democracy
-
రాజా.. ఐ లవ్ యూ రాజా!
బూజు పట్టిన రాజరికాన్ని నేపాల్ ప్రజలు 19 ఏళ్ల క్రితమే వదిలించుకున్నారు. నాటి నాటకీయ పరిణామాలతో రాజు జ్ఞానేంద్ర షా (77) చేసేది లేక గద్దె దిగాడు. కిరీటం పక్కన పెట్టి, సింహాసం దిగి, రాజదండం వదిలేసి మాజీ అయ్యాడు. రాజభవనం ‘నారాయణ్ హితి ప్యాలెస్’ను ఖాళీ చేశాడు. సాధారణ పౌరుడిగా జీవనం ఆరంభించాడు. ఇదంతా పాత ముచ్చట. కొందరు నే’పాలితులు’ మళ్లీ ఇప్పుడు ‘రాజరికమే ముద్దు’ అంటున్నారు. రాజు పరిపాలనే కావాలని కోరుకుంటున్నారు. మాజీ రాజు జ్ఞానేంద్ర షా(Gyanendra Shah) ఇటీవలి కాలంలో దేశంలో పర్యటిస్తున్నారు. పశ్చిమ నేపాల్ తీర్థయాత్రలు ముగించుకుని రెండు నెలల అనంతరం ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఆదివారం పది వేల మంది మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ‘దేశాన్ని మీరే కాపాడాలి’ అంటూ ఆయనను ఉద్దేశించి నినాదాలతో హోరెత్తించారు. ‘రాజు కోసం రాజభవనాన్ని ఖాళీ చేయాలి. రాజు మళ్లీ రావాలి. మాకు రాజరికమే(Monarchy) కావాలి. మా రాజు చిరకాలం జీవించాలి’ అని వారంతా గళమెత్తారు. హిందూ మతాన్ని మళ్లీ దేశ అధికారిక అభి‘మతం’గా మార్చాలని డిమాండ్ చేశారు. జ్ఞానేంద్ర ఎలాంటి వ్యాఖ్యలూ లేకుండానే వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు.జ్ఞానేంద్ర మామూలోడు కాదురాజభవనంలో తమ కుటుంబ సభ్యుల ఊచకోత దుర్ఘటన దరిమిలా.. 2002లో జ్ఞానేంద్ర షా నేపాల్ రాజు అయ్యారు. అప్పటినుంచి దేశ రాజ్యాంగాధినేతగా నామమాత్ర అధికారాలతో నెట్టుకొచ్చిన ఆయన.. 2005లో రాజకీయ, కార్యనిర్వహణాధికారాలను కూడా సొంతం చేసుకుని సంపూర్ణాధికారం చేజిక్కించుకున్నారు. ప్రభుత్వాన్ని, పార్లమెంటును రద్దు చేయడమే కాకుండా రాజకీయ నాయకులు, జర్నలిస్టులను జైళ్లలో పెట్టించారు. సమాచార వ్యవస్థలను స్తంభింపజేసి, అత్యయిక పరిస్థితి ప్రకటించారు. తన ఏలుబడికి వీలుగా సైన్యాన్ని రంగంలోకి దింపారు. ఈ ఘటనలు ప్రజల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతను ఎగదోశాయి. 2006లో దేశవ్యాప్తంగా ప్రజా నిరసనలు మిన్నుముట్టడంతో జ్ఞానేంద్ర సింహాసనం దిగారు. దేశంలో 240 ఏళ్లుగా కొనసాగుతున్న హిందూ రాజరికాన్ని రద్దు చేయాలని నేపాల్ పార్లమెంటు 2008లో నిర్ణయించడంతో ఆయన రాయల్ ప్యాలెస్ విడిచిపెట్టారు. అలా నేపాల్ 2008లో లౌకిక, గణతంత్ర రాజ్యమైంది. అయితే.. తమ గణతంత్ర రాజ్యం అనుకున్నంత ‘ఘన’తంత్రంగా లేదంటూ నేపాల్ ప్రజల్లో తాజాగా అసమ్మతి పెచ్చరిల్లుతోంది. దేశంలో రాజకీయ అస్థిరత వేళ్లూనుకుందని, అవినీతి అర్రులు చాచి విచ్చలవిడిగా పెరిగిందని, ఆర్థిక రంగం కుదేలైందని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజరికం రద్దయిన 2008వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు దేశంలో 13 ప్రభుత్వాలు మారడమే రాజకీయ అస్థిరతకు తార్కాణమని అసంతృప్తవాదులు మండిపడుతున్నారు. దేశం మరింత పతనావస్థకు దిగజారకుండా ఉండాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని వారు అభిలషిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో రాజరిక వ్యవస్థకు మళ్లీ అవకాశం లేదని నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి సహా పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.మావోయిస్టు ప్రధానిగా ప్రచండ!ఇప్పుడు మనం చూస్తున్న హిమ రాజ్యం నేపాల్(Nepal) ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. ఆ చిన్న ముక్కలన్నిటిని రాజు పృథ్వీనారాయణ్ షా 1768లో ఏకీకృతం చేసి ‘నేపాల్ సామ్రాజ్యం’గా మార్చారు. 1800 సంవత్సరం నుంచి రాజప్రతినిధులు, ప్రధానమంత్రులు నియమితులై షా వంశ రాజుల పేరిట అధికారం చెలాయిస్తూ వచ్చారు. అప్పట్లో రాజు పదవి లాంఛనప్రాయం. తన పూర్వీకుల మాదిరిగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూనే రాజు త్రిభువన్ షా 1950లో ‘రాజకీయ పాత్ర’ను కూడా కొత్తగా తలకెత్తుకున్నారు. ఇక నాటి నుంచి 2006లో ‘రాజు పదవీచ్యుతి ఉద్యమం’ కొనసాగే వరకు షా వంశ రాజులు రాజకీయాధికారం కూడా చెలాయించారు. త్రిభువన్ షా కుమారుడు మహేంద్ర షా ఆధునిక నేపాల్ రూపశిల్పి. ‘హిందూ రాజరికం’ భావనకు కూడా ఆయనే మార్గదర్శి. తదనంతర కాలంలో ప్రజల నుంచి ఎదురైన నిరసనలను దృష్టిలో ఉంచుకున్న రాజు బీరేంద్ర షా 1990లో ‘సంపూర్ణ రాజరికం నుంచి రాజ్యాంగ రాజరికానికి’ నేపాల్ పరివర్తన చెందేందుకు అంగీకరించి, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుతో అధికారం పంచుకోవడానికి సంసిద్ధుడయ్యాడు. ఇలా రాజీ కుదిరినా ప్రజల్లో అసమ్మతి సెగ మాత్రం చల్లారలేదు. 1990వ దశకం మధ్యలో దేశంలో మావోయిస్టుల తీవ్రవాదం విస్తరించింది. ‘ప్రచండ’గా సుప్రసిద్ధుడైన మావోయిస్టు ఉద్యమ నేత పుష్పకమల్ దహాల్ ఆ తర్వాత దేశ ప్రధానమంత్రి అయ్యాడు.రాజకుటుంబంలో రక్తపాతం!2001లో నేపాల్ రాజభవనంలో చోటుచేసుకున్న మారణకాండలో రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్య, మరో ఎనిమిది మంది రాజ కుటుంబీకులు హత్యకు గురయ్యారు. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడానికి ఇంటి పెద్దలు అంగీకరించకపోవటంతో యువరాజు దీపేంద్ర ఆగ్రహించి మద్యం మత్తులో తన కుటుంబ సభ్యులను చంపడమే కాకుండా తానూ తుపాకితో కాల్చుకుని మరణించాడు. ఈ పరిణామం తర్వాత జ్ఞానేంద్ర షా రాజు అయినప్పటికీ ఆయన పదవీకాలం స్వల్పమే. జ్ఞానేంద్రకు తాజాగా ఖాట్మండు విమానాశ్రయం వద్ద స్వాగతం పలకాలని బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా సామాజిక మాధ్యమాల వేదికగా నేపాలీలకు పిలుపునివ్వడం కొసమెరుపు! దేశంలో ఎన్నికైన తొలి ప్రధానమంత్రి బి.పి.కొయిరాలాకు మనీషా స్వయానా మనవరాలు. ::జమ్ముల శ్రీకాంత్(Courtesy: CNN, The Times of India, WION, India Today, Al Zazeera) -
రాజ్యాంగ హక్కులపై దాడిని ఖండిద్దాం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులపై జరుగుతున్న దాడిని ప్రజలంతా ఖండించాలని నేషనల్ అల యన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ (ఎన్ఏపీఎం) రెండో ప్లీనరీలో వక్తలు పిలుపునిచ్చారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఎన్నో హక్కులపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని జైళ్లపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, పౌరహక్కుల నేతలు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దని సూచించారు. ఎన్ఏపీఎంను ప్రారంభించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన రెండో ప్లీనరీ సమావేశాలు శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభమయ్యాయి. 4వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో 24 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రజాస్వామ్య ఉద్యమాలపై ప్రభుత్వాల అణచివేత, ఆదివాసీల హక్కులపై దాడి తదితర అంశాలపై ప్లీనరీలో చర్చించనున్నారు. శనివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారిణి అరుణా రాయ్, న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ఇర్ఫాన్ ఇంజనీర్, ప్రొఫెసర్ శాంతాసిన్హా, డీయూ సరస్వతి, టీఎం కృష్ణ పలు అంశాలపై మాట్లాడారు. ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దు: అరుణారాయ్ ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దని అరుణా రాయ్ అన్నారు. భారతదేశం అంటే భిన్న సంస్కృతులు, భిన్న భాష ల కలయిక అని.. ఆ భిన్నత్వాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం పాలకులు ప్రజలను విడదీసేందుకు మతాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. అది ఎంతో ప్రమాదమని హెచ్చరించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులపై గ్రామ స్థాయి లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ శాంతా సిన్హా అన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ రిలీజియన్ అన్న నినాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దని ఇర్ఫాన్ ఇంజనీర్ సూచించారు. ప్రస్తు త రాజకీయాలు దేశ ప్రజలపై మతం అనే కారుమబ్బులను కప్పుతున్నాయని, వాటిని అడ్డుకోవాల్సి న అవసరం ఉందని టీఎం కృష్ణ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హ క్కులతోపాటు సమాజంలోని మహిళలు, పిల్లలు, ట్రాన్స్జెండర్లు.. ఇలా అణచివేతకు గురవుతున్న ఎన్నో వర్గాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని డీయూ సరస్వతి అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని, దేశ సహజ సంపదను బడా కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తోందని సమావేశంలో పాల్గొన్న పలువురు ఆదివాసీ ఉద్యమ నేతలు ఆరోపించారు. అరుణా రాయ్ రచించిన ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’పుస్తకాన్ని ప్రశాంత్ భూషణ్ తదితరులు ఆవిష్కరించారు. సోషల్మీడియా ద్వారానే అధిక హింస: ప్రశాంత్ భూషణ్ దేశంలో వాక్ స్వాతంత్య్రంపై ఎక్కువ దాడి జరుగుతోందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వాలను విమర్శిస్తే జైళ్లలో వేస్తున్నారని అన్నారు. స్వేచ్ఛగా మాట్లాడేవారిని సోషల్ మీడియా వేదికగా హింసించడం పెరిగిందని తెలిపారు. భౌతికంగా కంటే సోషల్ మీడియాలోనే ఇప్పుడు అతిపెద్ద హింస జరుగుతోందని చెప్పారు. సోషల్ మీడియాలో విద్వేష పూరిత పోస్టులు పెట్టేవారిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికార వికేంద్రీకరణ జరిగితేనే మార్పు సాధ్యమని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి డబ్బుతో అధికారం సంపాదించటం.. అధికారంలోకి వచ్చాక మళ్లీ డబ్బు సంపాదన అన్నట్టుగా మారిందని అన్నారు. చర్చ జరగకుండానే కొత్త చట్టాలు రూపొందిస్తున్నారని, కొన్నిసార్లు ఒకే రోజులో పదుల సంఖ్యలో నూతన చట్టాలు రూపొందిస్తున్న పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థలకు స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. -
న్యాయ వ్యవస్థకు తాడు మీద నడక
రణవీర్ అలహాబాదియా కేసు ఎంత సంక్లిష్టమో సుప్రీంకోర్టు దాన్ని డీల్ చేసిన తీరు తేటతెల్లం చేస్తోంది. ఈ విచారణ... నైతిక ఆగ్రహానికీ, రాజ్యాంగ ఔచిత్యానికీ నడుమ తాడు మీద చేసిన నడకను తలపిస్తోంది. వాదప్రతివాదాలు విన్న తర్వాత యూ ట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రణవీర్కు ఊరట కల్పిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది. రణవీర్ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ వ్యక్తి. ‘ఇండియా గాట్ లేటెంట్’ అనే వెబ్ టాలెంట్ షోలో అతను చేసిన వ్యాఖ్యలపై అనేక ఎఫ్ఐఆర్లు దాఖలు అయ్యాయి. ఆ వ్యాఖ్యలు సరదా కోసమే చేసినప్పటికీ వాటిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. మీడియా సంస్థలు, రాజకీయ నేతలు గగ్గోలు పెట్టడం అగ్నికి ఆజ్యం పోసి నట్లయింది. రణవీర్ భాష ఎంత అసహ్యకరంగా ఉంది అన్నది న్యాయపరంగా ప్రధాన ప్రశ్న కాదు, అది భారతీయ చట్టాల ప్రకారం నేరపూరిత అపరాధం అవుతుందా అవ్వదా అన్నదే ముఖ్యం. ఆయన న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ న్యాయస్థానంలో చేసిన ఈ వాదన ఎంతైనా సమంజసం. వారికీ రాజ్యాంగ రక్షణ అవసరంకానీ కోర్టు ఇలాంటి సూక్ష్మ అంశాలను పట్టించుకునే మూడ్లో లేదు. భాష ‘డర్టీ’గా, ‘పర్వర్టెడ్’గా ఉందంటూ విచారణ ఆసాంతం ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తన ఏహ్యభావం వ్యక్తం చేసింది. ఒక దశలో న్యాయమూర్తి కల్పించుకుని, ‘‘ఇలాంటి భాషను మీరు సమర్థిస్తున్నారా?’’ అని చంద్రచూడ్ను ప్రశ్నించారు. నిజానికి డిఫెన్స్ లాయర్ పాత్ర... అత్యంత తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్ననిందితుడికి సైతం న్యాయవ్యవస్థ ద్వారా చట్టపరమైన రక్షణ లభించేట్లు చూడటమే!సుప్రీంకోర్టు సమాజ నైతికతకు సంరక్షకురాలు కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి రాజ్యాంగ హక్కులను కాపాడటమే దాని ప్రాథమిక విధి. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం అంటే జనామోదం పొందిన భావప్రకటనను పరిరక్షించడం అనుకోకూడదు. అప్రియమైన, జనాదరణ లేని భావప్రకటన చేసి నప్పుడు అలాంటి వారికి రాజ్యాంగపరమైన రక్షణ అవసరం అవుతుంది.అభినవ్ చంద్రచూడ్ ఈ విచారణ సందర్భంగా న్యాయ సూత్రాల మీదకు కోర్టు దృష్టిని మరల్చారు. అపూర్వ అరోరా వెబ్ సిరీస్ (కాలేజ్ రొమాన్స్) కేసును ఉదహరిస్తూ, అసభ్యత మాత్రమే అశ్లీలత అవ్వదన్న సుప్రీం తీర్పును ఆయన ప్రస్తావించారు. ఒకరి భావప్రకటన ఇతరుల లైంగిక వాంఛలను ప్రేరేపించడానికి ఉద్దేశించి నదా, హద్దులు దాటి నేరపూరితమైన అశ్లీలతకు అది కారణమైందా అనే అంశాల ప్రాతిపదికగా దాన్ని పరీక్షకు పెట్టాలని ఈ తీర్పు చెబుతోంది. న్యాయస్థానం దీన్ని పట్టించుకున్నట్లు లేదు. ‘‘ఇది అశ్లీలత కాకుంటే, మరేది అశ్లీలత అవుతుంది?’’ అని ప్రశ్నించింది. కోర్టులు నైతిక శూన్యంలో పని చేయాలని అనడం లేదు. అలా అని వాటి నైతిక పరమైన ఏహ్యత... న్యాయ తర్కాన్ని కప్పివేయకూడదు. అరోరా కేసు ‘‘మీరు ఏదనుకుంటే అది మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చిందా?’’ అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. తన వ్యక్తిగత మర్యాద భావన నుంచి వాక్ స్వాతంత్య్ర సంరక్షణను వేరు చేయడానికి కోర్టు విముఖంగా ఉన్నట్లు ఈ ప్రశ్న సంకేతాలు ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో కేసు ఎదుర్కొంటున్న ‘యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్’ రణవీర్ అలహాబాదియా పితృస్వామ్య కథనంరణవీర్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు ఆయన న్యాయవాది చంద్రచూడ్ కోర్టు దృష్టికి తీసుకురాగా, జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్య ప్రస్తుత హియరింగ్లో అత్యంత కలవరం కలిగించిన అంశం! ఈ తరహాలో చౌకబారు ప్రచారం పొందాలని మీరు ప్రయత్నించినట్లే, బెదిరింపుల ద్వరా చౌకబారు ప్రచారం సంపాదించాలని ప్రయత్నించే వారు కూడా ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. రణవీర్ మాటలు ఎంత అభ్యంతర కరమైనవి అన్నది పక్కనపెడితే, చంపేస్తామనే బెదిరింపులు వాటికి పర్యవ సానం కారాదు. రణవీర్ వ్యాఖ్యలు తన తల్లిదండ్రులకు అవమానం కలిగించా యని విచారణలో కోర్టు పదేపదే ప్రస్తావించింది. భారతీయ సాంస్కృతిక నియమాలను ఈ పితృస్వామ్య నెరేటివ్ ప్రతిఫలిస్తుంది. రాజ్యాంగంలో దీనికి చోటు లేదు. న్యాయస్థానాలు నైతికతకు పున రావాస కేంద్రాలు కావు. రణవీర్ నేరం చేశాడా లేదా అన్నదానికి... అతడు తన కుటుంబాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాడన్నది సంబంధం లేని విషయం. సామాజిక తిరస్కారాన్ని చట్టపరమైన నేరారోపణతో ముడిపెట్టడం అనేది కోర్టులు దాటకూడని ప్రమాదకమైన రేఖ. కోర్టు చిట్టచివరకు రణవీర్కు మధ్యంతర ఉపశమనం మంజూరు చేసింది. ప్రతివాదులకు నోటీసు జారీచేసి వారి సమాధానం కోరింది. ఇది సరైన నిర్ణయం. రణవీర్ వ్యాఖ్యలకు అభ్యంతరకర స్వభావం ఉన్నప్పటికీ, వాటిని నేరంగా గుర్తించడానికి అది చాలదు.‘ఇండియా గాట్ లేటెంట్’ వెబ్ షో వివాదం, పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఈ కార్యక్రమ స్వభావం సందర్భపరమైన ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తింది. రణవీర్ వ్యాఖ్యల క్లిప్ అసందర్భంగా లీక్ అయ్యింది. ఆ విషయం కోర్టుకూ తెలిసినట్లే ఉంది. అయినా విచారణలో ఈ ఎరుక ప్రభావం కనిపించలేదు. భావప్రకటన స్వేచ్ఛ కేసుల్లో సంద ర్భానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మూక ప్రేరేపిత నైతిక భయాందోళనల నుంచి కోర్టులు వాక్ స్వేచ్ఛను పరిరక్షించాలి. న్యాయస్థానాలు తమ విచారణలో ఎంత సంయమనం పాటించాల్సి ఉంటుందో గుర్తు చేసేందుకు రణవీర్ కేసు చక్కటి ఉదా హరణగా నిలుస్తుంది. న్యాయమూర్తులు కూడా మనుషులే. అందరి లానే వారికీ అసహ్యం, కోపం, అనైతికత పట్ల ఏహ్యభావం ఉంటాయి. కాని వారి వృత్తి... భావోద్వేగాలకు లోనై తీర్పులు చెప్పేది కాదు. రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా న్యాయాన్ని పరిరక్షించాలి. జనాభిప్రాయం వేరేలా ఉన్నప్పుడు ఈ విధి కష్టతరంగానే ఉంటుంది. కత్తి మీద సాములా వారు తమ విద్యుక్త ధర్మం నిర్వర్తించాల్సి వస్తుంది. విచారణ జరగాల్సిన తీరువ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడానికి రాజ్యాంగానికి లోబడి అంతిమంగా తాను ఏం చేయాలో అదే మన సర్వోన్నత న్యాయ స్థానం చేసింది. మధ్యంతర ఉపశమనం మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ క్రమంలో అది వ్యవహరించిన తీరు ప్రజలకు అస్పష్ట సంకేతాలు పంపింది. న్యాయవ్యవస్థ నిన్ను కాపాడు తుంది... కానీ ఆ పని నిన్ను అవమానానికి గురి చేసిన తర్వాతే,అసంతృప్తితోనే నీ హక్కులను గౌరవిస్తున్నట్లు నీకు స్పష్టం చేసిన తర్వాతే, నీ మీద తన నైతిక ఆధిక్యతను రుజువు చేసుకున్న తర్వాత మాత్రమే జరుగుతుందని చెప్పకనే చెప్పింది. రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలు పని చేయాల్సిన తీరు ఇది కాదు. జనామోదం కొరవడిన వారికీ, అభ్యంతకరమైన వారికీ, ఆఖరుకు పెర్వర్ట్ అయిన వారికీ ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాపాడేందుకే సుప్రీం కోర్టు ఉన్నది. అసభ్యత నుంచి సమాజాన్ని శుద్ధి చేయడం తన బాధ్యత కాదనీ, తనకు దీపస్తంభంలా నిలవాల్సింది చట్టమే కాని నైతికత కానేకాదనీ న్యాయ స్థానం గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకుంటూ ఈ కేసు విచా రణ కొనసాగిస్తుందని ఆశిద్దాం.సంజయ్ హెగ్డే వ్యాసకర్త సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మన రాజ్యాంగం బలమైనదేనా?
