సీబీఐ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. (చదవండి: టీడీపీ మాజీ ఎంపీ.. రాయపాటిపై సీబీఐ దాడులు) -
సామూహిక లైంగిక దాడి జరిగింది: సీబీఐ
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హథ్రాస్ దళిత యువతి అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు యువకులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఆమెను చిత్రహింసలకు గురిచేసి మృతికి కారణమైన వారిపై, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, సామూహిక అత్యాచారం కింద అభియోగాలు నమోదు చేసింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు స్థానిక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కాగా ఆధిపత్య వర్గానికి చెందిన నలుగురు యువకులు బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆమె నాలుక కోసి, వెన్నుముక విరిచి అత్యంత పాశవికంగా దాడి చేశారు. (చదవండి: కాలేజీ క్లర్కుతో ఎఫైర్: 21 ఏళ్లుగా..) దీంతో ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కాగా తల్లితో కలిసి గడ్డి కోస్తున్న సమయంలో మెడకు దుపట్టా బిగించి లాక్కెళ్లి బాధితురాలిని చిత్ర హింసలకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక బాధితురాలి అత్యంత దయనీయ పరిస్థితిలో మరణించడం, మృతదేహానికి పోలీసులే అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించడం వంటి పరిణామాలు పలు అనుమానాలకు తావిచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించిన ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సెప్టెంబరు 30న యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఈ కేసు విచారణకై తొలుత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఆ తర్వాత సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణను అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తోంది. -
103 కిలోల బంగారం మాయం!
చెన్నై: తమిళనాడులో కేంద్ర దర్యాప్తు సంస్థ కస్టడీ నుంచి సుమారు రూ. 45 కోట్ల విలువైన బంగారం మాయవడం సంచలనం రేపుతోంది. 2012 నాటి కేసుకు సంబంధించిన 103 కిలోల పసిడి అదృశ్యమైన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు సీబీ-సీఐడీని ఆదేశించింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి నివేదిక సమర్పించాలని దేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులకు కేసును అప్పగిస్తే తమ ప్రతిష్ట దిగజారుతుందని సీబీఐ న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా.. జస్టిస్ పీఎన్ ప్రకాశ్ వారి అభ్యంతరాన్ని తోసిపుచ్చారు. ఈ సందర్భంగా.. ‘‘ పోలీసులు అందరూ నమ్మదగినవారే. సీబీఐకి ఏమీ ప్రత్యేకంగా కొమ్ములు లేవు కదా. అలా లోకల్ పోలీసులకు అని తోక మాత్రమే లేదు. సీబీఐకి ఇదొక అగ్నిపరీక్ష వంటిది. ఒకవేళ వాళ్లు సీతలా పవిత్రమైతే.. అవినీతి ఆరోపణల నుంచి విముక్తి పొంది తేజోవంతులై బయటకు వస్తారు. లేనిపక్షంలో దీని కారణంగా ఎదురయ్యే పరిణామాలు ఎదుర్కోకతప్పదు’’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. అసలు ఈ బంగారం ఎక్కడిది? చెన్నైలోని సురాణా కార్పొరేషన్ లిమిటెడ్పై నమోదైన కేసులో భాగంగా 2012లో సీబీఐ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆ కంపెనీ నుంచి సుమారు 400 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిస్కట్లతో పాటు ఆభరణాల రూపంలో ఉన్న పసిడిని కంపెనీ వాల్ట్లో లాక్ చేసి భద్రపరిచారు. ఈ తాళాలను స్థానిక సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించారు. అయితే 2013లో ఈ కంపెనీపై మరో కేసు నమోదు కాగా.. 2012 నాటి కేసులో బంగారం స్వాధీనం అవసరం లేదని, దాన్ని రెండో కేసుకు బదిలీ చేయాలని కోరింది. న్యాయస్థానం నుంచి అనుమతి లభించడంతో అప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్న బంగారం గురించి డాక్యుమెంట్లో మార్పులు చేసింది. అనేక పరిణామాల అనంతరం రెండేళ్ల తర్వాత అంటే 2015లో సరైన ఆధారాలు లేనందువల్ల సురాణా కంపెనీపై నమోదు చేసిన రెండో కేసును మూసివేస్తున్నట్లు సీబీఐ రిపోర్టు ఇచ్చింది. ఇందుకు సమ్మతించిన న్యాయస్థానం.. ఆ కంపెనీకి చెందిన బంగారాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్కు అప్పగించాలని ఆదేశించింది. దీంతో తమ బంగారం గురించి సురాణా కంపెనీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా.. సురాణా యాజమాన్యం అనేక బ్యాంకుల్లో రుణ ఎగవేతదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు చేరింది. ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో.. సీబీఐ ఆధీనంలో ఉన్న సురాణా కంపెనీ బంగారం మొత్తాన్ని, ఆ కంపెనీ రుణం ఎగవేసిన బ్యాంకులకు అందజేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో 2020 ఫిబ్రవరిలో బ్యాంకు అధికారుల సమక్షంలో సీబీఐ ఆ లాకర్లు తెరిచింది. అప్పుడు బంగారాన్ని తూకం వేయగా సుమారు 103 కిలోల మేర తక్కువగా ఉండటంతో అందరూ అవాక్కయ్యారు. ఈ విషయం హైకోర్టుకు చేరడంతో ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. -
మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుడు, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన అనుచరులకు అక్రమ మైనింగ్ ఉచ్చు మెల్లమెల్లగా బిగుస్తోంది. అక్రమ మైనింగ్పై నమోదు చేసిన కేసుల విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దూకుడు పెంచింది. గుంటూరులోని యరపతినేని నివాసం, ఆఫీస్తో పాటు, దాచేపల్లి, నడికుడి, పిడుగు రాళ్లకు చెందిన నిందితుల ఇళ్లు, హైదరాబాద్ సహా 25 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు గురువారం మెరుపు దాడులు చేపట్టారు. శాటిలైట్ సర్వే ద్వారా మైనింగ్ మాఫియా ఏ మేరకు సహజ వనరులను కొల్లగొట్టిందో అంచనా వేస్తామని వెల్లడించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీబీఐ 17 మందిపై కేసు నమోదు చేయగా నిందితుల్లో 13 మంది యరపతినేని బినామీలు, అనుచరులే. సీబీఐ లోతైన విచారణ దిశగా అడుగులు వేస్తుండటంతో మైనింగ్ మాఫియా, టీడీపీ నాయకుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో సాక్ష్యాలతో హైకోర్టు ముందుంచిన మాజీ ఎమ్మెల్సీ టీజీవీ అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో నడుస్తున్న అక్రమ మైనింగ్పై వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి. కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో పిల్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు 2018లో అక్రమ మైనింగ్పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటి ప్రభుత్వం తూతూ మంత్రంగా విచారణ చేపట్టి పిడుగురాళ్ళ మండలం సీతారామపురం, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా కేవలం 31 లక్షల మెట్రిక్ టన్నుల సున్నపురాయిని దోచేసినట్లుగా చూపారు. దీంతో తాము ఒడ్డున పడ్డామని మైనింగ్ మాఫియా ఊపిరి పీల్చుకుంది. అయితే అప్పట్లో అధికారులను మేనేజ్ చేసి దోచి, దాచేసిన లెక్కలు శాటిలైట్ సర్వే ద్వారా బయటపడనున్నాయి. టీజీవీ కృష్ణారెడ్డి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ద్వారా సేకరించిన శాటిలైట్ సర్వే ప్రకారం కేసానుపల్లి, నడికుడిల్లో 2015 జూలై నుంచి 2017 జనవరి వరకూ, సీతారామపురంలో 2015 సెప్టెంబర్ నుంచి 2017 మార్చి నాటికి 68.53 లక్షల మెట్రిక్ టన్నుల తెల్లరాయిని దోచేసినట్లు అంచనా. (అక్రమ కట్టడాలపై జీవీఎంసీ కొరడా) కోనంకి వద్ద అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతానికి సంబంధించిన శాటిలైట్ చిత్రం 2017 జూలై నెలలో ఈ సాక్ష్యాలను ఆయన హైకోర్టుకు సైతం అందించారు. 2016లో దాఖలు చేసిన పిల్లో 2014–15 మధ్య 34లక్షల మెట్రిక్ టన్నులు దోచేసినట్టు పేర్కొన్నారు. కోర్టులో దాఖలు చేసిన శాటిలైట్ సర్వే ఆధారాలకు, 2017 జనవరి నుంచి 2018 జూలైల మధ్య జరిగిన అక్రమ మైనింగ్ శాటిలైట్ అంచనాలు తోడైతే సుమారు 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల వరకూ లైమ్ స్టోన్ను మైనింగ్ మాఫియా దోచేసినట్టు తెలుస్తోంది. సీబీఐ శాటిలైట్ సర్వే అంచనాల ఆధారంగా చేపట్టే లోతైన విచారణలో మనీ లాండరింగ్, అక్రమ ఆస్తుల ఆర్జన, ఇతర ఆర్థిక నేరాలు బయటపడతాయేమోనని మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. వేల కోట్ల అక్రమ మైనింగ్ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర, అధికారుల సహకారం తదితర అంశాలు కూడా సీబీఐ వెలుగులోకి తీయాలని రాజకీయంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దాడులు... వేధింపులు గత ప్రభుత్వ హయాంలో యరపతినేని కనుసన్నల్లో నడిచిన అక్రమ మైనింగ్పై కోర్టులను ఆశ్రయించిన వైఎస్సార్సీపీ నాయకుడు కుందుర్తి గురువాచారిని చిత్రహింసలకు గురిచేశారు. మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిపై అక్రమ కేసులను బనాయించారు. అందరి పాత్రలూ వెలికితీయాలి పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో మాజీ ఎమ్మెల్యే యరపతినేని తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వేల కోట్ల సహజ సంపదను కొల్లగొట్టారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారుల పాత్ర ఉంది. సామాన్యుడు ట్రాక్టర్ మట్టి సొంత అవసరాల కోసం తీసుకెళ్తే కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టే అధికారులు రూ.వేల కోట్ల సహజ సంపదను దోచేస్తుంటే అప్పట్లో కళ్లు మూసుకుని కూర్చున్నారు. కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు. ఇలా అక్రమ మైనింగ్కు సహకరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. – టి.జి.వి. కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ -
యరపతినేని నివాసాల్లో సీబీఐ దాడులు
సాక్షి, అమరావతి/దాచేపల్లి(గురజాల): టీడీపీ పాలనలో అక్రమ మైనింగ్కు పాల్పడిన టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల నివాసాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) గురువారం మెరుపు దాడులు చేసింది. తెలంగాణలోని హైదరాబాద్తో పాటు గుంటూరు జిల్లా గురజాల, పిడుగురాళ్ల, నడికుడి, నారాయణపురం, కేసానుపల్లి తదితర 25 ప్రాంతాల్లోని నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. దీనికి సంబంధించిన వివరాలను సీబీఐ ఢిల్లీ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. తాము జరిపిన సోదాల్లో అనేక ఆధారాలతో పాటు పలు కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు, సామగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. 17 కేసులపై దర్యాప్తు.. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు సహా ఆయన అనుచరులు 17 మంది సాగించిన అక్రమ సున్నపురాయి తవ్వకాలపై నమోదైన 17 కేసులపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లోని కేసానుపల్లి, నడికుడి, కోనంకి గ్రామాల పరిధిలో నిందితులు అక్రమ మైనింగ్, క్వారీ తవ్వకాలు, విలువైన సున్నపురాయిని మోసపూరితంగా తరలించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. పెద్ద ఎత్తున సహజ వనరుల దోపిడీకి పాల్పడ్డారు. 2014 నుంచి 2018 వరకు అనేక లక్షల టన్నుల సున్నపురాయిని అక్రమంగా తవ్వేశారు. మొత్తంగా అనేక కోట్ల రూపాయల మేర విలువైన సహజ వనరులు దోచుకున్నారు. ఈ వ్యవహారంపై వేగంగా దర్యాపు చేస్తున్నట్లు సీబీఐ పేర్కొంది. శాటిలైట్ చిత్రాలతో నష్టం అంచనా.. అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. నష్టం అంచనా వేయడానికి దేశంలోనే తొలిసారిగా శాటిలైట్ చిత్రాలను ఉపయోగించుకుంటోంది. అక్రమ మైనింగ్కు ముందు, ఆ తర్వాత.. శాటిలైట్ చిత్రాలను తీసుకొని వాటిని సాంకేతిక పద్ధతుల్లో పరిశీలించి ఏ మేరకు అక్రమ మైనింగ్ చేశారనే దానిని సీబీఐ అంచనా వేస్తోంది. కాగా, సీబీఐ అధికారులు వచ్చారన్న విషయం తెలుసుకున్న కొందరు నిందితులు పరారైనట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవహారంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయమున్న వ్యక్తులు ఆందోళనకు గురవుతున్నట్లు తెలిసింది. -
యరపతినేని కేసు: కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గుంటూరు, హైదరాబాద్ సహా 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో కీలక డాక్యుమెంట్లు, నగదు, పలు వస్తువులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. కాగా లైమ్స్టోన్ అక్రమ మైనింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రకృతి వనరులను దోచుకున్నారనే అభియోగాలపై యరపతినేని శ్రీనివాసరావు సహా ఆయన ముఖ్య అనుచరులు 13 మందితో పాటు మొత్తం 17 మందిపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2014-18 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో కొనకి, కేసానుపల్లి, నడికుడి గ్రామాలలో కొనసాగిన అక్రమ మైనింగ్ పరిమాణాన్ని నిర్ధారించేందుకు సీబీఐ శాటిలైట్ ఇమేజ్లను విశ్లేషిస్తోంది.(చదవండి: ఉల్లం‘గనుల్లో బినామీలు’) నిందితుల్లో యరపతినేని అనుచరులు 1. నెల్లూరి శ్రీనివాసరావు (కేశానుపల్లి) 2. వేముల శ్రీనివాసరావు (నారాయణపురం, నడికుడి) 3. ఓర్సు వెంకటేశ్వరరావు (నడికుడి) 4.వేముల ఏడుకొండలు (నారాయణపురం, నడికుడి) 5. ఇర్ల వెంకటరావు (నారాయణపురం, నడికుడి) 6. బత్తుల నరసింహారావు (దాచేపల్లి) 7. మీనిగ అంజిబాబు (జనపాడు) 8. గ్రంధి అజయ్కుమార్ (పిడుగురాళ్ల) 9. జి.వెంకట శివకోటేశ్వరరావు (పిడుగురాళ్ల) 10. ఓర్సు ప్రకాశ్ (కొండమోడు–రాజుపాలెం) 11. వర్ల రత్నం (పిడుగురాళ్ల) 12. నంద్యాల నాగరాజు (కొండమోడు–రాజుపాలెం) 3. ఆలపాటి నాగేశ్వరరావు (ధరణికోట–అమరావతి) సహా మరో నలుగురు కేసులో నిందితులుగా ఉన్నారు. -
చిత్రహింసలు: రక్తపు మరకలు తుడవాలంటూ
చెన్నై: తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మద్రాస్ హైకోర్టుకు నివేదిక అందజేసింది. ‘‘రిజల్ట్స్ ఆఫ్ లాబొరేటరి అనాలిసిస్’’ పేరిట రూపొందించిన ఫోరెన్సిక్ రిపోర్టును మధురై ధర్మాసనానికి సమర్పించింది. సత్తాన్కులం లాకప్, టాయిలెట్, ఎస్హెచ్ఓ గదిలోని గోడలపై సేకరించిన రక్త నమూనాలు, మృతుల డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు వెల్లడించింది. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరి నిపుణులు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు పేర్కొంది. ఈ మేరకు..‘‘సత్తాన్కులం పోలీస్ స్టేషన్లో 19.06.2020 రోజున సాయంత్రం బెనిక్స్, జయరాజ్లను, నిందితులైన పోలీసు అధికారులు అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. (చదవండి: అందుకే వాళ్లిద్దరూ మృతి చెందారు: సీబీఐ) అదే రోజు రాత్రి మరోసారి తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలే వారి మృతికి కారణమయ్యాయి’’అని స్పష్టం చేసింది. ఇక బాధితులను తీవ్రంగా హింసించడమే గాకుండా, గాయాల వల్ల వారి శరీరం నుంచి కారిన రక్తం ఫ్లోర్పై పడితే, దానిని కూడా వారి దుస్తులతోనే శుభ్రం చేయాలంటూ అత్యంత పాశవికంగా ప్రవర్తించారని పేర్కొంది. ఇక కోవిల్పట్టి మెజిస్ట్రేట్ విచారణ, పోస్ట్మార్టం నివేదికలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించినట్లు చార్జిషీట్లో పొందుపరిచింది. (చదవండి: కస్టడీ డెత్: 9 మంది పోలీసులపై చార్జిషీట్) ఆరోజు ఏం జరిగింది? సీబీఐ నివేదికలోని వివరాల ప్రకారం.. జూన్ 19న ఎస్సై బాలక్రిష్ణన్, ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీధర్, కానిస్టేబుల్ ఎం ముత్తురాజాతో పాటు మరికొంత మంది పోలీసులు కామరాజార్ చౌక్ వద్ద జయరాజ్ను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బెనిక్స్ వెంటనే సత్తానుకులం పోలీస్ స్టేషన్కు బయల్దేరి వెళ్లారు. తన తండ్రిని ఎందుకు కొడుతున్నారంటూ ఎస్సై బాలక్రిష్ణన్ను నిలదీశారు. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు అతడిపై కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్ను బెనిక్స్ నెట్టివేయడంతో మరింతగా రెచ్చిపోయారు. పోలీసులపై చేయి ఎత్తినందుకు తగిన గుణపాఠం చెబుతామంటూ బెనిక్స్ను తీవ్రంగా కొట్టారు. అలా కొన్ని గంటలపాటు జయరాజ్, బెనిక్స్లను చిత్ర హింసలకు గురిచేశారు. ఆ తర్వాత వారిద్దరి దుస్తులు విప్పించి, మళ్లీ కొట్టడం ప్రారంభించారు. చెక్కబల్లపై వారిని పడుకోబెట్టి, కాళ్లూ, చేతులూ వెనక్కి మడిచి పెట్టి లాఠీలతో తీవ్రంగా కొట్టారు. తమను విడిచిపెట్టాలని ఎంతగా ప్రాధేయపడినా కనికరం చూపలేదు. తీవ్రమైన గాయాల వల్లే వీరిద్దరు మృతి చెందినట్లు పోస్ట్మార్టం నివేదిక కూడా స్పష్టం చేస్తోంది. కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సత్తాన్కుళానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టడంతో మరణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. ఈ క్రమంలో జూలై 7న సీబీఐ రెండు కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టింది. -
