పోలింగ్‌ సమయం పెంపు | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ సమయం పెంపు

Published Sun, May 5 2024 3:25 AM

-

నిర్మల్‌చైన్‌గేట్‌: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు ఈ నెల 13న నిర్వహించనున్న పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సమయాన్ని పెంచినట్లు జిల్లా ఎన్నికలాధికారి, కలెక్టర్‌ ఆశిస్‌ సాంగ్వాన్‌ శనివారం ఓ ప్రకటనలో తెలి పారు. ఉదయం 7నుంచి సాయంత్రం 6గంట ల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున పోలింగ్‌ సమయాన్ని గంట పెంచినట్లు పేర్కొన్నారు. ఓటర్లంతా ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటేసి పోలింగ్‌ శాతాన్ని పెంచాలని సూచించారు.

Advertisement
 
Advertisement