మీకు తెలుసా? ప్రపంచ దేశాలన్నింటి రాజ్యాంగాల సగటు ఆయుష్షు 19 ఏళ్లు మాత్రమేనని! భారతదేశం మాత్రం 75 ఏళ్ల పాటు తన రాజ్యాంగాన్ని కాపాడుకుంది. దీనికి సంతోషపడదాం. గర్వంగా ఫీల్ అవుదాం. దేశ చరిత్రలోనే కీలకమైన ఈ ఘట్టాన్ని గత వారమే చూశాం. అయితే, సమీక్షకు తగిన సమయం కూడా ఇదే! డెబ్ఫై ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత రాజ్యాంగం ఎదుర్కొన్న సవాళ్లు, ప్రశ్నలేమిటన్నది చూద్దాం.మన రాజ్యాంగం వలసవాదులదని చాలామంది మేధావులు విమర్శిస్తూంటారు. భారతీయ మూలాలు ఉన్నది కాదని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానిస్తూ ఉండేది. అలాంటప్పుడు ఇది ఏ విధంగా మనకు మంచిది?ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించిందనేది ఒక సమాధానం. అలాగే ఏకకాలంలో అర్హులందరికీ ఓటుహక్కు కల్పించిన రాజ్యాంగం కూడా మనదే. కానీ దీనివల్ల అందరూ సమానంగా లాభ పడ్డారా? లేక... ముస్లింలు, ఆదివాసీలు, దళిత మహిళలు లాభ పడలేదా? డెబ్భై ఏళ్ల ప్రయాణంలో మన రాజ్యాంగం ఇప్పటివరకూ 106 సార్లు మార్పులకు గురైంది. ఇది మన శక్తికి ప్రతీకా? ఎందుకంటే, అవసరమైనప్పుడు తగు విధంగా మార్పులు, చేర్పులు చేసుకునే వీలుతో రాజ్యాంగం ఉంది. లేదా ఇది బలహీనతా? అగ్రరాజ్యం అమెరికాలో 1789 నుంచి జరిగిన సవరణలు కేవలం 27 మాత్రమే.శాసనాలు చేసే ప్రజా ప్రతినిధుల వ్యవస్థ కంటే కార్యనిర్వాహక వర్గాన్ని రాజ్యాంగం ఎక్కువ బలోపేతం చేసిందని చెబుతారు. అసెంబ్లీ స్పీకర్ల పనితీరు, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ఈ పరి స్థితిని మరింత దిగజార్చాయి. ఫలితంగా ఎంపీలు పార్టీ నాయకత్వా నికి సబార్డినేట్లుగా మారిపోయారు. స్పీకర్లకు హౌస్ ఆఫ్ కామన్ ్స (యూకే) మాదిరిగా వారిపై అధికారం ఏదీ ఉండదు. ఈ విమర్శను ఇప్పటివరకూ ఎవరూ సవాలు చేయలేదు కూడా! అయితే దీని వెనుక ఏముందన్నది నిశితంగా పరిశీలించాల్సిన అంశం. ‘‘భారతీయ రాజ్యాంగం అడ్డుగోడలు నిర్మించకుండా... కార్యనిర్వాహక వర్గానికి ఎక్కువ అధికారాలు ఇచ్చింది. అంతేకాకుండా ఈ వర్గం తన అధికారాన్ని పూర్తిస్థాయిలో చలాయిస్తుందని విశ్వసించింది’’ అంటారు గౌతమ్ భాటియా. పాలకులందరూ మంచివారనీ, రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారని రాజ్యాంగ నిర్మాతలు భావించారా? ఊహూ, అలా అనుకోలేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఒక ఉదాహరణ – ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి. ఇది రాజ్యాంగాన్ని సుప్తచేతనావస్థలో పెట్టడం వల్లనో, రాజ్యాంగా నికి అతీతంగా పోవడం వల్లనో అమలు కాలేదు. దాంట్లో భాగమైన వ్యవస్థలతోనే జరిగింది. ఇది మన రాజ్యాంగం బలహీనత లేదా లోపాన్ని ఎత్తిచూపింది. రాజ్యాంగ పరమైన నైతికత లేని విషయాన్ని ఎమర్జెన్సీ పరిస్థితి ఎత్తి చూపిందని చెప్పవచ్చు. ఈ నైతికత అనేది రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు పనిచేస్తాయా, లేదా అన్నదాన్ని నిర్ణయిస్తుంది. గవర్నర్లు, ఎన్నికల కమిషనర్లు తరచూ ఈ రాజ్యాంగ నైతికతను తప్పుతుంటారని మనకు తెలుసు. కానీ వాటిపై వ్యాఖ్యా నించడం కంటే ఎక్కువేమీ చేయలేము – ఈ అంశాలపై మనఆందోళన, విమర్శ ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ! రాజ్యాంగంలో ఉన్న మరో లోటు ఇదేనా?రాజ్యాంగం సమాఖ్య నిర్మాణానికి ఏర్పాటు చేసింది. కానీ ఆర్థికాంశాలతో పాటు పరిపాలనకు సంబంధించిన విషయాల్లోనూ రాష్ట్రాలపై పెత్తనం చలాయించే అధికారం కేంద్రానికి కట్టబెట్టింది. సమాఖ్య స్వరూపాన్ని మార్చే అధికారం, శక్తి కూడా కేంద్రానిదే. స్వాతంత్య్రం లభించిన సమయంలో దేశం బలహీనంగా, ముక్కలు ముక్కలుగా విడిపోయింది కాబట్టి... ఆ పరిస్థితుల్లో ఇలాంటి ఏర్పాట్లు చేశారని అనుకున్నా మూడు సిల్వర్ జూబ్లీల కాలం గడచిన ఈ తరుణంలోనైనా మార్పులు చేయడం అనవసరమా? భారతీయ పౌరులకు రాజ్యాంగం బోలెడన్ని ప్రాథమిక హక్కు లను కల్పించింది. అయితే భావ ప్రకటన, వ్యక్తీకరణపై పూర్తిస్థాయి స్వాతంత్య్రం మాత్రం లేకుండా పోయింది. నిజానికి ఈ ‘ఫ్రీ స్పీచ్’ను నైతికత, పరువునష్టం వంటి రెండు సందర్భాల్లో మాత్రమే నియంత్రించాల్సి ఉంటుంది. మహా అయితే... విదేశాలతో మన సంబంధాలు దెబ్బతినే పరిస్థితులకూ పొడిగించవచ్చు. కానీ... మనకున్న నియంత్రణలు చాలా ఎక్కువగా లేవూ?1973లో రాజ్యాంగంపు మౌలిక స్వరూపాన్ని కాపాడే లక్ష్యంతో సుప్రీంకోర్టు కొన్ని విధి విధానాలను సిద్ధం చేసింది. ఇదో చారిత్రక నిర్ణయం. అయితే దాదాపుగా అదే సమయంలో జబల్పూర్ అడిష నల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎమర్జెన్సీ విషయంలో శాసనకర్తల ఒత్తిడికి లొంగిపోయారు. అయోధ్య విషయంలోనూ ఇదే జరిగిందన్నది చాలామంది అభిప్రాయం. అలాగే జమ్మూ–కశ్మీర్కు ఉన్న రాష్ట్ర హోదాను కూడా రాజ్యాంగం కాపాడలేకపోయింది. కాబట్టి... రాజ్యాంగ సంరక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు తమ నిర్ణయాల్లో అసందిగ్ధతతో వ్యవహరిస్తున్నాయి. లేదంటే అవసరమైనంత చేయడం లేదు. రాజ్యాంగం మనకు ఎన్నికల కమిషన్ , కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), ఇన్ఫర్మేషన్ కమిషన్ వంటి ఎన్నో వ్యవస్థలను కల్పించింది. కానీ... ఇవి పాలకవర్గానికి అతీతంగా స్వతంత్రంగా పని చేసేలా మాత్రం చేయలేకపోయింది. ఆ యా సంస్థల ఉన్నతాధి కారుల నియామకాల విషయంలో ఇది మరింత సత్యమని చాలా మంది చెబుతారు. చివరగా... రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన రాజకీయ నేతలు, సంస్థల అధినేతలు ఆ పని ఎంత వరకూ సక్రమంగా నిర్వర్తించారు? అలాగే రాజ్యాంగ సంరక్షణ బాధ్యతను న్యాయమూర్తులు ఎంత సమర్థంగా నిర్వహించారు? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ను ఇదే ప్రశ్న అడిగితే... ‘‘భారత్కు మంచి రాజ్యాంగం ఉంది. కీలక సందర్భాల్లో రాజకీయ నేతలు, న్యాయమూర్తులు దీని ప్రతిష్ఠను దిగజార్చారు. పాలకవర్గం మాత్రమే కాదు... పార్లమెంటు కూడా ఇందులో భాగస్వామే’’ అన్నారు. ఇందులో అంగీకరించక పోయేందుకు ఏమీ లేదన్నది నా అభిప్రాయం!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సంపన్నుల ఆధిపత్యం ఆందోళనకరం
వాషింగ్టన్: అమెరికాలో సంపన్నుల ఆధిపత్యం నానాటికీ పెరిగిపోతోందని, ఇది నిజంగా ప్రమాదకరమైన పరిణామం అని అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తంచేశారు. కొందరు ధనవంతులు దేశాన్ని శాసించే పరిస్థితి రావడం సరైంది కాదని అన్నారు. దేశ ప్రజాస్వామ్యం భద్రంగా ఉండాలంటే బడాబాబులు పెత్తనం సాగించే అవకాశం ఉండొద్దని చెప్పారు. బైడెన్ పదవీ కాలం ముగియనుంది. ఈ నెల 20వ తేదీన ఆయన అధ్యక్ష పగ్గాలను డొనాల్డ్ ట్రంప్కు అప్పగించబోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం శ్వేతసౌధంలో బైడెన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్, కుమారుడు హంటర్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఈ సందర్భంగా ఓవల్ ఆఫీసు నుంచి జో బైడెన్ ప్రసంగించారు. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలినప్పటికీ శిక్ష నుంచి తప్పించే అవకాశం ప్రస్తుతం ఉందని, ఈ పరిస్థితి కచి్చతంగా మారాలని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని సూచించారు. ట్రంప్పై ఉన్న క్రిమినల్ కేసులు, ఆయన దోషిగా తేలిన సంగతిని పరోక్షంగా ప్రస్తావించారు. శిక్ష నుంచి తప్పించుకొనే అవకాశం అధ్యక్షుడికి ఇవ్వొద్దని పేర్కొన్నారు. పిడికెడు మంది సంపన్నులు, బలవంతుల చేతుల్లో అధికారం కేంద్రీకృతం కావడం ప్రమాదకరమని వెల్లడించారు. వారు అధికార దురి్వనియోగానికి పాల్పడితే ఊహించని ఉపద్రవాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అందుకే అలాంటివారిని నియంత్రించే వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రభావితం చేసినట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోషల్ మీడియాను జవాబుదారీగా మార్చాలి సమాజంపై సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరుగుతుండడం పట్ల బైడెన్ స్పందించారు. సోషల్ మీడియా కంపెనీల ఆధిపత్యం వల్ల దేశానికి చాలా నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్యానించారు. తప్పుడు సమాచారం, అసత్య ప్రచారం అనే ఊబిలో అమెరికా కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత మీడియా అనేది కనుమరుగు అవుతోందని, ఎడిటర్లు అనేవారు కనిపించడం లేదని అన్నారు. సోషల్ మీడియాలో నిజ నిర్ధారణ అనేది లేకపోవడం బాధాకరమని వెల్లడించారు. అసత్యాల వెల్లువలో సత్యం మరుగునపడడం ఆవేదన కలిగిస్తోందన్నారు. కొందరు స్వార్థపరులు అధికారం, లాభార్జన కోసం సోషల్ మీడియాను విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నారని బైడెన్ ఆరోపించారు. మన పిల్లలను, మన కుటుంబాలను కాపాడుకోవడానికి, అధికార దురి్వనియోగం నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి సోషల్ మీడియాను జవాబుదారీగా మార్చాలని స్పష్టంచేశారు. తగిన నిబంధనలు, రక్షణలు అమల్లో లేకపోతే కృత్రిమ మేధ(ఏఐ) కోరలు మరింతగా విస్తరిస్తాయని, మానవ హక్కులకు, గోప్యతకు భంగం వాలిల్లుతుందని హెచ్చరించారు. తమ నాలుగేళ్ల పాలనలో సాధించిన ఘనతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాము విత్తనాలు నాటామని, వాటి ఫలితాలు తర్వాత కనిపిస్తాయని జో బైడెన్ తేల్చిచెప్పారు. -
స్వాతంత్య్ర ఫలాలను కాపాడుకోవాలి!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఇప్పుడిక భూమ్మీద అత్యధిక జనాభా గల దేశంగానూ అవతరించనుంది. భారతావని 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటోంది. ఈ సమ యంలో మనందరిపై ప్రత్యేక బాధ్యత ఉంది. స్వాతంత్య్రం మనకు ప్రసాదించిన స్వేచ్ఛలను పరిరక్షించుకుంటూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో వాటిని బలోపేతం చేసుకునేందుకు నడుం బిగించాలి. ఎంతో ఉన్నతంగా రెపరెపలాడే జాతీయ జెండాకు సగర్వంగా సెల్యూట్ చేసే ప్రతి భారతీయుడూ ఆ జెండాలోని మూడు రంగుల అంత రార్థాన్ని గ్రహించాలి. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, దేశ సమైక్యతను ప్రతిఫలించే ఆ మువ్వన్నెలే మన ప్రజాస్వామ్యాన్ని అవని మీదే ఉన్నతమైందిగా రూపొందించాయి. భారత ప్రజల ఈ సమైక్యతను దెబ్బతీసే విద్వేష ప్రచారాలను అడ్డు కోవాలి. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అహంకార పూరితమైన నిరంకుశ అధికారం ఎప్పటికీ కబళించకుండా కాపాడుకోవాలి. ఈ చారిత్రక సందర్భంగా ఇలా చేస్తామని మనమందరం ప్రతిన పూనాలి. ఇదే జాతీయ పతాకానికి మనం అర్పించగల ఘన నివాళి. సమైక్యత మన సంపద వలస పాలన మృత్యు కౌగిలి నుంచి విముక్తమైన భారత్ నాడు తక్షణం జాతి సమైక్యతకు నడుం బిగించింది. చెల్లా చెదురుగా ఉన్న బ్రిటిష్ పాలిత ప్రాంతాలను, సంస్థానాలను విలీనపరచి ఒక సమైక్య జాతిగా అవతరించింది. ఈ సమైక్యత రాత్రికి రాత్రే మంత్రం వేసినట్లు వచ్చింది కాదు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన స్వాతంత్య్రోద్యమం, విదేశీ పాలనకు చరమగీతం పాడేందుకు భారతీయులందర్నీ ఏకం చేసింది. భాష, కులం, మతం, స్త్రీపురుష భేదం, సామాజిక అంతరాలు... వీటన్నిటికీ అతీతంగా భారతీయులను ఈ ఉద్యమం సమైక్యం చేసింది. ఈ సమైక్యత భారత్కు అమూల్య సంపద. కుల మత విభేదాలు, భాషా దురహంకారాలతో ఇది నాశనం కాకూడదు.ఇలాంటి కుట్రలతో భారతీయులను భారతీయుల మీదే ఉసిగొల్పి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలను పొందితే పొందవచ్చు. కానీ, ఒక గొప్ప జాతిగా ఈ దేశం ప్రయాణం సాగించే ప్రగతి బాట మీద ఇవి అగాథాలను సృష్టిస్తాయి. వలస పాలకులు మనల్ని నిలువునా దోచారు. వారి నుంచి స్వాతంత్య్రం సాధించుకున్న మనం ఒక బీదదేశంగా కొత్త జీవితం ప్రారంభించాం. ఆ స్థాయి నుంచి నేడు ప్రపంచ అగ్రస్థాయి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగగలిగాం. 1991లో చేపట్టిన ఆర్థిక సరళీకరణ విధానం మన ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చింది. పేదరికం తగ్గింపు, ఆర్థిక అసమానతల తొలగింపు ప్రభుత్వ విధానానికి దిశానిర్దేశం అయ్యాయి. అందరి ఆర్థిక ప్రయోజనమే మనకు పరమావధి అయ్యింది. ఒకవైపు ఆర్థిక అంతరాలు పెరుగుతూ, మరోవైపు ఎంపిక చేసిన కొద్ది మంది వ్యాపార దిగ్గజాలే సంపద ప్రయోజనాలను పొందడాన్ని మనం అనుమ తించకూడదు.వేర్పాటు రాజకీయాలు కూడదు! ఉపాధి లేని వృద్ధి ఏ ఆర్థిక వ్యవస్థకూ క్షేమం కాదు. సామాజిక అసంతృప్తికి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలకు నిరుద్యోగ సమస్య దారితీస్తుంది. జనాభాలో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న యువజనులకు విద్య, నైపుణ్యం, తగు ఉపాధి కల్పించాలి. ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలకు, ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వాలి. తద్వారా గరిష్ఠ ఆర్థిక ప్రయోజనం పొందాలన్నదే ధ్యేయంగా రానున్న 25 సంవత్సరాలకు బాటలు వేసుకోవాలి. ఇది సుసాధ్యం కావాలంటే విద్య, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు దేశం నలు మూలలకు స్వేచ్ఛగా వెళ్లగలగాలి. మతం, భాష వంటివి ఈ స్వేచ్ఛా గమనానికి అడ్డంకులు కాకూడదు. దేశ పారిశ్రామిక సారథులు అవరోధాల ప్రమాదాన్ని గుర్తించి జాతీయ సమైక్యతకు గళం విప్పాలి. విచ్ఛిన్న రాజకీయాలు ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుంటే వారు మౌన ప్రేక్షుల్లా ఉండిపోకూడదు. శాస్త్రీయ సంప్రదాయం నిలబెట్టాలి! స్వాతంత్య్రం తొలినాళ్ల నుంచీ దేశం శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రగతి సాధనకు దాన్ని మార్గం చేసుకుంది. పురోగమన దృక్పథంతో నేషనల్ సైన్స్ పాలసీ రూపుదిద్దుకుంది. విజ్ఞానం, బోధన, పరిశోధనలకు గొప్ప గొప్ప సంస్థలు ఏర్పాటయ్యాయి. అనేక భారతీయ సాంకేతిక సంస్థలు ప్రపంచ గుర్తింపు పొందాయి. వాటిలో చదివిన పలువురు విద్యావంతులు నేడు ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార సంస్థలకు సారథ్యం వహిస్తున్నారు. అంతరిక్ష, సాగర, అణుశక్తి కార్య క్రమాలు మనల్ని అంతటి సామర్థ్యం ఉన్న అతి కొద్ది దేశాల సరసన నిలిపాయి. శాస్త్రీయంగా, సాంకేతికంగా ప్రపంచ గుర్తింపు పొందిన మన వైజ్ఞానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల సారథ్య బాధ్యతల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం పేరిట తక్కువ ప్రతిభావంతులకు చోటు కల్పిస్తే అంతకు మించిన దురదృష్టం ఉండదు. ప్రాచీనకాలం నుంచీ మనకు గర్వించదగిన సాంప్రదాయిక విజ్ఞానం ఉంది. అయితే అది ఆధునిక విజ్ఞానాన్ని మసకబరచి మేటి శాస్త్రవేత్త లకు అపఖ్యాతి తేకూడదు.స్పష్టమైన విదేశీ విధానాలురెండు అధికార కూటములు ప్రపంచంపై పట్టు సాధించడానికి పోటీపడుతున్న సమయంలో... దేశాల మధ్య శాంతి సామరస్యాలు మెరుగుపరచడానికి మనం అవలంబించిన విలువలు, విధానాలు, మన అలీన ఉద్యమ నాయకత్వం భారత్కు ఎనలేని గౌరవం తెచ్చి పెట్టాయి. మన పొరుగున ఉన్న అత్యధిక దేశాలతో మనకు సహృద్భావ సంబంధాలు ఉండేవి. కొన్నిటితో ఘర్షణలు ఉన్నప్పటికీ శాంతి యుత సహజీవనానికి వీలుకల్పించేలా వాటితో అవగాహనా వార ధులను నిర్మించుకునే ప్రయత్నం చేశాం. ప్రపంచ దేశాలు మనల్ని నమ్మదగిన గౌరవప్రదమైన మిత్రదేశంగా పరిగణించే స్థితి ఉండాలి. ముఖ్యంగా దక్షిణ ఆసియాలో ఈ విశ్వాసం పొందాలి. కేవలం కెమెరాల మందు ఆప్యాయతా ప్రదర్శనలకు పరిమితమైతే మన విదేశాంగ విధానం బలహీనం అవుతుంది. సమర్థులయిన దౌత్యవేత్తల సహకారంతో విజ్ఞులైన నాయకులు సుస్పష్టమైన చర్యలు చేపట్టాలి. యువత శ్రేయస్సు ముఖ్యం యువజనుల ఆరోగ్యం, విద్య, నైపుణ్యం మీద తప్పనిసరిగా దృష్టి సారించాలి. మన చిన్నారుల్లో ఎదుగుదల లోపం, బిడ్డల్ని కనే మహిళల్లో పోషణ లేమి, రక్తహీనత అధికంగా ఉన్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్ –5) తేల్చి చెప్పింది. కాబట్టి పౌష్టికాహార కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవ సరం ఉంది. అలాగే, మంచినీరు, పారి శుద్ధ్య రంగాల్లో కూడా సరైన చర్యలు, విధానాలు అమలు చేయాలి. మన ఆరోగ్య వ్యవస్థలో ఉన్న అనేక బలహీనతలను కోవిడ్ – 19 బట్టబయలు చేసింది. వ్యాధులపై నిఘా పెంచాలి. ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వెయ్యాలి. వైద్య సేవల రంగాన్ని విస్తరించాలి. ఈ దిశగా పరిశీలిస్తే ఆ యా రాష్ట్రాల మధ్య ఆరోగ్య వ్యవస్థల పనితీరు, వాటి విస్తరణల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. రాష్ట్రాలు ఆరోగ్యం మీద మరిన్ని నిధులను వెచ్చించాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల లక్ష్య సాధన కోసం రాష్ట్రాలకు ఇతోధికంగా మద్దతు అందించాలి. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందించడం సార్వత్రిక ఆరోగ్య సేవల కల్పన విధానాల లక్ష్యం కావాలి. దేశవ్యాప్తంగా సమరీతిలో ఈ లక్ష్యాన్ని సాధించాలి. పౌరుల బాధ్యతఅప్పట్లో నేను పధ్నాలుగేళ్ల కుర్రవాడిని. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆనంద పారవశ్యంతో మునిగిపోయాను. అదే సమయంలో దేశ విభజన అంతులేని విషాదం మిగిల్చింది. అలాంటి దుఃస్థితి తిరిగి ఎప్పటికీ రాని దృఢమైన దేశంగా భారత్ ఎదగాలని ఆశించాను. ఇండియా ఇన్నేళ్లల్లో సాధించింది చూసి నేనిప్పుడు గర్విస్తున్నాను. ఈ గొప్ప దేశం భవిష్యత్తు పట్ల నాకు ఎన్నో ఆశలున్నాయి. సమాజంలో çసుహృద్భావ వాతావరణాన్ని కలుషితం చేస్తూ, ప్రజల్ని విభజిస్తున్న వేర్పాటు నినాదాలు, మత విద్వేషాలు చూసి నేను ఆందోళన కూడా చెందుతున్నాను. మరో వంక, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను పరిరక్షించి తీరాల్సిన, సుపరిపాలన నియమ నిబంధనలను నిలబెట్టాల్సిన, ఎన్నికలకు ధనబలం, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలు బలహీనమవటం కూడా జరుగుతోంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను పరిరక్షించుకోవలసింది భారత పౌరులే! సగర్వంగా తల ఎత్తి మన జెండాకు వందనం చేసేటప్పుడు మనలో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవలసిన గురుతర బాధ్యత ఇది!డాక్టర్ మన్మోహన్ సింగ్ (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా 2022 ఆగస్ట్ 15న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాసిన వ్యాసం ఇది. ‘ది హిందూ’ సౌజన్యంతో.) -
ప్రజాస్వామ్యం మానవత్వం
జార్జిటౌన్: ప్రపంచ శాంతి, సౌభాగ్యాలే లక్ష్యంగా ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే సరికొత్త పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చారు. అంతరిక్షం, సముద్రం అనేవి అంతర్జాతీయంగా పరస్పర సహకారానికి, అభివృద్ధికి వేదికలు కావాలి తప్ప సంఘర్షణలు, యుద్ధాలకు కాదని తేల్చిచెప్పారు. గురువారం గయానా దేశ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. స్వార్థం, విస్తరణవాదం అనే సంకుచిత ధోరణిని భారత్ ఏనాడూ నమ్ముకోలేదని అన్నారు. విస్తరణవాదంతో ముందుకెళ్లాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. వనరుల దోపిడీ అనే ఆలోచనకు భారత్ దూరంగా ఉంటుందని వివరించారు. మూడు దేశాల పర్యటన భాగంగా ప్రధాని మోదీ గయానాలో పర్యటించారు. గయానా పార్లమెంట్లో ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ప్రపంచం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే సూత్రాన్ని అనుసరించాలి. అదే మనకు తారకమంత్రం. మనతోపాటు అందరినీ కలుపుకొని వెళ్లాలని, అందరి అభివృద్ధిలో మనం సైతం భాగస్వాములం కావాలని ప్రజాస్వామ్యం ప్రథమం స్ఫూర్తి బోధిస్తోంది. మనం నిర్ణయాలు తీసుకోవడంలో మానవత్వం ప్రథమం అనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మానవత్వానికి తొలి ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ఫలితాలతో మొత్తం మానవాళికి మేలు జరుగుతుంది. గ్లోబల్ సౌత్ దేశాలు మేల్కోవాల్సిన సమయం వచి్చంది. మనమంతా క్రియాశీలకంగా పనిచేయాలి. మనం ఒక్కతాటిపైకి రావాలి. మనం కలిసికట్టుగా పని చేస్తూ నూతన ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) సృష్టించాలి. ప్రపంచం విషయానికొస్తే యుద్ధాలు, ఘర్షణలకు ఇది సమయం కాదు. యుద్ధాలకు దారితీస్తున్న పరిస్థితులను గుర్తించి, వాటిని రూపుమాపాల్సిన సమయం ఇది. భారత్–గయానా మధ్య గత 150 ఏళ్లుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత్ దృష్టిలో ప్రతి దేశమూ కీలకమైనదే. ఏ ఒక్కటీ తక్కువ కాదు. ద్వీప దేశాలను చిన్న దేశాలుగా పరిగణించడం లేదు. వాటిని అతిపెద్ద సముద్ర దేశాలుగా భావిస్తున్నాం. ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే స్ఫూర్తితో భారత్ ‘విశ్వబంధు’గా తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభాలు తలెత్తితే అందరికంటే మొదట భారత్ స్పందిస్తోంది’ అని ప్రధాని మోదీ వివరించారు. -
హైదరాబాద్లో ‘డిజైన్ డెమోక్రసీ’ ప్రారంభం
హైదరాబాద్: ఎంతగానో ఎదురుచూస్తున్న డిజైన్ ఫెస్టివల్ ‘డిజైన్ డెమోక్రసీ 2024’ హైదరాబాద్లో ప్రారంభమైంది. నగరంలోని హైటెక్స్లో ప్రారంభమైన ఈ ప్రదర్శన అక్టోబర్ 4 నుండి 7వ తేదీ వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది.తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్తో కలిసి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఫీక్కీ ఫ్లో మాజీ చైర్పర్సన్ పింకీ రెడ్డి, డిజైన్ డెమోక్రసీ వ్యవస్థాపకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ ప్రారంభించారు.తెలంగాణ మ్యూజియం బ్రాండ్ డైరెక్టర్ మాన్సీ నేగి, క్యూరేటర్ సుప్రజా రావుతో కలిసి డిజైన్ డెమెక్రసీ వ్యవస్థపాకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ, అర్జున్ రాఠీ నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ అసాధారణ సృజనాత్మక ప్రతిభ, వినూత్న ప్రదర్శనల వేదికగా నిలిచింది. -
తనను వ్యతిరేకించే వారి మాట కూడా వినేవాడే పాలకుడు: గడ్కరీ
ముంబై: ప్రజాస్వామ్యం, పాలకుల వ్యవహార తీరుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను వ్యతిరేకించే వారి మాటను పాలకుడు వినడమే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్షగా పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలను స్వీకరించి, దానిపై ఆత్మపరిశీలన చేసుకుంటాడని చెప్పారు. రచయితలు, మేధావులు, కవులు నిర్భయంగా తమ భావాలను వ్యక్తీకరించాలని తెలిపారు.పుణెలోని ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పరీక్ష ఏంటంటే.. ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని అందించినా దాన్ని పాలకుడు సహించవలసి ఉంటుందన్నారు. ఆ ఆలోచనలను పరిగణలోకి తీసుకొని నడుచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.దేశంలో విమర్శకుల అభిప్రాయ బేధాల్లో సమస్య లేదు కానీ.. అభిప్రాయాలను వెల్లడించడంలోనే సమస్య ఉంది. మనం రైటిస్టులు, లెఫ్టిస్టులం కాదు. మనం అవకాశవాదులం. రచయితలు, మేధావులు ఎలాంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరుతున్నాం. ఒకరి లోపాలను గుర్తించేందుకు ఎప్పుడూ విమర్శకులు చుట్టుముట్టాల్సిన అవసరం ఉంది. అంటరానితనం, సామాజిక న్యూనత భావం, ఆధిపత్యం కొనసాగినంత కాలం దేశం అభివృద్ధి చెందదని అన్నారు. -
షేక్ హసీనా.. నియంతగా మారిన ప్రజాస్వామ్య ప్రతీక!