గీతం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్శిటీ భూకబ్జాలపై విచారణ జరపాలని సోమవారం ప్రజాసంఘాల జేఏసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. 'గత 40 ఏళ్లుగా గీతం యూనివర్సిటీ భూకబ్జాలకు పాల్పడింది. వారు ఆక్రమించిన భూముల్లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారు. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజు అధికంగా వసూలు చేసింది. భూకబ్జాలు, అవినీతికి పాల్పడిన గీతం యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి. చేసిన మోసాలను రాజకీయ పలుకుబడితో గీతం యూనివర్సిటీ పెద్దలు తప్పించుకుంటున్నారు. గీతం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. గీతం యూనివర్సిటీ అక్రమాలకు చంద్రబాబు మద్దతు తెలపడాన్ని ఖండిస్తున్నాం' అని ప్రజాసంఘాల జేఏసీ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. (ఆక్రమణలకు చరమ‘గీతం’) -
రఘురామకృష్ణంరాజు: సోదాలపై సీబీఐ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులను మోసగించిన వ్యవహారంపై ఎంపీ రఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలపై గురువారం సీబీఐ మీడియాకు ప్రెస్నోట్ విడుదల చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొంది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు తెలిపింది. నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. దీనిలో భాగంగానే హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. కంపెనీ కార్యాలయాలు, యజమాని నివాసాలు, ఇతర ప్రదేశాలపై సోదాలు జరిపినట్లు ప్రెస్నోట్లో పేర్కొంది. (రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు) -
రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు
సాక్షి, హైదరాబాద్ : నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై కేంద్ర దర్యాప్త సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. బ్యాంక్ లోన్ బకాయిలపై కేసు నమోదు చేసిన సీబీఐ గురువారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈనెల 6న హైదరాబాద్, ముంబై సహా 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. రఘురామకృష్ణంరాజు సహా 9 మందిపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టారు. ఇండ్-భారత్ కంపెనీతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేసింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. ఈ దాడుల్లో పలు కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఏప్రిల్ 30న బ్యాంక్ లోన్ బకాయిలు పడిన కేసులో సైతం హైదరాబాద్, భీమవరంలోని రఘురామకృష్ణంరాజు కంపెనీల్లో సోదాలు చేపట్టారు. వివిధ ప్రాజెక్ట్లకు సంబంధించి రూ.600 కోట్ల మేర ఆయన రుణాలు తీసుకున్నారు. ఇక ఇండ్-భారత్ పవర్ లిమిటెడ్కు సంబంధించి రూ.947 కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగ్గవేయగా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్ల నుంచి రూ.2655 కోట్ల మేర రఘురామకృష్ణంరాజు లోన్ తీసుకున్నారు. ఈ సోదాల్లో 11 నుంచి 14 సీబీఐ బృందాలు పాల్గొన్నట్టు సమాచారం. బ్యాంకులకు ఎగవేతపై రఘురామకృష్ణంపై సీబీఐ దాడులు ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా సీబీఐ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించింది. -
‘బొల్లినేని’ కేసు: కీలక ఆధారాలు సేకరించిన సీబీఐ
-
‘బొల్లినేని’ కేసులో సీబీఐ దూకుడు!
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ అవినీతి కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి బొల్లినేని శ్రీనివాసగాంధీకి వ్యతిరేకంగా పలు కీలక సాక్ష్యాలను సేకరించింది. ఈ సాంకేతిక ఆధారాల సాయంతో కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. జీఎస్టీ కమిషనర్ చిలుక సుధారాణి, సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాసగాంధీలు కలిసి ఓ వ్యాపారవేత్త వద్ద రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఫిర్యాదుపై సీబీఐ సెప్టెంబర్ 11న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసి అత్యంత కీలకమైన ఆడియో రికార్డులు, పలు ఫొటోలు సంపాదించింది. ఇందులో బొల్లినేని శ్రీనివాసగాంధీ, చిలుక సుధారాణి, బాధితుడు సత్యశ్రీధర్రెడ్డిల సంభాషణల రికార్డులున్నాయని తెలిసింది. వీరు రూ.10 లక్షల లంచం తీసుకుంటుండగా తీసిన పలు ఫొటోలు కూడా సీబీఐ సేకరించిందని సమాచారం. ఈ కాల్స్లో లంచం డిమాండ్ చేయడం, వాటిని ఎప్పుడు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలో సత్యశ్రీధర్రెడ్డికి సూచించిన వ్యవహారం మొత్తం రికార్డయింది. (చదవండి: స్వేచ్ఛ, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు) అసలేం జరిగిందంటే..? ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్, దాని అనుబంధ కంపెనీలు అక్రమమార్గంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను పొందాయంటూ జీఎస్టీలో కేసు నమోదైంది. కేసులో నింది తుడు జగన్నగారి సత్యశ్రీధర్రెడ్డి అరెస్టయి, మార్చి 29న విడుదలయ్యాడు. ఇదే కేసులో వ్యాపార భాగస్వామిగా ఉన్న అతని భార్య అరెస్టు కాకుండా, మొత్తం కేసును నీరుగార్చేందుకు హైదరాబాద్ జీఎస్టీ పన్ను ఎగవేత నిరోధక విభాగంలో డిప్యూటీ కమిషనర్గా ఉన్న చిలుక సుధారాణి, అదే విభాగంలో సూపరింటెండెంట్గా ఉన్న బొల్లినేని శ్రీనివాసగాంధీలు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధితుడు సత్యశ్రీధర్ కూడా అంగీకరించాడు. అడ్వాన్సుగా రూ.10 లక్షలు ఏప్రిల్ 15న చెల్లించాడు. మిగిలిన రూ.4.90 కోట్ల నగదుకు బదులుగా ఓపెన్ప్లాట్ల రూపంలో ఇవ్వాలని వారు షరతు విధించారు. ఈ లంచం వ్యవహారంలో సీబీఐకి ఉప్పందింది. దీంతో సుధారాణి, బొల్లినేని శ్రీనివాసగాంధీలతోపాటు లంచం విషయాన్ని తమకు చెప్పకుండా దాచినందుకు బాధితుడు సత్యశ్రీధర్రెడ్డిపైనా సీబీఐ కేసు నమోదు చేయడం గమనార్హం. ఏడాదికాలంలో బొల్లినేనిపై రెండో కేసు నమోదు కావడం గమనార్హం. గతేడాది బొల్లినేనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఎంపీ సుజనా చౌదరికి సంబంధించిన జీఎస్టీ ట్యాక్స్ ఎగవేత కేసును దర్యాప్తు చేసింది సుధారాణి, బొల్లినేని శ్రీనివాసగాంధీలే. (చదవండి: చంద్రబాబు ఆప్తుడు బొల్లినేనిపై మరో సీబీఐ కేసు) -
హథ్రాస్: న్యాయం చేసే ఉద్దేశముందా?
లక్నో: హథ్రాస్ ఘటనకు కారణమైనవారికి కఠినమైన శిక్ష తప్పదని చెప్పిన సీఎం యోగి ఆదిత్యనాథ్ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని అన్నారు. అయితే, ఇప్పటికే ఈ ఘటనపై సిట్ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ సీబీఐ విచారణ ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీబీఐ విచారణ పేరుతో కాలయాపన చేస్తారని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలనే ఉద్దేశముంటే జ్యుడీషియల్ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ నేతల పర్యటనలతో హథ్రాస్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఇదిలాఉండగా.. కేసును సీబీఐకి అప్పగిస్తూ సీఎం ప్రకటించినప్పటికీ సిట్ బృందం బాధిత కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతోపాటు ఘటన గురించి తెలిసిన ఇంకెవరైనా స్టేట్మెంట్ ఇవ్వొచ్చునని సిట్ పేర్కొంది. కాగా, గత గురువారం ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన సిట్ బృందం, గ్రామస్తులతో భేటీ అయింది. సీనియర్ ఐపీఎస్ అధికారి భగవాన్ స్వరూప్ సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. పొలం పనులకు వెళ్లొస్తున్న 19 ఏళ్ల దళిత యువతిపై అగ్రకులానికి చెందిన 14 మంది వ్యక్తులు అత్యాచారం చేసి, దారుణంగా హింసించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: దళిత యువతి వీడియో క్లిప్పై హల్చల్) తీవ్రంగా గాయపడిన యువతి ఢిల్లీలోని సఫ్దార్గంజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత మంగళవారం మృతి చెందింది. యువతి మరణవార్త బయటికి రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నిందితులకు కఠిన శిక్షలు పడాలని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలు తీశాయి. ఈక్రమంలోనే అదే రాత్రి 2.30 గంటలకు యువతి మృతదేహానికి ఉత్తర్ప్రదేశ్ పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక, రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించిన సంగతి తెలిసిందే. (చదవండి: రేప్ కేసుల్లో బాధితుల పేర్లు వెల్లడిస్తే..) -
సుశాంత్ కేసులో మరో మలుపు
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుని విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐపీసీలో సెక్షన్ 302ని (హత్య) చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ సీబీఐకి సమర్పించిన నివేదికలో సుశాంత్పై విష ప్రయోగం జరగలేదని చెప్పినప్పటికీ, ఆయనది ఆత్మహత్యా, హత్యా అన్నది తాము నిర్ధారించలేమని పేర్కొంది. సుశాంత్ని విష ప్రయోగం ద్వారా కాకుండా మరో రకంగా హత్య చేసి ఉండే అవకాశాలను కొట్టి పారేయలేమని పేర్కొంది. ఊపిరాడకే సుశాంత్ మరణించారని అందువల్ల అది కచ్చితంగా ఆత్మహత్య అని నిర్ధారించలేమని కూడా ఎయిమ్స్ వైద్యుడు ఒకరు చెప్పినట్టుగా ప్రచారంలో ఉంది. దీంతో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సెక్షన్ 302ని చేర్చాలని యోచిస్తున్నట్టుగా సీబీఐ వర్గాలు గురువారం వెల్లడించాయి. సుశాంత్ సింగ్ మృతి కేసులో భవిష్యత్ విచారణపై సీబీఐ త్వరలోనే ఒక కార్యాచరణ రూపొందించనుంది. జూన్ 14 ఉదయం సుశాంత్ సింగ్ శవమై కనిపించిన రోజు ఆయన అపార్ట్మెంట్లో ఉన్న దీపేష్ సావంత్ , సిద్ధార్థ్ పితాని ఇతర సిబ్బందిని మరోసారి విచారించడానికి సిద్ధమవుతోంది. ఈ కేసులో పితాని, సుశాంత్ కుక్ నీరజ్ కూడా సాక్షులుగా మారే అవకాశాలున్నాయి. 13 రాత్రి సుశాంత్, రియా కలుసుకున్నారా? సుశాంత్ మృతి చెందడానికి ముందు రోజు రాత్రి జూన్ 13న సుశాంత్, నటి రియా చక్రవర్తిని కలుసుకున్నారని ముంబైకి చెందిన బీజేపీ స్థానిక నాయకుడు వివేకానంద గుప్తా చెబుతున్నారు. వాళ్లిద్దరూ తెల్లవారు జామున 3 గంటల వరకు కలిసే ఉన్నారని, ఆ తర్వాత సుశాంత్ రియాను ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేశారని తనకి కొంత మంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారని వెల్లడించారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారుల వద్ద చెబుతానని వివేకానంద తెలిపారు. -
నిందితులంతా నిర్ధోషులే
-
బాబ్రీ విధ్వంసం: నిందితులంతా నిర్దోషులే
న్యూఢిల్లీ/లక్నో: దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటన ముందుస్తు పథకం ప్రకారం జరిగింది కాదని, పథకం ప్రకారం కూల్చివేసినట్టుగా ఆధారాలు లేవని పేర్కొంది. లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానంలోని కోర్టు రూమ్ నంబరు 18లో సీబీఐ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ తుది తీర్పును చదివి వినిపించారు. ఈ కేసులో 2 వేల పేజీల జడ్జిమెంట్ కాపీని రూపొందించారు. కాగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ కేసులో తుది తీర్పు తమకు అనుకూలంగా వెలువడటంతో బీజేపీ నాయకులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులకు భారీ ఊరట లభించింది. కాగా ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వినయ్ కతియార్, సాక్షిమహారాజ్, ధరమ్దాస్, రామ్ విలాస్ వేదాంతి, లల్లూ సింగ్, పవన్ పాండ్యా తదితరులు కోర్టుకు చేరుకున్నారు. ఇక మాజీ ఉపప్రధాని ఎల్కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, సతీశ్ ప్రధాన్, గోపాల్ దాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరయ్యారు. మిగతా ముద్దాయిలంతా లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానానికి చేరుకున్నారు. ఉమా భారతి కరోనా సోకగా, వయో భారం, అనారోగ్యం కారణంగా ఎల్కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి సైతం న్యాయస్థానం ఎదుట స్వయంగా హాజరుకాలేకపోయారు. అప్రమత్తమైన కేంద్రం.. దేశ వ్యాప్తంగా ప్రకంననలు రేపిన 1992 నాటి బాబ్రీ ఘటన తీర్పు నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. ఇక 1992 డిసెంబర్ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేసిన విషయం విదితమే. ఈ కేసును విచారించిన సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగుతుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించింది. కఠిన చర్యలు తప్పవు బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు వెలువడతున్న క్రమంలో హైదరాబాద్ పాతబస్తీ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్, ఎయిర్పోర్ట్లో అదనపు భద్రత ఏర్పాటు చేశారు. తీర్పు నేపథ్యంలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
బాబ్రీ విధ్వంసం కేసు: నేడే తుదితీర్పు
లక్నో: సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 1992 బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం నేడు తుదితీర్పు వెలువరించనుంది. తీర్పు వెలువరించే రోజు నాటికి జీవించి ఉన్న 32 మంది ముద్దాయిలు కూడా కోర్టు ఎదుట హాజరుకావాలని సీబీఐ జడ్జి ఎస్కే యాదవ్ 16వ తేదీన ఆదేశించారు. ముద్దాయిల్లో మాజీ ఉపప్రధాని ఎల్కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రులు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, వినయ్ కతియార్, సాధ్వి రితంబర ఉన్నారు. తీర్పునిచ్చే రోజు కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ కోర్టులో హాజరవుతారో లేదో తెలియరాలేదు. కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా బాబ్రీ విధ్వంసం జరిగింది. రాజస్తాన్ గవర్నర్గా పదవీ కాలం ముగియగానే గత సెప్టెంబర్ నుంచి, ఆయనపై విచారణ కొనసాగింది.(చదవండి: నూతన శకానికి నాందీ క్షణం) విచారణ జరుగుతుండగానే 16 మంది మరణం కాగా 1992 డిసెంబర్ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీబీఐ విచారించింది. ఈ క్రమంలో సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగుతుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించింది. -
9 మంది పోలీసులపై సీబీఐ చార్జిషీట్
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చార్జిషీట్ దాఖలు చేసింది. సత్తాన్కులం పోలీస్ స్టేషన్ హౌజ్ ఇన్చార్జ్ సహా తొమ్మిది మంది పోలీసుల పేర్లను అభియోగపత్రంలో చేర్చింది. ఎస్ శ్రీధర్, కె.బాలకృష్ణ, పి.రఘుగణేష్, ఏఎస్ మురుగన్, ఎ. సమదురై, ఏఎమ్ ముత్తురాజ, ఎస్. చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, ఎస్.వేల్ముత్తు తదితరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు మధురై కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేసింది. ఈ కేసులో అరెస్టైన స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దురై ఇటీవలే కరోనాతో మృతి చెందినట్లు సీబీఐ వెల్లడించింది. (చదవండి: ‘కొడుకు ఒంటిపై 13, తండ్రి శరీరంపై 17 గాయాలు’) కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సత్తాన్కుళానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టడంతో మరణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. ఈ క్రమంలో జూలై 7న సీబీఐ రెండు కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఇక కస్టడీ డెత్ కేసులో అరెస్టైన సత్తాన్కుళం పోలీసు స్టేషను అధికారులు ముత్తురాజ్ మరుగన్, థామస్ ఫ్రాన్సిస్ బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఇటీవల మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో న్యాయస్థానం ఎదుట హాజరైన సీబీఐ అధికారులు, పదునైన గాయాల కారణంగానే మృతి చెందినట్లు పేర్కొంది. పోస్ట్మార్టం నివేదిక ప్రకారం బెనిక్స్ ఒంటిపై 13 గాయాలు, జయరాజ్ శరీరంపై 17 గాయాలు ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. తాజాగా తొమ్మిది మంది పేర్లను చార్జిషీట్లో చేర్చింది. -
బొల్లినేనిపై మరో సీబీఐ కేసు
-
యూబీఐకి ‘ముసద్దీలాల్’ టోకరా!
