ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి | Bandi Sanjay Comments on BRS Govt | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి

Sep 11 2023 3:00 AM | Updated on Sep 11 2023 3:00 AM

Bandi Sanjay Comments on BRS Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా­స్వామ్య తెలంగాణ ఏర్పా­టు లక్ష్యంగా జరుగుతున్న పోరాటానికి మద్దతివ్వాలని ప్ర­వాస భారతీయులకు బీజేపి జాతీయ ప్రధాన కార్య­దర్శి, ఎంపీ బండి సంజయ్‌  పిలుపు­నిచ్చా­రు. తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ధి జరు­గుతోందంటే ప్రధాని మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధులవల్లేనని చెప్పారు. ముఖ్యంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రమే నిధులిస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో అవినీతికి పాల్పడటం తప్ప బీఆర్‌ఎస్‌ ప్రభు­త్వం చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజె­ర్సీలో ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ అఫ్‌ బీజేపీ (ఓఎఫ్‌­ఓబీ) ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్‌ మాట్లాడారు.  ప్రవాస భారతీ­యులు ఎన్నికల సమయంలో కచ్చితంగా కనీ­సం 15 రోజుల సమయమైనా వెచ్చించి దేశా­నికి రావాలని కోరారు.

రాష్ట్రంలో అవినీ­తిని నిర్మూలించడంతోపాటు పేదలకు పక్కా గృహ సదుపాయం, నిరక్షరాస్యత నిర్మూలన, ఉన్నత విద్యావ్యాప్తితోపాటు  తాగు, సాగు నీటి ప్రాజె­క్టులను పెద్ధ ఎత్తున నిర్మించాల్సిన అవసర­ముందన్నారు. కార్య­క్రమంలో  కృష్ణారెడ్డి అనుగుల (ఓఎఫ్‌ఓబీ జాతీ­య పూర్వ అధ్య­క్షులు), ప్రవాస భారతీ­యులు వి­లాస్‌ రెడ్డి, జంబుల  సంతోష్‌ రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి తుమ్మల, వంశీ యంజాల, ప్రదీప్‌ రెడ్డి కట్ట పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
Advertisement