బంగ్లాదేశ్ ప్రధాని షేక్హసీనా ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో అక్కడే ముగిసింది. ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్యస్థాపన కోసం సైనికపాలకులతో పోరాడిన నాయకురాలు.. నేడు నియంత అనే పేరు మూటగట్టుకుని దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం నడిపిన షేక్ముజిబుర్ రెహ్మాన్ వారసత్వంతో దేశ రాజకీయాల్లోకి వచ్చిన హసీనా 1975లో దేశం మిలిటరీ పాలనలోకి వెళ్లిన తర్వాత యూరప్తో పాటు భారత్లో ఆశ్రయం పొందారు. 1981లో ఇండియా నుంచే బంగ్లాదేశ్ తిరిగి వెళ్లి ప్రత్యర్థి ఖలీదా జియాతో కలిసి దేశంలో ప్రజాస్వామ్య పోరాటం నడిపారు. తర్వాతి పరిణామాల్లో తిరుగులేని నాయకురాలిగా ఎదిగి ఐదుసార్లు అధికారాన్ని చేపట్టారు. తాజాగా తన ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలపై దేశంలో చెలరేగిన ఆందోళనలు, హింసకు తలొగ్గి దేశం విడిచి తిరిగి భారత్కే వచ్చారన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం.పోరాటం నుంచి తిరుగులేని అధికారం వైపు.. మిలిటరీ పాలనపై పోరాడేందుకు హసీనా 1981లో ప్రవాసం వీడి బంగ్లాదేశ్కు వచ్చారు. రాజకీయ ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బీఎన్పీ)చీఫ్ ఖలీదా జియాతో చేతులు కలపి దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడారు. 1990లో ఈ పోరాటంలో విజయం సాధించి సైనిక నియంత హుస్సేన్ మహమ్మద్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించారు. అనంతరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్, బీఎన్పీ సంకీర్ణ ప్రభుత్వం నడిపాయి. కాకపోతే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో బీఎన్పీపై విజయం సాధించి షేక్హసీనా తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టారు. కానీ ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ చేతిలో హసీనా తిరిగి ఓటమి చవిచూశారు. సైనిక తిరుగుబాటు తదనంతర పరిణామాల తర్వాత మళ్లీ 2007లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన హసీనా అప్పటి నుంచి ఇప్పటివరకు అధికారంలోనే ఉండి బంగ్లాదేశ్కు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ వచ్చారు.ప్రతిపక్షమే లేకుండా అణిచివేశారు..2007లో రెండోసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత హసీనా అసలు స్వరూపం బయటపడింది. నియంతృత్వ విధానాలు అమలు చేయడం మొదలు పెట్టారు. రాజకీయ ప్రత్యర్థులు, ప్రజాసంఘాల నేతల మూకుమ్మడి అరెస్టులకు పాల్పడ్డారు. ఒక్కోసారి కొందరు నేతలు ఉన్నట్టుండి అదృశ్యమయ్యేవారు. వారి మిస్సింగ్ మిస్టరీగానే మిగిలింది. ఇంతే కాకుండా హసీనా పాలనలో ఫేక్ ఎన్కౌంటర్లు సర్వసాధారణమైపోయాయి. ఆమె హయాంలో ఐదుగురు ముస్లిం అగ్రనేతలను యుద్ధనేరాల్లో ఉరితీశారు. హసీనా నాయకత్వంలో దేశంలో ఎన్నికలు జరిగితే ప్రతిపక్షం వాటిని బహిష్కరించి పోటీకి దూరంగా ఉందంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ప్రజాస్వామ్యం ముసుగులో నియంతగా ఎలా మారారన్నదానికి హసీనా రాజకీయ జీవితం ఒక ఉదాహరణ అని ఢాకా యూనివర్సిటీ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ నజ్రుల్ అన్నారు.15 ఏళ్ల హసీనా పాలనలో పాజిటివ్ కోణం.. షేక్ హసీనా వరుస 15 ఏళ్ల పాలనలో బంగ్లాదేశ్ ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందిందని చెబుతారు. వస్త్ర తయారీ రంగంలో మహిళలకు అత్యధికంగా ఉద్యోగాలు కల్పించడం వల్లే ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి సాధ్యమైందన్న వాదన ఉంది. హసీనా పాలనలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం భారత్ కంటే ముందుకు వెళ్లింది. హసీనా పాలనలో దేశంలో పేదిరికం తగ్గడంతో పాటు దేశంలోని 17 కోట్ల మంది ప్రజల్లో 95 శాతంమందికి కరెంటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు దేశం ఎందుకు వీడాల్సి వచ్చింది..ప్రభుత్వ ఉద్యోగాల్లో 1971 యుద్ధంలో పాల్గొన్న వారి వారసులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్లో హింస చెలరేగింది. తొలుత ప్రభుత్వం తీసుకున్న ఈ కోటా నిర్ణయాన్ని తర్వాత ఆ దేశ సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కోటాకు వ్యతిరేకంగా చెలరేగిన ఈ హింసలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో హసీనా ప్రభుత్వం దిగివచ్చి కోటా విధానంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ ఆందోళనలు ఆగలేదు. హసీనా గద్దె దిగాల్సిందేనని, ఆమె ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు తీవ్రమయ్యాయి. చివరకు ప్రధాని అధికార నివాసాన్ని ఉద్యమకారులు చుట్టుముట్టడం.. సైన్యం హెచ్చరికల నేపథ్యంలో.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సోదరితో కలిసి హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. -
మారకుంటే... ముప్పు
రక్తసిక్త అమెరికా రాజకీయ చరిత్రలో కొత్త పేజీ అది. అమెరికా దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నేడో రేపో అధికారికంగా ఖరారవుతారని భావిస్తున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్పై పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ వద్ద శనివారం జరిగిన కాల్పులు, హత్యాయత్నంతో అగ్రరాజ్యమే కాదు... యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ ఎన్నికల ర్యాలీలో చేసిన ఈ దాడిలో దుండగుడి తుపాకీ తూటా ట్రంప్ కుడి చెవి పైభాగాన్ని రాసుకుంటూ, రక్తగాయం చేసి పోయింది. నిఘా వర్గాల భద్రతా వైఫల్యాన్ని బట్టబయలు చేసిన ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఆయన బయట పడ్డారు. ఎన్నికల బరిలో ట్రంప్కు ప్రధాన పోటీదారైన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాల నేతలందరూ ఈ దాడిని ఖండించారు. దాడికి పాల్పడిన ఇరవై ఏళ్ళ వ్యక్తిని భద్రతా దళాలు మట్టుబెట్టారన్న మాటే కానీ, ఈ దుశ్చర్య వెనుక అసలు కారణాలు లోతైన దర్యాప్తులో గానీ వెలికిరావు. తాజా దాడి ఘటనతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయావకాశాలు పెరుగుతాయని ఓ అంచనా. అది నిజం కావచ్చు. కానీ, అంతకన్నా కీలకమైనది ఇంకోటుంది. ప్రపంచంలోని అతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే నేలపై ఆ స్ఫూర్తి వెనకపట్టు పట్టి, హింసాకాండ చెలరేగుతోంది. అమెరికా సమాజమే కాదు... ప్రపంచమంతా ఆందోళన చెందాల్సిన విషయమిది. అమెరికాలో నేతలపై దాడులు, హత్యాయత్నాలు ఇదే తొలిసారి కాదు. గతంలో అబ్రహామ్ లింకన్, జాన్ ఎఫ్. కెనడీ సహా నలుగురు దేశాధ్యక్షులు దుండగుల దుశ్చర్యలకు బలయ్యారు. రీగన్, థియోడర్ రూజ్వెల్ట్ లాంటి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, తాజా ఘటన జనంలో మునుపెన్నడూ లేని రీతిలో పేరుకున్న అణిచిపెట్టుకున్న ఆగ్రహానికీ, చీలికకూ ప్రతీకగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, ట్రంప్పై హత్యాయత్న ఘటన జరిగిన కొద్ది గంటల తరువాత కూడా అమెరికాలో రాజకీయ భాష రెచ్చగొట్టే విధంగా సాగడం విషాదం. ఘటన జరిగిన మూడు గంటలకే రక్తసిక్తమైన ట్రంప్ పిడికిలి బిగించిన ఫోటోలతో టీషర్ట్లు ఆన్లైన్లో అమ్మకానికి వచ్చేశాయి. ఈ జగడాలమారి వైఖరిని చూస్తుంటే, అగ్రరాజ్యంలో నేతలు పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. విలువలు మరచిన మాటల దాడితో వేడెక్కుతున్న ఎన్నికల వాతావరణంలో ప్రజల్లో తీవ్రమైన ఇష్టానిష్టాలు ప్రబలి, పరిస్థితి ఎక్కడి దాకా పోయే ప్రమాదం ఉందో చెప్పడానికి ట్రంప్పై దాడి తార్కాణం. ఎన్నికలను యుద్ధంలా, రక్తం చిందించైనా సరే గెలవడమే పరమావధిగా భావించడం అతి పెద్ద తప్పు. ఇది అమెరికాయే కాక ప్రజాస్వామ్య దేశాలన్నీ విస్మరించలేని పాఠం. ఈ పాపంలో అన్ని పార్టీలకూ భాగం ఉంది. అనేక జాతులు, తెగలతో కూడిన అమెరికా రాజకీయ వ్యవస్థలో విభేదాలు సహజమే. కానీ, ట్రంప్ మళ్ళీ పగ్గాలు చేపడితే అది అమెరికాకు విలయమేనంటూ డెమొక్రాట్లు ప్రచారం సాగిస్తూ వచ్చారు. రిపబ్లికన్లు, ట్రంప్ సైతం సైద్ధాంతికంగా దిగజారుడుతనంలో తక్కువ తినలేదు. అమెరికాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రతీకగా దేశ చట్టసభకు పీఠమైన యూఎస్ క్యాపిటల్ భవనాన్ని చుట్టుముట్టి, 2021 జనవరి 6న ట్రంప్ అనుకూల మూకలు యథేచ్ఛగా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్య సౌధంలో ప్రమాద ఘంటికలు మోగాయి. తాజా హత్యాయత్నానికి డెమోక్రాట్లు, బైడెన్ల ప్రచార ధోరణే కారణంటూ ట్రంప్ సహచరులు విరుచుకుపడుతున్నారు. ఒక్కమాటలో... అగ్రరాజ్యమనీ, భూతల స్వర్గమనీ అనుకొనే అమెరికాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న హింసాత్మక ధోరణులు, పార్టీల వారీగా నిలువునా చీలిపోయిన జనం, ఆగని రాజకీయ హింస అక్కడి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఆ దేశంలో తుపాకీ సంస్కృతి పెను సర్పమై బుసలు కొడుతోంది. అమెరికాలో తుపాకీలు బజారులో అతి సులభంగా కొనుక్కోవచ్చన్నది జగమెరిగిన సత్యం. అమెరికా రాజ్యాంగ ప్రకారం ఆత్మరక్షణార్థం ఆయుధాలు కలిగివుండే హక్కు పౌరులకుంది. అమెరికా వయోజనుల్లో ప్రతి పది మందిలో నలుగురింట్లో తుపాకులున్నాయి. చిత్రమేమిటంటే, 2023 జూన్ నాటి ప్యూ రిసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం తుపాకీ చేతిలో ఉంటే చట్టాన్ని పాటించే పౌరులుగా తమను తాము కాపాడుకోవచ్చని నూటికి 49 మంది అమెరికన్లు భావిస్తున్నారు. మరోమాటలో అమెరికన్ సమాజానికి దేశ శాంతి భద్రతలపై అంతటి అపనమ్మకం ఉందను కోవచ్చు. మరి, పౌరుల చేతిలోని ఈ ఆయుధాలు తప్పులు చేసేవారి చేతుల్లో పడితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. దేశంలో పాఠశాలలు, వాణిజ్యభవన సముదాయాల్లో విచక్షణారహితమైన కాల్పుల ఘటనల నుంచి తాజా హత్యాయత్నం దాకా అనేక సంఘటనలే అందుకు సమాధానాలు. తుపాకీలపై నియంత్రణలున్నంత మాత్రాన ఈ ఘటనలు జరగవని కాదు కానీ, లేనప్పుడు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ప్రస్తుతం అమెరికా ముందు, ఆ దేశ రాజకీయ నేతలు, పార్టీలు, ప్రజల ముందు ఓ పెను సవాలుంది. అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితులు, పేట్రేగుతున్న రాజకీయ విద్వేషం, హింస లకు అడ్డుకట్ట వేయాల్సింది వారే. అన్ని పక్షాలూ కళ్ళు తెరిచి, ఈ పతనాన్ని నివారించాలి. అతివాదాన్ని నిరసించాలి. ఎన్నికల ప్రచారంలో పరస్పర గౌరవంతో సైద్ధాంతిక చర్చలే అనుసరణీయ మార్గమన్న తమ మౌలిక సూత్రాలనే మళ్ళీ ఆశ్రయించాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదనీ, ఎన్నికలొక్కటే సామాజిక, రాజకీయ సమస్యలన్నిటికీ పరిష్కారమని ఓటర్లు తమ తీర్పు ద్వారా మరోసారి చాటాలి. అలా కాక, ఇలాంటి ఘటనల్ని వాటంగా చేసుకొని ఎవరికి వారు మరింత రెచ్చగొట్టుడు ధోరణికి దిగితే కష్టం. అది ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదం. -
రాచరికం నుంచి ప్రజాస్వామ్యం దాకా...
కర్నూలు ప్రాంతాన్ని పరిపాలించని ఉత్తర, దక్షిణ భారత ప్రసిద్ధ రాజవంశాలు లేవంటే అతిశయోక్తి కాదు. క్రీస్తుపూర్వం ఈ ప్రాంతాన్ని మౌర్యులు పాలించారు. తర్వాతి కాలంలో చాళుక్యులు, పల్లవులు, చోళులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు పాలించారు. విజయనగర రాజుల పాలన ఈ ప్రాంతానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. 1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓటమి తరువాత ముస్లిం పాలకులు: బీజాపుర్ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు, గోల్కొండ నవాబులు, కర్నూలు నవాబులు దాదాపు 275 ఏళ్లు పాలించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనపై మొదట 1801లో ముత్తుకూరు గౌడప్ప నాయకత్వంలో తెర్నేకల్ గ్రామం పన్నులు కట్టడానికి నిరాకరించింది. బ్రిటీష్ సైనికుల ముట్టడిలో అనేకమంది గ్రామస్థులు మరణించారు. బ్రిటిష్ వారిని ఎదిరించి తిరుగుబాటు చేసిన మొదటి గ్రామంగా తెర్నేకల్ను చెప్పవచ్చు.ప్రసిద్ధి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిన్నవయసులోనే బ్రిటిష్ ప్రభుత్వ కఠినమైన పరిపాలనా విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటు అతి త్వరగా 66 గ్రామాలకు వ్యాపించింది. 1846–1847 మధ్య కాలంలో ఈయన సాహసోపేతమైన ప్రతిఘటన జనరల్ ఆండర్సన్ ఆధ్వర్యంలోని ఆంగ్లేయ దళాలను గడగడ లాడించింది. అయితే అపారమైన బ్రిటిష్ సైన్యం ముందు ఓటమి తప్పలేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బంధించి ఉరితీసింది కంపెనీ ప్రభుత్వం. 1800వ సంవత్సరంలో నిజాం నవాబు ఈస్టిండియా కంపెనీ వారికి సైనిక ఖర్చుల కోసం ఇవ్వవలసిన సొమ్ముకు బదులుగా బళ్ళారి, కడప జిల్లాలను పూర్తిగానూ; కర్నూలు జిల్లాలోని కంభం, మార్కాపురం, కోయిలకుంట్ల, పత్తికొండ తాలూకాలను ఇచ్చాడు. ఇలా వారికి ధారాదత్తం చేయడంతో ఈ ప్రాంతాలకు ‘దత్త మండలాలు’ అనే పేరు వచ్చింది. ఈస్టిండియా కంపెనీ పాలనలో కర్నూలు ప్రాంతం 1800వ సంవత్సరం నుంచి 1857వ సంవత్సరం వరకు కొనసాగింది.దత్తమండలాలకు ప్రధాన కలెక్టరుగా థామస్ మన్రో 1800–1807 వరకు సేవలను అందిచాడు. కర్నూలు ప్రాంతాన్ని పాలించిన మొదటి కలెక్టరు ఆయనే. రైత్వారీ భూవిధానం వంటి వ్యవస్థాగతమైన మార్పులతో ఉత్తమ పాలన సాగింది. మన్రో నివేదికను అమలుచేస్తూ రెవిన్యూ పరిపాలన సౌలభ్యం కోసం 1808వ సంవత్సరంలో రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. అవి కడప, బళ్ళారి జిల్లాలు. అనంతపురం ప్రాంతం బళ్ళారి జిల్లాలో, కర్నూలు ప్రాంతం కడప జిల్లాలో భాగంగా ఉండేవి. కర్నూలు పరిధిలోని రామళ్లకోట, నంద్యాల, సిరివెల్, నందికొట్కూరు తాలూకాలతో పాటు కడప జిల్లా నుంచి దూపాడు (మార్కాపురం), కంభం, కోయిలకుంట్ల; బళ్లారి జిల్లా నుంచి పత్తికొండ తాలూకాను కలిపి మొత్తం 8 తాలూకాలతో 1858 జూలై 1న కర్నూలు జిల్లా అవతరించినది. స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఈ జిల్లాలో ఎలాంటి మార్పులూ సంభవించలేదు. అయితే 2022 ఏప్రిల్ 4న జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత కర్నూలు జిల్లా రెండుగా... అంటే కర్నూలు, నంద్యాల జిల్లాలుగా విభజితమయ్యింది.ప్రస్తుతం జనాభా విషయంలో నంద్యాల జిల్లా కంటే ఎక్కువగా, వైశాల్యం, రెవిన్యూ విషయంలో నంద్యాల జిల్లా కంటే తక్కువ స్థాయితో కర్నూలు మారిన పరిస్థితిని గమనించగలం.– ఆచార్య మన్సూర్ రహ్మాన్ సామాజిక – ఆర్థిక విశ్లేషకులు ‘ 9441067984(కర్నూలు జిల్లా 166వ అవతరణ దినోత్సవం నేడు) -
ఎందుకీ ప్రజాస్వామ్య పతనం?
భారతదేశం ప్రపంచ ప్రజాస్వామ్యానికే మాతృక అని మోదీ కొద్ది సంవత్సరాల క్రితం సగర్వంగా ప్రకటించారు. ఆ మాట చారిత్రకంగా వాస్తవమని ఏ చరిత్రకారుడు కూడా అన్నట్లు లేడు. ఆధునిక సమాజాలు స్థిరపడినా కొద్దీ ఆధునిక ప్రజాస్వామ్యాల దశ మొదలైంది. అటువంటి ప్రాంతాలలో భారతదేశం కూడా ఒకటనటంలో సందేహం లేదు. ప్రపంచ ప్రజాస్వామ్యం వేల ఏళ్ళుగా రూపుదిద్దుకున్న చరిత్రలో భారత భూమి భాగస్వామ్యం ఉండటం గర్వించదగ్గ విషయం. అయితే, ‘వి–డెమ్’ ప్రకారం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల ర్యాంకింగ్స్లో ఇండియా స్థానం 104. మొత్తం 179 దేశాలతో పోల్చినప్పటి స్థితి ఇది. భారత్ లాంటి మహత్తర దేశస్థానం ఎందువల్ల పడిపోయినట్లు? ఆ పతనానికి బాధ్యులెవరు? రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 27న పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమె ద్వారా ఒక ముఖ్యమైన మాటను చెప్పించగలదో లేదోనని ముందుగా కొంత అనుమానం కలిగింది. చివరకు చెప్పించటం చూసి సంతోషం కలిగింది. భారతదేశం ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అని అభివర్ణించారామె. ప్రపంచ చరిత్ర పుటలలోకి వెళ్ళి చూసినట్లయితే ఆ మాటకు కొంత విలువ ఉంటే ఉండవచ్చు. కనుక అది చారిత్రక దృష్టితో సంతోషించదగిన మాటే. అయితే, రాష్ట్రపతితో ఆ మాట చెప్పించిన మోదీ పాలనలో, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల ర్యాంకింగ్స్లో మన స్థానం 104కు ఎందుకు పతనమైందన్నది భారతీయుల సందేహం.భారతదేశం ప్రపంచ ప్రజాస్వామ్యానికే మాతృక అని మోదీ కొద్ది సంవత్సరాల క్రితం సగర్వంగా ప్రకటించారు. ఆ మాట చారిత్రకంగా వాస్తవమని ప్రపంచంలో ఏ చరిత్రకారుడు కూడా అన్నట్లు లేడు. అయితే, క్రీస్తు పూర్వం అనేక శతాబ్దాల క్రితం ప్రపంచంలోని పలు సమాజాలు నాగరికమైనా కొద్దీ అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థల లక్షణాలు కనిపించసాగాయి. నిజానికి అందుకు బీజాలు ఆదిమ తెగల సమాజాలలోనే ఉన్నట్లు మానవ వికాస శాస్త్రజ్ఞులు చెప్తారు. ఆ తర్వాత దశలో ఆధునిక సమాజాలు స్థిరపడినా కొద్దీ ఆధునిక ప్రజాస్వామ్యాల దశ మొదలైంది. అటువంటి ప్రాంతాలలో భారతదేశం కూడా ఒకటనటంలో సందేహం లేదు. అవే పరిణామాలు గ్రీసు, ఈజిప్టు, ఇతర మధ్యధరా సముద్ర తీర ప్రాంతాలు, చైనా వంటి చోట్ల కూడా చోటు చేసుకున్నాయి. ఆ విధంగా ఇవన్నీ క్రీస్తు పూర్వ కాలపు అక్క చెల్లెల్లన్నమాట. అందుకు అనుగుణంగానే ఈ ప్రాంతాలన్నింటా ప్రజాస్వామిక తత్త్వవేత్తలు, సంఘ సంస్కర్తలు, పరిపాలనా శాస్త్రవేత్తలు అప్పటినుంచే ఆవిర్భవించటం మొదలైంది.మొత్తానికి ఆ విధంగా ప్రపంచ ప్రజాస్వామ్యం వేల ఏళ్ళుగా రూపుదిద్దుకున్న చరిత్రలో భారత భూమి భాగస్వామ్యం ఉండటం మనమంతా గర్వించదగ్గ విషయం. అయితే, అటువంటి మహత్తర దేశస్థానం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల ర్యాంకింగ్స్లో ఇపుడు 104కు ఎందువల్ల పడిపోయినట్లు? ఆ పతనానికి బాధ్యులెవరు? ఆ స్థితి భారతీయులకు గర్వించదగ్గ విషయమా? ప్రజాస్వామ్య దేశాలు, వ్యవస్థలన్నింటిని ఎప్పటికప్పుడు మదింపు చేసే ప్రపంచ స్థాయి సంస్థ పేరు ‘వి–డెమ్’. దాని నివేదికలు కొద్ది సంవత్సరాల క్రితమే ఇండియాను ‘ఇటీవల అతి హీనంగా నియంతృత్వీకరణ చెందుతున్న దేశాలలో ఒక’టనీ, ‘ప్రపంచంలోని మొదటి పది నియంతృత్వ దేశాలలో ఒక’టనీ అభివర్ణించాయి. తర్వాత 2018 వచ్చేసరికి, అనగా గత ఎన్నికల కన్నా ముందే, ‘ఎన్నికైన నియంతృత్వం’ స్థాయికి పడిపోయింది. 2018 నుంచి 2023 వరకు అయిదేళ్ళ పాటు కూడా అదే స్థాయిలో కొనసాగింది. ఈ 2024 ర్యాంకింగ్స్ వచ్చేసరికి పరిస్థితి ఏమి కాగలదో చూడాలి. ఇది వి–డెమ్ పరిశీలించిన మొత్తం 179 దేశాలతో పోల్చినప్పటి స్థితి అన్నమాట. వి–డెమ్ సంస్థ స్వీడన్లోని గోథెన్బర్గ్ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ విభాగం నుంచి పనిచేస్తుంది. ఒక ప్రజాస్వామ్యం ఏవిధంగా పనిచేస్తున్నదో మదింపు వేసేందుకు ఆ సంస్థకు ఐదు కొలమానాలు ఉన్నాయి. అవి, ఎన్నికల తీరు, ఉదారవాదం, ప్రజల భాగస్వామ్యం, చర్చలకు గల అవకాశం, ప్రజా సంక్షేమం. వి–డెమ్ మాత్రమే కాదు, కొన్ని తేడాలతో ఇతర ప్రముఖ సంస్థలు కూడా హీనమైన ర్యాంకులే ఇస్తూ వస్తున్నాయి. ఉదాహరణకు ప్రపంచ ప్రసిద్ధ ‘ఎకానమిస్టు’ మేగజైన్ 2020లో 53వ ర్యాంక్నిచ్చింది. ప్రజాస్వామ్య సూచీలలో పత్రికా స్వేచ్ఛ ఒకటని భావిస్తే, ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ నివేదిక ప్రకారం, ఈ 2024లో ఇండియా ర్యాంకు 180 దేశాలలో 159వది. మానవ హక్కుల విషయంలో 165 దేశాలలో 109వది. నిజానికి ప్రధానంగా ధనిక వర్గాలకు లాభం చేసే ఆర్థికాభివృద్ధి సూచీల మాట ఎట్లున్నా, సామాన్య ప్రజలకు సంబంధించిన మానవాభివృద్ధి సూచీలు కూడా ప్రజాస్వామ్యం గురించేనని భావిస్తే, ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం మనది 134వ స్థానం. గమనించదగినదేమంటే, ఈ సూచీలన్నీ నరేంద్ర మోదీ పాలనలో క్రమంగా పడిపోతున్నాయి. అయినప్పటికీ ఆయన ప్రభుత్వం ఇటువంటి నివేదికలను, వాటిలో పేర్కొన్న వాస్తవాలను, తమ తీవ్రమైన అప్రజాస్వామికతను విస్మరించి, భారతదేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే ప్రకటనలు నిర్భయంగా చేయటాన్ని బట్టి వారి తెగువను మెచ్చుకోవాలి. దేశంలో ప్రజలేమన్నా, ప్రపంచం ఏమన్నా, ఈ మాటను కూడా గోబెల్స్ ప్రచారం వలె సాగించినట్లయితే అదే నిజంగా స్థిరపడగలదన్నది మోదీ నమ్మకం అయి ఉండాలి. ఇందులోని గమనించదగ్గ మెలిక ఏమంటే, భారతదేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అయినా కాకున్నా ప్రజాస్వామ్యానికి బీజాలు వేసిన భూభాగాలలో ఒకటన్నది నిజమే గాని, దానిని వర్ధిల్ల చేయటంలో మోదీ పాత్ర ఏమిటన్నది ప్రశ్న. మనది మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే ప్రచారం చాటున ఆయన తన అప్రజాస్వామికతను, పైన పేర్కొన్న తరహా ర్యాంకింగుల అప్రతిష్ఠను కప్పిపెట్టుకో జూస్తున్నారనిపిస్తున్నది. గోబెల్స్ తరహా ఎత్తుగడలలో ఇది ఒకటి. ఈ సందర్భంగా, ఇటీవలి లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ సాగించిన భయం గొలిపే విషప్రచారం అనివార్యంగా గుర్తుకువస్తుంది. ఆ ప్రచారాన్ని చివరకు ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ సైతం బహిరంగంగా ఆక్షేపించవలసి వచ్చిందంటే, మోదీ తీరును ప్రజాస్వామికమని ఎవరైనా అనగలరా? భారతదేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అని సగర్వంగా చాటుకోగల నాయకుని ధోరణి అదేనా? ఈ దేశపు గత చరిత్రను, ప్రజాస్వామిక సంప్రదాయాన్ని ప్రస్తావించే నైతిక హక్కు ఆయనకు ఉంటుందా? పైన పేర్కొన్న ర్యాంకింగ్లన్నీ మొన్నటి ఎన్నికల విష ప్రచారం కన్నా ముందటివి. ఆ తర్వాతవి ఏ విధంగా ఉండగలవో చూడాలి.మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా చెప్పించిన మరొక విశేషం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ. ఈ ప్రస్తావనలు ప్రధానితో పాటు బీజేపీకి చెందినవారు గత కొద్దిరోజులుగా చేస్తున్నారు. అది చాలదన్నట్లు సాక్షాత్తూ రాష్ట్రపతి ద్వారా మాట్లాడించారు. ఎమర్జెన్సీ విధింపు పూర్తి అప్రజాస్వామికమనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ చర్య తీసుకున్న పరిస్థితులు, అది అమలైన తీరు అన్నీ ప్రజాస్వామ్య విరుద్ధమే. దానిని అందరూ ఖండించటమే గాక, తిరిగి ఎన్నడూ ఏ రూపంలోనూ ఆ ధోరణులను ప్రదర్శించకూడదు. కానీ, దానిని ఇంతగా ఖండించే మోదీ చేస్తున్నదేమిటీ? తన నాయకత్వాన ఇండియాకు ప్రజాస్వామ్య ర్యాంకింగ్లు వరుసగా పడిపోతూ నియంతృత్వ ర్యాంకింగులు ఎందుకు వస్తున్నాయి? ఇందిర ఎమర్జెన్సీ తన వ్యక్తిగత అధికార పరిరక్షణకు ప్రజాస్వామ్యాన్ని, సమాజాన్ని ఒక పరిమిత కాలం పాటు భంగపరిచిన చర్య. అంతే తప్ప ఆ చర్య దీర్ఘకాలిక ప్రభావం చూపలేదు. అందుకు భిన్నంగా మోదీ చర్యల వల్ల భారత సమాజమే విషప్రాయమవుతున్నది. ఆ ప్రభావాలు దీర్ఘకాలం పాటు ఉండనున్నాయి. తన తీరు చివరకు ఆరెస్సెస్కు సైతం ఇబ్బందికరం, అభ్యంతరకరం అవుతున్నది. అటువంటి నాయకుడు కనీసం ఎన్నికల ఎదురుదెబ్బలతోనైనా పాఠాలు గ్రహించి తన ధోరణిని మార్చుకోవటం అవసరం. భారతదేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే నీతులు ఎవరికీ చెప్పనక్కరలేదు. - వ్యాసకర్త సీనియర్ సంపాదకులు- టంకశాల అశోక్ -
‘ఈవీఎం’ సేఫేనా..? జోరందుకున్న చర్చ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) సేఫా..? వాటిలో పడిన ఓటు భద్రమేనాా..? ఈవీఎంలను హ్యక్ చేసి మెజారిటీ ప్రజలిచ్చిన తీర్పును మార్చొచ్చా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలపైనే మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిపుణుల నుంచి సామాన్యుల దాకా ఈవీఎంల వాడకంపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. ఇటీవల కొందరు పాపులర్ టెక్నాలజీ నిపుణులే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో ఈవీఎంలపై అనుమానాలకు శాస్త్రీయ నివృత్తి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఈలాన్ మస్క్ అయితే ఈవీఎంల వాడకానికి పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టాలని ట్వీట్ చేసి సంచలనానికి తెర తీశారు. మస్క్ ఈ తరహా అభిప్రాయం వెలిబుచ్చిన సమయానికే మహారాష్ట్రలోని ముంబై నార్త్వెస్ట్ నియోజకవర్గంలో ఓటీపీ ద్వారా ఈవీఎంను తెరిచారన్న వివాదం వెలుగులోకివచ్చింది. దీంతో ఈవీఎంల భద్రతపై చర్చ జోరందుకుంది.భారత్కు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేధావి శ్యామ్ పిట్రోడా కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమేమీ కాదన్నారు. వీరే కాక తాజాగా సైబర్ లా నిపుణుడు, ప్రముఖ న్యాయవాది పవన్ దుగ్గల్ కూడా ఇంచు మించు ఇదే చెప్పారు. ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఛాన్సు లేకపోలేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా..? అనే సమాధానం లేని ప్రశ్న మళ్లీ అందరి మెదళ్లను తొలుస్తోంది. అసలు మస్క్ ఏమన్నారు.. సందర్భమేంటి..? ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్ను నివారించొచ్చని టెస్లా అధినేత మస్క్ ఇటీవల సూచించారు. అమెరికా నియంత్రణలో ఉన్న ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుంది’అని మస్క్ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు.మస్క్కు మాజీ ఐటీ మంత్రి కౌంటర్లో వాస్తవమెంత..?మస్క్ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన వెంటనే ఎక్స్లో మాజీ కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత్లో వాడే ఈవీఎంలు అమెరికాలో వాడే తరహావి కావు. ఇక్కడి ఈవీఎంలు కంప్యూటర్ ప్లాట్ఫాం మీద తయారు చేయలేదు. వాటికి బయటి నుంచి ఎలాంటి నెట్వర్క్తో అనుసంధానించే అవకాశమే లేదు. రీ ప్రోగ్రామింగ్ కూడా వీలు లేదు. ఇలాంటి పరికరాలను హహ్యాక్ చేయడం కుదరదు. కావాలంటే ప్రపంచ దేశాలు భారత ఈవీఎంలను వారి ఎన్నికల్లో వాడుకోవచ్చు’అని సూచించారు.రాజీవ్ చంద్రశేఖర్ లాజిక్ కరక్టేనా.. సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ ఏమన్నారు.. ‘ఒక కంప్యూటర్కు బయటి నుంచి ఎలాంటి నెట్వర్క్తో అనుసంధానం లేనపుడు హ్యాక్ చేయడం కష్టమే కావచ్చు. అయితే ఎలాంటి వ్యవస్థనైనా ఏమార్చి దానిలో జోక్యం చేసుకునే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నా. నిజానికి భారత్లో వాడుతున్న ఈవీఎంలకు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి రక్షణ ఉందనేది మనకెవరికీ తెలియదు. భారత్లో అసలు సైబర్ భద్రతకు సంబంధించి పక్కా చట్టమే ఇప్పటివరకు లేదు.‘ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్కు సంబంధించి ఈవీఎంలు ISO 27001 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది నిపుణులు తేల్చాలి. ఈవీఎంల భద్రతకు ఎలాంటి సైబర్ సెక్యూరిటీ పప్రోటోకాల్ను వాడుతున్నారనేది ఇప్పటివరకు బహిర్గతమవలేదు. ఎవరికీ తెలియదు’అని సైబర్ లా నిపుణులు, ప్రముఖ న్యాయవాది పవన్దుగ్గల్ వ్యాఖ్యానించారు.శ్యామ్ పిట్రోడా అనుమానాలేంటి..?ఈవీఎంలపై టెక్నాలజీ నిపుణుడు శ్యామ్ పిట్రోడా కుండ బద్దలు కొట్టారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనని తేల్చి చెప్పారు. ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల మీద సమారు అరవై ఏళ్ల పాటు నేను పనిచేశాను. ఈవీఎం యంత్రాల వ్యవస్థనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే. దీని వల్ల ఫలితాలు తామరుమారవుతాయి. ఈవీఎంల కంటే పాత బ్యాలెట్ పేపర్ విధానమే చాలా ఉత్తమమైంది. ఇందులో అయితే ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి. కొంత మంది చెబుతున్నట్లు ఈవీఎంలు కేవలం స్టాండలోన్ పరికాలే కాదు. వాటికి వీవీప్యాట్ వ్యవస్థ అమర్చి ఉంటుంది. ఇంతేగాక వీటిని తయారు చేసే క్రమంలో, రవాణా చేసే సందర్భాల్లో ఏమైనా జరిగేందుకు అవకాశం ఉంటుంది’అన్నారు. బ్యాలెట్ పేపరే పరిష్కారమా..? ఈవీఎంలపై ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితేనే బెటరని సామాన్యులతో పాటు పార్టీల అధినేతలు సూచిస్తున్నారు. ఈవీఎంలు వాడకంలో అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్ విధానంలో ఖర్చు కొద్దిగా పెరిగినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఓటర్లకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం కలగాలంటే బ్యాలెట్ పేపరే బెస్ట్ అన్న వాదన వినిపిస్తోంది. -
జనస్వామ్యమా! జయీభవ!!