సాక్షి, హైదరాబాద్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) నుంచి రుణం తీసుకుని మోసం చేసిన కేసులో హైదరాబాద్కు చెందిన ముసద్దీలాల్ జ్యువెలర్స్పై బెంగళూరు సీబీఐ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే శుక్రవా రం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్కి చేరుకున్న ఈడీ ప్రత్యేక బృందం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. బెంగళూరు సీబీఐ యూనిట్కు చెందిన బ్యాంక్ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ సెల్ (బీఎస్ఎఫ్సీ) గతేడాది జూలై 20న ముసద్దీలాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై కేసు నమోదు చేసింది. రుణాల రూపంలో పలు దఫాలుగా రూ.88 కోట్లు తీసుకుని మోసం చేసిన సంస్థ యజమానులు మోహన్లాల్ గుప్తా, ప్రశాంత్ గుప్తాలను కేసులో నిందితులుగా చేర్చారు. వీరు నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లు సీబీఐ తెలిపింది. ఇదే విధంగా మరో బ్యాంక్ నుంచి కూడా రుణం తీసుకొని, ఆ తర్వాత యూబీఐతో ఆర్థిక లావాదేవీలు చేయడానికి ఆసక్తి చూపుతూ బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది. ఇలా లావాదేవీలు ప్రారంభించి సదురు సంస్థ తన క్రెడిట్ లిమిట్ను రూ.55 కోట్లకు పెంచుకుంది. ఓ దశలో వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ (డబ్ల్యూసీఎల్), ఫండెడ్ ఇంట్రెస్ట్ టర్మ్ లోన్స్ (ఎఫ్ఐటీఎల్) కూడా తీసుకుంది. దీంతో యూబీఐ దగ్గర ముసద్దీలాల్ సంస్థ తీసుకున్న మొత్తం రుణం రూ.88 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని దారి మళ్లించి వాటికి సంబంధించిన వాయిదాలను కూడా చెల్లించకపోవడంతో సదరు బ్యాంక్ ముసద్దీలాల్ సంస్థ ఖాతాలను ఎన్పీఏల జాబితాలో చేర్చింది. రూ.48 కోట్లు ఎగవేత.. వన్ టైమ్ సెటిల్మెంట్ (ఎటీఎస్) స్కీమ్లో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ముసద్దీలాల్ యజమానులు రూ.40 కోట్లు చెల్లించినా.. మరో రూ.48 కోట్లు ఉద్దేశపూర్వకంగా ఎగవేశారని బ్యాంకు అధికారులు తేల్చారు. దీంతో బెంగళూరు సీబీఐ యూనిట్లో ఫిర్యాదు చేశారు. ఓటీఎస్లో భాగంగా కొంత మొత్తం చెల్లించినా.. రుణం తీసుకునేప్పుడు తప్పుడు పత్రాలు సమర్పించడం నేరమేనని సీబీఐ పేర్కొంది. ఈ స్కామ్లో భారీ మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానించిన సీబీఐ అధికారులు విష యాన్ని ఈడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో భాగంగా శుక్రవారంరాత్రి హైదరాబాద్కి వచ్చిన ఈడీ అధికారులు ముసద్దీలాల్ సంస్థలు, వాటి యజమానుల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 2017 డీమానిటైజేషన్ సమయంలో ముసద్దీలాల్ సంస్థ యజమానులు తమ వద్ద ఉన్న పాతనోట్లను మార్చడానికి వారి బంగారం వారే కొనుక్కుని రూ.100 కోట్ల స్కామ్కు పాల్పడినట్లు హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదైంది. -
చంద్రబాబు ఆప్తుడు బొల్లినేనిపై మరో సీబీఐ కేసు
సాక్షి, హైదరాబాద్ : జీఎస్టీ కమిషనరేట్లో ఉన్నతాధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం మరో కేసు నమోదు చేసింది. ఇన్ పుట్ క్రెడిట్ మంజూరుకు సంబంధించి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో హైదరాబాద్ జీఎస్టీ కమిషరేట్ పన్ను ఎగ వేత నిరోధక విభాగం డిప్యూటీ కమిషనర్ చిలుక సుధారాణి, సూపరిం టెండెంట్ బొల్లినేని శ్రీనివాసగాంధీ, ఓ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ సత్య శ్రీధర్రెడ్డిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తవ్వుతున్న క్రమంలోనే బొల్లినేనిపై తాజా కేసు నమోదైందని సమాచారం. అసలేం జరిగిందంటే.?: హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ పన్ను ఎగవేత విభాగంలోని అధికారులు లంచం తీసుకున్నట్లుగా గతేడాది అక్టోబర్ 31న సీబీఐకి సమాచారంఅందింది. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే దీనిపై సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్– దాని అనుబంధ సంస్థలు అక్రమంగా ఇన్ పుట్ క్రెడిట్ ట్యాక్స్ (ఐటీసీ) పొందాయన్న కేసును చిలుక సుధారాణి, బొల్లినేని శ్రీనివాసగాంధీ బృందం దర్యాప్తు చేసింది. కేసును నిందితులకు అనుకూలంగా మార్చేందుకు వీరు, మరికొందరు జీఎస్టీ అధికారులతో కలిసి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా 2019, ఏప్రిల్ 15న రూ.10 లక్షల నగదు తీసుకున్నారు. మిగిలిన మొత్తానికి భూములను కొనివ్వాలన్న ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ విషయంపై సీబీఐకిగానీ, ఇతర దర్యాప్తు సంస్థలకు గానీ ఫిర్యాదు చేయనందుకుగాను సత్య శ్రీధర్రెడ్డి పేరును కూడా సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. కాగా, మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడిగా పేరొందిన శ్రీనివాసగాంధీపై గతేడాది ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైన విషయం తెలిసిందే. అక్రమాస్తులు, మనీ ల్యాండరింగ్ ఆరోపణలు సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో (ఈడీ) పనిచేసినప్పుడు తన పోస్టును అడ్డం పెట్టుకుని, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు, సూచనల మేరకు ఎదుటి వారిపై విరుచుకుపడినట్లు ఆరోపణలున్న బొల్లినేని శ్రీనివాసగాంధీపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే సీబీఐ గత ఏడాది ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసింది. గత ఏడాది జూలై 8న గాంధీపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.200 కోట్ల విలువచేసే అక్రమాస్తుల్ని గుర్తించింది. ఈ కేసు ఆధారంగా ముందుకు వెళ్లిన ఈడీ శ్రీనివాసగాంధీపై అదే నెల 23న ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలు చేసింది. ఆయన భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపించింది. సీబీఐ నమోదు చేసిన కేసు, చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. 2010 నుంచి 2019 మధ్య శ్రీనివాస గాంధీ ఆస్తులు ఏకంగా 288 శాతం పెరిగాయి. చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తూ ఆయన చెప్పిన వారిని టార్గెట్ చేయడం, అనుకూలంగా వ్యవహరించమన్న వారిని విడిచిపెట్టడం చేస్తూ భారీగా ఆర్జించినట్లు గాంధీపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి వ్యవహారాలతో లబ్ధి పొందిన నేపథ్యంలోనే 2010లో రూ.21 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు.. 2019, జూన్ 26 నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3.74 కోట్లకు చేరాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.200 కోట్ల పైమాటే. చంద్రబాబుకు సన్నిహితుడన్న పేరు... చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉండి, ఆయన అండదండలతో గతంలో ఏ అధి కారి పని చేయని విధంగా 2004 నుంచి 2017 వరకు బొల్లినేని శ్రీనివాస గాంధీ ఈడీలోనే విధులు నిర్వర్తించారు. అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. అయినా చంద్రబాబు పైరవీల ఫలితంగా ఆయన్ను బషీర్బాగ్ జీఎస్టీ భవన్లో జీఎస్టీ ఎగవేత నిరోధక విభాగం సూపరింటెండెంట్ ఆఫీ సర్గా నియమించారు. ఆ విభాగం కేంద్రం గా చేసిన అవినీతిపై తాజాగా సీబీఐ మరో కేసు నమోదు చేసింది. గతంలో ఎవరూ పని చేయని విధంగా బొల్లినేని గాంధీ ఈడీలో సుదీర్ఘకాలం పని చేశారు. 1992లో సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో ఇన్స్పెక్టర్గా చేరిన బొల్లినేని శ్రీనివాస గాంధీ.. 2002లో సూపరింటెండెంట్గా పదోన్నతి పొందారు. 2003లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్లోకి డిప్యుటేషన్పై వెళ్లిన ఆయన ఏడాది పాటు పనిచేశారు. 2004లో ఈడీకి బదిలీపై వెళ్లిన గాంధీ గతంలో ఎన్నడూ లేని విధంగా 2017 వరకు ఎలాంటి బది లీలు లేకుండా ఈడీలోనే విధులు నిర్వర్తించారు. ఇలాంటి పోస్టుల్లో పని చేసి వచ్చిన వారికి జీఎస్టీలో ఫోకల్ పోస్టు ఇవ్వరు. అయితే దీనికి భిన్నంగా అందులోనూ గాంధీకి కీలక పోస్టు లభించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై జీఎస్టీ ఎగవేత కేసును సైతం పర్యవేక్షించిన గాంధీ ఆయనకు పూర్తి అనుకూలంగా వ్యవహరించారని, దీనికి బదులుగా భారీగా లబ్ధి పొందారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ సుజనా చౌదరి అరెస్టు కాలేదని తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల్లో పెద్దమొత్తంలో ఆస్తులు... గడిచిన పదేళ్లలో రూ.65 లక్షలు జీతంగా అందుకున్న శ్రీనివాస గాంధీ ఆయన కుమార్తె మెడికల్ సీటుకే రూ.70 లక్షలు కట్టారు. కూకట్పల్లి హైదర్నగర్లో ఇంటిని రూ.1.20 కోట్లతో నిర్మించారు. ఏపీలోని తుళ్లూరు, గుణదల, పెద్దపులిపాక, కన్నూరు, కంకిపాడు, పొద్దుటూరు, హైదరాబాద్లోని కొండాపూర్, మదీనాగూడ, కూకట్పల్లిలలో, స్థిరాస్తులు కూడగట్టిన గాంధీ భారీగా మనీ ల్యాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ గత ఏడాది నమోదు చేసిన తన ఈసీఐఆర్లో ఆరోపించింది. త్వరలో ఈ కేసుకు సంబంధించి గాంధీ ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా, శ్రీనివాసగాంధీపై సీబీఐ రెండు రోజుల క్రితం మరో కేసు నమోదు చేసింది. ఇన్ పుట్ క్రెడిట్ మంజూరుకు సంబంధించి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో బొల్లినేనితో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
బొల్లినేని శ్రీనివాస గాంధీపై సీబీఐ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ కమిషనరేట్లో అవినీతి అధికారులను సీబీఐ పట్టుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీకి సంబధించి జీఎస్టీ అవకతవకలను సరి చేయడానికి తెలంగాణ జీఎస్టీ కమిషనరేట్ ఉద్యోగులు సీహెచ్ సుధారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ బొల్లినేని శ్రీనివాస గాంధీ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అందుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. బొల్లినేని శ్రీనివాస గాంధీ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. 1992 ఏప్రిల్ 27న సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇన్స్పెక్టర్గా చేరారు. 2002లో సూపరింటెండెంట్గా పదోన్నతి పొంది హైదరాబాద్ కమిషనరేట్లో పోస్టింగ్ పొందారు. 2003లో డిప్యుటేషన్పై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్)కి వెళ్లారు. 2004లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వెళ్లి, 2017 వరకు అక్కడే ఉన్నారు. ఆ తరువాత 2017లో జీఎస్టీకి బదిలీ అయ్యారు. గాంధీ దాదాపు 13ఏళ్ల పాటు ఈడీలో పనిచేశారు. ఈ సమయంలో ఆయన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మారారు. (ఎల్లో మీడియా దుష్ప్రచారంపై రజత్ భార్గవ్ స్పష్టత) తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ పూర్తిస్థాయిలో పని చేశారు. కేంద్ర మాజీమంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనాచౌదరికి చెందిన గ్రూపు కంపెనీల మనీలాండరింగ్పై వచ్చిన ఫిర్యాదులను గాంధీ ఉద్దేశ్యపూర్వకంగా బుట్ట దాఖలు చేశారు. పూర్తి ఆధారాలున్నా కూడా సుజనా కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. ఫైళ్లను తారుమారు చేశారని కేంద్ర ఆర్థిక శాఖకు గతంలోనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడిన నేపథ్యంలోనే గాంధీ ఇంత భారీస్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. బాబుకు అనుకూలంగా వ్యవహరించడంతో అమరావతి ప్రాంతంలో భూమిని కూడా కట్టబెట్టినట్లు సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. -
రియా.. రియా.. అంటూ అడ్డగించారు!
