ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది | Sakshi
Sakshi News home page

ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది

Published Tue, May 7 2024 11:30 AM

ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది

చిలకలూరిపేట: ఆర్యవైశ్యులకు ఎప్పుడూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నియోజకవర్గంలోని పట్టణం, నాదెండ్ల, యడ్లపాడు, చిలకలూరిపేట మండలాలకు చెందిన ఆర్యవైశ్యలు కుటుంబ సమేతంగా హాజరై తామంతా వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్ధి కావటి శివనాగ మనోహర్‌ నాయుడు మాట్లాడుతూ ఆర్యవైశ్యులతో తమ కుటుంబానికి ఆత్మీయ బంధం ఉందన్నారు. గత టీడీపీ హయాంలో ఆర్యవైశ్యులకు అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి అయిన వెంకాయమ్మ వి–ట్యాక్స్‌ విధించి వేధించిన విషయం తనకే కాదు నియోజకవర్గం అందరికీ తెలిసిందేనన్నారు. పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్‌ మిట్టపల్లి రమేష్‌, జ్ఞానేశ్వర ఫౌండేషన్‌ చైర్మన్‌ షేక్‌ జాన్‌సైదా ఆర్యవైశ్యుల సేవాభావాన్ని, ఐక్యతను, వారి సాధకబాధల గురించి ప్రసంగించారు.

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ చిలకలూరిపేటలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థ్ధి కావటి

Advertisement
 
Advertisement