ఏటా వచ్చే వేసవికి అదనంగా ఈసారి ఎన్నికల వేసవిని చవిచూస్తున్నాం. కాకపోతే రెంటి మధ్యా ఒక తేడా ఉంది. సూర్యతాపం ద్విగుణీకృతమవుతున్నకొద్దీ, వోటర్లలోనూ ఎన్నికల సమరోత్సాహం త్రిగుణీకృతమవుతుంది. అదే ప్రజాస్వామ్యంలోని అందమూ, చందమూ, ఆకర్షణా. ప్రజా స్వామ్యం అత్యుత్తమం కాకపోవచ్చుకానీ, ఇప్పటివరకూ అనుభవంలోకి వచ్చిన అన్ని వ్యవస్థల్లో అదే ఉత్తమమని పండితులెందరో తేల్చారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే వెన్నెముక. తమ కలలు, కాంక్షలతో ముడిపడినవి కనుకే ఎన్నికలు జనానికి మండు వేసవిలోనూ మంచు లేపనమవుతాయి. రాచరికం, సైనిక నియంతృత్వం లాంటి చేదు అనుభవాల దరిమిలా ప్రజాస్వామ్యాన్ని తెచ్చు కున్నామని పొరబడేవారున్నారు. రాజ్యమూ, సామ్రాజ్యమూ ఉనికిలోకి రాకముందే, మనుషులు గుంపు కట్టడం నేర్చిన తొలి దశలోనే అంకురించిన తాత్వికత– ప్రజాస్వామ్యం. కాలికమైన అంతరాలను, అడ్డంకులను దాటుకుని నేటికీ పురివిప్పుతున్న రాజకీయ తాత్వికత అదే. వేట– ఆహార సేకరణ దశలో మనిషి ప్రకృతి శక్తులతో పోరాడుతున్నప్పుడే తోటి మనుషుల తోడు, తోడ్పాటుల విలువ గుర్తించాడు; అభిప్రాయాల కలబోతనూ, ఐక్య కార్యాచరణనూ అలవరచుకున్నాడు. అంద రినీ కలుపుకొనిపోయే నాయకత్వాన్నీ ఆనాడే ప్రతిష్ఠించుకున్నాడు. గణతంత్రం పేరిట సాముదా యికంగా అభివృద్ధి చేసుకున్న సమాజాలతోనే రాజకీయ చరిత్ర ప్రారంభమైందని విజ్ఞులంటారు. గణతంత్రంలో నాయకుడు సమానులలో మొదటివాడే తప్ప అసామాన్యుడూ కాదు, అడ్డు అదుపుల్లేని అధికార శ్రీమంతుడూ కాదు. నేడు ప్రతి వోటుకూ ఒకే విలువ ఉన్నట్టే, నాడు ప్రతి ఒకరికీ ఒకే విలువ. పురాణేతిహాసాల్లో ఇందుకు సాక్ష్యాలు కనిపిస్తాయి. రామాయణంలో దశరథుడు తన పెద్దకొడుకు రాముడికి పట్టాభిషేకం చేయడానికైనా; మహాభారతంలో యయాతి తన చిన్న కొడుకు పూరునికి రాజ్యం కట్టబెట్టడానికైనా పౌర, జానపదుల ఆమోదం తప్పనిసరి. సమష్టి స్థానంలో వ్యక్తి ప్రాధాన్యం పుంజుకున్న దశలోనూ మంత్రి పరిషత్తులో చర్చించే నిర్ణయాలు తీసుకు నేవారు. విభీషణ శరణాగతి ఘట్టంలో రాముడు వానరవీరుల అభిప్రాయాన్ని అడుగుతాడు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నో మలుపులూ, మరకలతోపాటు మెరుపులూ మన చూపుల్ని జిగేలుమనిపిస్తాయి. గణాలు వ్రాతాలుగా, వ్రాతాలు జనాలుగా, జనాలు మహాజనాలుగా మారే క్రమంలోనే సామ్రాజ్యాలు ఉనికిలోకి వచ్చాయి. మనదేశంలో మగధ సామ్రాజ్యావతరణకు ముందున్నది గణతంత్రమే. ఆనాడు దేశం పదహారు జనపదాలుగా ఉండేది. గ్రీస్, మెసపోటేమియాలలో గణతంత్ర రాజ్యాలు ఉండేవి. నాటి గ్రీస్లోని ఎథెన్స్ అధినేత పెరిక్లీస్ ప్రజాస్వామిక అనుభవాన్ని కొత్త పుంతలు తొక్కించి జనతంత్రానికే ఘన చిహ్నమయ్యాడు; సంపన్నుల ప్రతిఘటనకు ఎదురొడ్డుతూ పేదలవైపు నిలబడి కలబడడంలోనూ ప్రజానాయకులకు తొలిమూసై మణిపూస అయ్యాడు. బలవత్తరులైన పర్షియన్ల దాడిని దీటుగా తిప్పికొట్టినా, సాటి గ్రీసు రాజ్యమైన స్పార్టాతో యుద్ధమొచ్చిన దశలో ప్లేగు వాతబడి అతను కన్నుమూయడం ఎథెన్స్ స్వాతంత్య్రానికీ; ప్రజాస్వామ్యానికీ చితిపేర్చింది. ఆ తర్వాత, స్పార్టా సహా గ్రీస్ అలెగ్జాండర్ సామ్రాజ్యంలో, ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యంలో చిన్న వలసగా మసకబారిపోయింది. అలా కొడిగట్టిన ప్రజా స్వామ్యం తిరిగి కాంతినీ, క్రాంతినీ తెచ్చుకోవడానికి రెండువేల సంవత్సరాలు పట్టింది. ఎథెన్స్ ప్రభవించిన తాత్విక శిఖరాలే సోక్రటిస్, ప్లేటో, అరిస్టాటిల్! సోక్రటిస్ ప్రజాస్వా మ్యాన్ని వ్యతిరేకించినా; ప్లేటో అన్ని అధికారాలనూ రాజ్యం చేతుల్లో పెట్టి, ఉదారవాద నియంతృత్వమనే ఊహాస్వర్గానికి నిచ్చెన వేసినా; అరిస్టాటిల్ మధ్యేమార్గంగా రాజ్యాంగబద్ధ ఆదర్శ రాజ్యాన్ని నొక్కి చెప్పినా– ముగ్గురూ పశ్చిమ దేశాల రాజకీయ తాత్విక చింతనను ఉద్దీపింపజేసిన వారే. ప్రత్యేకించి అరిస్టాటిల్ ఆధునిక కాలంలో జాన్ లాక్, మాంటెస్క్యూ వంటి ప్రజాస్వామ్య దిశానిర్దేశకులకు ఒరవడి అయ్యాడు. గ్రీకుల బహుళ దేవతారాధనను వ్యతిరేకించినందుకు సోక్ర టిస్ను ఉరితీయడం ఎథెన్స్ ప్రజాస్వామ్య పరిమితిని, అపరిణతిని నొక్కిచెప్పి; భావప్రకటనా స్వేచ్ఛలేనిది ప్రజాస్వామ్యమే కాదన్న నీతినీ బోధించింది. పౌర ప్రాతినిధ్యం నుంచి రాచరిక నియంతృత్వంలోకి జారిపోయిన రోమ్ అనుభవమూ ఇలాంటిదే. వ్యక్తులు ఉత్తములూ, ఉన్నత సంకల్పవంతులూ అయితే చాలదు; వ్యవస్థలను బలోపేతం చేస్తేనే ప్రజాస్వామ్యానికి ఉనికీ, మనికీ అన్నది రోమ్ నేర్పిన గుణపాఠం. యూరప్ అంతటా ప్రజాస్వామ్య వ్యవస్థల సంపూర్ణ పతనం; ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి ఇంగ్లండ్ వేగుచుక్క కావడం; ఫ్రెంచి విప్లవం తిప్పిన మలుపులు; ప్రజాస్వామ్య మార్గంలో అమెరికా వేసిన ముందడుగు– ఇదంతా మరో చరిత్ర. వోటుహక్కు చరిత్రనే తిరగేస్తే, ఎథెన్స్ ప్రజాస్వామ్యంలోనూ బానిసలకు వోటు హక్కు లేదు. ఆ తర్వాతా శ్రామికులకు, స్త్రీలకు వోటు హక్కు లభించడానికి పెద్ద పోరాటాలే జరిగాయి. యూరప్ దేశాలు అనేకం ప్రజాస్వామ్యంలోకి రావడానికి ఇరవయ్యో శతాబ్ది చివరి వరకూ ఎదురుచూశాయి. ఇలాంటి చీకటి వెలుగుల చిత్రపటంలో భారత్ ఉనికే ఉజ్వలమూ, ఉత్తేజవంతమూ! వోటు హక్కును సార్వత్రికం చేసిన తొలి ఘనత మనదే. భారత్ ఒక దేశంగా మారడాన్నే అనుమానించి అవహేళన చేసిన నాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ సహా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రజాస్వామిక ప్రస్థానంలో ముందడుగు వేస్తూనే ఉన్నాం. బహుళ మతాలూ, భాషల వైవిధ్యం వైరుద్ధ్యం కాదనీ, ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువనీ ప్రపంచానికి చాటి చెప్పాం. భారత ప్రజాస్వామ్యమా! జయతు జయతు! -
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం: అమెరికా
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని కలిగిన ఉన్న దేశం భారత్ అని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. భారత్ ఎల్లప్పుడు తమకు ప్రాముఖ్యతతో కూడిన వ్యూహాత్మక భాగస్వామి అని తెలిపింది. భారత్-అమెరికా సంబంధాలపై యూఎస్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం మీడియాతో మాట్లాడారు. భారత్లో లోక్సభ ఎన్నికల వేళ అమెరికా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా మిల్లర్ చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్లో ప్రజాస్వామ్యం వెనకబాటు తనం, ప్రతిపక్షాలపై అణిచివేత దోరణీకి సంబంధించి అమెరికా కీలక వ్యాఖ్యలను ప్రస్తావిస్త్ను మీడియా అడిగిన ప్రశ్నకు మిల్లర్ సమాధానం చెప్పారు. ‘భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అమెరికాకు భారత్ చాలా ప్రాముఖ్యతతో కూడిన వ్యూహాత్మకమైన భాగస్వామి. ఇరు దేశాల బంధం సత్యమని నేను ఆశిస్తున్నా’అని మిల్లర్ పేర్కొన్నారు. ఇటీవల కూడా భారత సంబంధాలపై మిల్లర్ స్పందిస్తూ.. భారత్ తమకు(అమెరికా) చాలా ముఖ్యమైన భాగస్వామని పేర్కొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా భారత్, అమెరికాల సంబంధాలు ఎప్పడూ వృద్ధి చెందాలని కోరుకుంటున్నామని తెలిపింది. ఇటీవల సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు నిష్పక్షపాతంగా ఓటు వేయడానికి భారత్లో సరైన పరిస్థితులు ఉంటాయని ఆశిస్తున్నామని అమెరికా వ్యాఖానించిన విషయం తెలిసిందే. అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించిన సంగతి విదితమే. -
ఫర్ డెమాక్రసీ? అగేనెస్ట్ డెమాక్రసీ?
‘సిటిజెన్స్ ఫర్ డెమాక్రసీ’ ఆంధ్రప్రదేశ్లోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాపాడటానికి పుట్టినట్టు కనిపిస్తుంది. ఈ సంస్థ చేసిన అతి గొప్ప పని ముసలివాళ్ళకు, గుడ్డివాళ్ళకు, కుంటివాళ్ళకు ఇంటి దగ్గరే పింఛన్లను అందించే కార్యక్రమాన్ని ఆపించడం. ఇందుకోసం ముందు కోర్టుకు పోయింది. తరువాత ఎన్నికల కమిషన్ వద్దకు పోయి ఆపించింది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన 2,50,000 మంది వలంటీర్లు ఫించన్ల పంపిణీ ద్వారా ఓటును ప్రభావితం చేస్తారని. ఇదో కొత్త వాదన, వింత వాదన. ఈ అప్రజాస్వామిక సంస్థ చెయ్యబట్టి 30కి పైగా ముసలివాళ్ళు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈ సంస్థను ప్రజలు గౌరవిస్తారా? వైసీపీ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో వలంటీర్లను కాంట్రాక్టు ఉద్యోగ పద్ధతిలో నియమించింది. వారినందరినీ ఉద్యోగాల నుండి తీసేసే అధికారం ఈసీకి కూడా లేదు. వలంటీర్లు చేసే అతిమానవత్వపు పని ముసలోళ్ళకు, కుంటోళ్ళకు, గుడ్డోళ్ళకు ఒకటో తారీఖు నాడు పెన్షన్ డబ్బు వాళ్ళ ఇంటి వద్ద అందించడం. అదికాక వీళ్లు ఇంకా చాలా పనులు తమ క్లస్టర్స్ (దాదాపు 50 కుటుంబాలు)లో చేస్తారు. దాదాపు నాలుగున్నర సంవత్సరాలకు పైగా ఆ కుటుంబాలతో, ఆ ముసలి వారితో, రోగస్థులతో సంబంధంలో ఉండి వారి మెప్పును పొందిన వలంటీర్లను ఎన్నికలయ్యే వరకు వారిని కలిసి మాట్లాడకుండా ఎలా ఆపుతారు? అంతేకాదు, ప్రభుత్వ వెల్ఫేర్ స్కీముల కిందికొచ్చే ప్రజలు ఏ రాష్ట్రంలోనైనా మెజారిటీ. అటువంటి కుటుంబాలన్నిటితో ఈ వలంటీర్లు చాలా ఇతర స్కీముల ద్వారా కూడా కలుస్తారు కదా. ఆరోగ్య సంబంధ స్కీములు, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన అవసరాలు, స్కూలు పిల్లలకు ఉన్న అవసరాలు, రేషనుకు సంబంధించిన అవస రాలు అన్నీ వాళ్లు ఇంటింటికి తీరుస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళకు చెడ్డ పేరొస్తే తప్ప, మంచి పేరుతో, సహాయ సహకార సంబంధాలలో వలంటీర్లు ఉంటే వారి సంబంధాల్ని సిటిజెన్స్ ఫర్ డెమాక్రసీ గానీ, ఈసీగానీ ఎలా ఆపుతాయి? ఈ పనిని ఈ సంస్థ డెమాక్రసీకి అను కూలంగా కాదు చేసింది; డెమాక్రసీ వ్యతిరేక బుద్ధితో చేసినట్లు అర్థమౌతూనే ఉంది. ఈ వలంటీర్లు ఆయా గ్రామాల వారే, వాడల వారే. పట్టణాల్లో కూడా వాళ్ళు పనులు చేసే కుటుంబాలకు తెలిసిన వారే. వీళ్ళు నిత్య సంబంధాలు ముసలోళ్ళకు, కుంటోళ్ళకు, గుడ్డోళ్ళకు ఫించను ఇవ్వకుండా ఆపితే ఆగుతాయా? అప్పుడు ఈ సంస్థ ఏమి చెయ్యాలి? ఈ వలంటీర్ల ఉద్యోగాలు పీకించి గ్రామ బహిష్కరణ చేయించాలి. అప్పుడు వీళ్ళు నిజమైన సిటిజెన్స్ ఫర్ డెమాక్రసీ పని చేసినట్టు! కానీ అది వారి నుంచి కాదు కనుక ఈ ఒక్క డిమాండ్ సాధించారు. ఈ పని చేసింది ప్రజా స్వామ్యం కోసమా, ప్రతిపక్షాల కోసమా? అసలు ఈ సంస్థ ఏర్పడిన విధానం, దాని లక్ష్యం, అది సాధించిన ఘనతలను చూద్దాం. ఇది 2023 అక్టోబర్లో విజయవాడలో ఏర్పడింది. మాజీ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (రిటైర్డ్ ఐఏఎస్) జనరల్ సెక్రటరీగా ఏర్పడింది. మాజీ ఛీప్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం (రిటైర్డ్ ఐఏఎస్) ఇందులో ముఖ్యంగా పని చేస్తున్నారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లోనే డెమాక్రసీని కాపాడటానికి, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాపాడటానికి పుట్టినట్టు కనిపిస్తుంది. ఈ ఇద్దరికీ పౌరహక్కుల గురించి ఎన్నడూ మాట్లాడిన చరిత్ర లేదు. ఆదివాసుల్లోగానీ, దళితుల్లోగానీ వీరికి అభిమానులు ఉన్నట్లు ఎక్కడా కనిపించదు. ఇంతకుముందు ఐఏఎస్ అధికారులు పదవుల్లో ఉండగా, దిగిపోయాక కూడా ప్రజల హక్కుల కోసం పని చేసినవాళ్ళు ఉన్నారు. మన ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ శంకరన్, కాకి మాధవరావు చాలా కాలం ఇటువంటి పని చేశారు. ఆదివాసుల కోసం బీడీ శర్మ చాలా పనిచేశారు. శంకరన్ రిటైర్ అయ్యాక కమిటీ ఆఫ్ కన్సర్న్డ్ సిటిజన్స్ అనే సంస్థ పెట్టి బీద ప్రజల కోసం, పౌర హక్కుల రక్షణ కోసం చాలా పనిచేశారు. ఆయన మరణానంతరం దళిత సంఘాలు ఈనాటికీ ఆయన సంస్మరణ సభలు జరుపుతాయి. కాకి మాధవరావు ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్లో చాలా చురుకుగా పనిచేశారు. బీడీ శర్మ ఆది వాసుల హక్కుల కోసం తన జీవిత కాలమంతా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకు భిన్నంగా రమేష్ కుమార్, సుబ్రహ్మణ్యం... చంద్ర బాబు నాయుడి ఏజెంట్లుగా వ్యవహరించారని స్పష్టంగా అర్థమౌ తూనే ఉంది. దానివల్ల ఎవరి హక్కులు భంగమయ్యాయి? అతి బీద, ముసలి, కుంటి, గుడ్డి వారి హక్కులు భంగమయ్యాయి. చాలా బాధా కరమైన విషయమేమంటే ఈ అప్రజాస్వామిక సంస్థ చెయ్యబట్టి 30కి పైగా ముసలివాళ్ళు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇంత దారుణానికి ఒడిగట్టిన సిటిజెన్స్ ఫర్ డెమాక్రసీ అనే పేరు గల సంస్థను ప్రజలు గౌరవిస్తారా? ఇప్పుడు పరిస్థితి చూడండి. అదే చంద్రబాబు నాయుడు నేను వలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాను; వాళ్ళందరికీ నెలకు 10 వేలు ఇస్తానంటున్నాడు ఎందుకు? మొత్తం ప్రజానీకంలో ఆయన ఆట బొమ్మలైన మాజీ ఐఏఎస్ అధికారులు చేసిన పనివల్ల మొత్తం కూటమి ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. ఈ కూటమి కూడా ఒక ఉమ్మడి మానిఫెస్టోను ప్రకటించలేదు. ఎవరిది వాళ్ళు మానిఫెస్టోగా రాసుకున్నారు. కానీ రేపు అధికారమొస్తే ముగ్గురు మంత్రి మండలిలో ఉండి పరిపాలించాలి. చంద్రబాబు ఇప్పుడు ఇచ్చే హామీలు బీజేపీ, జనసేనవి కావు కదా! వాళ్ళెందుకు అంగీకరిస్తారు? ఆయన పబ్లిక్ మీటింగుల్లో ఇష్టమొచ్చినట్లు వాగ్దానాలు చేస్తున్నాడు. మరో వాగ్దానం చూడండి. ఆయన అధికారంలోకి వస్తే ప్రతి స్త్రీకి సంవత్సరానికి 15 వేలు ఇస్తాడట. ఇంట్లో ఎంతమంది స్త్రీలు ఉంటే అన్ని పదిహేను వేలు ఇస్తాడట. ఇద్దరుంటే 30 వేలు, ముగ్గురుంటే 45 వేలు అంటున్నాడు. ఈ పైసల పంపకాన్ని బీజేపీ ఒప్పుకుంటుందా! అందుకు మోదీ సరే అన్నాడా? చంద్రబాబు హామీలు జగన్ హామీ లలా కాదే. జగన్ అన్నీ స్వయంగా తన పార్టీలో నిర్ణయించగలడు. కానీ బాబు ఇప్పుడు అలా చెయ్యలేడే. బీజేపీ ఒక జాతీయ పార్టీ. దానికి 30 వేల ఎకరాల్లో వేల కోట్లు పెట్టి రాజధాని కట్టడమే అంగీకారం కాదు. ఇప్పుడు ఆంధ్రలో వలంటరీ వ్యవస్థను అంగీకరిస్తే దేశమంతా అటువంటి డిమాండ్లు వచ్చే అవకాశముంది. కనుక బాబు బోగస్ వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆయన అయోమయంలో మాట్లాడు తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దేశంలో చాలా అంశాలను ప్రభావితం చేస్తాయి. ప్రశాంత్ కిశోర్ డబ్బులతో ఎన్నికల రిజల్ట్ ప్రిడిక్షన్స్ చేస్తూ స్వంత పార్టీ పెట్టి బిహార్లో ఏ మాత్రం గుర్తింపు లేని నాయకుడుగా మిగిలిపోయి ఇప్పుడు మళ్ళీ పాత అవతారమెత్తుతున్నాడు. ఏపీ ఎన్నికలు అతన్ని దేశంలోనే ఎవరూ నమ్మకుండా చేసే అవకాశముంది. విదేశాల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకొని వచ్చిన ఈ బ్రాహ్మణ మేధావి ఇంగ్లిష్ మీడియం విద్యా ప్రభావంగానీ, సంక్షేమ పథకాల ప్రభావంగానీ ఎన్నికల్లో ఉండదని ఊకదంపుడు బ్రాహ్మణ వాదం చేస్తున్నాడు. బడులు కాకుండా, గుడులు కడితే ప్రజలు ఓట్లేస్తారని వీరి సిద్ధాంతం. రిటైర్డ్ ఐఏఎస్లు పౌరహక్కుల నాయకుల అవతారమెత్తి ముసలోళ్ళను, కుంటోళ్లను, గుడ్డోళ్ళను ముంచితే వారి నాయకుడు చంద్రబాబు వలంటీర్లను, అమరావతి రైతులను అంతు లేని ఆశలతో ముంచుదామని చూస్తున్నాడు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపిస్తలేదు. ఎలా నమ్ముతారు? జగన్ వెల్ఫేర్ కార్యక్రమాల వల్ల రాష్ట్రం అప్పుల పాలైంది; అభివృద్ధి అంటే సింగపూర్ వంటి రాజధాని కట్టలేదు; అద్దంలా మెరిసే రోడ్లు వెయ్యలేదు అంటూనే ఇప్పుడు జగన్ను మించిన హామీలిస్తున్నాడు. ఆయన ఇచ్చే హామీల గురించి పవన్ కల్యాణ్ గానీ, పురందే శ్వరిగానీ ఏమీ మాట్లాడటం లేదు. అంటే ఆ పార్టీలు ఈ వాగ్దానా లను అంగీకరించవనే కదా అర్థం. ఎన్నికలు ఇంకో నెల రోజులు ఉండగా, ఈ మూడు పార్టీల పరేషాన్ చూస్తే చూసేవారికే జాలేస్తుంది. మరీ చంద్రబాబు అయితే ఓడిపోతే ఎట్లా, ఎట్లా అనే భయం ముఖంలో కనిపిస్తుంది. ఇవి ఆఖరి ఎన్నికలని ఆయన భయమే చెబుతుంది. ఏమౌతుందో ఏపీ ప్రజలే నిర్ణయిస్తారు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
Lok sabha elections 2024: ఎన్నికల భారతం చూసొద్దాం!