విచారణ సంస్థలు ‘చెప్పిస్తాయి’!... మీడియా చెప్పుకోనిస్తుంది..! అవునా కాదా అన్నది.. చెప్పించడం..! అసలేమైందన్నది.. చెప్పుకోనివ్వడం. మీడియా ఎప్పుడూ ఉన్నట్లే.. రియా విషయంలోనూ ఉంది. అయితే ఎప్పుడూ లేనంతగా.. విమర్శలను ఎదుర్కొంటోంది! సుశాంత్ పెట్టి వెళ్లిన అగ్నిపరీక్ష.. రియాకా.. మీడియాకా..?! ఊపిరి అందనిది ఎవరికి? జూలై 1 రియా చక్రవర్తి పుట్టిన రోజు. స్నేహితుడు సుశాంత్ సింగ్ ఉండి ఉంటే బహుశా ఆమె అతడితో తన ‘రెండో’ పుట్టిన రోజును జరుపుకుని ఉండేవారు. ఏడాది క్రితమే ఏప్రిల్లో సుశాంత్కి ఆమె పరిచయం. లేదా ఆమెకు సుశాంత్ పరిచయం. డిసెంబర్ నాటికి ఈ రెండు పక్షులు ఒక గూటికి చేరాయి. ఆ గూడు ముంబైలోని బాంద్రాలో సుశాంత్ ఉంటున్నది. అందులోనే మగపక్షి జూన్ 14 న సీలింగ్ ఫ్యాన్కి నిర్జీవంగా వేలాడుతూ కనిపించింది. అప్పటికి ఆరు రోజులుగా ఆ గూడులో జంటపక్షి కనిపించడం లేదు. రియాపై తొలి సందేహం! (చదవండి: సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్నా..) తొలి సందేహం మొదట ప్రియమైన వారి మీదనే వస్తుంది. రియాతోపాటు ఈ కేసులో డబ్బు, డ్రగ్స్, వాట్సాప్ కీలకంగా ఉన్నాయి. వాట్సాప్ చాట్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పరిశీలిస్తోంది. డబ్బు ‘ఫ్లో’ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిశోధిస్తోంది. డ్రగ్స్ వేర్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) తవ్వితీస్తోంది. ప్రతి దాంట్లోనూ రియా కామన్. సీబీఐ, ఈడీ, ఎన్.సి.బి. ఆమెను ఇంటరాగేట్ చేస్తున్నాయి. అయితే ఈ మూడింటిని మించి ఆమెపై విచారణ జరుపుతున్న అనధికార శక్తి ఒకటి ఉంది. మీడియా! చూసే ఉంటారు.. ఆది, సోమవారాల్లో విచారణకు హాజరయ్యేందుకు ఎన్.సి.బి. కార్యాలయానికి వెళ్తున్న, వెళ్లి వస్తున్న రియాను మూకుమ్మడిగా అడ్డగించి.. ‘రియా, రియా.. రియా..’ అంటూ మీద పడుతూ మీడియా ప్రతినిధులు తనని ఎంత అసౌకర్యానికి గురి చేశారో! అది వారి డ్యూటీలో భాగమే అవచ్చు. రాబట్టి, బయటపెట్టడం. అయితే అది డ్యూటీ చేస్తున్నట్లుగా లేదు. లాఠీ ఛార్జి చేస్తున్నట్లుగా ఉంది. రియాను ఎవరూ సమర్థించడం లేదు. అంతమాత్రాన మీడియా ఆమెను ఎలా ప్రశ్నించినా అంగీకారం అవుతుందా?! ‘‘సీబీఐ గానీ, ఈడీ గానీ, ఎన్.సి.బి. గానీ రియాను వెంటాడటం లేదు, వేటాడటం లేదు. మీడియా ఒక్కటే ఆ పని చేస్తోంది. విచ్–హంట్ చేస్తోంది. అరెస్టుకు రియా సిద్ధంగానే ఉన్నారు. ప్రేమించినందుకు ఫలితం ఇదే కనుకైతే ఆ ఫలితాన్ని అనుభవించకుండా పారిపోవాలని ఆమె అనుకోవడం లేదు. ముందస్తు బెయిలు ఇవ్వమని ఒక్క కోర్టును కూడా రియా ఇప్పటివరకు అభ్యర్థించలేదు’’ అని రియా లాయర్ మీడియా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘విచారణ సంస్థలకు ఏమీ మిగలకుండా తనే మొత్తం విచారణ జరిపి రియాను దోషిగా తేల్చేసింది మీడియా..’’ అని సుప్రీంకోర్టు న్యాయవాది మీనాక్షీ బీబీసీతో అనడం కూడా మీడియా వహించవలసిన పాత్రను గుర్తు చేయడమే. ‘‘కంగ్రాచ్యులేషన్స్ ఇండియా. నా కొడుకును అరెస్ట్ చేశావు. నా కూతుర్నీ అరెస్టు చేస్తావు. ఒక మధ్యతరగతి కుటుంబాన్ని చక్కగా కూలగొట్టేశావ్. ఏమైనా.. న్యాయం కోసం ఏదైనా జరగాల్సిందే. జై హింద్’’ అని రియ తండ్రి ఆవేదన చెందారు. రిటైర్డ్ లెఫ్ట్నెంట్ కల్నల్ ఆయన. ఇండియా అంటే మీడియానే! మీడియా ఏం చూపిస్తోందో అదే కదా మనం చూసే ఇండియా. విస్తరిస్తున్న కరోనా, ‘హద్దు’ మీరుతున్న చైనా, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ.. ఈ ఐదు నెలలుగా మన ఇండియా. ఇప్పుడు రియా కూడా! అభిమాన నటుల అర్ధంతర మరణం హృదయాన్ని కలచి వేస్తుంది. అర్ధంతర అనుమానాస్పద మరణమైతే సందేహ జ్వాలల్ని రేపుతుంది. ఆ జ్వాలలు ఇప్పుడు రియాను చుట్టుముట్టాయి. వాటిల్లో ఆమె కెరీర్ దగ్ధం అయిపోవడమో, సుశాంత్ పెట్టి వెళ్లిపోయిన అగ్నిపరీక్ష పాస్ అయి బయటికి రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఈలోపే మీడియా.. ఇన్విజిలేటర్గా, స్క్వాడ్గా, ఎవాల్యుయేటర్గా అన్నీ తానే అవడంతో పాటు, క్వొశ్చన్ పేపర్ను కూడా తనే సెట్ చేసి ఇస్తోందన్న ఒక విమర్శ అయితే ఉంది. తూనీగ తూనీగ టీవీ షోల నుంచి సినిమాల్లోకి వచ్చారు రియా. ఆమె తొలి చిత్రం తెలుగులో వచ్చిన ‘తూనీగ తూనీగ’ (2012). తర్వాత బాలీవుడ్లో ఆరు చిత్రాల్లో నటించారు. ‘జలేబీ’ (2018) లో చక్కటి నటనను ప్రదర్శించారు. ‘చెహ్రే’ అని ఇంకో సినిమా విడుదల కావలసి ఉంది. -
అందుకే వాళ్లిద్దరూ మృతి చెందారు: సీబీఐ
చెన్నై: తమిళనాట ప్రకంపనలు రేపిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్ కేసులో సీబీఐ కోర్టుకు కీలక విషయాలు వెల్లడించింది. సత్తాన్కుళంకు చెందిన జయరాజ్, బెనిక్స్ పదునైన గాయాల కారణంగానే మృతి చెందినట్లు పేర్కొంది. పోస్ట్మార్టం నివేదిక ప్రకారం బెనిక్స్ ఒంటిపై 13 గాయాలు, జయరాజ్ శరీరంపై 17 గాయాలు ఉన్నట్లు పేర్కొంది. కాగా కస్టడీ డెత్ కేసులో అరెస్టైన సత్తాన్కుళం పోలీసు స్టేషను అధికారులు ముత్తురాజ్ మరుగన్, థామస్ ఫ్రాన్సిస్ బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఇటీవల మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ను ఆశ్రయించారు. (చదవండి: కస్టడీ డెత్ కేసు: కరోనాతో ఎస్ఎస్ఐ మృతి) ఈ సందర్భంగా.. తగిన ఆధారాలతో కోర్టు ముందు హాజరైన సీబీఐ అధికారి.. విచారణలో భాగంగా మురుగన్, థామస్ జయరాజ్, బెనిక్స్లను తీవ్రంగా కొట్టినట్లు ఇద్దరు మహిళా హెడ్ కానిస్టేబుళ్లు వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 38 మందిని విచారించామని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు తండ్రీకొడుకులు చిత్రహింసలకు గురిచేసినట్లు తేలిందన్నారు. లోతైన గాయాల కారణంగానే వారిద్దరు మృతి చెందినట్లు పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైందని కోర్టుకు తెలిపారు. ఇక కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఎస్ఐ పాల్దురై ఇటీవల కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.(చదవండి:రాత్రంతా చిత్ర హింసలు.. రక్తపు మరకలు) కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సత్తాన్కుళానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టడంతో మరణించిన విషయం విదితమే. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కారు అభ్యర్థన మేరకు ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించేందుకు అనుమతినిచ్చింది. దీంతో విచారణ వేగవంతం చేసిన దర్యాప్తు సంస్థ.. కస్డడీ డెత్ కేసులో సత్తాన్కుళం పోలీస్ స్టేషనుకు చెందిన 10 మంది పోలీసు అధికారులను అరెస్టు చేసింది. -
సుశాంత్ కేసు: మనవడికి పవార్ మందలింపు
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బిహార్, మహారాష్ట్రల మధ్య వివాదాలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సుశాంత్ రాజ్పుత్ మృతి దర్యాప్తుపై స్పందించారు. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులకు మొదటి అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శరద్ పవార్ మనవడు పార్థ్ పవార్(అజిత్ పవార్ కుమారుడు) కూడా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై పవార్ స్పందించారు. ఇవి పరిణితి లేని వ్యాఖ్యలు అని.. వాటిని తాము సీరియస్గా తీసుకోవడం లేదని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని మనవడిని బహిరంగంగా మందలించారు పవార్. (బాంద్రా డీసీపీ- రియా ఫోన్ కాల్స్) సుశాంత్ మృతిపై ముంబై పోలీసుల దర్యాప్తు సరిగా సాగడం లేదని.. వారి మీద తమకు నమ్మకం లేదని సుశాంత్ కుటుంబ సభ్యులు బిహార్ ముఖ్యమంత్రిని కోరిన సంగతి తెలిసిందే. దాంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు నితీష్ కుమార్. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బిహార్ సీఎం ఇలా చేశారని.. శివసేన ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర పోలీసులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారు నాకు గత 50 ఏళ్ల నుంచి తెలుసు. వారి మీద పూర్తి నమ్మకం ఉంది. ఆరోపణలను నేను పట్టించుకోను. ముందు వారిని లోతుగా దర్యాప్తు చేయనిద్దాం. తర్వాత కేసును సీబీఐకి లేదా ఇతర ఏజెన్సీలకు అప్పగించినా మేము వ్యతిరేకించం’ అన్నారు పవార్. (సీబీఐ దర్యాప్తు: రియా స్పందన) ఈ కేసులో రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉన్నట్లు వస్తోన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. అసలు ఆదిత్య పేరును ఇందులోకి ఎందుకు లాగుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు పవార్. ఆదిత్య పేరును బీజేపీనే వివాదంలోకి లాగిందని ఆయన ఆరోపించారు. ‘సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుతో ఆదిత్య ఠాక్రేకు ఏం సంబంధం ఉంది. రాష్ట్రంలో మా మద్దతుతో శివసేన అధికారంలోకి రావడాన్ని ప్రతిపక్షాలు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాయి. అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయి’ అని సీనియర్ సేన నాయకుడు సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. (బాలీవుడ్తో సంబంధాలు నిజమే: ఆదిత్య ఠాక్రే) -
సుశాంత్ కేసు: అసలు ఎవరీ శ్రుతి మోదీ
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇప్పటికే సుశాంత్ కేసులో బిహార్ ప్రభుత్వం, కేంద్రం. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించామని సుప్రీంకోర్టుకు తెలపడంతో సర్వోన్నత న్యాయస్థానం సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. దీంతో ఈ కేసులోని మిస్టరీని ఛేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సుశాంత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరుగురిని నిందితులుగా చేర్చుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రియా చక్రవర్తిని ఏ1 నిందితురాలుగా ప్రకటించింది. ఆమెతో పాటు ఈ కేసులో ఏ2గా రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, ఏ3గా తల్లి సంధ్య చక్రవర్తి, ఏ4గా సోదరుడు షోవిక్ చక్రవర్తి, ఏ5గా సుశాంత్ ఇంటి మేనేజరు శామ్యూల్ మిరిండా, ఏ6గా సుశాంత్ బిజినెస్ మాజీ మేనేజరు శ్రుతి మోదీతో పాటు పలువురును ఈ కేసులో నిందితులుగా చేర్చింది. (సీబీఐ దర్యాప్తు: రియా స్పందన) కాగా ఈ కేసును సుశాంత్ కుటుంబం బీహార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయగా, తాజాగా ఈ రోజు(శుక్రవారం) తమ ఎదుట హాజరు అవ్వాలని సుషాంత్ మాజీ మేనేజర్ శ్రుతికి ఈడీ సమన్లు జారీ చేసింది. అలాగే రేపటిలోగా సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథాని కూడా హాజరు కావాలని ఈడీ పేర్కొంది. ఇదిలా ఉండగా ఎఫ్ఐఆర్లో కొత్తగా శ్రుతి మోదీ పేరు వినిపించడంతో అసలు ఈ శ్రుతి ఎవరే ప్రశ్న ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మెదులుతోంది. (సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ ప్రారంభం) సుశాంత్, రియా ఇద్దరికి బాగా తెలిసిన వ్యక్తి. శ్రుతి మోదీ.. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తికి మాజీ మేనేజర్ అని తెలుస్తోంది. అలాగే ఈమె సుశాంత్ మాజీ బిజినెస్ మేనేజర్ అని వెల్లడైంది. సుశాంత్ మరణంపై దర్యాప్తులో భాగంగా ముంబై పోలీసులు శ్రుతి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. శుత్రి ముంబై పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. ఆమె జూలై 2019 నుంచి 2020 ఫిబ్రవరి వరకు సుశాంత్తో కలిసి పనిచేసినట్లు తెలిపింది. సుశాంత్ ఆర్థికంగా ఉన్నవాడని, బాంద్రాలోని తన ఇంటి అద్దె సుమారు రూ. 4.5 లక్షలతోపాటు నెలకు దాదాపు 10 లక్షలు ఖర్చు చేసేవారని శ్రుతి ముంబై పోలీసులకు తెలిపింది. (ఈడీ దర్యాప్తు: షాకిస్తున్న రియా ఆస్తుల లిస్ట్) -
సీబీఐ దర్యాప్తు: రియా స్పందన
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు విచారణకై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రంగంలోకి దిగడం పట్ల అతడి ప్రేయసిగా ప్రచారంలో ఉన్న రియా చక్రవర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమె.. సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు రాకముందే సీబీఐ విచారణ ప్రారంభించడం చట్ట విరుద్ధమంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘పూర్తిగా చట్టవిరుద్ధం. న్యాయ సూత్రాలకు అతీతం. దేశ సమాఖ్య స్పూర్తిపై ప్రభావం చూపుతుంది’’అని పేర్కొన్నారు. కాగా జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని బాంద్రాలో గల నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే.(జూన్ 8 వరకు సుశాంత్తోనే ఉన్నా: రియా) ఈ క్రమంలో అనేక పరిణామాల అనంతరం సుశాంత్తో సహ జీవనం చేసిన రియా చక్రవర్తే అతడిని ఆత్మహత్యకు పురిగొల్పిందని, డబ్బు తీసుకుని మోసం చేసిందంటూ అతడి తండ్రి కేకే సింగ్ బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఇందులో భాగంగా సుశాంత్ సొంత రాష్ట్రమైన బిహార్( ప్రభుత్వం) ఈ కేసులో సీబీఐ విచారణ కోరడంతో కేంద్రం ఇందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపిన సీబీఐ.. సుశాంత్ కేసులో రియాతో పాటు మరో ఐదుగురి(ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, షోయిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరంద, శ్రుతి మోదీ) పేర్లను ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. ఇక ఈ విషయంపై స్పందించిన రియా.. బిహార్ పోలీసుల నుంచి ఈ కేసును ముంబై పోలీసులకు అప్పగించాలని తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై తీర్పు వెలువడక ముందే సీబీఐ విచారణ మొదలుపెట్టడం సరికాదని పేర్కొన్నారు. (రియా పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ) పిటిషన్లో రియా ఏం చెప్పిందంటే.. తన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్న నేపథ్యంలో బిహార్ పోలీసుల నుంచి కేసును ముంబై పోలీసులకు అప్పగించాలని కోరిన సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన రియా.. గత ఏడాది కాలంగా తామిద్దరం సహజీవనం చేస్తున్నామని కోర్టు తెలిపారు. జూన్ 8న సుశాంత్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. డిప్రెషన్తో బాధ పడుతున్న సుశాంత్.. దానిని అధిగమించేందుకు మందులు వాడేవాడని.. ఈ క్రమంలో జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అప్పటి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియుడి మరణంతో కుంగిపోయిన తనను కొంత మంది అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు. నేను సుశాంత్ గర్ల్ఫ్రెండ్.. సీబీఐ దర్యాప్తు కావాలి ఇక రియా గతంలో ‘సుశాంత్సింగ్ రాజ్పుత్ మరణంపై సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాప్తునకు ఆదేశించాలి’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సోషల్ మీడియా వేదికగా కోరిన విషయం తెలిసిందే. ‘‘నేను సుశాంత్ గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి. నాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయాన్ని విశ్వసిస్తాను. సుశాంత్ మృతిపై సీబీఐ పరిశోధన జరిపించాలని నేను మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను’’అని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రస్తుతం ఓవైపు తన ఆస్తులపై ఈడీ ఆరా తీయడం, మరో వైపు సీబీఐ విచారణ వేగవంతం చేయడంతో ఆమె స్వరం మారిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
