అచ్చంపేట: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన టీడిపీ కార్యకర్తలు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. వారందరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. తాళ్లచెరువు గ్రామం నుంచి టీడిపీకి చెందిన 20 కుటుంబాల వారు వైఎస్సార్ సీపీలో చేరారు. అచ్చంపేట ఎస్సీ కాలనీకి చెందిన 25 కుటుంబాల వారు వైఎస్సార్ సీపీలో చేరారు. చింతపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు వైఎస్సార్ సీపీలో చేరారు. తాడువాయి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన 20 కుటుంబాల వారు ప్రలోభాలకు లొంగి పొరపాటు చేశామంటూ తిరిగి ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి మరీ తిరిగి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చేత వైఎస్సార్ సీపీ కండువాలు కప్పించుకున్నారు.
వైఎస్సార్సీపీలోకి
50 యాదవరాజుల కుటుంబాలు
నరసరావుపేట రూరల్: కేసానుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ మాజీసర్పంచ్ లింగాల లక్ష్మీనారాయణతోపాటు 50 యాదవరాజుల కుటుంబాలు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరాయి. గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్ధి పి.అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సిఎం జగనన్న అందిస్తున్న సంక్షేమ పాలన చూసి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు మాజీ సర్పంచ్ లింగాల లక్ష్మీనారాయణ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు మారూరీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీలో పలువురు చేరిక
ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి
పిడుగురాళ్ల: పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీలో పలువురు చేరారు. మాచవరం మండలంలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీకి చెందిన 10 కుటుంబాలు తెలుగు దేశం పార్టీ నాయకులు పనితీరు నచ్చక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి గురజాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మె ల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా కాసు మహేష్రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అందించే సంక్షేమ పథకాలు, నియోజక వర్గంలో మహేష్రెడ్డి అందించిన అభివృద్ది చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు.
టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
పిడుగురాళ్ల: పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో తెలుగు దేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరారు. గురజాల మండలం పల్లెగుంతల గ్రామానికి చెందిన 10 కుటుంబాల వారు తెలుగు దేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు జాస్తి శంకరయ్య, వంకాయల పాటి నాగేశ్వరరావు, దూళ్లిపాళ్ల వెంకటేశ్వర్లు, ముప్పాళ్ల ఆంజనేయులు, గోళ్ల రామయ్యలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన
ఎమ్మెల్యే నంబూరు శంకరరావు