ప్రపంచ ప్రజాస్వామ్య జాతరలో పూనకాలు లోడింగ్... అని చెప్పేందుకు ఈ అంకెలు చాలు! 1952 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ట్రాక్ రికార్డు ఇది. అంతేకాదండోయ్... యూరప్ మొత్తం జనాభా (75 కోట్లు) కంటే ఈ ఎన్నికల్లో మన ఓటర్లే ఎక్కువ! అందుకే ఇప్పుడు ప్రపంచమంతా మన ఓట్ల పండుగ వైపు చూస్తోంది. విదేశీ టూరిస్టులు కూడా ఈ కోలాహలాన్ని కళ్లారా చూసేందుకు ఉవి్వళ్లూరుతున్నారు. ఈ ఆసక్తిని గమనించిన పలు భారతీయ ట్రావెల్ కంపెనీలు వినూత్న ఐడియాతో వారికి ‘ద గ్రేట్ ఇండియన్ ఎలక్షన్ మేజిక్’ను చూపించేందుకు ప్లాన్ చేశాయి. అదే ‘ఎన్నికల టూరిజం’. దేశంలో ఇప్పుడిది నయా ట్రెండ్! ‘కోడ్’ కూతతో 7 విడతల్లో 44 రోజుల పాటు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మెగా సార్వత్రిక సమరంలో పారీ్టల ప్రచారం జోరందుకుంది. ఇసుకేస్తే రాలనంత జనంతో భారీ సభలు.. పోటీ చేసే అభ్యర్థులు చేసే విన్యాసాలు... ప్రసంగాల్లో నేతల వాగ్దాటి... రాత్రికిరాత్రే పారీ్టలు మార్చే ఆయారాంలు, గయారాంలు.. హోరెత్తించే ర్యాలీలు.. కార్యకర్తల సందడితో దేశమంతా ఎన్నికల జ్వరం ఆవహించింది. మనకు ఇవేమీ కొత్తకాదు. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల క్రతువును ప్రత్యక్షంగా చూడాలనుకునే విదేశీయుల కోసం దేశంలోని పలు ట్రావెల్ ఏజెన్సీలు ఎన్నికల టూరిజం పేరుతో ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి. 2019లో ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికలను చూసేందుకు దాదాపు 8,000 మంది విదేశీ టూరిస్టులు వచి్చనట్లు అంచనా. ముఖ్యంగా అమెరికా, చైనా, నేపాల్, యూఏఈ, ఉక్రెయిన్, ఆ్రస్టేలియా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. విద్యార్థులు, జర్నలిస్టులు, రీసెర్చ్ స్కాలర్లు, మహిళా బృందాలు, చరిత్ర–సంస్కృతి, రాజకీయాల పట్ల మక్కువ చూపేవారు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈసారి ఎన్నికల టూరిజం కోసం 25,000 మందికి పైగానే విదేశీ పర్యాటకులు రావచ్చని ట్రావెల్ కంపెనీలు లెక్కలేస్తున్నాయి. మెక్సికో స్ఫూర్తి 2005లో మెక్సికోలో బాగా విజయవంతమైన పోల్ టూరిజం స్ఫూర్తితో అహ్మదాబాద్కు చెందిన అక్షర్ ట్రావెల్స్ అనే సంస్థ ఈ కాన్సెప్టును తొలిసారి దేశంలో ప్రవేశపెట్టింది. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీలతో ఆకట్టుకుంది. వణ్యప్రాణుల టూరిజం... మెడికల్ టూరిజం... విలేజ్ టూరిజం... హిమాలయన్ ట్రెక్కింగ్ టూరిజం... తీర్థయాత్రల టూరిజం... దేవాలయాలు–ఆధ్యాతి్మక టూరిజం.. యోగా టూరిజం.. ఇలా విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తున్న జాబితాలోకి ఎన్నికల టూరిజాన్ని కూడా చేర్చింది. గుజరాత్లో సక్సెస్ కావడంతో 2014, 2019 లోక్సభ ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా దీన్ని కొనసాగించినట్లు ఆ సంస్థ చైర్మన్ మనీష్ శర్మ చెప్పారు. ‘ఎన్నికల సమయంలో భారత్ను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ టూరిస్టుల్లో యూరోపియన్లు, మధ్య ప్రాచ్యం, పశి్చమాసియాకు చెందిన వారు ఎక్కువ. ర్యాలీల్లో లక్షలాది మంది పాల్గొనడం వారికి సరికొత్త అనుభూతిని అందిస్తోంది’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశంలో 20కి పైగానే ట్రావెల్ ఏజెన్సీలు ఎలక్షన్ టూరిజం ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. 6 రోజులకు ప్రారంభ ధర రూ. 40,000 కాగా, 2 వారాల ప్యాకేజీకి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ప్యాకేజీల ప్రత్యేకతేంటి? అటు పర్యాటకంగా, ఇటు రాజకీయంగా ఆసక్తి రేకెత్తించే కీలక ప్రాంతాలు, రాష్ట్రాలను ఏజెన్సీలు ప్రధానంగా ఎంచుకుంటున్నాయి. వారణాసి, ఢిల్లీతో సహా కేరళ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటివి ఎన్నికల టూరిజం ప్యాకేజీల్లో ప్రధానంగా చోటు దక్కించుకుంటున్నాయి. భారీ ఎన్నికల ర్యాలీలు, సభల్లో పాల్గొనడంతో పాటు స్థానిక రాజకీయ నాయకులతో మాటామంతీ, కలిసి భోజనం చేయడం, గ్రామ పంచాయతీలను సందర్శించడం వంటివన్నీ ప్యాకేజీల్లో చేరుస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులను కలుసుకునే అవకాశాన్ని కూడా టూరిస్టులకు కలి్పస్తున్నారు. దీనివల్ల వారి ప్రచార వ్యూహాలు, ఇతరత్రా ఎన్నికల సంబంధ విషయాలను నేరుగా తెలుసుకోవడానికి వీలవుతుంది. కేవలం ఎన్నికల కార్యక్రమాలనే కాకుండా చుట్టుపక్కల గుళ్లూ గోపురాలు, కోటలు, బీచ్ల వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను చుట్టేసే విధంగా ప్యాకేజీలను రూపొందిస్తున్నామని శర్మ వివరించారు. అంతేకాదు ధాబాల్లో భోజనం, స్థానికంగా నోరూరించే వంటకాలను రుచి చూపించడం, ఆ ప్రాంతంలోని సంస్కృతి, సాంప్రదాయాలతో పర్యాటకులు మమేకం కావడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీకి చెందిన ఇన్క్రెడిబుల్ హాలిడేస్ అనే సంస్థ విదేశీ టూరిస్టులతో పాటు దేశీ పర్యాటకులకు కూడా ఇలాంటి ప్యాకేజీలను అందిస్తోంది. సందర్శనీయ ప్రదేశాలను చూపడంతో పాటు ఎన్నికల సంబంధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే విధంగా పర్యాటకుల అభిరుచిని బట్టి ప్యాకేజీలను రూపొందిస్తున్నామని ఈ కంపెనీ కన్సల్టింగ్ పార్ట్నర్ సుదేశ్ రాజ్పుత్ పేర్కన్నారు. ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ రూ.25,000 నుంచి ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. ట్రావెబ్రేట్.కామ్ ప్యాకేజీ కూడా ఇలాంటిదే. ఢిల్లీలోని ఎలక్షన్ మ్యూజియం సందర్శనలో మన ఎన్నికల చరిత్ర, చిరస్మరణీయ నాయకుల గురించి తెలుసుకోవడం, పోలింగ్ను తీరును చూపించడం, ఫలితాల రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠ, విజేతల సంబరాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం వంటి పలు ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటు ప్రజాస్వామ్య జీవధాతువు
భారతదేశంలో రాజకీయాలు 2024 సార్వత్రిక ఎన్నికల శంఖారావంతో ఊపందుకున్నాయి. ఓటరు చైతన్యం ఇందులో కీలకం. ఓటు దేశ ప్రజలకు జీవధాతువు. మన జీవిత నిర్మాణానికి అది ఒక పనిముట్టు. ఓటుహక్కును మనం దుర్వినియోగం చేసుకుంటే, మన మిగిలిన హక్కులన్నీ కాల రాయ బడతాయి. అందుకే ఓటు అనేది అత్యున్నతమైనది. దాని విలువ అమూల్యమైనది. ఆ విలువ మానవ విలువలతో సమానమైనది. భిన్న భావజాలాల ప్రభావం ఈ ఎన్నికల మీద ఉండబోతోంది. అంబేద్కర్ వాదుల, సామ్యవాదుల, సోషలిస్టుల, కమ్యూనిస్టుల, స్త్రీవాదుల, దళిత బహుజన వాదుల, మైనారిటీ హక్కుల వాదుల, మానవ హక్కుల పోరాటవాదుల సిద్ధాంతాల ప్రజ్వలనం సమాజంలో అంతర్గతంగా బలంగా ఉందని చెప్పక తప్పదు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మళ్ళీ తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నాలుగు రోజుల్లో షెడ్యూలు వస్తుందనగా... బీజేపీకి ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంగా బయటికి తీసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడం దీని లక్ష్యం. సీఏఏ చట్టం 2019 లోనే పార్ల మెంట్ ఆమోదం పొందినా, రాష్ట్రపతి సమ్మతి కూడా లభించినా... విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా అమలులో జాప్యం జరిగింది. పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా పలుమార్లు చెబుతూ వచ్చారు. సరిగ్గా అదను చూసి ఇపుడు దానిని తెరపైకి తెచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి 2014 డిసెంబర్ 31 కంటే ముందు మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ఈ చట్టం వర్తిస్తుంది. భారతదేశంలోకి అనేక మతాలవారు ఆయా కాలాల్లో వచ్చారు. భారతీయ జన జీవనంలో కలసిపోయారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి అన్ని మతాలవారు, కులాల వారు కలసి పోరా డారు. భారతదేశానికి మొదటి ఎన్నికలు జరిగినప్పటి నుండి ముస్లింలకు పార్లమెంట్లోనూ, అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం ఇస్తూ వస్తు న్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ముస్లిం సభ్యులు 76 మంది ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ముస్లిం ఎంపీలు గణనీయంగా ఎన్నికయ్యారు. ఆనాడు ముస్లింల జనాభా 6 శాతం కంటే తక్కువ. మొదటి రాజ్యసభలో సుమారు 10.5 శాతం ముస్లిం సభ్యులున్నారు. 2014లో బీజేపీ స్వల్ప మెజారిటీతో లోక్సభ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ అధికారానికి వచ్చిన నాటి నుండి ముస్లింల ప్రాతినిధ్యం అత్యల్పం. అందుకే 2024 ఎన్నికల్లో ముస్లింలు ఏకమై సెక్యులర్ పార్టీలకు ఓట్లు వేస్తారని ఒక పరిశోధనా పత్రం పేర్కొంది. బీజేపీపై పోటీ చేసే బలమైన అభ్యర్థికి ఓట్లు వేస్తారని ఆ పరిశోధన అంచనా వేసింది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 27 మంది ముస్లిం అభ్యర్థులు గెలవగా (17వ లోక్సభ), 16వ లోక్సభలో 23 మంది ముస్లిం సభ్యు లున్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇది ముస్లింలు తక్కువ సంఖ్యలో వున్న రెండోసభ. ప్రపంచంలో భారత్ మూడవ అతిపెద్ద ముస్లిం జనాభా (17.22 కోట్లు్ల) కలిగివున్న దేశం. నిజానికి ముస్లింలు ఈ దేశ స్వాతంత్య్రంలో పాల్గొన్న ప్రధానమైన శక్తులు. వారిని నిర్లక్ష్యం చేయడం దేశ అభివృద్ధికి, సౌభాగ్యానికి గొడ్డలిపెట్టు. క్రైస్తవులు భారతదేశానికి ఇతర దేశాల నుండి వలస వచ్చినవారు కాదు. హిందూమతంలో అస్పృశ్యతకు, నిరాదరణకు గురైనవారు ఆ మతంలోకి వెళ్ళి అక్షర విద్యను నేర్చుకున్నారు. దళితులు ఎక్కువ మంది క్రైస్తవ మతంలో చేరి అక్షర విద్యను నేర్చుకున్నారు. వారిని నిరాకరించడం వల్ల, జనరల్ సీట్లలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్ల లౌకికవాదం దెబ్బతింటుంది. ఇక బౌద్ధం భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక విప్లవాన్ని తీసుకువచ్చింది. సమసమాజ భావాన్ని ప్రజ్వ లింప చేసింది. మానవతా ధర్మాన్ని ప్రబోధం చేసింది. భారతదేశ వ్యాప్తంగా బౌద్ధ సంస్కృతి వికాసం జరిగింది. భారతదేశం నుండి ప్రపంచ దేశాలకు బౌద్ధం విస్తరించింది. భారతదేశ వ్యాప్తంగా బౌద్ధులు కోట్లాది మంది వున్నారు. వారు ప్రత్యక్షంగా లేకపోవచ్చు. పరోక్ష రాజకీయ ఉద్యమంలో వున్నారు. తప్పకుండా భారత రాజ కీయాల్లో వీరి ప్రభావం స్పష్టంగా వుంది. ఇకపోతే రావ్ు మనోహర్ లోహియా ప్రభావం దళిత బహుజన రాజకీయాల మీద బలంగా వుంది. మండల కమిషన్ రిపోర్టును బయటికి తీసుకొచ్చిన వి.పి.సింగ్ ప్రభావం కూడా బలంగా వుంది. కమ్యూనిస్ట్లు, అంబేడ్కర్ వాదుల అశేషమైన భావజాలం కూడా 2024 ఎన్నికల మీద వుంది. భారతదేశంలో అనేక భావజాలాల ప్రభావానికి ఈ ఎన్నికలు గురవు తాయి అనడంలో సందేహం లేదు. ఫూలే, అంబేడ్కర్, రావ్ు మనో హర్ లోహియా, పెరియార్ రామస్వామి నాయకర్, వి.పి. సింగ్, కాన్షీరావ్ు... వీరందరి ప్రభావం తప్పక ప్రజల మీద ఉంది. ఇకపోతే 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన తొమ్మిదేళ్ళ పది మాసాల్లో పెరిగిన నిరుద్యోగం, చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు, నల్ల ధనాన్ని వెనక్కి తీసుకురావడంలో విఫలం కావడం, సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొన్న అష్ట కష్టాలను ప్రధానాంశాలుగా ప్రతిపక్షాల కూటిమి ‘ఇండియా’ విస్తృతంగా ప్రచారం చేయాలి. మాజీ ఎన్నికల కమిషనర్ టి.ఎన్. శేషన్ చెప్పినట్లుగా దశ మహపాతకాలు దేశ ఎన్నికల వ్యవస్థను కరకర నమిలేస్తున్నాయి. భారతదేశంలో ఎన్నికలు కొత్త కాదు. ప్రజలు చైతన్యవంతులు, ఆలోచనాపరులు. అయితే, యువతకు ఉద్యోగ వసతి కల్పిస్తారనీ, ఆర్థిక అభివృద్ధి చేస్తారనీ ఎక్కువమంది మోదీకి ఓట్లు వేశారు. కానీ పేద ప్రజలకు భరోసాని ఇచ్చే ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామి’ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నీరుగార్చింది. స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడమనేది కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధ విధి. ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు నిర్వహించడం వల్ల కొంత మేలు ఉన్నప్పటికీ, లోపాలు కూడా లేక పోలేదు. సున్నితమైన నియోజకవర్గాల్లో, ఎన్నికల సంబంధ హింసాకాండ చోటు చేసుకొనే అవకాశమున్న పోలింగ్ కేంద్రాల్లో తగిన సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించడానికి విడతలవారీ ఎన్నికల నిర్వహణ దోహదపడుతుంది. 85 ఏళ్ళ వయస్సు పై బడిన వారందరూ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 85 వయస్సు పైబడిన ఓటర్లు దేశ వ్యాప్తంగా 82 లక్షల మంది ఉన్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందులో వందేళ్ళు దాటిన ఓటర్లు 2 లక్షల 18 వేల మంది వున్నారు. భారతదేశ రాజకీయాల్లో ఈనాడు అనివార్యంగా ఓబీసీలకు సీట్లు పెంచవలసిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది. బీసీలు వృత్తికారులే కాక, శ్రామికశక్తులు! చాలామంది బీసీలు తమ విముక్తిదాతైన ఫూలే గూర్చి తెలుసుకోలేకపోతున్నారు. మహాత్మా ఫూలే ఓబీసీలకు అర్థమైనపుడే వారిలో సామాజిక, రాజ కీయ చైతన్యం వస్తుంది. స్త్రీలకు కూడా మునిపటి కంటే ఎక్కువ సీట్లు ఇస్తారు. విద్యాధికులు, రిటైర్డ్ ఆఫీసర్లు, అడ్వకేట్లు, పాత్రికేయ ప్రము ఖులు, రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇప్పుడు రాజకీయ రంగంలోకి దూకారు. ఆంధ్రప్రదేశ్లోకి బీజేపీని ఆహ్వానించడం వల్ల చంద్రబాబు ముస్లింల, క్రైస్తవుల, సోషలిస్టుల, కమ్యూ నిస్టుల ఓట్లు కోల్పోతున్నారు. రాజ్యాంగేతరమైన భావజాలం ఎన్ని కలలో పెరగడం ఆశ్చర్యకరం. అయితే భారతదేశంలో ఇవన్నీ అనేక సందర్భాలలో జరుగుతూ వచ్చాయి. వాటన్నింటినీ భారతదేశం తట్టుకొని నిలబడుతూ వచ్చింది. బీజేపీ తన వ్యూహ ప్రతి వ్యూహ రచనల్లో ప్రధానంగా పార్టీలను చీల్చడం, లొంగదీసుకోవటం వంటి అనేక వ్యూహాలతో ముందుకువెళ్తోంది. కానీ భారత రాజ్యాంగాన్ని దాటి వెళ్లే శక్తి ఏ వ్యక్తికీ, ఏ పార్టీకీ లేదని మనం తప్పక నమ్మాలి. దాని అంతర్గత శక్తి బౌద్ధ సూత్రాలతో నిండి ఉంది. అందుకే 2024 ఎన్నికలకు దళిత బహుజన లౌకికవాద భావజాలంతో ముందుకు నడవాల్సిన చారిత్రక సందర్భం ఇది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
Delhi liquor scam: 31న విపక్షాల మహా ర్యాలీ
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా విపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు చేతులు కలుపుతున్నారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ, ఆయనకు సంఘీభావంగా ఈ నెల 31న తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో మహా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. కూటమి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దేశ ప్రయోజనాలతోపాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో మహా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించామని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. దేశంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యం పెను ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారంతా కేజ్రీవాల్ ఆరెస్టు పట్ల ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ‘‘ఇది కేవలం అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన సమస్య కాదు. ప్రతిపక్షాలన్నీ బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి. అధికారంలో ఉన్న వ్యక్తులు మొదట విపక్షాలను డబ్బుతో కొనేయాలని చూస్తున్నారు. మాట వినకపోతే ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగిస్తున్నారు. అయినా లొంగకపోతే తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఇలాగే అరెస్టు చేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పైనా గురిపెట్టారు’’ అని గోపాల్ రాయ్ ఆరోపించారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను గృహ నిర్బంధంలో ఉంచారని, ఆప్ కార్యాలయాన్ని సీజ్ చేశారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని చెప్పారు. కేవలం రాజకీయ సభ కాదు ఢిల్లీలో ఈనెల 31న జరిగే మహా ర్యాలీ కేవలం రాజకీయ సభ కాదని, కేంద్రంలోని నిరంకుశ బీజేపీకి వ్యతిరేకంగా వినిపించే గొంతుక అని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరి్వందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఖాతాలను స్తంభింపజేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. ఇండియా కూటమి పక్షాలకు అండగా నిలుస్తామని తెలిపారు. మోదీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై దాడులను సహించబోమని సీపీఎం నేత రాజీవ్ కున్వార్ స్పష్టం చేశారు. -
ప్రజాస్వామ్యంలో ఏఐ పాత్ర
ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) తన మొదటి ప్రధాన నైతిక పరీక్షను ఎదుర్కొనే సంవత్సరంగా ఈ 2024 ఉండబోతోంది. ఈ సంవత్సర ప్రారంభంలో బంగ్లాదేశ్, స్లొవేకియాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులను దెబ్బగొట్టడానికి ‘డీప్ ఫేక్’ను వాడుకున్నారు. అదే సమయంలో, జైలు నుంచే ఇమ్రాన్ ఖాన్ తన ఓటర్లకు పిలుపునివ్వడంలో కూడా జెనరేటివ్ ఏఐ సాయపడింది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే పాత్రకు భిన్నంగా కృత్రిమ మేధను ఎలా ఉపయోగించుకోవచ్చో పాకిస్తాన్ చేసి చూపించింది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడానికి కృత్రిమ మేధ చాలా సాయపడగలదు. తక్కువ ఖర్చుతో, అధిక సామర్థ్యంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని నిర్వహించుకోవడంలోనూ ఇది ఎంతగానో ఉపయోగపడగలదు. గత రెండేళ్లుగా, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ)... దాని ద్వారా ఉత్పన్నమైన ఉత్సాహం, అది కలిగించిన అంతరాయాలపై సాంకేతిక కథనాలు ఆధిపత్యం చలాయించాయి. కాపీరైట్, పక్షపాతం, గోప్యత, డీప్ఫేక్ (వ్యక్తుల వాస్తవ చిత్రాన్ని మార్చి అప్రతిష్ఠకు పాల్పడటం) వంటి నైతిక సమస్యలు ఎదురు కావడంతో, 2023 చివరి భాగంలో ఈ కథనాలు కొద్దిగా పసలేనివిగా మారిపోయాయి. ఇప్పుడు, చాలా దేశాల్లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి సహాయపడినా లేదా దానిని నాశనం చేసినా... కృత్రిమ మేధస్సు తన మొదటి ప్రధాన నైతిక పరీక్షను ఎదుర్కొనే సంవత్సరంగా 2024 ఉండబోతోంది. భారత్, అమెరికా, బ్రిటన్, ఇండోనేషియా, ఇతర ప్రధాన ప్రజాస్వామ్య దేశాలు ఈ సంవత్సరం కీలకమైన ఎన్నికలకు వెళుతున్నాయి. జనరేటివ్ ఏఐ కంటే ముందే డీప్ఫేక్లు ఉనికిలో ఉన్నప్పటికీ – ‘సోరా’, ‘స్టేబుల్ డిఫ్యూజన్’ వంటివి వాటి ఉత్పత్తిని ప్రజాస్వామీకరించాయి. వాటిని సులభంగా, వేగంగా, చౌకగా మార్చేశాయి. వాట్సాప్, టిక్ టోక్ మొదలైనవి అంతర్జాతీయ పంపిణీని అత్యంత సులభంగా మార్చేయడంతో సోషల్ మీడియాకు సంబంధించి శిఖరస్థాయి దశలో ఉన్నాం. బంగ్లాదేశ్, స్లొవేకియా ఈ సంవ త్సరం ప్రారంభంలో ఎన్నికలకు వెళ్లాయి. ఈ సందర్భంగా చాలా డీప్ఫేక్లు వచ్చాయి. బంగ్లాదేశ్ ప్రతిపక్ష నాయకుడు పాలస్తీనియన్లకు తన మద్దతు విషయంలో సందిగ్ధంగా ఉన్నట్లు చూపటం జరిగింది. ఇది ఆ దేశంలో ఒక వినాశకరమైన వైఖరి. స్లొవేకియా ఎన్నికలలో, ఒక ప్రధాన పోటీదారు ఎన్నికల రిగ్గింగ్ గురించి, మరింత ప్రమాదకరంగా బీరు ధరను పెంచడం గురించి మాట్లాడినట్లు చూపారు. ఇది ఆయన ఓటమికి కారణమైంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నకిలీ వాయిస్ అమెరికా ప్రైమరీలలో ఓటు వేయవద్దని ప్రజ లను కోరింది. 2016 కేంబ్రిడ్జ్ అనలిటికా(డేటా స్కాండల్) వైఫల్యానికి చెందిన జ్ఞాపకాలు ఇంకా తాజాగా ఉన్నాయి. పెద్ద ఎన్నికలు సమీపి స్తున్నందున ఇవి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అయినప్పటికీ, నేను ఇక్కడ భిన్న వైఖరిని తీసుకుంటాను. పాకిస్తాన్ వైపు చూడండి. అక్కడ మాజీ ప్రధాని జైల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరిగాయి. ఆయన పార్టీ గుర్తులు లాక్కుని, వారి అభ్యర్థులను నిర్బంధిస్తామని బెదిరించారు. చివరికి ఇతర పార్టీలు గెలిచినట్లు ప్రకటించినప్పటికీ, భారీ రిగ్గింగ్, అవకతవకలు జరిగి నప్పటికీ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి కచ్చితమైన మెజారిటీ వచ్చిందని చాలా నివేదికలు పేర్కొన్నాయి. కటకటాల్లో ఉండి కూడా, దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి జనరేటివ్ ఏఐని ఉపయోగించుకోవడం ద్వారా, ప్రజాస్వామ్యాన్ని అణచివేశానని తనపై వచ్చిన కథనాన్ని ఇమ్రాన్ ఖాన్ వమ్ముచేయగలిగారు. తన ఓటర్లను బయటకు వచ్చి తన పార్టీకి ఓటు వేయమని ఇమ్రాన్ కోరిన దృశ్యాలను రూపొందించడానికి జనరేటివ్ ఏఐని ఉపయోగించుకున్నారు. ఇది యూట్యూబ్తోపాటు ఇతర ఆన్ లైన్ ఛానెళ్లలో విస్తృతంగా షేర్ అయింది. ప్రజలు ఆయన పిలుపును విని రికార్డు సంఖ్యలో బయటకు వచ్చారు. ఆయన అభ్య ర్థులకు ఆశ్చర్యకరమైన విజయాలు అందించారు. ప్రజాస్వా మ్యాన్ని నాశనం చేసే పాత్రకు భిన్నంగా, కృత్రిమ మేధస్సును ఎలా ఉప యోగించుకోవచ్చో పాకిస్తాన్ చేసి చూపించింది. డీప్ఫేక్ల విధ్వంసక శక్తిని నేను తిరస్కరించడం లేదు. భారత్లో, ఇతర దేశాల్లోని ఎన్నికలలో చర్చను ప్రేరేపించడానికీ, కథనాలను రూపొందించడానికీ వాటిని ఉపయోగిస్తారని నేను భయ పడుతున్నాను కూడా. అయినప్పటికీ, ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడానికి కృత్రిమ మేధ చాలా సాయపడగలదు. పాకిస్తాన్ ఉదాహరణ దీనికి సంబంధించి ఒక సృజనాత్మక మార్గం. ఎన్నికల్లో పారదర్శకతను, సమ్మిళితత్వాన్ని, సమర్థతను పెంపొందించడానికి కూడా ఏఐని ఉపయోగించవచ్చు. దాని అధునాతన డేటా విశ్లేషణ సామర్థ్యాలు ఎన్నికల సంబంధిత డేటాను నిజ సమయంలో పర్యవేక్షించగలవు. మోసపూరిత కార్యా చరణను సూచించే ఏవైనా అవకతవకలను ఇట్టే గుర్తించగలవు. ఏఐ అల్గారిథమ్లు ఓటరు నమోదులు లేదా బ్యాలెట్ సమర్పణలో అక్ర మాలకు సంబంధించిన నమూనాలను గుర్తించగలవు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ల భద్రతను కూడా ఏఐ మెరుగు పరుస్తుంది. అదనంగా, ప్రమాదాలను కనిపెట్టే అల్గారి థమ్లు... సంభవించగల సైబర్ ప్రమాదాలను గుర్తించడంలో కూడా సహాయపడతాయి. స్థానిక సమస్యలపై దృష్టి సారించే అభ్య ర్థులపై, వారి మాని ఫెస్టోలపై ప్రజల స్థానిక మాండలికాలలో అత్యంత సున్నితమైన వ్యక్తిగత కంటెంట్ని రూపొందించడంలో జెనరేటివ్ ఏఐ సహాయ పడుతుంది. తద్వారా ఓటరు అవగాహనను నవీకరించడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా వ్యక్తిగతీకరించిన విధానం విస్మృత వర్గాల్లో రాజకీయ అవగాహనను పెంపొందించగలదు. దీన్ని అధిక సామర్థ్యంతో చాలా తక్కువ ఖర్చుతో చేయ డంలో జెనరేటివ్ ఏఐ ఉపయోగపడుతుంది. తద్వారా తక్కువ డబ్బు ఉన్న అభ్యర్థులకు కూడా అధికారం లభించేలా చేస్తుంది. కృత్రిమ మేధతో నడిచే వ్యవస్థలు వైకల్యాలున్న ఓటర్లకు ప్రాప్యతను కూడా మెరుగుపరుస్తాయి. ఉదాహరణకు, అతిశక్తిమంతమైన వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్లు దృష్టి లోపం ఉన్న ఓటర్లకు సహాయపడతాయి. రాజకీయ సంభాషణలో సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూసేందుకు, జన సమూహాలలో ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేయడానికి కూడా కృత్రిమ మేధను అన్వయించవచ్చు. ఎన్నికల నిర్వహణ లాజిస్టిక్స్ వంటివాటిని కూడా అనుకూలపర్చవచ్చు. ఖర్చులు ఆదా చేయవచ్చు. ఇది భారతదేశం వంటి పెద్ద దేశాలకు చాలా ముఖ్యమైనది. ఓటరు నమోదును, ధ్రువీ కరణను మరింత సమర్థవంతంగా చేయడంలో కృత్రిమ మేధ సహాయపడుతుంది. అర్హతను ధ్రువీకరించడానికి అవసరమైన డేటాను సరైన సమయంలో విశ్లేషించడం ద్వారా పొడవాటి క్యూలు లేకుండా చేస్తుంది. చివరగా, కృత్రిమ మేధ అనేది ద్వంద్వ వినియోగ సాంకేతికతను కలిగివున్నది. అపారమైన విధ్వంసక శక్తితో పాటు భారీ ప్రయో జనాలను ఇది కలిగి ఉంది. ఎన్నికలపై దాని ప్రతికూల ప్రభావాన్ని డీప్ఫేక్ల రూపంలో మనం చూడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మన ప్రజాస్వామ్యాలను అది ఎలా మెరుగుపరుస్తుందో కూడా చూడాలి. పర్ఫెక్టుగా లేకపోయినా, ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఈ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపడంలో విజయం సాధించింది. జస్ప్రీత్ బింద్రా వ్యాసకర్త సాంకేతికాంశాల మేధావి (‘ది మింట్’ సౌజన్యంతో) -
ఎన్నికల బృహత్ పర్వం!