చంద్రన్న గోల్మాల్పై సీబీఐ
సాక్షి, అమరావతి : టీడీపీ సర్కార్ హయాంలో ఫైబర్ గ్రిడ్, చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక పథకాల్లో రూ.వందల కోట్లలో అవినీతి జరిగినట్లు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించింది. ఈ అక్రమాలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం సచి వాలయంలో సమావేశమైన మంత్రివర్గం దీనిపై క్షుణ్నంగా చర్చించింది. అనంతరం మంత్రివర్గం తీర్మానం మేరకు ఈ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణ కేంద్రంగా సాగిన ఈ అవినీతి వ్యవహారంలో విస్తుగొలిపే వాస్తవాలు మంత్రివర్గ ఉపసంఘం విచా రణలో వెలుగు చూశాయి. ఈవీఎంల ట్యాంపరింగ్, చోరీ కేసులో నిందితుడైన వేమూరు హరి కృష్ణకు చెందిన బ్లాక్లిస్ట్లోని టెరాసాఫ్ట్కు గత ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ గ్రిడ్ పనులను కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పాత్ర కూడా సీబీఐ దర్యాప్తు సంస్థ విచారణలో వెలుగు చూసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ ఫైబర్ గ్రిడ్ కథ... ► గ్రామీణులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కేంద్రం ఫైబర్ నెట్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటర్నెట్తోపాటు టీవీ చానెళ్లను ప్రసారం చేయడం కోసం కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం(సీఎస్ఎస్) ఫైబర్ నెట్ నిధులతో టీడీపీ సర్కార్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టింది. ► ఏరియల్ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ మొదటి దశలో భాగంగా ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ పనులకు 2015 జూలై 7న గత సర్కారు హయాంలో రూ.329 కోట్ల అంచనా వ్యయంతో ఏపీఎస్ఎఫ్ఎల్ (ఆంధ్రపదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ► ఈ టెండర్లలో నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. హారిజోన్ బ్రాడ్క్రాస్ట్ ఎల్ఎల్పీ, సిగ్నమ్ డిజిటల్ నెట్తో టెరాసాఫ్ట్ కన్సార్టియంగా ఏర్పడి రూ.320.88 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. ► టెండర్ నిబంధనలు 15 ఏ (1), 15 బీ (5) ప్రకారం హారిజోన్ సంస్థకు టెండర్లో పాల్గొనే అర్హత లేదు. సిగ్నమ్ డిజిటల్ నెట్ దాఖలు చేసిన అనుభవ ధ్రువీకరణ పత్రం కూడా నకిలీది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఈ–పాస్ యంత్రాల సరఫరాలో అక్రమాలకు పాల్పడిన టెరాసాఫ్ట్ను 2015 మే 11న ఏపీటీఎస్(ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) బ్లాక్ లిస్ట్లో పెట్టింది. టీడీపీ సర్కారు హయాంలో జరిగిన అక్రమాలపై నివేదికను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఎల్ –1ని కాదని టెరాసాఫ్ట్కు.. ► నిబంధనల ప్రకారం బ్లాక్ లిస్ట్లో ఉన్న సంస్థకు టెండర్లలో బిడ్ దాఖలు చేసేందుకు అర్హత ఉండదు. కానీ ఈఎంవీ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)ల చోరీ కేసులో నిందితుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ బిడ్ను ఆమోదించాలని టీడీపీ సర్కార్ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అంతటితో ఆగకుండా తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన ఎల్–1ను కాదని అధిక ధరక బిడ్ దాఖలు చేసిన టెరాసాఫ్ట్కు ఫైబర్ గ్రిడ్ దక్కేలా చక్రం తిప్పారు. అనుమతి లేదు...రూ.558.77 కోట్లు అదనం ► భారత్ బ్రాండ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్) గిగాబైట్ పాసివ్ ఆప్టికల్ నెట్వర్క్ (జీపీవోఎన్) సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ నెట్ రెండో దశను అమలు చేయాలని ఆదేశించింది. అయితే ఏపీఎస్ఎఫ్ఎల్ మాత్రం ఐఎంపీఎల్ఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో పనులు చేపట్టింది. జీపీవోన్తో పనులు చేపడితే రూ.851.23 కోట్లు వ్యయం అవుతుందని బీబీఎన్ఎల్ తొలుత అంచనా వేసింది. ఆ తర్వాత దాన్ని రూ.907.94 కోట్లకు సవరించింది. కానీ ఏపీఎస్ఎఫ్ఎల్ మాత్రం ఐఎంపీఎల్ఎస్తో పనులు చేసేందుకు రూ.1,410 కోట్లకు ఎల్ అండ్ టీ కన్సార్టియంకు అప్పగించింది. అంటే ఇది బీబీఎన్ఎల్ నిర్థారించిన మొత్తం కంటే రూ.558.77 కోట్లు అధికం. కేంద్ర ప్రభుత్వం నుంచి గత సర్కార్ దీనికి అనుమతి కూడా తీసుకోలేదు. నాసిరకం సెట్టాప్ బాక్సులు.. ► ఏపీ ఏరియల్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు తొలి దశ అమలును పర్యవేక్షించేందుకు పీఎంఏ (ప్రాజెక్టు మానిటరింగ్ ఏజెన్సీ) ఎంపికలోనూ టీడీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడింది. ► సెట్ బాక్స్ల టెండర్లలో 8 సంస్థలు పాల్గొంటే తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించకుండా నాలుగు సంస్థలకు పనులు విభజించి అప్పగించారు. కానీ సెట్టాప్ బాక్స్లను కేవలం టెరాసాఫ్ట్ నుంచే కొనుగోలు చేసి బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారం కేబినెట్ సబ్ కమిటీ విచారణలో వెలుగు చూసింది. సెట్ టాప్ బాక్సుల నాసిరకంగా ఉన్నట్లు కమిటీ తేల్చింది. ఈ క్రమంలో పైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.200 కోట్లకుపైగా అవినీతి చోటు చేసుకున్నట్లు నిర్ధారిస్తూ కేబినెట్కు నివేదిక ఇచ్చింది. చంద్రన్న కానుకల్లో అవినీతి వెల్లువ.. చంద్రన్న కానుక, రంజాన్ తోఫా పేరిట గత సర్కారు పేదలకు పంపిణీ చేసిన రేషన్ సరుకుల్లోనూ పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు నిర్థారణ అయింది. కానుక అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపించాలని టీడీపీ నేతలే పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అక్రమాలు వెలికి తీయాలని విజయనగరం జిల్లా గజపతినగరం అప్పటి ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు జడ్పీ సమావేశంలో డిమాండ్ చేయడం దుమారం రేపింది. అక్రమాలు రుజువైతే రెవన్యూ రికవరీ చట్టం ద్వారా డబ్బులు తిరిగి వసూలు చేయాలని అప్పుడు ఆయన డిమాండ్ కూడా చేశారు. హెరిటేజ్కు సంతర్పణ.. చంద్రన్న కానుక కింద సంక్రాంతి పండుగకు పేదలకు అందించిన గిఫ్ట్ ప్యాక్లో మిగిలిన సరుకులతో పాటు 100 గ్రాముల చొప్పున నెయ్యి కూడా పంపిణీ చేశారు. ఇందుకోసం ఏడాదికి 1,301 కిలో లీటర్ల నెయ్యి కొనుగోలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోనూ, పొరుగు రాష్ట్రాల్లోనూ పలు డెయిరీలు కిలో నెయ్యి ప్యాకింగ్తో సహా రూ.320 నుంచి రూ. 420 వరకు అప్పట్లో విక్రయించాయి. బహిరంగ మార్కెట్లో విశాఖ డెయిరీ నెయ్యి కిలో రూ. 320, దొడ్ల డెయిరీ నెయ్యి రూ. 350, తిరుమల డెయిరీ నెయ్యి రూ. 375, నందిని డెయిరీ నెయ్యి రూ.420 చొప్పున రిటైల్ అమ్మకాలు జరుపుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా రిటైల్ కొనుగోలు దారులకు కిలో గేదె నెయ్యి రూ.372కే విక్రయిస్తామని విజయవాడలోని ఓ సూపర్ మార్కెట్ పత్రికా ప్రకటన ఇచ్చింది. అయితే ఇలా తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే వారిని కాదని హెరిటేజ్ డెయిరీ నుంచి కిలో నెయ్యి రూ. 499తోపాటు దీనిమీద 14.5 శాతం విలువ ఆధారిత పన్ను కలిపి కిలో రూ.575 చొప్పున గత సర్కారు కొనుగోలు చేసింది. ఒక ఏడాది నెయ్యి సరఫరాలోనే రూ.26 కోట్లకు పైగా దుర్వినియోగం అయిందనే ఆరోపణలున్నాయి. కానుక పేరిట కోట్లు స్వాహా.. సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుక పేరిట తెల్ల రేషన్ కార్డుదారులకు అర కిలో కందిపప్పు, అర కిలో శనగలు, అర కిలో బెల్లం, అర లీటర్ పామాయిల్, కిలో గోధుమపిండి, 100 గ్రాముల నెయ్యి పంపిణీ చేశారు. ఈ సరుకులన్నీ ఒక సంచిలో పెట్టి ఇచ్చేందుకు గిఫ్ట్ సంచుల పేరిట ఏటా అదనంగా రూ. 15 కోట్లు ఖర్చు చేసి నాసిరకం సంచులిచ్చారు. బెల్లం దుర్వాసన రావడంతో సగం మంది లబ్ధిదారులు డస్ట్బిన్లో పారేశారు. ఈ విషయాన్ని కళ్లారా చూసిన నాటి సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించినా ఫలితం శూన్యం. చంద్రన్న కానుక సరుకుల సరఫరా టెండర్లను సిండికేట్గా ఏర్పడి దక్కించుకున్నారు. 2015 – 2019 మధ్య సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా పథకం పేరిట సరుకుల సేకరణకు రూ.1,766.28 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.565.94 కోట్ల విలువైన సరుకులు పీడీఎస్ కింద సేకరించారు. మార్క్ఫెడ్, ఆయిల్ఫెడ్ ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా సరుకుల కోసం రూ.1,200.34 కోట్లు ఖర్చు చేశారు. అయితే ధరల్లో వ్యత్యాసం, నాసిరకం సరుకులు సరఫరా చేయడం ద్వారా రూ.158.38 కోట్ల మేర ఇందులో అవినీతి జరిగినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
తబ్లీగ్ జమాత్ చీఫ్పై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: తబ్లీగ్ జమాత్ చీఫ్, నిజాముద్దీన్ మర్కజ్కు చెందిన మౌలానా సాద్కు హవాలా మార్గంలో విదేశాల నుంచి వచ్చిన విరాళాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు కొనసాగిస్తోంది. నిజాముద్దీన్లో తబ్లీగ్ జమాత్ సమావేశం నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమైన మౌలానా సాద్ పై ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం హవాలా మార్గంలో మౌలానాకు విదేశాల నుంచి విరాళాలు వచ్చాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేసింది. దీంతో తాజాగా రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు, ఈడీ, ఐటీ విభాగాల నుంచి మౌలానాకు అందిన విదేశీ విరాళాలపై సమాచారాన్ని సేకరించారు. తబ్లీగ్ జమాత్ విదేశీ విరాళాల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న మౌలానా సన్నిహితుడైన ముర్సలీన్ను మే 16న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించారు. చదవండి: 82 మంది విదేశీయులపై చార్జీషీటు దాఖలు జమాత్ ట్రస్టుకు విదేశీ విరాళాలు హవాలా మార్గంలో స్వీకరించి మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ దర్యాప్తులో తేలడంతో సీబీఐ రంగంలోకి దిగి మౌలానా సాద్ పై దర్యాప్తు సాగిస్తోంది. మర్కజ్ ట్రస్ట్తోపాటు మౌలానా సాద్పై సీబీఐ చర్యలు తీసుకోనుంది. అంతకుముందు మర్కజ్ విరాళాలపై కీలక పత్రాలను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మార్చి 13 తరువాత మార్కాజ్ లోపల ఉన్న వేలాది మంది భారతీయులను, విదేశీయులను దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ధిక్కరించడానికి మౌలానా సాద్ ప్రోత్సహించారని ఆరోపణలున్నాయి. కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన 4,300 మంది వ్యక్తులు మర్కజ్లో జరిగిన కార్యక్రమానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నారని కేంద్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు సూచిస్తున్నాయి. చదవండి: ఎన్ 95 మాస్క్ల పేరుతో భారీ మోసం -
అమరావతి అక్రమాలపై సీబీ'ఐ'
