భువనేశ్వర్: కంధమల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కొంటామల్ ప్రాంతంలో రీపోలింగ్ నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది. ఈ నెల 23న కొంటామల్ బూత్ నంబర్ 26, 28లో రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని ప్రధాన ఎన్నికల అధికారి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఓటర్లు, అభ్యర్థులకు దీనిపై అవగాహన కల్పించాలని బౌధ్, కంధమల్ జిల్లాల కలెక్టర్లను భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. దిలీప్కుమార్ మహపాత్రోను బౌధ్ అదనపు కలెక్టర్గా, కొంటామల్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా కమిషన్ నియమించింది. కొంటామల్ నియోజకవర్గంలో బూత్ రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో భారత ఎన్నికల సంఘం అనుమతితో బౌద్ జిల్లాలోని కొంటామల్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని రెండు పోలింగ్ బూత్లు 26 – కిరాసిరా, 28 – మహేశ్వరపిండ్లలో ఈ నెల 23న రీ–పోలింగ్ షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ విషయమై రాజకీయ అభ్యర్థులు, ఏజెంట్లందరికీ లిఖితపూర్వకంగా తెలియజేయాలని, ఓటర్లకు అవగాహన కల్పించేందుకు తగిన ప్రచారం చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి జిల్లా ఎన్నికల అధికారికి సూచించారు.
కొంటామల్లో రీపోలింగ్
Published Thu, May 23 2024 3:35 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- అమెరికాలో బాపట్ల యువకుడి హత్య : హంతకుడు అరెస్ట్
- కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న నీతా అంబానీ
- కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ వారిపై 'రేణూ దేశాయ్' ఫైర్
- ఏడు పదుల వయసులో అందాల పోటీలో పాల్గొన్న మహిళగా రికార్డు!
- T20 World Cup 2024: ఆసీస్పై టీమిండియా విజయం.. హిట్మ్యాన్ ఖాతాలో రికార్డుల వెల్లువ
- చికెన్, ఫిష్ కబాబ్స్ల్లో కృత్రిమ రంగుల వాడకం నిషేధం!
- మణిపూర్లో ‘కుకీ’ల కొత్త డిమాండ్.. బీజేపీ నిర్ణయమేంటి?
- లీకైన ఫోటోలు.. దుమారం రేపుతున్న త్రిష, విజయ్ వ్యవహారం
- కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్కేసర్ కేసులో విస్తుపోయే విషయాలు
- కావ్య కనుసైగలతో మాలేపాటిపై కేసుల నమోదు?
Advertisement