ప్రజాస్వామ్యానికి పండుగ లాంటి ఎన్నికల సమయం వచ్చింది. దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికలకూ, అదే విధంగా మరో 4 రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకూ శనివారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ప్రకటించడంతో ఒక బృహత్ యజ్ఞానికి అంకురార్పణ జరిగింది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంలో మరో నెల రోజుల పైచిలుకులో తొలి దశతో సుదీర్ఘ ఎన్నికల పర్వం ఊపందు కోనుంది. ఇదే ఏడాది అమెరికా సహా పలు భారీ ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలకు సిద్ధమవుతుండగా, 96.9 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లతో మన దేశం సంఖ్యాపరంగా అన్నిటి కన్నా ముందు వరుసలో ఉంది. అలాగే, మిగిలిన దేశాలతో పోలిస్తే సుదీర్ఘంగా ఈ ప్రక్రియ సాగనుంది. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు సైతం ఇలాగే సుదీర్ఘంగా సాగాయి. 489 స్థానాలకు గాను మొత్తం 68 దశల్లో అప్పట్లో ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత మళ్ళీ అంత సుదీర్ఘంగా సాగుతున్నవి ఈ సార్వత్రిక ఎన్నికలే. ఈ ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 44 రోజుల వ్యవధిలో ఈ హంగామా కొనసాగుతుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దాంతో రానున్న రెండున్నర నెలలు వేసవి వేడితో పాటు దేశమంతటా ఎన్నికల ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయి. ఇవి యువతరం ఎన్నికలు కావడం విశేషం. ఓటర్లలో 29 శాతం మంది 18 నుంచి 29 ఏళ్ళ మధ్యవయసు యువతరమే. 2660 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొనే ఈ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి కూడా! అధికారికంగా అభ్యర్థులకు ఎన్నికల వ్యయ పరిమితులు విధించారన్న మాటే కానీ, పార్టీల ప్రచారం సహా ఈ ఎన్నికల తతంగం మొత్తం ఖర్చు దాదాపు రూ. 1.2 లక్ష కోట్లు దాటుతుందని లెక్క. ఏకంగా 15,256 అడుగుల ఎత్తైన ప్రాంతంలోనూ పోలింగ్ కేంద్రం నిర్వహిస్తున్న బృహత్తర ప్రక్రియ ఇది. వెబ్సైట్లు, సోషల్ మీడియా, ఫోన్–ఇన్ ప్రచార సాధనాలతో వర్చ్యువల్ ప్రచారం ప్రబలిన ఆధునిక కాలమిది. ఓటింగ్కు 48 గంటల కన్నా ముందే ప్రచారం ఆపాలి, అంశాల ప్రాతిపదికన – కులమతాలకూ, విద్వేషానికీ దూరంగా ప్రచారం సాగాలి లాంటి నిబంధనల్ని ఆచరణలో పెట్టించడం ఈసీకి కష్టమే. అలాగే 1999లో 29 రోజులతో మొదలై గత 2019లో 39, ఈసారి 44 రోజులకూ వ్యాపిస్తూ పోతున్న ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉండే పాలకపక్షాలకు వాటంగా మారుతుందని ఆరోపణలొస్తున్నాయి. షెడ్యూల్ ప్రకటన ఫలితంగా తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో ఈసీ క్రియాశీలక పాత్ర మొదలైంది. తాజాగా సోమవారం గుజరాత్, యూపీ సహా అరడజనుల రాష్ట్రాల్లో హోమ్శాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఈసీ కౌరడా జుళిపించింది. పశ్చిమ బెంగాల్లో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన డీజీపీపై వేటు వేసింది.ఎన్నికలు నిష్పక్ష పాతంగా సాగాలంటే, ఆయా ప్రాంతాల్లో పాలకపక్ష అనుకూలురని పేరుబడ్డ అధికారులకు చెక్ చెప్పడం సమంజసమే, స్వాగతించాల్సిందే. అయితే, అనేక సందర్భాల్లో కేంద్రంలోని పాలక వర్గాల చేతిలోని సంస్థగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపణలు వింటూనే ఉన్నాం. అవన్నీ నిరాధారమని మాటలతో కన్నా చేతల ద్వారా తేల్చడమే ఈసీ ముందున్న మార్గం. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఒకప్పటి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ను ఆదర్శంగా నిలుపుకోవాలి. పాలకుల కన్నా ప్రజలకు జవాబుదారీగా ఈసీ నిలబడాలి. డబ్బు, అధికారం లేనివారు సైతం ఎన్నికల బరిలో స్వేచ్ఛగా పోటీ చేసే ఆరోగ్యకర వాతావరణం కల్పించాలి. దురదృష్టవశాత్తూ పరిస్థితులన్నీ ఆ ఆదర్శాలకు తగ్గట్టు ఉన్నాయన్న భరోసా ఇప్పటికీ పూర్తిగా కలగడం లేదు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలోనే దేశంలో ఒకటికి రెండు కీలక పరిణామాలు సంభవించాయి. రహస్యమయమైపోయిన ఎన్నికల బాండ్లలో దాతలు, గ్రహీతల (పార్టీల) వివరాలు వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)ని ఆదేశించాల్సి వచ్చింది. మరోపక్క మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అంశంపై వేలకొద్దీ పేజీల నివేదిక సమర్పిస్తూ, లోక్సభకూ, రాష్ట్రాల శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు జరగాలని సిఫార్సు చేసింది. ఇంకొకపక్క కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక విధానంలో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి భాగం లేకుండా ప్రభుత్వం ఆ మధ్య చేసిన మార్పులు సైతం మరోసారి తెర మీదకు వచ్చాయి. ఈ పరిణామాలన్నీ ఒక రకంగా భారత ప్రజాస్వామ్య ప్రస్థానం నునుపైన జారుడు శిఖరం మీద సాగుతున్న అంశాన్ని పట్టిచూపాయి. రానున్న కాలంలో ఈ ప్రయాణం ఇంకెంత సంక్లిష్టం కానున్నదో చెప్పకనే చెప్పాయి. బాండ్ల సాక్షిగా పారిశ్రామిక వర్గాలకూ, రాజకీయాలకూ మధ్య రహస్యబంధం అంతకంతకూ బలపడుతున్న వేళ, దేశమంతా ఒకేసారి ఎన్నికలతో సమస్తం కేంద్ర పాలకుల కనుసన్నల్లోకి మార్చాలని చూస్తున్న వేళ... రానున్న ఎన్నికల్లో ప్రజలెన్నుకొనే ప్రభుత్వాలు కీలకం కానున్నాయి. ‘‘చరిత్ర కూడలిలో నిల్చొని, ఏ మార్గంలో వెళ్ళాలో ఎంచుకోవాల్సిన పరిస్థితి ప్రతి జాతికీ ఒకానొక దశలో వస్తుంది’’ అని భారతదేశానికి రెండో ప్రధాన మంత్రి అయిన లాల్బహదూర్ శాస్త్రి ఒక సందర్భంలో అన్నారు. ఆ మార్గాన్ని బట్టే భవితవ్యం ఉంటుంది. ప్రజాస్వామ్య భారతావని తన ప్రయాణంలో ఇప్పుడు సరిగ్గా అదే స్థితిలో ఉంది. ఈ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఎంచు కొనే మార్గం పౌరుల మొదలు న్యాయవ్యవస్థ, ప్రభుత్వ అధికార వ్యవస్థ, మీడియా దాకా సమస్తాన్నీ ప్రభావితం చేయనుంది. అందుకే, సరైన మార్గాన్ని ఎంచుకోవడం అత్యవసరం. సరైన ఎంపిక సాగాలంటే, అలక్ష్యం చేయకుండా విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడమే సాధనం. -
మరోసారి 'మోదీ'ని ప్రశంసించిన అమెరికన్ సింగర్.. ఎందుకంటే?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చేసింది. దీనిపై దేశంలో పలు ప్రాంతాల్లో వ్యతిరేఖత కనిపిస్తోంది. కానీ ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని 'మేరీ మిల్బెన్' మాత్రం ఇది గొప్ప చర్య అంటూ వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ నాయకత్వాన్ని గుర్తించాలని, భారతదేశంతో దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కృషి చేయాలని, ముఖ్యంగా మూడోసారి మోదీని ఎన్నుకోవాలని సూచించింది. సీఏఏ నిజమైన ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుందని, దుర్బల వర్గాలకు రక్షణ మరియు ఆశ్రయాన్ని అందజేస్తుందని మేరీ మిల్బెన్ పేర్కొంది. మత స్వేచ్ఛను కోరుకునే క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు ఇదొక శాంతి మార్గం. భారతదేశం వీరందరికి నివాసం కల్పిస్తోంది. పౌరసవరణ చట్టం నిజమైన ప్రజాస్వామ్య చర్య అని మేరీ మిల్బెన్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొంది. భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) నోటిఫికేషన్ గురించి అగ్ర రాజ్యం అమెరికా ఆందోళన చెందుతోంది. సీఏఏ అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తూ.. ఇది భారత అంతర్గత విషయమని స్పష్టం చేసింది. ఇది దేశ సమగ్ర సంప్రదాయాలకు, మానవ హక్కుల విషయంలో తమ దీర్ఘకాల నిబద్దతకు అనుగుణంగా రూపొందించినట్లు వెల్లడించారు. @StateDept, PM @narendramodi is demonstrating compassionate leadership towards those being persecuted for their faith and providing a home to them in #India. A pathway to peace for Christians/Hindus/Sikhs/Jain/Buddhists seeking #religiousfreedom. When the PM is reelected for a… https://t.co/Y5tyuWCVAs — Mary Millben (@MaryMillben) March 15, 2024 -
ట్రంప్ ప్రపంచానికే ముప్పు
వాషింగ్టన్: తన కంటే ముందు దేశాధ్యక్షుడిగా పనిచేసిన ఒక నాయకుడు అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకు ముప్పుగా పరిణమించాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్పై పరోక్షంగా దుమ్మెత్తి పోశారు. ఏ అధ్యక్షుడైనా అమెరికా ప్రజలను రక్షించడాన్ని కనీస బాధ్యతగా భావిస్తాడని, ఈ విషయంలో ఆ మాజీ అధ్యక్షుడు పదవిలో ఉన్నప్పుడు ఈ విషయంలో దారుణంగా విఫలమయ్యాడని, అతడిని క్షమించలేమని అన్నారు. బైడెన్ గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గంటపాటు మాట్లాడిన బైడెన్.. ట్రంప్ పేరును 13 సార్లు పరోక్షంగా ప్రస్తావించారు. పలు అంశాల్లో ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందు ట్రంప్ మోకరిల్లాడని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ‘నాటో’ దేశాలను ఏమైనా చేసుకోండి అంటూ పుతిన్కు సూచించాడని ఆరోపించారు. పుతిన్ చర్యలను అడ్డుకోకపోతే ప్రపంచ దేశాలకు నష్టం తప్పదని హెచ్చరించారు. పుతిన్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఉక్రెయిన్కు అన్ని రకాలుగా సాయం అందించాల్సి ఉందని పేర్కొన్నారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో సాధారణ పాలస్తీనియన్లు మరణించడం చూసి తాను తీవ్రంగా చలించిపోయానని బైడెన్ చెప్పారు. గంజాయి తీసుకుంటే నేరం కాదు డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మళ్లీ నెగ్గడానికి యువ ఓటర్ల మనసులు గెలుచుకొనే పనికి శ్రీకారం చుట్టారు. గంజాయి తీసుకుంటే, గంజాయి కలిగి ఉంటే నేరంగా పరిగణించవద్దని తేలి్చచెప్పారు. గంజాయి విషయంలో అమల్లో ఉన్న నిబంధనలను సమీక్షించాలని తన మంత్రివర్గాన్ని ఆదేశించానని చెప్పారు. సాధారణంగా స్టేట్ ఆఫ్ ద యూనియన్ అడ్రస్లో తమ విదేశాంగ విధానంతోపాటు దేశీయంగా కీలక అంశాలను అమెరికా అధినేతలు ప్రస్తావిస్తుంటారు. కానీ, గంజాయి గురించి మాట్లాడిన మొట్టమొదటి అధ్యక్షుడు మాత్రం బైడెన్ కావడం విశేషం. -
ప్రజాస్వామ్యమే గెలిచింది: ఏక్నాథ్ షిండే
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన రాజకీయ పార్టీ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ తేల్చేశారు. ఈ తీర్పుపై స్పందించిన సీఎం ఏక్నాథ్ షిండే.. శివ సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం మరోసారి విజయం సాధించిందని అన్నారు. శివ సేన- బీజేపీ సంకీర్ణ కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన లక్షల మంది ఓటర్లు గెలుపొందారని తెలిపారు. "రాష్ట్రంలోని శివసైనికులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేడు ప్రజాస్వామ్యం మరోసారి గెలిచింది. 2019లో శివసేన-బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన లక్షలాది మంది ఓటర్లు ఈరోజు విజయం సాధించారు. ఇది శివుడి విజయం. హిందూ హృదయ చక్రవర్తి బాలాసాహెబ్ థాక్రే భావాజాలంతో ఉన్న శివసైనికుల విక్టరీ ఇది." అని ఏక్నాథ్ షిండే ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. "బాలాసాహెబ్, ధర్మవీర్ ఆనంద్ దిఘేల హిందుత్వ భావాజాలానికి మేమే నిజమైన వారసులమని మరోసారి రుజువైంది. నేటి విజయం సత్యం విజయం. సత్యమేవ జయతే." అని అన్నారు. "నేటి ఫలితం ఏ పార్టీ విజయం కాదు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విజయం. ప్రజాస్వామ్యంలో మెజారిటీనే ముఖ్యం. శివ సేనాను ఎలక్షన్ కమిషన్ మనకు కేటాయించింది. ఇప్పుడు విల్లు, బాణాలు కూడా మన చేతికి వచ్చాయి. నేటి ఫలితాల నుంచి నియంతృత్వం, రాజవంశం అంతమైంది." "పార్టీని తన ఆస్తిగా భావించి ఎవరూ తన మనసుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేరు. ప్రస్తుత తీర్పు పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తి కాదని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలి. పార్టీ అధ్యక్షుడు ఏకపక్షంగా ఉండకూడదు. ఈ తీర్పు అందుకు ఉదాహారణగా ఉంది.' అని షిండే ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: Maharashtra politics: షిండే వర్గమే అసలైన శివసేన -
ప్రజాస్వామ్యం లేని గెలుపు?
ఆమె గెలవడం ఇది అయిదోసారి. అందులోనూ ఇది వరుసగా నాలుగో గెలుపు. మామూలుగా అయితే ఇది అసాధారణం. అయితే, బంగ్లాదేశ్లో కాదు. ఆ దేశంలో ఆదివారం పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన తీరు కానీ, ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ (ఏఎల్) ఘన విజయం కానీ అనూహ్యమేమీ కాదు. మునుపటి ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, దాని మిత్రపక్షాలు... అన్నీ కలిపి 15 పార్టీలు ప్రజాతీర్పుకు దూరంగా ఉన్నప్పుడు పాలక పక్షానిదే గెలుపు కాక మరేమవుతుంది! ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాలు ప్రజలకు పిలుపునివ్వడంతో సహజంగానే ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. 2018 నాటి 80 శాతం సగానికి పడిపోయి, 40 చిల్లర వద్ద తచ్చాడింది. ఫలితాలూ ఊహించినట్టే వచ్చాయి. మొత్తం 300 స్థానాల్లో 299 స్థానాలకు ఎన్నికలు జరగగా, పాలక పక్షానికి 223 వచ్చాయి. విచి త్రమేమంటే, ఆ తర్వాత అత్యధిక స్థానాలు గెలిచింది స్వతంత్రులే. ఇలా ఇండిపెండెంట్లుగా గెలిచిన 62 మందిలో కూడా అత్యధికులు పాలక అవామీ లీగ్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తూ, పార్టీ అధికా రిక అభ్యర్థిపై పోటీ చేసి గెలవమన్న వాళ్ళే! అలా గెలిచినవాళ్ళే! ఇప్పుడు బంగ్లాదేశ్ పార్లమెంట్లో రెండో అతి పెద్ద వర్గం ఈ ఇండిపెండెంట్లదే! ‘జాతీయ పార్టీ’ 11 సీట్లు, మరో మూడు విపక్ష పార్టీలు 3 సీట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నామావశిష్టంగా నిలిచాయి. ఇప్పుడిక ఎవరిని పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ప్రకటిస్తారో చూడాలి. అధికారిక ప్రకటనలెలా ఉన్నా, ఆచరణలో వాస్తవికంగా బంగ్లా ఇప్పుడు ఒక రకంగా ప్రతిపక్షమే లేని పార్లమెంట్ అయింది. షేక్ హసీనా తన తాజా విజయంతో అటు ప్రతిపక్షాలనే కాదు... ఇటు ప్రజాస్వామ్యాన్ని సైతం ఓడించారని విశ్లేషకులంటున్నది అందుకే! ప్రపంచంలో దీర్ఘకాల మహిళా ప్రభుత్వాధినేత అనే కిరీటం హసీనాదే. 2009 నుంచి హసీనా తాలూకు పార్టీదే అధికారం. అప్పటి నుంచి ఇన్నేళ్ళలో మంచీ చెడులు రెంటిలోనూ హసీనా ఉక్కుమహిళే! అటు ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలతో దేశాన్ని దుర్భర దారిద్య్రం నుంచి బయటకు తెచ్చి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన కీర్తి, ఇటు మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో తొక్కేసిన అపకీర్తి... రెండూ ఆమెవే. దేశ ఆర్థిక పురోగతి, సామాజిక అభివృద్ధిలో అవిస్మరణీయ పాత్ర ఈసారి కూడా ఆమెకు విజయం అందించి ఉండవచ్చు. అంతమాత్రాన మిగతా తప్పులన్నీ ఒప్పులై పోవు. అసలు ఈ ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతపై అంతర్జాతీయ పరిశీలకులు, మానవ హక్కుల సంఘాల వారు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేశారు. కీలక సంస్థలు, వ్యవస్థల పైన, అసమ్మతి వినిపించకుండా చివరకు మీడియా పైన కూడా హసీనా సర్కార్ నియంత్రణపై విమర్శలూ వచ్చాయి. 17 కోట్లకు పైగా జనాభా ఉన్న బంగ్లాదేశ్ తరుణ ప్రజాస్వామ్యానికి ఇది వన్నె తీసుకురాదు. బలమైన ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థే లేదు. హసీనా మరోసారి ఎన్నికవడం భారత్కు మాత్రం ఒక రకంగా శుభవార్తే! ఎందుకంటే, హసీనా హయాంలో భారత – బంగ్లాదేశ్ బంధాలు బలపడ్డాయి. వాణిజ్యం పెరిగింది. మెరుగైన రోడ్డు, రైలు రవాణా సదుపాయాలు ఏర్పడ్డాయి. అంతకన్నా ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతానికి తీవ్ర వాదం పెనుముప్పుగా పరిణమించిందని ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మునుపటి షేక్ హసీనా హయాం మరో పర్యాయం కొనసాగడం ఢిల్లీ దృష్టి నుంచి చూస్తే మంచిదే! బంగ్లాదేశ్లో రాజకీయ సుస్థిరత, విదేశాంగ విధానాల కొనసాగింపు మనకు లాభించే విషయాలు. పైగా, అంతర్యుద్ధంలో కూరుకుపోయిన ఉమ్మడి పొరుగుదేశమైన మయన్మార్ నుంచి శరణార్థుల సమస్య పెరుగుతూ, తీవ్రవాదులకు ఆయుధాలు సులభంగా అందివచ్చే పరిస్థితులున్న సమయంలో బంగ్లా దేశ్లో స్నేహశీల సర్కార్ ఉండడం భారత్కు ఒకింత సాంత్వన. నిజానికి, రాగల కొద్దినెలలు దక్షిణాసియా ప్రాంతానికి కీలకం. ఎందుకంటే, ఈ ప్రాంతంలోని పలు దేశాల్లో ఈ ఏడాదే ఎన్నికలున్నాయి. ఈ ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో ఎన్నికలు జరగనుంటే, ఆ తరువాత కొద్దినెలలకే శ్రీలంకలో అధ్యక్ష పదవికి ఎన్నిక. ఇక, ఏప్రిల్ – మే నెలల్లో భారత్లో లోక్సభ ఎన్నికలు సరేసరి. వివిధ దేశాల ఎన్నికల ఫలితాలు, కొలువు దీరే కొత్త ప్రభుత్వాలు, వాటి వైఖరిలో మార్పులను బట్టి భారత ఉపఖండంలో అనేక మార్పులు రావడం సహజం. ఇప్పటికే నిరుడు సెప్టెంబర్లో మాల్దీవుల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారత వ్యతిరేక వైఖరిని అస్త్రంగా చేసుకొని, మహమ్మద్ మొయిజు గద్దెనెక్కారు. భారత్కు దీర్ఘకాలిక మిత్రదేశమైన మాల్దీవులు అప్పటి నుంచి ఢిల్లీ కన్నా బీజింగ్ వైపు మొగ్గుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజా లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ ఘటనలోనూ అదే కనపడింది. వీటన్నిటి దృష్టితో చూసినప్పుడూ బంగ్లాదేశ్లో మరోసారి భారత అనుకూల హసీనా సర్కార్ ఏర్పాటవడం భారత్కు ప్రయోజనకరమే! ఇటు భారత్తో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు, అటు చైనా సైనిక ఆలంబన – రెండూ కొనసాగిస్తూ హసీనా చేస్తున్న సమతూకం అందరికీ చేతకావు. అలాంటి ఆమె విజయాలు ప్రశంసా ర్హమే అయినా, సాగిస్తున్న రాజకీయ అణచివేతను విస్మరించలేం. ఆన్లైన్లో విమర్శించినా అరదండాలే అన్న డిజిటల్ భద్రతా చట్టం లాంటివి పౌరస్వేచ్ఛకు ప్రతిబంధకాలు. ప్రజాస్వామ్య వాతావర ణమే లేకుంటే, చివరకు అమెరికా సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాలు వాణిజ్య షరతులు విధిస్తాయి. అదే అదనుగా బంగ్లాదేశ్ పక్షాన చైనా బరిలోకి దిగుతుంది. అది భారత్కూ అభిలషణీయం కాదు. అందుకే, ప్రతిపక్షాలను ఊపిరి పీల్చుకొనిచ్చేలా, వ్యవస్థల స్వతంత్రతను కాపాడేలా హసీనా సర్కార్కు భారత్ నచ్చజెప్పాలి. బంగ్లాకూ, భారత్కూ దీర్ఘకాలంలో అదే శ్రేయస్కరం. -
టెక్నాలజీతో న్యాయం మరింత చేరువ: సీజేఐ
రాజ్కోట్: ఆధునిక సాంకేతికత సాయంతో న్యాయాన్ని అందరికీ ప్రజాస్వామ్యయుతంగా చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. శనివారం గుజరాత్లోని రాజ్కోట్లో నూతన జిల్లా కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. కృత్రిమ మేధతో పని చేసే టెక్స్ట్ టు స్పీచ్ ‘కాల్–ఔట్’ సిస్టమ్ను, ఈ–ఫైలింగ్ 3.0 ప్లాట్ఫామ్ను ఆవిష్కరించారు. జిల్లా కోర్టుల ఆవశ్యకతను ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. న్యాయం కోసం ముందుగా అక్కడికే వస్తారని గుర్తు చేశారు. పౌరుల హక్కుల సాధనకు జిల్లా కోర్టులే పునాదిరాళ్లన్నారు. ‘‘ద్వారకలోని సోమ్నాథ్ ఆలయం, పూరీలోని జగన్నాథాలయంపై ఉండే ధ్వజం న్యాయవాదులు, న్యాయమూర్తులు, పౌరులందరినీ కలిపి ఉంచే మానవత్వానికి ప్రతీక. అలాంటి మానవత్వానికి రాజ్యాంగమే రక్ష’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. -
హసీనాకు అగ్నిపరీక్ష!
మెరిసేదంతా మేలిమి అని ప్రజానీకాన్ని నమ్మిస్తే ఓట్ల వర్షం కురవొచ్చు. ఒకటికి రెండుసార్లు ఆ చిట్కా పనిచేసి అధికారం వచ్చినా రావొచ్చు. కానీ ఎల్లకాలం అదే మంత్రం ఫలించదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ నాలుగో దఫా నెగ్గేందుకు పడుతున్న అవస్థలను గమనిస్తే అర్థమవుతుంది. ఆదివారం బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు జరగబోతు న్నాయి. ఆ ఎన్నికలు సవ్యంగా సాగుతాయనీ, ప్రజలంతా తన పక్షమేననీ హసీనా ఇప్పటికీ నమ్మ బలుకుతున్నారు. పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరి ఓటు హక్కు వినియోగించుకోవటం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం బతికేవుందని చాటాలంటూ పౌరులకు ఆమె విన్నపాలు చేస్తున్నారు. అటు విపక్షం హసీనా నయవంచనను బట్టబయలు చేయాలని ప్రజలను కోరింది. ఈ ఎన్నికలను బహిష్కరించి, శని ఆదివారాల్లో దేశవ్యాప్త హర్తాళ్ పాటించాలని పిలుపునిచ్చింది. బంగ్లాలో అటు ఎన్నికల తంతు, ఇటు బహిష్కరణ పిలుపు రెండూ సాధారణ ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయి. 2014 ఎన్నికలను విపక్ష బంగ్లా నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) బహిష్కరించింది. తదనంతర ఎన్నికల్లో పోటీలో దిగి, చివరి నిమిషంలో ఆ పార్టీ ముఖం చాటేసింది. 2014లో 39 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోగా, 2019 నాటికి అది ఒక్కసారిగా 80 శాతానికి ఎగబాకింది. గత ఎన్నికల్లో అవామీ పార్టీ నేతృత్వంలోని కూటమికి 300 స్థానాల్లో ఏకంగా 96 శాతం స్థానాలు... అంటే 288 రాగా, బీఎన్పీ కూటమికి ఏడంటే ఏడే వచ్చాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అధికార పక్షంపైరిగ్గింగ్ ఆరోపణలు రివాజు. అయితే గత ఎన్నికలకూ, ఇప్పటికీ తేడా కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అప్పట్లో హసీనా గెలుపుపై ఎవరికీ సంశయాలు లేవు. మెజారిటీ విషయంలోనే భిన్న స్వరాలు వినిపించాయి. ఈసారి అలాకాదు. ఏం చేసైనా నెగ్గి తీరాలన్న సంకల్పంతో అన్ని రకాల మాయోపాయాలకూ సిద్ధపడుతున్నారని విపక్షంతోపాటు పౌరసమాజ వర్గాలు ఆరోపిస్తున్నాయి. యాభై రెండేళ్ల క్రితం హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలో పాకిస్తాన్ పాలకులపై పోరాడి బంగ్లా విముక్తి సాధించింది. ఆ వెంటనే ముజిబుర్ రెహమాన్ను కూలదోసి సైన్యం అధికా రాన్ని ఆక్రమించింది. ఆయన్ను దారుణంగా కాల్చిచంపింది. వెంటవెంటనే జరిగిన మార్పుల్లో జన రల్ జియావుర్ రెహమాన్ అధికారం చేజిక్కించుకుని అనంతర కాలంలో దేశాధ్యక్షుడయ్యారు. బీఎన్పీ ఆయన నేతృత్వంలోని పార్టీయే. మరో సైనిక పాలకుడు హెచ్ఎం ఎర్షాద్ సైతం జాతీయ పార్టీని ఏర్పాటుచేశారు. మొత్తానికి మూడు సైనిక తిరుగుబాట్లు, దాదాపు 20 వరకూ విఫల తిరుగు బాట్లతో దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సైనిక పాలకులు ఎన్నికలు లేకుండా చేసి, పౌరుల ఓటుహక్కుకు ఎగనామం పెడితే... ప్రజాస్వామ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీలు దొంగ ఓట్లతో, హింసతో దాన్ని మరింత నీరుగార్చాయి. తనకు మెజారిటీ ప్రజల మద్దతున్నదని చెప్పే హసీనా తొలి, మలి దఫాలకు మించి మూడోసారి పూర్తి స్థాయి నియంతగా మారారని, అసమ్మతి స్వరాలను అణిచేశారని ఆమె వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో ఇరుక్కుని 22,000 మంది విపక్ష నేతలు, కార్యకర్తలు జైళ్లలో మగ్గుతున్నారు. అధిక ధరలు తగ్గించాలని, ఉపాధి కల్పించాలని ఉద్యమించినవారిని హసీనా సర్కారు శత్రువులుగా చూస్తోంది. హసీనా తొలిసారి అధికారంలోకొచ్చిన రోజులతో పోలిస్తే ఇప్పుడు కరెంటు కోతలు లేవు. దేశం పచ్చగా కనబడుతోంది. అడిగిందే తడవుగా విదేశీ మదుపుదారులు ఉదారంగా అప్పులిచ్చారు. ఆర్థిక రంగం పుంజుకోవటంతో నగరాలు మెరిసిపోతున్నాయి. ఆకాశాన్నంటే భవంతులు, ఎక్స్ప్రెస్ వేలు, వంతెనలు, భారీ దుకాణ సముదాయాలు, దిగుమతి చేసుకున్న వినియోగ వస్తువులు విస్మయ పరుస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే ఇదంతా తిరబడుతున్న దాఖలాలు కనబడుతున్నాయి. అందాల పరదాల మాటున పాతరేసినవన్నీ పైపైకి తోసుకొచ్చి నిలదీస్తున్నాయి. బ్యాంకులు వేల కోట్లలో ఇచ్చిన అప్పులన్నీ పారు బాకీలుగా మారి బావురుమన్నాయి. ఖజానాలో కరెన్సీ మాయమై, ద్రవ్యో ల్బణం ఆకాశాన్నంటి దేశ ఆర్థిక వ్యవస్థ బిత్తరచూపులు చూసింది. విదేశీ పెట్టుబడులతో మొదలు పెట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం సరైన పర్యవేక్షణ కొరవడి నత్తనడకన సాగింది. వ్యయం అనేక రెట్లు పెరిగింది. పల్లెటూళ్లు తెల్లముఖం వేశాయి. ఉపాధి కరువై గ్రామీణులు నగరా లకు, పట్టణాలకు వలసలు కట్టారు. కరెంట్ అకౌంట్ సంక్షోభం పీల్చి పిప్పి చేస్తుండగా ఒకనాడు పైపై మెరుగులు చూసి ఎగబడి పొగిడిన అంతర్జాతీయ మీడియా వరస కుంభకోణాల వైనాన్ని వెల్లడిస్తున్నకొద్దీ దేశంలో అశాంతి ప్రబలింది. ఉద్యమాలు వెల్లువెత్తాయి. వాటి అణచివేత తప్ప హసీనా దగ్గర మరే ప్రత్యామ్నాయం లేకపోవటం విషాదాల్లోకెల్లా విషాదం. దేశాన్ని దక్షిణాసియాలోనే ‘ఎకనామిక్ టైగర్’గా రూపొందించానని ఒకనాడు సగర్వంగా చాటు కున్న హసీనా సంక్షోభంపై సరైన సంజాయిషీ ఇవ్వలేకపోతున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన లపై ఇంటా బయటా ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ ఉల్లంఘనల బాధ్యులకు తమ దేశంలో ప్రవేశం ఉండబోదని అమెరికా ప్రకటించింది. వైఫల్యాలకు పాలక విపక్షాలు రెండూ బాధ్యత వహించాలని ప్రజలు భావిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇతర నేతలతో పోలిస్తే హసీనాయే ఉన్నంతలో మెరుగని మెజారిటీ పౌరులు విశ్వసిస్తుండటం విశేషం. ఏకపక్షంగా సాగే తాజా ఎన్నికల తంతులో విజయం మాటెలావున్నా హసీనాకు మున్ముందు గడ్డు పరిస్థితులు తప్పవు. ఆమె విఫల నేతగా మిగులుతారా, తప్పులు దిద్దుకుని దేశాన్ని గట్టెక్కిస్తారా అన్నది చూడాల్సివుంది. -
సరికొత్త అధ్యాయం?!