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో టీడీపీ హయాంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, ఇతర అక్రమాలపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పేరుతో అక్రమాలకు పాల్పడినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం అన్ని రికార్డులను పరిశీలించి వివరాలు సేకరించి గతేడాది డిసెంబర్ 27న నివేదిక ఇచ్చింది. ఓత్ ఆఫ్ సీక్రెసీ (అధికారిక రహస్యాలు వెల్లడించననే ప్రమాణాన్ని)ని ఉల్లంఘించినట్టు మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది. రాజధానిపై తమ వాళ్లకు ముందస్తు లీకులు ఇవ్వడంతో 2014 జూన్ నుంచి డిసెంబర్లోపు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా సీఆర్డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. సీఐడీ, సిట్, ఈడీ దర్యాప్తు ఇలా.. - రాజధాని అక్రమాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీఐడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తమ పరిధిలో లోతైన దర్యాప్తు చేపట్టాయి. - మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. రాజధాని కోర్ ఏరియాలో 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ఆధారాలు సేకరించింది. - అమరావతి, పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి గ్రామాల్లో తెల్లకార్డు దారులను బినామీలుగా అడ్డుపెట్టుకుని భూములు కొనుగోలు చేసినట్టు నిర్ధారించింది. - మభ్యపెట్టి తన భూమి కొనుగోలు చేశారని వెంకటాయపాలెంకు చెందిన దళిత మహిళ పోతురాజు బుజ్జి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. - టీడీపీ మాజీ మంత్రులు పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావులతోపాటు టీడీపీ నాయకుడు బెల్లంకొండ నరసింహారావుపై సెక్షన్ 420, 506 రెడ్విత్ 120(బి)తోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 3(1)(జి)(పి) కింద కేసు నమోదు చేసి.. ఆధారాలు సేకరించింది. - ఇప్పటి వరకు సీఐడీ ఏడు కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడ్డాయి. - ఇదే వ్యవహారంపై సీఐడీ ఇచ్చిన రిపోర్టుతో రాజధానిలో అక్రమ లావాదేవీలపై ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్–హైదరాబాద్) ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) – 2002, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఎఫ్ఇఎంఎ –ఫెమ)–1999 కేసులు నమోదు చేసింది. కీలక ఆధారాలు సేకరించడంలో నిమగ్నమైంది. డీఓపీటీకి నివేదిక - రాజధాని ప్రాంతంలో భూములను స్వాధీనం చేసుకోవడంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానంలో అనేక అవకతవకలు, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడిందనడంపై బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. - పేదల నుంచి భూముల సేకరణలోనే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడినట్టు తేలింది. - ఇందులో అనేక నేరాలు, పెద్ద ఎత్తున కుట్ర, ఫోర్జరీ(చీటింగ్), తప్పుడు పత్రాల తయారీ, రికార్డుల ట్యాంపరింగ్ వంటి అక్రమాలు చోటు చేసుకున్నట్టు మంత్రివర్గ ఉప సంఘం గుర్తించింది. - ఈ అక్రమాలపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ), అవినీతి నిరోధక చట్టం, బినామీ లావాదేవీలు (నిషేధ) చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టం వంటి నేరాలపై కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. - రాజధాని అమరావతి పేరుతో అక్రమాలకు పాల్పడిన వారు ఆర్థిక లబ్ధి పొంది ఇతర రాష్ట్రాలు, విదేశాలకు కూడా నగదు తరలించినట్టు స్పష్టమవుతోంది. - ఈ నేరాలతో సంబంధం ఉన్న కొందరు రాష్ట్రంలో, పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉండే అవకాశం ఉండటంతో జాతీయ సంస్థ దర్యాప్తు తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం నివేదికను కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీఓపీటీ)కు పంపించింది. -
రాజధాని అక్రమాల కేసు సీబీఐకి
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో భూ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని భూముల అక్రమాల కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.కాగా, చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో రాజధాని భూముల విషయంలో భారిఎత్తున అక్రమాలు జరియాన్న ఆరోపణల నేపథ్యంలో.. దాన్ని నిగ్గు తేల్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన మాట వాస్తవమేనని సబ్కమిటీ నివేదించింది. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. బినామీల పేర్లతో అక్రమాలు చేశారంటూ సబ్ కమిటీ నివేదికలో పేర్కొంది. సబ్కమిటీ నివేదిక ఆధారంగా సీఐడీ, సిట్ విచారణ జరిపింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించింది. రాజధాని భూముల విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని మొత్తాన్ని కేంద్ర హోం శాఖకు అంద చేశారు. మొత్తంగా నాలుగువేల ఎకరాలకు పైగా భూముల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని కెబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. -
సీబీఐకి వైఎస్ వివేకా హత్యకేసు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మార్చి 15న వైఎస్ వివేకా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై సిట్ పలు కోణాల్లో దర్యాప్తు చేసింది. కాగా తన తండ్రి హత్యపై పలు అనుమానాలు ఉన్నాయని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ఆయన కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలని హైకోర్టు ఈ సందర్భంగా సీబీఐకి సూచించింది. -
రాయపాటిపై సీబీఐ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగుళూరులలో రాయపాటికి చెందిన నివాసాల్లో, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బ్యాంకు రుణాల ఎగవేత కేసుకు సంబంధించి అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల అనంతరం రాయపాటిపై 120(బీ), రెడ్ విత్ 420, 406, 468, 477(ఏ), పీసీఐ యాక్ట్ 13(2), రెడ్ విత్ 13(1)డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాయపాటితో పాటు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస్లను నిందితులుగా చేర్చారు. రుణాల ఎగవేతపై యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ భార్గవ్ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ట్రాన్స్టాయ్ కార్యాలయాలతో పాటు పలు చోట్ల సోదాలు చేపట్టారు. చదవండి : రాయపాటి ఇంటిపై సీబీఐ దాడులు -
బొగ్గు స్కాంలో సీబీఐ దూకుడు
సాక్షి, హైదరాబాద్: బొగ్గు కుంభకోణంలో సీబీఐ దూకుడు పెంచింది. తెలంగాణ కేంద్రంగా ఉన్న సూర్యలక్ష్మీ కాటన్ మిల్స్ (ఎస్సీఎమ్ఎల్) నాగ్పూర్లో పాల్పడ్డ బొగ్గు కుంభకోణంపై సీబీఐ ఆధారాల సేకరణలో దూసుకుపోతోంది. తమ కాటన్ మిల్లుకు ఇంధన సరఫరా అన్న కారణంతో ప్రభుత్వం నుంచి పొందిన బొగ్గును బయట మార్కెట్లో విక్రయించారన్న ఆరోపణలపై సీబీఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ మేరకు గత గురువారం సికింద్రాబాద్లోని సూర్యలక్ష్మీ కాటన్మిల్స్ ప్రధాన కార్యాలయం, నాగ్పూర్ రాంతెక్లోని శాఖ ఆఫీస్పై ఏకకాలంలో దాడులు చేసిన సంగతి తెలి సిందే. సూర్యలక్ష్మీ కాటన్మిల్స్ చైర్మన్ ఎల్.ఎన్ అగర్వాల్, ఎండీ పరితోశ్ అగర్వాల్పై చీటింగ్ కేసు నమోదు చేసింది. ఇదే సమయంలో ఇందులో డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరు మాజీ ఎంపీల సమాచారం సేకరించిందని తెలిసింది. బహిరంగ మార్కెట్కు..: విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన కాటన్మిల్లు, మరో పవర్ ప్లాంటుకు బొగ్గు కోసమని సూర్యలక్ష్మీ కాటన్ మిల్స్.. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్తో ఒప్పందం చేసుకుంది. 2008లో 4,968 టన్నులకు ఒప్పందం కుదిరింది. అప్పుడెలాంటి అవకతవకలు లేవు. కానీ, 2014లో 1,30,000 టన్నులకు మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో 1,13,000 టన్నుల సరఫరాలో అక్రమలు జరిగాయని వెస్ట్రన్ కోల్ఫీల్డ్ అంతర్గత విచారణలో తేలింది. 2014–15లో 21,598.77, 2015–16లో 50,321.77 టన్నులు, 2016–17లో 58194.73 టన్నుల బొగ్గు వెస్ట్రన్ కోల్ఫీల్డ్ నుంచి సరఫరా అయింది. ఈ మొత్తం బొగ్గులో అధిక శాతాన్ని సూర్యలక్ష్మి కాటన్ మిల్స్ తన అవసరాలకు కాకుండా బయట మార్కెట్లో అక్రమంగా విక్రయించారన్నది వెస్ట్రన్ కోల్ఫీల్డ్ అంతర్గత విచారణతోపాటు, దానిపై నియమించిన ప్రత్యేక కమిటీ కూడా తేల్చింది. దీంతో వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని నివేదిక తేల్చినట్లు సమాచారం. ఆ సమయంలో వీరికి రాజకీయంగా పలువురు సహకరించారని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఇద్దరు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు ఉండటమే ఇందుకు కారణం. ఇద్దరూ ఉత్తర తెలంగాణ ఎంపీలే..! బొగ్గు కుంభకోణంలో వందల కోట్ల రూపాయలు కేంద్రానికి నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ కుంభకోణంలో రాజకీయ జోక్యంపైనా సీబీఐ నజర్ పెట్టిందని తెలిసింది. సూర్యలక్ష్మి కాటన్ మిల్స్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో చైర్మన్, ఎండీతో కలిపి మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు మాజీ ఎంపీలు కావడం గమనార్హం. అందులో ఒకరు ఉమ్మడి కరీంనగర్, మరొకరు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. వీరిద్దరూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా పారిశ్రామికంగా, రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్నవారు. వీరిలో ఒకరికి పలు పరిశ్రమలతోపాటు మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. మరొకరు రాజధానిలోని ఒక రేస్క్లబ్తోపాటు, ఓ బ్యాంకుకు చైర్మన్గా వ్యవహరించారు. వెస్ట్రన్ కోల్ఫీల్డ్ ఉద్యోగులపైనా..! వేల టన్నుల బొగ్గును సూర్యలక్ష్మీ కాటన్ మిల్స్కు తరలించడంలో వెస్ట్రన్ కోల్ఫీల్డ్లో ఉన్నత స్థాయి నుంచి కిందిస్థాయి దాకా పలువురు ఉద్యోగులు సహకరించారని సీబీఐ గుర్తించింది. ఈ జాబితా చాంతాడంత ఉండటంతో ప్రస్తుతానికి గుర్తు తెలియని వెస్ట్రన్ కోల్ఫీల్డ్ ఉద్యోగులు అని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ప్రస్తుతం సీబీఐ అధికారులు 2014 నుంచి 2017 వరకు పలువురు ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించి సీబీఐ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. ఎవరి ఆదేశాలు, ప్రలోభాలతో వెస్ట్రన్ కోల్ఫీల్డ్ ఉద్యోగులు ఇలా చేసారన్నది సీబీఐ ఆరా తీస్తోంది. -
‘కోడెల బీజేపీలోకి చేరాలని ఎందుకు అనుకున్నారు?’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కోడెల చనిపోయారన్న కనీస సానుభూతి లేకుండా రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. ‘పార్టీలో పనిచేసే వారికి గౌరవం లేదని కోడెల బాధపడింది నిజమా కాదా? ఆయనను చంద్రబాబు ఎందుకు దూరం పెట్టారు? కోడెల బీజేపీలో చేరాలని ఎందుకు ప్రయత్నించారు? సొంత పార్టీ నేతలే ఆయనపై ఎందుకు ఫిర్యాదు చేశారు? కోడెల సెల్ఫోన్ మాయంపై బాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?’అంటూ మంత్రి ప్రశ్నించారు. అంతేకాకుండా కోడెల మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలని బాబు అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో సీబీఐ రాకూడదన్న చంద్రబాబు ఇప్పుడు కోడెల మరణంపై సీబీఐ దర్యాప్తునకు ఎలా డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. అదేవిధంగా గవర్నర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చేసిన అనుచిత వ్యాఖ్యలు అందరికీ గుర్తున్నాయని అన్నారు. కేంద్రానికి గవర్నర్ ఏజెంట్ అని చంద్రబాబు విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి విమర్శలు చేసిన బాబు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని గవర్నర్ దగ్గరికి వెళ్లారని ప్రశ్నించారు. ఇదేనా ఆయన 40 ఏళ్ల అనుభవం అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. కాగా కోడెల శివప్రసాదరావు మృతిపై విచారణ జరిపించాలంటూ చంద్రబాబు ఇవాళ గవర్నర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’ అందుకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు -
శివకుమార్ కస్టడీ పొడిగించిన కోర్టు
సాక్షి, బెంగళూరు/ న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే డీకే శివకుమార్ జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులపాటు న్యాయస్థానం పొడిగించింది. శివకుమార్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున జుడిషియల్ కస్టడీకి పంపాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. దీనిపై మంగళవారం వాదోపవాదాలు విన్న అనంతరం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. -
ప్రతీకారమే పరమావధిగా..
ప్రత్యర్థులపై ప్రతీకారమే పరమావధిగా భారత రాజకీయాలు తీవ్రమైన విషవలయం చుట్టూ తిరుగుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రాల పరిధిలో ఉన్న ప్రతీకార రాజకీయాలు ఇప్పుడు న్యూఢిల్లీకి చేరుకున్నాయి. నరేంద్రమోదీ, అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ వాటిని పరాకాష్టకు తీసుకుపోతున్నట్లుంది. నిఘా సంస్థలు ప్రత్యర్థి రాజకీయ నేతలపై నేరారోపణ చేయడం, కస్టడీ, ఇంటరాగేషన్, కోర్టుల చుట్టూ తిప్పడం మీడియాను కనువిందు చేస్తున్నట్లుంది. ప్రత్యర్థి గతంలో తమకు ఏం చేశాడో తాము అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థికీ, అతడి మద్దతు దారులకూ దాన్నే అప్పగించడమే ఆధునిక రాజకీయాల్లో ప్రతికారానికీ, పైశాచికానందానికి కారణమవుతోంది. ప్రతీకార రాజకీయాలు ఒకరి వెంట ఒకరిగా రాజకీయనేతలనే చుట్టుముడుతుండటం నిజంగా ఒక విషవలయం. భారతదేశ రాజకీయాల్లో ప్రతీకారం తీర్చుకోవడం చాలా పాత విషయమే కావచ్చుకానీ నరేంద్రమోదీ, అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ దాన్ని పరాకాష్టకు తీసుకుపోతున్నట్లుంది. వాళ్లు నీకేది చేస్తే నీవూ వాళ్లకు అదేవిధంగా చేయి అనే బైబిల్ సూక్తికి భారత రాజకీయాలు సరికొత్త వ్యాఖ్యానం చేస్తున్నట్లున్నాయి. తాజాగా బీజేపీ ఒకవైపు సీబీఐ, ఈడీ, ఐటీలను మరోవైపున టీవీ చానల్స్, సోషల్ మీడియాకు కోరలు పదునుపెడుతూ ప్రతీకార రాజకీయాలను తారస్థాయికి తీసుకుపోతోంది. కశ్మీర్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా నరేంద్రమోదీ, షాలు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను ఉసిగొల్పగలిగేంత సమయాన్ని అట్టిపెట్టుకున్నారు. అందుకే మాజీ హోం, ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఇంటిపై నిఘా సంస్థలు భారీ స్థాయి దాడులకు తలపడటం, ఆయనపై నేరారోపణ, ఇంటరాగేషన్, కస్టడీ, కోర్టుల చుట్టూ తిప్పడం వంటి న్యాయ ప్రక్రియలు శరవేగంగా కొనసాగుతూ పోయాయి. నిఘా సంస్థల ఈ సత్వర చొరవ ముందు, కశ్మీర్ ఘటనలు, ఇమ్రాన్ ప్రేలాపనలు, డొనాల్డ్ ట్రంప్ చేతిని మోదీ స్నేహపూర్వకంగా తట్టడం వంటి ప్రముఖ ఘటనలన్నీ వెలవెలబోయాయనే చెప్పాలి. సీబీఐ అధికారులు తమ ట్రౌజర్లను పైకి లాక్కుంటూ ఢిల్లీలో పి. చిదంబరం ఇంటి గోడలపైకి ఎగబాకుతున్న దృశ్యాలు మీడియాలో కనబడి వాటికి ఒక తమాషా విలువను ఏర్పర్చాయి. ఈ దృశ్యం నన్ను కొంతకాలం క్రితం, ప్రతీకారాన్ని బలంగా ఆచరించేంతగా మన రాజకీయనేతలను ఏది పురికొల్పుతోంది అనే అంశంపై ఓ రాజకీయ నేతతో నేను మాట్లాడిన ఒక సాయంకాలపు సంభాషణవైపు తీసుకుపోయింది. నన్ను విందుకు ఆహ్వానించిన వ్యక్తి ఈ ప్రశ్నతో మొదలెట్టారు. ‘‘రాజకీయాల్లో మన జీవితాలను ఎందుకు మదుపు చేస్తున్నాము? దుమ్ముతో, వేడితో, మొరటుదనంతో కూడిన హెలికాఫ్టర్లలో ప్రయాణిస్తూ ఎందుకు కష్టపెట్టుకుం టున్నాము? పరస్పరం జగడాలాడుతూ, కోర్టు కేసులు, అరెస్టుల పాలవుతూ మనం సాధిస్తున్న దాన్ని అధికారం అంటామా? మనల్ని ఇక వెనక్కు రాలేనంతగా ఇలాంటి చోటికి లాక్కెళుతోంది ఏమిటి?’’ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కూడా ఆయనే చెప్పారు. ‘‘డబ్బు కోసం కాదు. అయినా.. రాజకీయాల్లో ప్రవేశించి మీరు డబ్బు సంపాదించినా, నిజానికి దాన్ని మీరు అనుభవించలేరు. మన దేశ రాజకీయాల్లో మీరు సంపన్నులుగా కనబడలేరు. చివరకు మన కార్లు, ఇళ్లు, వేసుకునే కుర్తాలు కూడా నిరాడంబరంగానే కనిపించాల్సిందే. చివరకు మన కుటుంబాల్లో మహిళలు కూడా నగలు దిగేసుకోవడం, ధారాళంగా ఖర్చుపెట్టడం చేయలేరు’’ అని నిర్వేదం ప్రకటించారాయన. ‘‘మీరు సాధించే రాజకీయ అధికారాన్ని, సంపదను మీరు ఏమాత్రం ఆస్వాదించలేనప్పుడు ఇలాంటి స్థితి మనకెందుకు, మనకు అర్థం కానిదల్లా ఇదే గుప్తాజీ’’ అన్నారాయన. అధికారం చేతుల్లోకి రాగానే ఏం జరుగుతుందో తాను చెప్పుకుంటూ పోయారు. ‘‘మీ ప్రత్యర్థి మీకు గతంలో ఏం చేశాడో అతడిని ఓడించాక మీరు కూడా అదే చేస్తారు. అతడికన్నా అతడి వెన్నంటి ఉంటే ప్రజలకే ఎక్కువగా హాని చేస్తుంటాం. ఎందుకంటే ప్రతి జిల్లాలో, ప్రతిగ్రామంలో మన ప్రత్యర్థిని బలపర్చే ప్రజలు మనకు బాగా తెలుసు. అందుకే వారిపైకి మన పోలీసులను, నిఘా సంస్థలను సునాయాసంగా ఎగదోలుతుంటాం. వారిపై కిలో అక్రమ నల్ల మందును కలిగి ఉన్నారని, హత్య చేశారని కూడా ఆరోపించవచ్చు మనం. అలాంటి రాజకీయాల్లో తర్వాత ఏం జరుగుతుంది’’ అని ప్రశ్నించారాయన. ‘మీ ప్రత్యర్థి బాధపడుతుంటే మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లే కదా’ అని నేను సమాధానమిచ్చాను. ‘చూడండి గుప్తాజీ మీరు మా రాజకీయనేతలను అర్థం చేసుకోవడం లేదు’ అని మొదలెట్టారాయన. ‘‘మన ప్రత్యర్థిని బలపర్చే ప్రజలను మనం దెబ్బతీసినప్పుడు, వారు తమ నేతలవద్దకు వెళ్లి, అయ్యా మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకుంటారు. ఆ నేత తనచేతుల్లో అధికారం లేదు కాబట్టి ఇప్పుడు తానేం చేయలేనని చెబుతాడు. తనవాళ్లను కాపాడలేని బాధను అతడు అనుభవిస్తుంటే మనం మహదానందపడతాం. మన ప్రత్యర్థులు తమవాళ్లకు సహాయం చేయలేని నిస్సహాయత్వంలో కూరుకుపోతుంటే మనకు అది పైశాచిక ఆనందం కలిగిస్తుంది. అందుకే మేం రాజకీయాల్లో తీవ్రంగా కష్టాలపాలవుతుంటాం’’ అనీ ఆయన ముగించారు. ఇది రెండు దశాబ్దాల క్రితం మా మధ్య జరిగిన సంభాషణ. ఆరోజు ఆయన చెప్పింది ఎంత చక్కటి నిజమో తెలుపడానికి ససాక్ష్యంగా ఎన్నో ఘటనలు ఇటీవల జరుగుతూ పోయాయి. ప్రస్తుతం చిదంబరం కస్టడీలో ఉన్నారు,. ఆయన కుమారుడు కార్తీ ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడు. కాంగ్రెస్ మాజీ కోశాధికారి మోతీలాల్ వోరా 90 ఏళ్ల ప్రాయంలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ భూ కేటాయింపు కేసులో చిక్కుకున్నారు. ఇక కమల్నాథ్ ఐటీ కేసులో ఇరుక్కోగా, తన మేనల్లుడు అగస్టా వెస్ట్లాండ్ హెలికాఫ్టర్ కొనుగోలులో ముడుపుల కేసులో ఇరుక్కున్నారు. ఇక సోనియా, రాహుల్ గాంధీలు నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ ఈడీ నిఘాలో ఉంటున్నారు. (ఈయనను మంగళవారం అరెస్టు చేశారు) ఈ చిట్టా చాలానే ఉంది. గతంలోకి వెళితే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే, 2015లో హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ సీయం వీరభద్రసింగ్పై అవినీతి కేసు దాఖలయింది. ఆయన రెండో కుమార్తె పెళ్లి జరుగుతున్న రోజున ఆయన ఇంటిపై అధికారులు దాడి చేశారు. మమతా బెనర్జీ పార్టీ సహచరనేతలు, పలువురు స్థానిక పోలీసులు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇంకా వెనక్కు వెళితే 2001లో నాటి తమిళనాడు సీఎం జయలలిత మాజీ సీఎం కరుణానిధిని రూ. 12 కోట్ల ఫ్లైఓవర్ కుంభకోణం కేసులో ఇరికించారు. ఆయన ఇంటిపై అర్ధరాత్రి దాటాక పోలీసులు దాడి చేశారు. ఆ వృద్ధనేతను పోలీసులు మెట్లకిందికి లాక్కుంటూ పోతున్న దృశ్యాలు ఇప్పటికీ మీలో వణుకు తెప్పిస్తాయి మరి. ఇకపోతే ఎన్డీయే లేక యూపీఏ ఏది అధికారంలో ఉన్నా లాలూ, ములాయం, మాయావతిలపై సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలు వరుసగా కేసులు పెడుతూ పోయాయి. తాజాగా ఐఎల్ ఎఫ్ఎస్ కుంభకోణంలో నకిలీ ఒప్పందాల ద్వారా రూ.20 కోట్లను దండుకున్న కేసులో రాజ్ థాకరేపై ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులన్నింటినీ నిశితంగా పరిశీలించినట్లయితే, ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్న రాజకీయ పార్టీ తాను అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలను అలాంటి సమస్యల్లోకే నెట్టడం కనిపిస్తుంది. దశాబ్దంపాటు అమిత్ షా, నరేంద్రమోదీ క్రిమినల్ కేసులను ఎదుర్కొన్నారు. షా అయితే బూటకపు ఎన్కౌం?టర్, హత్య కేసులో మూడునెలలు కస్టడీలో గడిపారు. తన బిడ్డ పెళ్లిలో ఉండగా అమిత్ షాను అధికారులు లాక్కెళ్లిన విషయాన్ని మర్చిపోవద్దు. ముందుగా రాయి విసిరిందెవరు అనేది ప్రశ్న కాదు. రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రాల స్థాయిలో జరుగుతూ వచ్చింది ఇప్పుడు కేంద్రందాకా పాకింది. దాన్ని బీజేపీ ఇప్పుడు మరొక దశకు తీసుకుపోయింది. మొదటగా మూడు కేంద్ర నిఘా సంస్థల కోరలకు పదునుపెట్టింది, కొన్ని టీవీ చానల్స్, సోషల్ మీడియాను కూడా వాటిలోభాగం చేసింది. రెండోది. బీజేపీలోకి ఫిరాయించాలని భావించేవారికి తన పక్క తలుపులు తెరిచి ఉంచింది. ఆనాడు నా అతిథేయి చెప్పిన కీలకాంశం ఇదే. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఇది కొనసాగింది. బాదల్ వర్సెస్ అమరీందర్, ములాయం వర్సెస్ మాయావతి, జయలలిత వర్సెస్ కరుణానిధి, దేవీలాల్ వర్సెస్ బన్సీలాల్.. ఇప్పుడు ఇది న్యూఢిల్లీకి చేరుకుంది. ఆధునిక ప్రతీకార రాజకీయాల గురించి, ప్రత్యర్థి బాధలు చూస్తూ పొందే పైశాచిక ఆనందం గురించి నాకు ఆరోజు మాస్టర్ క్లాస్ తీసుకున్న రాజకీయ ప్రముఖుడు ఎవరో కాదు. ఓం ప్రకాశ్ చౌతాలా. నాటి హర్యానా సీఎం. మా సంభాషణ హర్యానా భవన్లో జరిగింది. ఆయన ఇప్పుడు తీహార్ జైల్లో తన కుమారుల్లో ఒకరితో కలిసి అవినీతి కేసులో పదేళ్ల శిక్షను అనుభవిస్తున్నారు. వారి ప్రతీకార రాజకీయాలు ఇప్పుడు వారినే చుట్టుముట్టాయి. రాజకీయాలు ఎక్కడకు వెళుతున్నాయనే అంశంపై ఇప్పుడేమనుకుంటున్నారనే అంశంపై ఆయన జైలునుంచి బయటకు వచ్చాక తాజాగా మళ్లీ సంభాషించాలనుకుంటున్నాను. వ్యాసకర్త: శేఖర్ గుప్తా ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని వచ్చే సోమవారం పొడిగిస్తూ ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సెప్టెంబర్ 5న తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు గురువారం వెల్లడించిన సంగతి తెలిసిందే. చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేయకుండా కల్పించిన తాత్కాలిక రక్షణ గడువును వచ్చే గురువారం వరకు పొడిగిస్తునట్టు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఐఎన్ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం, ఇంద్రాణీ ముఖర్జీలు నిందితులుగా ఉన్నారు. గతేడాది కార్తిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థలు 23 రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారణ చేపట్టాయి. అయితే ఇటీవల ఇంద్రాణీ అప్రూవర్గా మారారు. -
చిదంబరం అరెస్ట్
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన నగదు అక్రమ చలామణి కేసులో యూపీఏ హయాంలో కీలక హోం, ఆర్థిక శాఖల మంత్రిగా విధులు నిర్వర్తించిన కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంను సీబీఐ అధికారులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. థ్రిల్లర్ సినిమాను తలపించే ఉత్కంఠభరిత మలుపుల నడుమ ఎట్టకేలకు చిదంబరం నివాసంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి ఆయనను సీబీఐ ప్రధాన కార్యాలయంలోనే ఉంచనున్నారు. గురువారం ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరంను హాజరుపర్చే అవకాశముంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. అరెస్ట్ నుంచి తక్షణమే ఊరట కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో చిదంబరం తరఫు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తక్షణ విచారణ కుదరదని, శుక్రవారం లోపు ఈ కేసును విచారించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దాంతో మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా ఉన్న చిదంబరం తప్పనిసరి పరిస్థితుల్లో.. బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తాను ఎక్కడికీ పారిపోవడం లేదని, ఈ కేసులో తాను నిందితుడిని కాదని పేర్కొంటూ తన వాదనను మీడియాకు వినిపించారు. ఆ వెంటనే అక్కడినుంచి జోర్ బాఘ్లోని తన నివాసానికి వెళ్లారు. కాసేపటికి అక్కడికి వెళ్లిన సీబీఐ అధికారులు ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. ఆయనను అదుపులోకి తీసుకుని సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. చిదంబరం అరెస్ట్, అంతకుముందు చోటు చేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ మండిపడింది. ఇది మోదీ సర్కారు కక్ష సాధింపేనని, తామంతా చిదంబరం వెనకే ఉన్నామని స్పష్టం చేసింది. (చదవండి : ఇదీ.. చిదంబరం చిట్టా) ఢిల్లీలో హై ఓల్టేజ్ డ్రామా.. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన క్షణం నుంచి.. చిదంబరం కేంద్రంగా దేశ రాజధానిలో ఉత్కంఠభరిత మలుపులతో హైడ్రామా కొనసాగింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి చిదంబరం అనూహ్యంగా అదృశ్యమయ్యారు. రెండు గంటల్లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత చిదంబరం ఇంట్లో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థల అధికారులు నోటీసులు అంటించారు. అయినా, ఆచూకీ తెలియకపోవడంతో చివరకు లుక్ ఔట్ నోటీసులు జారీచేశారు. చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా నిరోధించాలని అన్ని విమానాశ్రయాలకూ సమాచారమిచ్చారు. ఈ లోపు, ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసుకున్న పిటిషన్ను తక్షణమే విచారించలేమన్న సుప్రీంకోర్టు.. ఆ విచారణను ఏకంగా శుక్రవారానికి వాయిదా వేస్తూ బుధవారం సాయంత్రం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ కార్యాలయంలో ప్రత్యక్షం.. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో చిదంబరం అనూహ్యంగా దర్శనమిచ్చారు. అక్కడి విలేకరుల సమావేశంలో తన వాదన వినిపించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ప్రాణం కన్నా స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చే తత్వం తనదని చెప్పారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసేందుకు రాత్రంతా(మంగళవారం) తన లాయర్లతో కలిసి పిటిషన్ను రూపొందించానన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి సీబీఐ చార్జిషీట్లో తన పేరు లేదని వివరించారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో శుక్రవారం ఉన్నందున.. చట్టాన్ని గౌరవిస్తూ అప్పటివరకు తనను అదుపులోకి తీసుకోవద్దంటూ దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను నర్మగర్భంగా కోరారు. చిదంబరం కాంగ్రెస్ కార్యాలయంలో ఉన్న విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు అక్కడికి వెళ్లేలోపే.. చెప్పాల్సింది చెప్పేసి వెంటనే కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్లిపోయారు. అక్కడి నుంచి తన న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్లతో కలిసి నేరుగా జోర్బాఘ్లోని తన ఇంటికి వెళ్లారు. చిదంబరంను అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లిన సీబీఐ అధికారులు.. అక్కడి నుంచి ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ వారికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చిదంబరం ఇంటి గేట్ కూడా వేసి ఉండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఓ పక్క నుంచి గోడ దూకి వారు ఇంట్లోకి వెళ్లారు. మరో పది నిమిషాల్లో సీబీఐకి చెందిన మరో టీమ్, ఈడీ అధికారుల బృందం కూడా అక్కడికి చేరుకున్నాయి. శాంతిభద్రతల నిమిత్తం సీబీఐ కోరడంతో ఢిల్లీ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు కాసేపు చిదంబరంను ప్రశ్నించి, అనంతరం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను తీసుకుని నేరుగా సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. చిదంబరం నివాసం వద్ద మీడియాను, కార్యకర్తలను అదుపుచేస్తున్న అధికారులు బుధవారం ఉదయం నుంచీ సుప్రీంకోర్టులో.. బుధవారం ఉదయం నుంచి చిదంబరం బెయిల్ కేసుకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానంలో హైడ్రామా కొనసాగింది. చిదంబరం బెయిల్కు సంబంధించిన పిటిషన్ను తక్షణమే విచారించాల్సిందిగా కపిల్ సిబల్ నేతృత్వంలోని న్యాయవాదులు పదేపదే జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనాన్ని కోరారు. వారి అభ్యర్థనలను తోసిపుచ్చిన జస్టిస్ రమణ.. ఆ పిటిషన్లపై విచారణ ఎప్పుడు జరపాలన్నది ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయి నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఆ తరువాత సాయంత్రం 5 గంటల సమయంలో శుక్రవారం ఆ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. అయితే, ఆ పిటిషన్ను ఎవరి నేతృత్వంలోని ఏ ధర్మాసనం విచారిస్తుందనేది గురువారం సాయంత్రం మాత్రమే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న పార్టీ శ్రేణులు ‘అయోధ్య’హాళ్లోకి.. మొదట జస్టిస్ రమణ, జస్టిస్ శంతనుగౌండర్, జస్టిస్ అజయ్ రస్తోగిల ధర్మాసనం ముందు కపిల్ సిబల్ మొదట ఈ పిటిషన్ అంశం లేవనెత్తారు. తక్షణ విచారణ అవసరమా లేదా అని నిర్ణయించాల్సిందిగా ఆ పిటిషన్ను జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సీజేఐ వద్దకు పంపించింది. ఏ సమాచారం రాకపోవడంతో మధ్యాహ్న భోజన విరామం అనంతరం మళ్లీ సిబల్ జస్టిస్ రమణ ధర్మాసనం ముందు ఈ విషయాన్ని లేవనెత్తారు. పిటిషన్లో పొరపాట్లు ఉన్నాయని రిజిస్ట్రీ తమకు సమాచారమిచ్చారని, అందువల్ల, ఈ పిటిషన్ను తాము విచారించలేమని వారు స్పష్టం చేశారు. దాంతో కాసేపటి తరువాత ఆ కోర్టు హాలుకు వచ్చిన రిజిస్ట్రీ సూర్యప్రతాప్ సింగ్ ఆ పొరపాట్లు ఇప్పుడే సరిచేశారని, విచారణ జరిపే ధర్మాసనాన్ని నిర్ణయించే నిమిత్తం ఆ పిటిషన్ను సీజేఐ కార్యాలయానికి పంపించామని జస్టిస్ రమణ ధర్మాసనానికి తెలిపారు. సీజేఐ అయోధ్య కేసు విచారణలో ఉన్నారని, అది ముగిసేందుకు సాయంత్రం అవుతుందని, అందువల్ల మీరే విచారించాలంటూ కపిల్ సిబల్ జస్టిస్ రమణ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. వారు నిర్ద్వంద్వంగా నిరాకరించడంతో.. సీజేఐ జస్టిస్ గొగోయి నేతృత్వంలో అయోధ్య కేసు విచారణ జరుగుతున్న కోర్టు హాళ్లోకి కపిల్ సిబల్ వెళ్లారు. అక్కడ అయోధ్య విచారణ మధ్యలో.. అసాధారణ రీతిలో అ అంశాన్ని సిబల్ లేవనెత్తుతారేమోనన్న పలువురు భావించారు. కానీ రాజ్యాంగ ధర్మాసనం ముందు అలాచేయడానికి నిబంధనలు ఒప్పుకోనందువల్ల ఆ అంశాన్ని లేవనెత్తలేకపోయానని అనంతరం సిబల్ విలేకరులకు తెలిపారు. శుక్రవారం విచారణకు సీజేఐ నిర్ణయం తీసుకున్నారని తెలిసిన తరువాతే సుప్రీంకోర్టు ఆవరణ నుంచి కపిల్ సిబల్ బృందం వెళ్లిపోయింది. థ్రిల్లర్ మూవీలా.. చిదంబరం అరెస్ట్ వ్యవహారం బుధవారం దేశ రాజధానిలో థ్రిల్లర్ సినిమాలా సాగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుప్రీంకోర్టులో ఒక ఎపిసోడ్ కొనసాగింది. చిదం బరానికి అరెస్ట్ నుంచి ఊరట కల్పించేం దుకు అక్కడ ఆయన తరఫు లాయర్లు కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, ఇందిరా జైసింగ్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. అనూహ్యంగా రాత్రి 8 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన చిదంబరం మీడి యాకు తన వాదనను చెప్పేసి.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. సీబీఐ మొదట ఏఐసీసీ ఆఫీస్కు, తర్వాత ఆయన ఇంటికి వెళ్లారు. దాదాపు ఓ 30 నిమిషాల తరువాత చిదంబరంను అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయనను అక్కడినుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్కు తరలించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నేను కనీసం నిందితుడిని కూడా కాను. చట్టం నుంచి దాక్కోలేదు. చట్టపరంగా రక్షణ కోరుతున్నాను. నేను చట్టం నుంచి దాక్కుంటున్నానని అంటుండటం చూసి విస్మయం చెందాను. న్యాయం కోసం పోరాడుతున్నాను. ఐఎన్ఎక్స్ కేసులో నేను కానీ, నా కుటుంబీకులు కానీ, లేదా మరెవ్వరూ నిందితులు కాదు. – చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసు 2008లో జరిగిన పరిణామాలకు సంబంధించినది. కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే ఇప్పుడు ఈ కేసును అడ్డం పెట్టుకుని మా నాన్నను వేధిస్తున్నారు. – కార్తీ -
తరుముకొచ్చిన తప్పులు
‘‘మనం ఇతరులకు ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది..’’ తత్వవేత్తలే కాదు కాస్త తెలివి ఉన్నవాళ్లంతా తరచూ చెప్పేమాట ఇది. ఈ తత్వం బోధపడడానికి ఇంత తక్కువ సమయం పడుతుందని బహుశా పళనియప్పన్ చిదంబరం ఊహించి ఉండరు. కేంద్ర ఆర్థికమంత్రిగా, హోం మం త్రిగా పనిచేసిన అనుభవశాలి, కాకలు తీరిన కాంగ్రెస్లో చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు... వ్యవస్థలను స్వీయ ప్రయోజనాలకు వాడుకుని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన నేరానికి దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ కేసులతో తరుముతున్నాయి. అరెస్టు చేయకుండా నివారించాలన్న మొరలను కోర్టులు వినడం లేదు. బుధవారం సుప్రీంకోర్టు తలుపు తట్టినా ఉపయోగం లేకపోయింది. పోలీసుల సాయంతో సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా’ కేసులో చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించడమే కాక ఆయనను అరెస్టు చేసి విచారించాల్సిందేనని మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడం కాంగ్రెస్ వర్గాలలో కలకలం రేపింది. అప్పటి నుంచి చిదంబరం కనిపించకుండా పోయారు. ఆయన సెల్ఫోన్ కూడా స్విచాఫ్ అయిపోయింది. దీంతో బుధవారం ఈడీ లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. కపిల్ సిబల్, వివేక్ తంఖా, సల్మాన్ ఖుర్షీద్, దయాన్ కృష్ణన్ వంటి ఉద్ధండులైన న్యాయవాదులు చిదంబరం తరఫున వకాల్తా పుచ్చుకుని సుప్రీంలో వాదించినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత చిదంబరం మీడియా ముందుకు వచ్చారు. ‘‘నేను సాక్ష్యాలను ప్రభావితం చేయడంలేదు, సాక్ష్యాలను తారుమారు చేయడం లేదు, అన్నీ నిరాధార ఆరోపణలు, రాజకీయ దురుద్దేశంతో నాపై ఆపాదిం చారు, దర్యాప్తు సంస్థలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతున్నా, 2007 నాటి ఉదంతంలో పదేళ్ల తర్వాత 2017లో కేసు దాఖలు చేశారు, రాజ్యసభ ఎంపీని కాబట్టి దేశం విడిచిపెట్టి వెళ్లే అవకాశాలు లేవు’’ అంటూ వాదించారు. అరెస్టు తప్పించుకునేందుకు అందరూ చెప్పే మాటలే ఇవి. ఈ వాదనలతో ఇప్పటికే 20సార్లు చిదంబరం, కార్తి అరెస్టు తప్పించుకున్నారని, న్యాయస్థానాల నుంచి ఊరట పొందారని న్యాయనిపుణులు అంటున్నారు. తగిన మోతాదులో సాక్ష్యం కనిపించబట్టే ఈసారి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించిందన్నది నిపుణుల మాట. చిదంబరం ఆర్ధిక మంత్రిగా ఉండగా 2007లో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు రూ.307 కోట్ల విదేశీ నిధులు వచ్చాయి. ఈ వ్యవహారంలో చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు, ఆయన కుమారుడు కార్తీకి కోట్ల మేర ముడుపులు అందినట్లు ఆరోపణలొచ్చాయి. విదేశీ పెట్టుబడు ల అభివృద్ధి బోర్డు (ఎఫ్ఐపీబీ) అనుమతుల విషయంలో అవకతవకలు జరిగాయని 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది. చిదంబరం, కార్తీ, కొందరు ఆర్థిక శాఖ అధికారులు, ఐఎన్ఎక్స్ సంస్థకు చెందిన ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీ పై అభియోగాలు నమోదయ్యాయి. 2018 అక్టోబర్12న కార్తికి చెందిన రూ. 54 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇంద్రాణి, పీటర్లు అరెస్టయ్యారు. కార్తి గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్టయ్యారు. తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. కార్తిని ఈడీ అనేక పర్యాయాలు విచారించింది. చిదంబరంను గత ఏడాది డిసెంబర్లో, ఈ ఏడాది జనవరిలో ఈడీ అధికారులు విచారించారు. అయితే జైలులో ఉన్న ఇంద్రాణి ముఖర్జీ అప్రూవర్గా మారారని, ఈ కేసులో మారిషస్ దొంగదారులతో సహా అన్ని అవకతవకల గురించి పూసగుచ్చినట్లు ఏకరువు పెట్టారని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ హైకోర్టుకు ఈడీ అన్ని ఆధారాలు సమర్పించబట్టే చిదంబరం కథ కంచికి చేరిందని అంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణమే కాదు ఎయిర్సెల్ మాక్సిస్ కుంభకోణం కూడా చిదంబరం కుటుంబాన్ని 2006 నుంచి వెంటాడుతోంది. అలాగే 2జీ స్పెక్ట్రమ్ కేసు కూడా. ఆర్థిక మంత్రిగా ఉండగా చేసిన తప్పులన్నీ తరుముకొస్తున్నాయి. కుంభకోణాలే కాదు చీకటి ఒప్పందాలకూ చిదంబరం మారుపేరన్న ఆరోపణలున్నాయి. చిరకాల ప్రత్యర్థి పార్టీలైన తెలుగుదేశం,కాంగ్రెస్ల మధ్య కుదిరిన రహస్య మిత్రత్వం వెనుక మం త్రాం గం నెరపిన మాయలమారిగా చిదంబరం పేరుమోశారు. కేంద్రంలో చిదంబరం మంచి ఫామ్లో ఉన్న రోజుల్లో ఆయనతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం మేరకే చంద్రబాబు మీద పలు కేసులు మాఫీ అయిపోయాయని ఏకంగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. టీడీపీ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు ఒక సందర్భంలో పార్లమెంటులో అనర్గళ ఉపన్యాసం ఇస్తుంటే.. నువ్వు, మీ నాయకుడు చంద్రబాబు నన్ను రహస్యంగా కలిసి ఏంమాట్లాడారో ఇక్కడ చెప్పమంటావా అంటూ చిదంబరం ఆయన నోరు మూయించడం చూసి తెలుగుదేశం మాత్రమే కాదు యావద్దేశం నివ్వెరపోయింది. ఇలాంటి వివాదాలు చిదంబరానికి కొత్తేమీ కాదు. మన దేశంలో ‘చెప్పు దెబ్బ’ తిన్న తొలి రాజకీయ ప్రముఖుడు కూడా ఘనత వహించిన చిదంబరమే. సిక్కుల ఊచకోత కేసులో జగదీష్ టైట్లర్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన ఉదంతంపై 2009 ఏప్రిల్ 7న మాట్లాడుతుండగా చిదంబరం పై సిక్కు జర్నలిస్టు చెప్పు విసరడం అప్పట్లో సంచలనం సృష్టించింది. హార్వర్డ్ బిజినెస్ స్కూలులో ఎంబీఏ పట్టా పుచ్చుకున్నా తండ్రి వ్యాపార వారసత్వాన్ని కొనసాగించకుండా మద్రాసు లా కాలేజీలో అందుకున్న ఎల్ఎల్బీ పట్టానే చిదంబరం నమ్ముకున్నారు. మద్రాసు హైకోర్టులో మొదలై సుప్రీంకోర్టు వరకు ఎదిగారు. కానీ తర్వాత న్యాయాన్యాయ లొసుగులను, హార్వర్డ్ వాణిజ్య కిటుకలను కలబోసి కుంభకోణాలు చేసే స్థాయికి దిగజారతారని ఎవరూ ఊహించలేదు. వీటితో పాటు ప్రత్యర్థులపై రాజ్యాంగ వ్యవస్థలను, దర్యాప్తు సంస్థలను ప్రయోగించడంలో చిదంబరాన్ని మించి నవారు లేరు. విధి బలీయమైనది.. రాజకీయ కక్షసాధింపు కేసులలో ఆయన ఏమేం చేశారో ఇపుడు అవే ఆయనకు జరుగుతున్నాయి.. కుట్ర కేసులు మోపి వేధించడం, ఆరోపణలు రుజువు కాకపోయినా అరదండాలు వేయించడం, బెయిల్ దొరక్కుండా చేయడం ఇలాంటివన్నీ ఎక్కడో విన్నట్లుంది కదూ... అందుకే అన్నారు.. మనం ఏమి ఇస్తే తిరిగి మనకు అదే వస్తుంది. -
చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో నిందితుడిగా ఉన్న చిదంబరాన్ని నాటకీయ పరిణామాల మధ్య బుధవారం సాయంత్రం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం సీబీఐ, ఈడీ అధికారులు ఢిల్లీ పోలీసుల సాయం కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని సీబీఐ హెడ్ క్వార్టర్స్కు తరలించినట్టుగా సమాచారం. అంతకు ముందు చిదంబరం నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు వచ్చిన సీబీఐ, ఈడీ అధికారులు గోడలు దూకి ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. కాగా, మంగళవారం ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ పటిషన్ను తిరస్కరించడంతో చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లారు. సుప్రీం కోర్టులో కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే బుధవారం సాయంత్రం చిదంబరం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో సీబీఐ అధికారులు అక్కడికి చేరుకుని చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుక యత్నించారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు సీబీఐ అధికారులను అడ్డుకోవడంతో.. చిదంబరం తన నివాసానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత సీబీఐ బృందం చిదంబరం నివాసానికి చేరుకుని లోనికి వెళ్లేందుకు యత్నించింది. అయితే గేట్లు తెరవకపోవడంతో సీబీఐ అధికారులు గోడపై నుంచి దూకి చిదంబరం నివాసంలోకి ప్రవేశించారు. మరోవైపు సుప్రీం కోర్టులో చిదంబరం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ శుశ్రవారం విచారణకు రానుంది. ఇక 2007లో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు సమకూరడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ఆమోదముద్ర వేయడంలో అప్పటి ఆర్థిక మంత్రిగా నిబంధనలకు విరుద్ధంగా పచ్చజెండా ఊపారని చిదంబరం అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ నిధుల రాకకు ఎఫ్ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. చదవండి : అజ్ఞాతం వీడిన చిదంబరం -
సీబీఐ అదనపు డైరెక్టర్ తొలగింపు..!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అదనపు డైరెక్టర్ పదవి నుంచి మన్నెం నాగేశ్వరరావును తొలగిస్తూ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆయనను ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరావుపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన భార్య పేరుతో రుణాలు, షెల్ కంపెనీలతో సంబంధాలన్నాయంటూ నాగేశ్వరరావుపై పలు ఆరోపణలున్నాయి. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ కేసులోనూ ఆయన వైఖరిని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలను ధిక్కరిస్తూ ఆయన అధికారులను బదిలీ చేశారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని జయశంకర్ జిల్లా(ఉమ్మడి వరంగల్) మండపేట మండలం బోర్నర్సాపూర్ గ్రామం. 1986 ఒడిశా క్యాడర్కు చెందిన నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా రెండుసార్లు నియమితులయ్యారు. (చదవండి : సీబీఐ డైరెక్టర్గా తెలుగువాడెలా అయ్యారు?) -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీబీఐ అనుమతి
-
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఏపీ ప్రభుత్వం సాధారణ సమ్మతి (జనరల్ కన్సెంట్)ని పునరుద్ధరించింది. రాష్ట్రంలో సీబీఐ సోదాలు చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ గతేడాది నవంబర్లో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జోవో ను రద్దు చేస్తూ.. సీబీఐ ప్రవేశానికి వీలుగా సాధారణ సమ్మతిని పునరుద్దరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజా జీవోతో రాష్ట్రలోని కేసుల విచారణకు సీబీఐకి మార్గం సులభం కానుంది. ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో సీబీఐ ఎప్పుడైనా దర్యాప్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తూ గతేడాది నవంబర్ 8న టీడీపీ ప్రభుత్వం జోవో జారీ చేసింది. ఐటీ, సీబీఐ దాడులతో టీడీపీ నేతలను ఇబ్బందులు పెడుతున్నారని కుంటి సాకులు చెబుతూ అనుమతి నిరాకరించారు. అంతకు ముందు ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్ను విత్ డ్రా చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ మినహా మిగతా రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేయడంలో రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసేందుకు సీబీఐ పరిధి రద్దు అయినట్టు పేర్కొంది. జనరల్ కన్సెంట్ లేకుంటే రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించడానికి కూడా సీబీఐకి అధికారం ఉండదు. తద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా రాష్ట్ర ఏసీబీనే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. తాజాగా వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోతో రాష్ట్రంలో కేసుల విచారణకు సీబీఐకి మార్గం సులభమైంది.