మరో అడుగు ముందుకు పడింది. ఈశాన్య భారతంలో దీర్ఘకాలంగా సాగుతున్న సమస్యకు పరిష్కారం కనుక్కొనే ప్రయత్నంలో ఒక అభిలషణీయ పరిణామం గత వారం సంభవించింది. అస్సామ్లోని పేరుబడ్డ తీవ్రవాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సామ్’ (అల్ఫా)లోని ఒక వర్గం హింసామార్గం విడిచిపెట్టి, ప్రజాస్వామ్య పంథాలోకి రానున్నట్టు డిసెంబర్ 29న ప్రకటించింది. అల్ఫా వర్గానికీ, కేంద్ర, అస్సామ్ సర్కార్లకూ మధ్య ఈ తాజా త్రైపాక్షిక పరిష్కార ఒప్పందం (ఎంఓఎస్) స్వాగతించాల్సిన విషయం. ఈశాన్యంలో శాంతి స్థాపన నిమిత్తం కుదుర్చుకుంటూ వచ్చిన ఒప్పందాల వరుసలో ఇది తాజాది. చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజనీ, దీంతో అస్సామ్లో హింసాకాండకు పూర్తిగా తెర పడుతుందనీ కేంద్ర హోమ్ మంత్రి అమితమైన ఆశాభావం ప్రకటించారు. అయితే, ఇప్పటి దాకా కుదుర్చుకున్న అనేక ఒప్పందాల ఫలితాలు మిశ్రమంగానే మిగిలాయి. అందుకే, ఈ కొత్త ఒప్పందం కూడా కేవలం మరో పత్రంగా మిగులుతుందా? లేక శాంతిసాధనలో చరిత్రాత్మకం కాగలుగుతుందా అన్నది పలువురి అనుమానం. ‘సార్వభౌమాధికార’ అస్సామ్ను కోరుతూ 1979లో ‘అల్ఫా’ సాయుధ పోరాటం ప్రారంభించింది. అలా 44 ఏళ్ళుగా రగులుతున్న కుంపటిని తాజా ఒప్పందం చల్లారుస్తుందని ఆశ. 1985లో అస్సామ్ ఒప్పందం తర్వాత కూడా అక్కడి గ్రామీణ ప్రజల్లో అసంతృప్తిని రగిలించడంలో అల్ఫా సఫలమైంది. కిడ్నాపింగ్లు, దోపిడీలు, హత్యలు, బాంబు పేలుళ్ళతో ఒక దశలో అల్ఫా అట్టుడికించింది. దాంతో, ప్రభుత్వం 1990లో అల్ఫాను నిషేధించింది. కర్కశమైన ‘సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం’ (ఏఎఫ్ఎస్పీఏ)ను తీసుకురావాల్సి వచ్చింది. ‘అల్ఫా’ ఉచ్చదశలో వెలిగిపోతున్న రోజుల్లో దాని చేతులు అస్సామ్ మొదలు దక్షిణాసియా దాకా విస్తరించాయి. మయన్మార్, భూటాన్ లలో అల్ఫా శిబిరాలు, బంగ్లాదేశ్లో ఆ సంస్థ నేతలు, శ్రీలంక– పాకిస్తాన్లలో శిక్షకులున్న రోజులవి. అయితే, పరిస్థితులు మారాయి. శ్రీలంకలో ఎల్టీటీఈ పతనం, భూటాన్ గడ్డపై శిబిరాల్ని మూయించాల్సిందిగా ఆ దేశంపై ఒత్తిడి రావడం, అలాగే భారత్తో మైత్రి పాటించే షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక శక్తులను సహించక పోవడం, అల్ఫాలోని వర్గపోరు, భారత సర్కార్ ఉక్కుపాదం మోపడం... ఇవన్నీ కొన్నేళ్ళుగా అల్ఫాను బలహీనపరిచాయి. వలస కార్మికులనూ, సామాన్య నిరుపేదలనూ లక్ష్యంగా చేసుకొని సాగించిన హింస సైతం రైతాంగంలో అల్ఫా పలుకుబడిని పలుచన చేసింది. నిజానికి, గతంలో పలు సందర్భాల్లో అల్ఫాతో శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆ మాటకొస్తే శాంతిప్రక్రియ 2009లోనే మొదలైంది. చర్చల అను కూల వర్గంతో 2011లోనే సంప్రతింపులు ఆరంభమయ్యాయి. సంస్థ బలహీనమయ్యేసరికి సార్వ భౌమాధికార డిమాండ్ను అల్ఫా పక్కనబెట్టక తప్పలేదు. స్థానిక ప్రజల ప్రయోజనాల పరిరక్షణ చాలనే విధంగా వ్యవహరించి, గౌరవప్రదంగా బయటపడేందుకు ప్రయత్నించింది. వెరసి, పుష్కర కాలం తర్వాత చర్చలు ఫలించాయి. పరిష్కార ఒప్పందం కుదిరింది. అయితే, అల్ఫా సంస్థాపకుల్లో ఒకరైన అప్పటి ‘కమాండర్–ఇన్–ఛీఫ్’ పరేశ్ బారువా శాంతి చర్చలను వ్యతిరేకిస్తూ 2012లోనే ‘అల్ఫా ఇండిపెండెంట్’ (అల్ఫా–ఐ)గా వేరుకుంపటి పెట్టుకున్నారు. అరబింద రాజ్ఖోవా సారథ్యంలోని వర్గమే తప్ప సైద్ధాంతికంగా కరడుగట్టిన ఈ ‘అల్ఫా–ఐ’ వర్గం ఒప్పందంలో భాగం కాలేదు. అది ఒక లోటే. అలాగని, కుదిరిన ఒప్పందాన్ని తీసిపారేయలేం. వేర్పాటువాదం ప్రబలడంతో ఒకప్పుడు గణనీయంగా నష్టపోయిన రాష్ట్రం తాజా ఒప్పందంతో మళ్ళీ అభివృద్ధి పథంలో పయనించ గలుగుతుంది. కేంద్ర ఆర్థిక సహాయంతో అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. ఈ ఒప్పందం పుణ్యమా అని ఈ ఈశాన్య రాష్ట్రంలో సాంఘిక – సాంస్కృతిక అశాంతికి కూడా తెరపడుతుందని మరో ఆశ. ఎందుకంటే, అక్రమ వలసల మొదలు స్థానిక తెగల వారికి భూ హక్కుల వరకు పలు అంశాల పరిష్కారం గురించి తాజా త్రైపాక్షిక ఒప్పందం ప్రస్తావిస్తోంది. ఆ ఆశ నెరవేరితే అంతకన్నా కావాల్సింది లేదు. నిజానికి, అస్సామ్లో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకై ‘ఏఎఫ్ఎస్పీఏ’ కింద సాయుధ బలగాలకు అపరిమితమైన అధికారాలను ప్రభుత్వం ఎన్నడో కట్టబెట్టింది. అల్ఫా దూకుడు మునుపటితో పోలిస్తే తగ్గడం, అలాగే అనేక విమర్శల అనంతరం గత రెండేళ్ళలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆ చట్టాన్ని ఉపసంహరించారు. ఇప్పుడిక మిగతా ప్రాంతాల్లో సైతం ఈ అమానవీయ చట్టాన్ని ఎత్తివేసే దిశగా అస్సామ్ సర్కార్ అడుగులు వేయాలి. తాజా ఒప్పందంతో తీవ్రవాదానికి పూర్తిగా తెర పడిందని తొందరపడడానికి లేదు. అతివాద ‘అల్ఫా–ఐ’ వర్గం నేత బారువా ఇప్పటికీ చైనా–మయన్మార్ సరిహద్దులో గుర్తుతెలియని చోట దాగున్నారు. కొన్నేళ్ళుగా కొత్త చేరికలు లేక ఆయన వర్గం గణనీయంగా బలహీనపడినప్పటికీ, ఆ వర్గపు వ్యవహారం ఇంకా తేలనందున కేంద్ర, అస్సామ్ ప్రభుత్వాలు ఆచితూచి అడుగేయాల్సి ఉంది. కాక పోతే... ఒకపక్క రష్యా – ఉక్రెయిన్లు, మరోపక్క గాజాలో ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య యుద్ధా లతో రోజూ వార్తలను వేడెక్కించిన గడచిన 2023 ఎట్టకేలకు ఒక శాంతి ఒప్పందంతో ముగియడం ఒకింత ఊరట. ఒప్పందాన్ని సఫలం చేయడం ప్రభుత్వ, అల్ఫా వర్గాల ముందున్న సవాలు. అల్ఫా మాట అటుంచి, దీర్ఘకాల వేర్పాటువాదం అనంతరం ఈశాన్యంలో సుస్థిరంగా శాంతి వెల్లివిరియాలంటే ప్రభుత్వం ముందుగా అక్కడి ప్రతి పౌరుడూ జనజీవన స్రవంతిలో భాగమయ్యేలా చూడాలి. రైతాంగ జీవనప్రమాణాల్ని మెరుగుపరచాలి. వేర్పాటువాదం వైపు ఆకర్షితులు కాకుండా జాగ్రత్త పడాలి. అందుకీ ఒప్పందం దోహదపడితేనే ఇన్నేళ్ళ సంప్రతింపుల శ్రమకు అర్థం, పరమార్థం! -
ఇదేమి ప్రజాస్వామ్యస్ఫూర్తి?!
ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లో చరిత్రలో మునుపెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో సస్పెన్షన్ల పర్వం సాగుతోంది. ఈ నెల 13న పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్య ఘటనపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలనీ, చర్చ జరగాలనీ ప్రతిపక్షాలు పట్టు బట్టడం రచ్చగా మారింది. సభా వ్యవహారాలకు అడ్డుతగులుతున్నా రనీ, అభ్యంతరకరంగా ప్రవర్తి స్తున్నారనీ అంటూ ఇప్పటికి 141 మంది ప్రతిపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడం నిర్ఘాంత పరుస్తోంది. అధికార పార్టీ ఎంపీ సిఫార్సు పాసులతో సందర్శకులుగా వచ్చిన ఆగంతకుల రంగు పొగల హంగామాపై అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలని విపక్షం చూస్తుంటే, గత సంప్రదాయాలకు విరుద్ధంగా సభలో కాక బయట వివిధ పత్రికలు, టీవీ ఛానళ్ళలో ప్రధాని, హోమ్ మంత్రి జరిగిన సంఘటనపై స్పందిస్తూ ప్రతిపక్షాల డిమాండ్ను పెడచెవిన పెట్టడం చర్చనీయాంశమైంది. గత వారం 14 మంది, ఈ సోమవారం 78 మంది, తాజాగా మంగళవారం మరో 49 మంది... మొత్తం ఇప్పటికి 141 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. పార్లమెంట్లో సభా వ్యవహారాలకు అడ్డుపడిన సభ్యుల సస్పెన్షన్ కొత్తేమీ కాదు. ఇలా ఇంత సంఖ్యలో సస్పెన్షన్ల పర్వం సాగడం మాత్రం ఇదే తొలిసారి. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం ఎన్నడో 1989 మార్చిలో థక్కర్ ప్యానెల్ నివేదికపై రచ్చతో ఒకే రోజున లోక్సభలో 63 మంది సభ్యులను సస్పెండ్ చేసినట్టు చరిత్ర. ఇప్పుడు ఆ పాత రికార్డును చెరిపేస్తూ, దురదృష్టకరమైన కొత్త చరిత్ర లిఖితమైంది. సభాధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తికి సభ్యులను సస్పెండ్ చేసే అధికారమున్న మాట నిజమే. కానీ, ఆ స్థానంలో కూర్చొనే వ్యక్తి ప్రథమ కర్తవ్యం – అధికార, ప్రతిపక్షాల మధ్య సమతూకం పాటిస్తూ సభను సజావుగా నడపడమే తప్ప, సభ్యులపై పెత్తనం చూపడం కానే కాదు. ఆ సంగతి మర్చి పోయి సభలో వారందరికీ పెద్దన్నయ్యలా ప్రవర్తిస్తామంటేనే కష్టం. ప్రస్తుతం జరుగుతున్నదదే! నిరుద్యోగం సహా వివిధ సమస్యలపై దృష్టి పడేటందుకే పార్లమెంట్లో గతవారం అలా అలజడి రేపామని పట్టుబడ్డ ఆగంతకుల కథనం. ఆ ఆందోళనకారుల ఆలోచనలు ఏమైనప్పటికీ, వారు పొగ గొట్టాలతో పార్లమెంటులోకొచ్చే వీలు కల్పించి, సభ్యుల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టిన భద్రతా లోపంపై తక్షణం చర్చ జరగాల్సి ఉంది. అత్యవసరంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. విపక్షాల వాదనా అదే. ఆ వాదనలో న్యాయం ఉంది. ఘటనపై సభలో రక్షణ మంత్రి లాంటి వారు కాక శాంతి భద్ర తలు చూసే హోమ్ మంత్రి, సభానాయకుడు ప్రకటన చేయడం, సభ్యుల అనుమానాలను నివృత్తి చేయడం విధాయకం కూడా! కానీ అలా జరగట్లేదు. అక్కడే పీటముడి బిగిసింది. అనైతికత అంటూ ప్రతిపక్ష ఎంపీ మహువా మొయిత్రాపై చర్యలకు వేగిరపడ్డ పాలకులు, ఆగంతకులకు పాసులిచ్చిన స్వపక్షీయుడిపై చర్యకు ముందుకు రాకపోవడం ద్వంద్వ ప్రమాణాలంటూ విమర్శలకు తావిచ్చింది. అయితే, సభను సజావుగా సాగనివ్వకుండా ప్రతిపక్షాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని అధికార పక్ష ఆరోపణ. అది పూర్తి సత్యదూరమనలేం. కానీ, దాన్ని సాకుగా చూపుతూ సభలో సాధారణ ప్రకటన చేయడానికి కూడా అమాత్యులకూ, ప్రభుత్వానికీ అభ్యంతరం ఉంటే అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. సభావ్యవహారాలను అడ్డుకోవడం సైతం సభ్యుల హక్కులలో భాగమేనని బీజేపీ ఎంపీ స్వర్గీయ అరుణ్ జైట్లీయే ఒకప్పుడు వ్యాఖ్యానించడం గమనార్హం. కానీ, అధికార పీఠంపై కూర్చున్నాక బీజేపీ ఆ పాత వైఖరిని నమ్ముతున్నట్టు లేదు. చర్చలు, భిన్నాభిప్రాయాల కలబోతతో సాగాల్సిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పాలకుల ఏకపాత్రాభినయంగా మార్చాలని చూస్తున్నట్టుంది. ఎన్నికల సంఖ్యాబలపు నియంతృత్వంతో అధికారాన్ని హక్కుభుక్తంగా భావిస్తే అది గర్హనీయం. ప్రతిపక్షాలకున్న ప్రశ్నించే హక్కును కాదంటే, వాటి మాట వినాల్సిన పనే లేదనుకుంటే ఇక సభా సమావేశాలకు అర్థం ఏముంది! నేటి ప్రధాని గతంలో గుజరాత్ను ఏలినప్పుడూ, నిరసన తెలిపే ప్రతిపక్షాలపై నిర్దాక్షిణ్య సస్పె న్షన్ల పర్వం ఇలాగే సాగిందని పండితులు లెక్కలు తీస్తున్నారు. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాల్లోనే కనిపించే ఈ ధోరణి ఇప్పుడు పార్లమెంటుకు పాకడం విచారకరం. 2009–14 మధ్య దాదాపు 36 సస్పెన్షన్లు జరిగితే, ఎన్డీఏ ఏలుబడి వచ్చాక 2014–19లో అది 81కి ఎగబాకింది. ఇక, కేంద్రంలో వర్తమాన ప్రభుత్వ హయాంలో సస్పెన్షన్లు 149కి చేరాయి. ఇక, తాజా సస్పెన్షన్ల వల్ల ప్రస్తుత శీతకాల సమా వేశాల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో మూడింట రెండొంతుల పైగా సభ్యులు సభ వెలుపలికే పరిమితమైన పరిస్థితి. కొన్నేళ్ళుగా అనేక కీలక బిల్లులు చర్చే లేకుండా, అవసరమైన సవరణల్ని పట్టించుకోకుండా సంఖ్యాబలంతో చట్టాలవుతున్న తీరు పార్లమెంటరీ విధానాన్నే ప్రశ్నిస్తున్నాయి. ఇక, ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ వెలుపల మంగళవారం నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఓ ప్రతిపక్ష ఎంపీ ప్రవర్తించిన తీరు బాగా లేదు. రాజ్యసభ ఛైర్మన్ను అనుకరిస్తూ ఆ సభ్యుడు చేసిన ప్రహసనం సమర్థనీయం కాదు. ఇది ‘డెమోక్రసీ’ కాదు, ‘నమోక్రసీ’ అంటున్న ప్రతిపక్షాల పోరుకు శోభనిచ్చేదీ కాదు. వ్యక్తిగత ప్రవర్తనలో లోపాలు, పక్షపాత ధోరణులు ఎన్ని ఉన్నా... రాజ్యాంగ రీత్యా రాజ్యసభ ఛైర్మనైన భారత ఉపరాష్ట్రపతి హోదాకంటూ ఓ గౌరవం ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఆ గౌరవం ఇవ్వాల్సి ఉంది. అది మరిచి అగౌరవంగా ప్రవర్తిస్తే ప్రతిపక్షాలకే నష్టం. పోరాటాన్ని అది పలుచన చేస్తుంది. అసలు సంగతి పక్కదోవ పడుతుంది. ఏమైనా, చర్చలంటే టీవీలో ప్రసంగాల స్థాయికి దించేస్తూ, ప్రజాసమస్యల్ని గాలికొదిలేసే సభలతో ప్రయోజనం శూన్యం. ప్రతిపక్షాలే లేని పాలన కావాలనుకుంటే దానికి ప్రజాస్వామ్యమని పేరెందుకు? -
చీకటి వెలుగులు
విశాల విశ్వంలో సృష్టి సమస్తం ద్వంద్వాలమయం. ఈ ప్రపంచం ద్వంద్వాలమయం. లోకంలో వెలుగు చీకట్లుంటాయి. నిప్పూ నీరూ ఉంటాయి. తీపి చేదులుంటాయి. రేయింబగళ్లు ఉంటాయి. ఎండా వానా ఉంటాయి. శీతోష్ణాలుంటాయి. శిశిర వసంతాలుంటాయి. జీవితంలో సుఖదుఃఖాలు ఉంటాయి. ఆశ నిరాశలు ఉంటాయి. శాంతి అశాంతులు ఉంటాయి. గెలుపు ఓటములు ఉంటాయి. ఉత్థాన పతనాలు ఉంటాయి. మన వేదాంతం ఎంతగా అద్వైత సిద్ధాంత బోధ చేస్తున్నా, మానవమాత్రులైన వారెవరూ ద్వంద్వాతీతులు కారు, కాలేరు. మనుషులకు మాత్రమే కాదు, ఈ భూమ్మీద పుట్టిన ప్రతి జీవిలోనూ ఆడా మగా ఉంటాయి. ప్రతి జీవికీ చావుపుట్టుకలు ఉంటాయి. ప్రతి జీవితానికీ ఆద్యంతాలుంటాయి. ద్వంద్వబంధురమైన సృష్టి ప్రకృతి సహజం. సృష్టిలో ఇన్ని ద్వంద్వాలే లేకుంటే, ప్రకృతికి ఇంతటి సౌందర్యమెక్కడిది? జీవితానికి ఇంతటి వైవిధ్యమెక్కడిది? అద్వైతం అందమైన భావన. ఆధ్యాత్మిక ప్రవచనాల్లో ‘బ్రహ్మ సత్యం... జగన్మిథ్య’ అనే అద్వైత బోధను ఆలకించేటప్పుడు తన్మయత్వంతో కాసేపు ఓలలాడవచ్చేమో గాని, అది క్షణికమే! ఆ తర్వాత మిథ్యా మైకం నుంచి బయటపడ్డాక మనమింకా ద్వంద్వాల వలయంలోనే ఉన్నామన్న సంగతి ఎరుకపడటానికి ఎంతోసేపు పట్టదు. ‘మనకు రెండు కళ్లు, రెండు కాళ్లున్నట్లే ద్వంద్వాలన్నీ మన జీవితంలో భాగమే!’ అన్నాడు కార్లోస్ సాంటానా. అలాగని అతడేమీ తత్త్వవేత్త కాదు, వేదాంతి కాదు, కనీసం ప్రవచనకర్తయినా కాదు గాని, వారెవరికీ లేని ఎరుక అతడికి ఉంది. కార్లోస్ సాంటానా అమెరికన్ గిటారిస్ట్. అయినా, సృష్టిలోని ద్వంద్వాలను అర్థం చేసుకోవడానికి తత్త్వవేత్తలో, వేదాంతులో, ప్రవచనకర్తలో కానక్కర్లేదు... ఇసుమంత ఇంగితమున్న మనుషులైతే చాలు! ద్వంద్వాలు మన వెలుపలే కాదు, మన లోపల కూడా ఉన్నాయి. ద్వంద్వాల నడుమ నిత్యసంఘర్షణే ప్రకృతి ధర్మం. ‘మానవ జీవితమే మహాభారతం/ అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం’ అన్న ఆరుద్ర మాటలు ఇందుకు చిన్న ఉదాహరణ. మన జీవితాలను నిర్దేశించేవి జ్ఞానా జ్ఞానాలు, ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, ఉచితానుచితాలు, రాగద్వేషాలు, నీతి అవినీతి వంటి ద్వంద్వాలే! విశ్వానికి మూలం తొలుత ఏకపదార్థమేనని, కాలక్రమంలో అది ద్వంద్వాలుగా విడిపోయిందని పాశ్చాత్య తత్త్వవేత్తల్లో కొందరి భావన. సృష్ట్యాదిలో ప్రపంచమంతా జలమయమై ఉండేదని మన పురాణాల కథనం. గ్రీకు తత్త్వవేత్త థేలీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. థేలీస్ అభిప్రాయాన్ని అతడి శిష్యుడు అనగ్జిమాండర్ ఖండించాడు. ‘ఏదో ఒక అనిశ్చిత, అనిర్దిష్ట, అజ్ఞాత పదార్థం సమస్త స్థలాన్నీ ఆవరించి ఉండేది. అది అనంతం, అనశ్వరం’ అని అనగ్జిమాండర్ అన్నాడు. సృష్టికి మూలమైన పదార్థం ద్వంద్వాతీతమైనదో కాదో ఇప్పటికీ ఎవరికీ తెలీదు గాని, మన చుట్టూ ఉన్న ద్వంద్వాలు, మన లోపలున్న ద్వంద్వాలు అందరికీ అనుభవపూర్వకమే! జీవితంలో అడుగడుగునా తారసపడే ద్వంద్వాలే మన జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. ఎంతటి వారైనా జీవితంలో ఎదురయ్యే ద్వంద్వాలను అతిక్రమించలేరు. వాటి ఉనికిని గుర్తించకుండా ఉండలేదు. వాటికి అతీతంగా బతకలేరు. కాబట్టి మనం ద్వంద్వాలను నిర్ద్వంద్వంగా అంగీకరించక తప్పదు. లోకంలో కొందరు మనుషులు మంచివాళ్లుగా, మహానుభావులుగా చలామణీ అవుతారు. కొందరు దుర్మార్గులుగా, చెడ్డవాళ్లుగా పేరుమోస్తారు. నిజానికి ఎవరూ పూర్తిగా మంచివాళ్లుగా గాని, పూర్తిగా చెడ్డవాళ్లుగా గాని ఉండరు. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, వాటికి స్పందించే తీరుతెన్నులే మనుషుల మంచిచెడులను బయటపెడతాయి. అందుకే ‘మనుషులందరూ మంచి చెడుల సమ్మేళనాలే’ అన్నాడు స్కాటిష్ రచయిత రాబర్ట్ లూయీ స్టీవెన్సన్. ‘కృతా కృతేచ ద్వంద్వాని కదా శాంతాని కస్యవా/ ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాత్ భవ త్యాగపరో వ్రతీ’ అని అష్టావక్రుడు జనక మహారాజుకు చెప్పాడు. కృతాకృత కర్మకలాపాలు, సుఖదుఃఖాది ద్వంద్వాలు శాంతించినప్పుడు భక్తుడు సంశయరహితుడై జ్ఞాని అవుతాడని, అప్పుడు వైరాగ్య వ్రతం చేయకున్నా త్యాగపరాయణుడవుతాడని ఈ శ్లోకానికి అర్థం. జనకుడికి అష్టావక్రుడు చేసిన ఈ వేదాంత బోధ ‘అష్టావక్రగీత’గా ప్రసిద్ధి పొందింది. అష్టావక్రుడు తన గీతబోధలో ద్వంద్వాల ఉనికిని నిరాకరించలేదు. కాకుంటే, అవి శాంతించాలన్నాడు. ద్వంద్వాల మధ్య సమతుల్యతను సాధించినప్పుడే అవి శాంతిస్తాయి. సుఖదుఃఖాలు, రాగద్వేషాల వంటి సహజాతి సహజమైన ద్వంద్వాలకు కొంత మోతాదుకు మించి స్పందించడం మానవ స్వభావం. ద్వంద్వాల ప్రభావాన్ని సమానంగా స్వీకరించి, ఆత్మావలోకనం చేసుకోగల సామర్థ్యమే స్థితప్రజ్ఞ! కాకపోతే, మనుషుల్లో స్థితప్రజ్ఞులు అరుదు. ముఖ్యంగా ప్రజల మధ్య గడిపే రాజకీయ నేతల్లో, సినీతారల్లో మరీ అరుదు. ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల్లో జయాపజయాలు సర్వసాధారణాలు. ప్రజామోదం పొందిన వారు ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తారు. ప్రజాదరణ కొరవడిన వారు పరాజితులవుతారు. గెలుపొందిన వారు ‘అంతా తమ ప్రయోజకత్వం/ తామే భువి కధినాథులమనుకొని ’ విర్రవీగితే మాత్రం తర్వాతి ఎన్నికల్లో పర్యవసానాన్ని చవిచూడక తప్పదు. పరాజితులు ఇంతే తమ కర్మమ నుకుని కుంగిపోయినా, తమను ఆదరించని ప్రజలను నిందించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఘనవిజయాలు సాధించినప్పుడు బాధ్యతలను గుర్తెరిగి అప్రమత్తంగా ప్రవర్తించాలి. అపజయాలు ఎదురైనప్పుడు ఆత్మవిమర్శ చేసుకుని, లోపాలను సవరించుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. ఎన్నికల క్రతువులో ఘనవిజయాలూ శాశ్వతం కావు, అపజయాలూ శాశ్వతం కావు. శాశ్వతం కానివని తెలిసి తెలిసి ఫలితాలను తలకెక్కించుకుంటేనే ప్రమాదం. -
వోటథాన్ యాప్ ప్రారంభించిన లెట్స్వోట్ - వచ్చే వారంలో వాకథాన్ కూడా..
Digital Democracy Votathon App: ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లాభాపేక్షలేని పౌర సమాజ సంస్థ లెట్స్వోట్ 'డిజిటల్ డెమోక్రసీ వోటథాన్' యాప్ను విడుదల చేసింది. ఈ నెల 25న (నవంబర్ 25) గచ్చిబౌలి స్టేడియంలో 'స్టోరీబాక్స్'ను ఆవిష్కరించడమే కాకుండా ఓటు హక్కు, ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు 'వాకథాన్'ను నిర్వహించనున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిజిటల్ డెమోక్రసీ వోటథాన్ యాప్ ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి.. ఓటు ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి వోటథాన్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పౌరులు 'లైఫ్ సైకుల్' (Lifecykul) యాప్ డౌన్లోడ్ చేసుకుని పాల్గొనటానికి వోటథాన్ విభాగానికి వెళ్లాలి. ఆ తరువాత ఓటింగ్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి వాకింగ్ లేదా సైక్లింగ్ చేయడం ప్రారంభించవచ్చు. ప్రతి సెషన్ ముగిసే సమయానికి వినియోగదారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారో ఖచ్చితంగా తెలుసుకుంటారు. స్టోరీబాక్స్ స్టోరీబాక్స్ అనేది కంటెంట్ అందించే ఒక వినూత్న ఆలోచన. యువ పాఠశాల విద్యార్థులను చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు, కాబట్టి ఓటు హక్కు గురించిబ తెలుసుకుంటారు. అదే సమయంలో పెద్దలను ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రేరేపిస్తారు. లెట్స్వోట్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కంటెంట్ను ప్రారంభించింది. వివిధ పాఠశాలల యాజమాన్యాలతో కలిసి పనిచేయడం కూడా మొదలు పెట్టింది. ప్రస్తుతం 25 పాఠశాలల్లో ప్రారంభమైన ఈ స్టోరీబాక్స్ కంటెంట్ 40 పాఠశాలలకు చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. స్టోరీబాక్స్ మీద ఆసక్తి ఉన్న యాజమాన్యం స్టోరీబాక్స్ను ఇన్స్టాల్ చేసుకోవడానికి లెట్స్వోట్ టీమ్ను సంప్రదించవచ్చు. వాకథాన్ వచ్చే శనివారం (నవంబర్ 25) రోజు ఓటుపై అవగాహన పెంచేందుకు లెట్స్వోట్ ద్వారా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ భాగస్వామ్యంతో వాకథాన్ నిర్వహించనున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం 6:30 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ వాకథాన్లో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, మొదటిసారి ఓటు వేయనున్న ఓటర్లు, సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా ఇతర ప్రముఖులు సుమారు 4000 కంటే ఎక్కువమంది పాల్గొనే అవకాశం ఉందని ఓటు వేద్దాం జాతీయ కన్వీనర్ డాక్టర్ కె సుబ్బరంగయ్య అన్నారు. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ఓటరు అవగాహన కోసం నిరవహించే ఈ వాకథాన్లో వేసే ప్రతి అడుగు ఒక బలమైన ప్రజాస్వామ్యం నిర్మించడంలో ఉపయోగపడుతుంది. కొత్త ఓటర్లు.. అనుభవజ్ఞులైన వారితో చేతులు కలపడం ఇక్కడ జరుగుతుంది. కేవలం మన ఓటు వేయడమే కాకుండా.. భవిష్యత్తును రూపొందించడానికి కూడా ఇది ఒక మంచి వేదికగా అవుతుందని లెట్స్వోట్ పబ్లిసిటీ కన్వీనర్ షీలా పనికర్ తెలిపారు. -
సాధికారతే ప్రజాస్వామ్యం!
కులం పునాదుల మీద మనం ఒక జాతిని నిర్మించలేమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఘంటాపథంగా ప్రకటించారు. భారతీయులందరినీ ఏకతాటి మీదకు తీసుకొని రావాలంటే అందుకు తొలి షరతు కుల నిర్మూలనేనని ఆయన స్పష్టం చేశారు. ఒక మానవ సమూహం నాగరిక పౌరసమాజంగా మన్నన పొందాలంటే, దాని పాలనా విధానంలో ప్రజా స్వామ్యం శోభిల్లాలంటే... ఆ సమూహంలోని ప్రజలంతా ఆత్మ గౌరవంతో తల ఎత్తుకొని జీవించే పరిస్థితి ఉండాలి. ఆత్మ గౌరవానికి అతిపెద్ద శత్రువు కులమేనని పెరియార్ రామస్వామి నాయకర్ నిగ్గు తేల్చారు. కుల నిర్మూలన కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కుల నిర్మూలన ఎలా సాధ్యపడుతుంది? అనాగరికమైన ఈ కుల వ్యవస్థను కూలదోయడానికి ఉపకరించే ఆయుధాలేమిటి? దుర్భర బర్బర సంప్రదాయాల నుంచి సంఘాన్ని విముక్తం చేయడమెట్లా? ఆయా చార్రితక కాలమాన పరిస్థితులను బట్టి సంఘ సంస్కర్తలు రకరకాలుగా మార్గదర్శనం చేశారు. సహపంక్తి భోజనాలు చేయాలన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలన్నారు. పేదకులాల ప్రజలందరూ బాగా చదువుకోవాలని ఉపదేశించారు. వీటన్నిటి సారాంశం ఒక్కటే. పుట్టుక కారణంగా నిమ్నకులం వారుగా ముద్రవేయించుకునే ప్రజలందరూ ధనిక కులాల వారితో ఇంచుమించు సరిసమా నమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ హోదాలను అందుకోవాలి. అప్పుడే వారిలో ఆత్మన్యూనత అదృశ్యమై ఆత్మగౌరవం మొగ్గ తొడుగుతుంది. భారత రాజ్యాంగం ఇదే అభిప్రాయాన్ని తన లిఖితపూర్వక ఆదేశాల్లో ప్రతిఫలింపజేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలందరూ సమాన వాటాదారులు కనుక హెచ్చుతగ్గులు లేని సమాజానికి బాటలు వేయడం రాజకీయ పక్షాల కనీస బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఇప్పటివరకూ మన ఏలికలు విఫలమవుతూ వస్తున్నారనేందుకు నిమ్నవర్గాల దుఃస్థితే సజీవ సాక్ష్యం. ఆర్థిక, రాజకీయ రంగాల్లో కొన్ని మొక్కుబడి ప్రయోజ నాలను కల్పించినప్పటికీ, సామాజిక హోదాను కట్టబెట్టడంలో మన ప్రభుత్వాలు చేసింది పెద్ద గుండుసున్నా మాత్రమే! ఆంధ్ర ప్రదేశ్లో ఆధికారంలో వున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తన 53 నెలల పాలనాకాలంలో ఈ ఒరవడిని మార్చింది. ఆర్థిక, రాజ కీయ రంగాల్లో మొక్కుబడి తతంగాలకు స్వస్తి చెప్పి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంతవరకు ఎవరూ పట్టించు కోని సాంఘిక రంగంలో సైతం ఉద్యమ చైతన్యాన్ని రగిలించే ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభమైంది కనుకనే, ప్రజలు గుర్తించడం మొదలుపెట్టారు కనుకనే పార్టీ అధినేత వైఎస్ జగన్ సామాజిక సాధికార యాత్రలకు పిలుపునిచ్చారు. ఈ రథయాత్రలు మరింత జన చేతనను జ్వలింపజేస్తాయని ఆయన ఆశిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకూ గత కాలపు ప్రభుత్వాల తూతూ మంత్రపు తతంగాల స్థానంలో విప్లవకర విధానాలను ఆయన ప్రవేశపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేద వర్గాల ప్రజలను సంక్షేమ పథం నుంచి సాధికారత గమ్యం వైపు ఆయన మళ్లించారు. ప్రజలకు ఆ గమ్యాన్ని గుర్తు చేయడం కోసం ఇప్పుడు జరుగుతున్న యాత్ర లకు ‘సామాజిక సాధికార యాత్ర’లుగా ఆయన నామకరణం చేశారు. పేదవర్గాల ప్రజలందరూ ఈ గమ్యానికి చేరుకోవడమే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం, సార్థకత. సమస్త వృత్తి వ్యాపారాలకు ప్రాతినిధ్యం వహించే సకల జనులందరూ నిజమైన స్వేచ్ఛతో, సాధికార స్వరంతో నిర్భ యంగా తమ అభిప్రాయాలు వెల్లడించగలిగే దశకు చేరుకున్న ప్పుడే ప్రజాస్వామ్యం నూరుశాతం ఫలించినట్టు లెక్క. రాజ కీయ వేషాలు వేసుకున్న దొంగలకు, దోపిడీదార్లకు, పిండారీ లకు అదుపులేని లైసెన్స్లు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. నడిరోడ్ల మీద సభల పేరుతో తొక్కిసలాటలు సృష్టించి జనాన్ని చంపే స్వేచ్ఛ కోసం, నేరం చేసినట్టు ఆధారా లున్నవాడు కూడా అరెస్ట్ కాకుండా ఉండే స్వేచ్ఛ కోసం, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడే స్వేచ్ఛ కోసం ఇప్పుడు జరుగుతున్న ఆరాటాలు, పోరాటాలు ప్రజాస్వామ్యంగా పరిగణించడం సాధ్యం కాదు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ప్రకటిస్తూ పేద తల్లిదండ్రుల పక్షాన ఆ ఆస్తిని సమకూర్చే బాధ్యతను వైఎస్ జగన్ ప్రభుత్వం తలకెత్తుకున్నది. ఆ చదువు నాణ్యమైనదిగా, ఆధునిక సాంకేతికత జోడించినదిగా, అత్యు న్నతస్థాయి పాఠశాలల ప్రమాణాలను అందుకునేదిగా ఉండేట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంత బృహత్తరమైన కార్యా చరణలో తల్లిదండ్రుల మీద వీసమెత్తు భారం పడకుండా, పైగా వారికి ప్రోత్సాహకం కూడా లభించేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి బాలికా, బాలుడూ కచ్చితంగా బడికి వెళ్లేలా, ఏ ఒక్కరూ మధ్యలో బడి మానివేసే పరిస్థితి రాకుండా అందరూ ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ఒక విప్లవోద్యమం మొదలైంది. ఈ ‘ఆస్తి’పరులు తమ చదువును మదుపుచేసి మరో పదేళ్ల తర్వాత నుంచి వరుసగా ప్రతి ఏటా సంపద సృష్టిలో కీలక బాధ్యత వహించబోతున్నారు. తాము పుట్టి పెరిగిన వర్గాన్ని విముక్తం చేయబోతున్నారు. వైద్యం, వ్యవసాయం, చిన్న–సూక్ష్మ పరిశ్రమలు, చిరు వ్యాపారాలు తదితర రంగాలను కూడా పేదల అనుకూల విధానాలు ఆవహిస్తున్నాయి. ఇప్పుడు చేయూత కోసం ఎదురు చూసే స్థితిలో ఉన్న ప్రజలు రానున్న కాలంలో పదిమందిని చేయిపట్టి నడిపించగల స్థితికి చేరుకుంటారు. జగన్ ప్రభుత్వ విధానాల ఫలితంగా మరో ఐదు, పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భు తాలను చూడబోతున్నది. బలహీన వర్గాలకు రాజకీయ పదవుల కల్పనలో కూడా పాత పద్ధతులకు జగన్ సర్కార్ స్వస్తి చెప్పింది. మంత్రి మండలి శాఖల కేటాయింపుల్లో, శాసనమండలి, రాజ్యసభ సభ్యుల ఎంపికలో, కార్పొరేషన్లు, మేయర్లలో, మునిసిపల్, జడ్పీ ఛైర్మన్లలో, కార్పొరేషన్ చైర్మన్లలో ఇలా అన్నిరకాల రాజ కీయ పదువుల్లో బలహీన వర్గాలకు సింహభాగం కేటాయింపులు చేసిన జగన్ ప్రభుత్వం కొత్త చరిత్రను లిఖించింది. సామాజిక సాధికార యాత్రలో వైసీపీ నాయకులు ఈ గణాంకాలను ఉటంకిస్తూ చేస్తున్న సవాళ్లకు బదులు చెప్పలేక విపక్షం డిఫెన్స్లో పడిపోయింది. ఆర్థిక – రాజకీయ రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు ఒక ఎత్తయితే, సామాజిక మార్పులు మరో ఎత్తు. పేదవర్గాలు తల ఎత్తుకొని జీవించడానికి దోహదపడే మార్పులు కొన్ని ఆర్భాటం లేకుండా చోటు చేసుకుంటున్నాయి. ఒక నిశ్శబ్ద విప్లవం కమ్ముకొస్తున్న దృశ్యం ఇప్పుడు జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇందులో మూడు అంశాలను మనం స్పష్టంగా చూడవచ్చు. 1. కొత్తగా వెలుస్తున్న వాడల్లో కులజాడలు కన్పించడంలేదు. 2. హిందూ సమాజం అపురూప గౌరవంగా భావించే ఆలయ మర్యాదలు పెద్ద కులాల పరిధుల్ని దాటి బలహీనవర్గాల్లోకి ప్రవేశించాయి. 3. శ్రామిక మధ్యతరగతి మహిళల మాటకు ఇంటాబయటా క్రమంగా మర్యాద మన్నన పెరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో లక్షల సంఖ్యంలో నిర్మాణమవుతున్న జగనన్న ఇళ్లను పరిశీలించడానికి ఇటీవల బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్) వెబ్సైట్ ప్రతినిధి ఒకరు రాష్ట్రంలో పర్యటించారు. సెమీ అర్బన్ ప్రాంతమైన సామర్లకోటలో వేల సంఖ్యలో నిర్మాణం పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించి అక్కడ నివాసముంటున్న వాళ్లతో మాట్లాడారు. అందులో ఇంజేటి సమర్పణరాజు అనే లబ్ధిదారుడు చెప్పిన మాటలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ‘మాకు (దళితులకు) గతంలో కాలనీలు వేరుగా ఉండేవి. అవమానంగా ఉండేది. ఇక్కడలా చేయలేదు. మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాల నంబర్ల ఆధారంగా డ్రా తీశారు. డ్రాలో వచ్చిన ఫ్లాట్లను కేటాయించారు. అన్ని కులాల వారూ పక్కపక్కనే వచ్చారు. సంతోషంగా ఉంది.’ ఆ ప్రతినిధి పరిశీలించిన అన్ని కాలనీల్లో ఈ మాట వినిపించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెదతాడేపల్లి వాస్తవ్యురాలు గుండుగోలు అరుణ అనే దళిత మహిళ మాట్లాడుతూ మాకు వచ్చిన ఇంటికి ఎదురుగానే కమ్మవారికి వచ్చింది. మా పక్కనే తూర్పు కాపులకు వచ్చింది. అందరం కలిసే ఉంటున్నామని చెప్పింది. బలహీన వర్గాల వారికి ప్రభుత్వం కేటాయించే ఇంటి స్థలాల్లో కులాల వారీ కాలనీలు పట్టణ ప్రాంతాల్లో క్రమంగా అంతరించాయిగానీ, గ్రామాల్లో చాలాకాలం కొనసాగాయి. ఆ సంప్రదాయాన్ని 17 వేల జగనన్న కాలనీల్లో స్వస్తి పలికి సమష్టి జీవనానికి శ్రీకారం చుట్టారు. సంపన్నులకు, పెద్ద కుటుంబాల వారికీ, వ్యాపారులకు మాత్రమే ఆలయ కమిటీల్లో చోటు దొరికేది. పూర్వపు ధర్మ కర్తలకు లభించే గౌరవ మర్యాదలు ఈ కమిటీ సభ్యులకు కూడా లభిస్తాయి. ఆలయంలో లభించే గౌరవానికి హిందువులు విశేష ప్రాధాన్యమిస్తారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమా క్లైమాక్స్ దృశ్యం ఈ అభిప్రాయానికి అద్దం పడుతుంది. విఖ్యాత హిందూ దేవాలయం తిరుమలలో ఆలయ మర్యాదల కోసం సంపన్నులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తహతహలాడిపోవడం మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి తిరుమలలో తిరుమలేశుని తొలిదర్శనం చేసుకునే అవకాశాన్ని సన్నిధి గొల్లకు జగన్ మోహన్రెడ్డి హక్కుభుక్తం చేశారు. వెనక బడిన కులాల్లో మరింత వెనుకబడిన కులాల వారికి కూడా తిరుమల ఆలయ కమిటీలో సభ్యత్వం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే వేలాది ఆలయా లకు నియమించిన కమిటీల్లో సగం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలవారే! ఇదొక సామాజిక హోదా, గౌరవం. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బలహీనవర్గాల ప్రజలకు ఇప్పుడీ గౌరవం దక్కింది. మహిళా సాధికారత లేకుండా జన సాధికారత సంపూర్ణం కాదు. అది సంపూర్ణం కాకుండా నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అవతరించదు. పేద వర్గాల పురుషులు రాజకీయ, ఆర్థిక,సాంఘిక వివక్షలకు మాత్రమే గురవుతారు. శ్రామిక వర్గ మహిళలు తమ పురుషులతో సమానంగా ఈ వివక్షలను ఎదుర్కొంటూనే లైంగిక అసమానత్వాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఈ రెట్టింపు వివక్ష ఈనాటిది కాదు. ఈ దేశానికి మాత్రమే పరిమితమైనది కాదు. రెండు శతాబ్దాల క్రితం మాక్సిమ్ గోర్కీ రాసిన రష్యన్ నవల ‘అమ్మ’ ఇతివృత్తమే ఇది. ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషల్లో కోట్లాది మంది చదివి ప్రభావితమైన నవల బహుశా ‘అమ్మ’ ఒక్కటేనేమో! రెట్టింపు దోపిడీనీ, రెట్టింపు అవమానాల్నీ ఎదుర్కొన్న అమ్మ మాత్రం బేల కాదు. పోరాట పటిమకు పెట్టింది పేరు. ఆ మాటకొస్తే శ్రామిక మహిళలందరూ పోరాట పటిమ గలవారే. ‘మదర్ ఇండియా’లే! వారి గౌరవ మర్యాదలను ఇనుమడింపజేయగల కొన్ని ప్రత్యేక పథకాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పుడు రాష్ట్రంలోని స్థానిక సంస్థల అధ్యక్ష పీఠాలపై సగానికి పైగా మహిళలే ఆసీనులయ్యారు. ఆలయ కమిటీల్లోనూ సగానికంటే ఎక్కువమంది ఉన్నారు. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో సగం దక్కించుకున్నారు. మంత్రివర్గంలో కీలక శాఖల అధిపతులుగా ఉన్నారు. రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచడం ఒక భాగం మాత్రమే! ‘అమ్మ ఒడి’, అమ్మ పేరున ‘ఆస్తిపత్రం’, అమ్మకు ‘చేయూత’ అనే మూడు విశిష్ట పథకాలు ఎక్కడా లేనివి. మహిళల ఆత్మగౌరవానికి మకుట ధారణ చేసినవి. పిల్లల చదువులు, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయా ధికారాన్ని ‘అమ్మ ఒడి’ పథకం ఆమెకు కట్టబెట్టింది. 30 లక్షల మంది మహిళలకు సంపూర్ణ హక్కులతో ఇంటి పట్టాలను జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్నారు. ఇంటాబయటా ఆమె గౌరవం పెరిగింది. చేయూత పథకంతో నడివయసులోనూ మహిళలు వ్యాపారస్తులుగా రాణిస్తున్నారు. మనుమలు, మను మరాళ్లకు చిన్నచిన్న బహుమతులు కూడా కొనివ్వలేని నిస్స హాయ స్థితిని వాళ్లిప్పుడు జయించారు. వ్యాపార విజయాల కోసం ఇప్పుడు పాటుపడుతున్నారు. ఈ 53 నెలల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు బహుజనులను, మహిళలను సాధికారత పథంలో నిలబెట్టాయి. ఈ పరిణా మాన్ని పెత్తందారీ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తక్షణమే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో అన్ని వైపుల నుంచీ యుద్ధాన్ని ప్రకటించాయి. తప్పుడు ప్రచారాలతో ఒక విష వృష్టిని కురిపిస్తున్నాయి. సాధికార యాత్రలతో విష ప్రచారాలను ఎండగట్టవలసిన బాధ్యత, పెత్తందారీ కుట్రలను తిప్పి కొట్టవలసిన బాధ్యత బహుజనులూ, మహిళలదే! ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చగలిగితేనే కులం జాడలు, వెలివాడలు అదృశ్యమవుతాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇన్నేళ్ళకు న్యాయం!
మూడు దశాబ్దాల పైచిలుకు క్రితం కేసులో బాధితులకు ఎట్టకేలకు కాసింత ఊరట దక్కింది. పోలీసుల దమనకాండకు ప్రతిరూపమైన తమిళనాడు వాచాత్తి ఘటనలో సెప్టెంబర్ 29న మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఆ రకంగా చిరకాలం గుర్తుండిపోతుంది. మారుమూల గ్రామంలోని గిరిజనులపై దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన కేసు అది. అటవీ, పోలీసు అధికారులతో సహా మొత్తం 269 మంది దోషులంటూ కింది కోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది. దోషులు పైకోర్టును ఆశ్రయించి, జాగు చేశారు. తాజాగా మద్రాస్ హైకోర్ట్ ఆ అప్పీళ్ళను కొట్టివేసింది. కింది కోర్ట్ తీర్పును హైకోర్ట్ సమర్థించడమే కాక, 215 మందినీ దోషులుగా తీర్మానిస్తూ, ఒక్కొక్కరికీ 1 నుంచి 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితులకు ఇన్నాళ్ళకైనా న్యాయం దక్కిందనే భావన కలుగుతోంది. ప్రజాస్వామ్యం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మిగులుతోంది. నిజానికి, తమిళనాట ధర్మపురి జిల్లాలో తూర్పు కనుమల్లో నెలకొన్న గిరిజన గ్రామం వాచాత్తి గురించి ముప్ఫయ్యేళ్ళ క్రితం ఎవరూ విననైనా విని ఉండరు. కేవలం 655 మంది, అందులోనూ 643 మంది మలయాళీ షెడ్యూల్డ్ తెగల వారున్న 200 గడపల గ్రామం అది. కానీ, ఆ రోజు జరిగిన ఆ దారుణ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామం వార్తల్లో నిలిచింది. గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులు, అటవీ అధికారులు గ్రామంపై దాడి చేశారు. అక్కడ గిరిజనులపై సాగించిన అమానుషం, బడికెళ్ళే ఓ చిన్నారి సహా 18 మంది మహిళలపై సామూహిక అత్యాచారం, తాగునీటిలో విషం కలిపిన తీరు, పశువుల్ని ఊచకోత కోసి ఊరి బావిలో పడేసిన వైనం... ఆ గ్రామం రూపురేఖల్నే మార్చేశాయి. ‘గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్రామం’ అని ముద్రవేస్తూ అమాయకులపై అధికారులు సాగించిన ఆ దమనకాండ ఓ మాయని మచ్చ. కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లోతుగా విచారించి అధికారుల తప్పు తేల్చినా, ఏళ్ళ తరబడి వాయిదా పడుతూ వచ్చిన న్యాయం ఇన్నాళ్ళకు దక్కింది. బాధితులకు కాస్తయినా ఊరట దక్కింది. 1992 జూన్ 20 నుంచి మూడు రోజులు సాగిన అమానుష ఘటనలో మొత్తం 269 మంది నిందితులు కాగా, వారిలో 54 మంది న్యాయ విచారణ కాలంలోనే కన్నుమూశారు. మిగిలినవారికి ఇప్పుడు శిక్ష పడింది. ఈ కథ ఇక్కడి దాకా రావడం వెనుక న్యాయం కోసం సుదీర్ఘంగా సాగిన పోరాటం ఉంది. అప్పట్లో అధికారులపై కేసులు నమోదు కాకపోగా, గిరిజనులపైనే స్థానిక పోలీసులు ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి. గిరిజనులు తమ ఇళ్ళను తామే ధ్వంసం చేసుకున్నారని అధికారులు బుకాయించారు. హైకోర్ట్ ఆదేశిస్తే గానీ చివరకు సీబీఐ దర్యాప్తు జరగలేదు. అంతరాయాలతో విచారణ సుదీర్ఘంగా 19 ఏళ్ళు సాగి, చివరకు 2011లో ధర్మపురి సెషన్స్ కోర్ట్ అధికారులను దోషులుగా తేల్చి, శిక్ష వేసింది. దోషులు మద్రాస్ హైకోర్ట్ను ఆశ్రయించడంతో మరో 11 ఏళ్ళ సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఈ కేసు విచారణ సత్వరమే పూర్తి చేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి ఒకరు ఈ ఏడాది మొదట్లో పట్టుబట్టడంతో ఇప్పటికైనా కథ ఓ కొలిక్కి వచ్చింది. చిత్రం ఏమిటంటే – వాచాత్తి దమన కాండపై అప్పట్లోనే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైతే, ప్రభుత్వంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు అలాంటి నేరాలకు పాల్పడరంటూ జడ్జి దాన్ని కొట్టేయడం! జయలలిత సారథ్యంలోని అప్పటి అన్నాడీఎంకె పాలకులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అధికారంలో ఉన్న డీఎంకె, అన్నాడీఎంకె సర్కార్లూ తమ బ్యూరోక్రాట్లకు కాపు కాసేందుకే ప్రయత్నించాయి. కొందరు ఉద్యమకారులు, లాయర్లు, నిజాయతీపరులైన అధికారులు, జడ్జీల వల్ల చివరకు న్యాయం జరిగింది. అత్యాచార బాధితులు పట్టువిడవకుండా పోరాడడంతో ఇప్పటికైనా సత్యం గెలిచింది. కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా ధర్మం నిలిచింది. కేవలం 655 మంది ఆదివాసీలు బలమైన రాజ్యవ్యవస్థతో తలపడి, విజయం సాధించడం చరిత్రాత్మకం. ఆ రకంగా ఇది బలవంతులపై బలహీనుల గెలుపు. ఆదివాసీల హక్కుల గెలుపు. న్యాయవ్యవస్థ స్వతంత్రమనీ, పాలకుల తప్పులను సైతం సహించదనీ రుజువైంది. ఎస్సీ– ఎస్టీ చట్టం ఇప్పటికీ బలంగానే ఉందని తేలింది. అయితే, నేటికీ కొనసాగుతున్న అనేక దమనకాండ కేసుల్లో ఇంత సుదీర్ఘ పోరాటం, సత్యాన్ని వెలికితీసి దోషులకు శిక్షపడేలా బృహత్ యత్నం సాధ్యమేనా? న్యాయం దక్కడంలో ఆలస్యమైతే, న్యాయం చేయనట్టే! వాచాత్తి ఘటనలో అపరిమిత ఆలస్యమైంది. దోషుల్లో పలువురు బెయిల్పై బయట గడిపి, ఉద్యోగ ప్రయోజనాలన్నీ పొంది, హాయిగా రిటైరయ్యారు. ఇప్పటికైనా దోషులను శిక్షించడమే కాక, బాధితులకు తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారాలిస్తే సరిపోదు. నలుగురిలో గౌరవంగా బతికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. వలసవాద బ్రిటీషు పాలన లక్షణాలను పోలీసులు, అధికారులు ఇప్పటికైనా వదిలించుకొంటే మేలు. తమిళనాట గిరిజనులపై అమానుషాల నుంచి మిజోరమ్లో గ్రామాల దహనం, కశ్మీర్లో నిర సనకారులపై కాల్పుల దాకా దశాబ్దాలుగా చూస్తున్నవే. బ్రిటీషు దౌర్జన్యానికి మన భారతీయ పోలీ సులు వారసులుగా మారిన వైనానికి ఇవి ప్రతీకలు. పదే పదే సాగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు సాక్ష్యాలు. అందుకే, ‘‘దాడుల పేరిట చట్టవ్యతిరేక చర్యలకు’’ పోలీసులు బరి తెగించడం దుస్సహమని కోర్ట్ అన్న మాట కీలకం. నిన్నటికి నిన్న కూడా వార్తల్లో కనిపిస్తున్న ఇళ్ళపై దుర్మార్గ దాడుల ధోరణిని వ్యవస్థ సత్వరమే వదిలించుకోవాలి. వాచాత్తి కేసు గుర్తుచేస్తున్న పాఠం అదే! -
నేర విచారణ ప్రక్రియ ఇలా...
ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే. పేదలు–ధనికులు, చిన్న–పెద్ద అనే తారతమ్యాలు ఉండవు. అందరూ చట్టాన్ని గౌరవిస్తూ పాటించాల్సిందే. చట్టాలు అమలు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు, న్యాయవ్యవస్థలు పని చేస్తాయి. బాధ్యత గల పౌరులు ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సహకరించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్య వాటాదారులు కాబట్టి, ప్రభుత్వ పరిపాలన ఎలా సాగుతోంది అనే అవగాహన కూడా వారికి ఉండాలి. ఆ అవగాహన వారికి ఉంటేనే ప్రజాప్రతినిధుల పనితీరును సరిగ్గా అవగతం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడతారు. ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ (గుర్తించతగిన నేరం) జరిగితే పోలీసు వారికి ప్రజల నుంచి ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. మూడు సంవ త్సరాలు అంతకు ఎక్కువ శిక్షపడే నేరాలను కాగ్నిజబుల్ అఫెన్స్లు అంటారు. ఇలాంటి కేసుల్లో పోలీసులు మేజిస్ట్రేట్ వారెంట్ లేకుండా ఇతర నిబంధనలకు లోబడి నిందితులను అరెస్టు చేయవచ్చు. కాగ్నిజబుల్ అఫెన్సులపై ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు దాని ఆధారంగా ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసి సంబంధించిన మేజిస్ట్రేట్కు పంపిస్తారు. అది మొట్టమొదటి నివేదిక కాబట్టే దాన్ని ప్రాథమిక సమాచార నివేదిక అంటారు. మూడేళ్ళ కంటే తక్కువ శిక్షలు పడే నేరాలను నాన్–కాగ్నిజబుల్ అఫెన్సులు అంటారు. వీటిని కోర్టు ఉత్తర్వుల ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేస్తారు. ప్రైవేట్ కంప్లైట్ ఆధారంగా కోర్టు ఇచ్చే ఉత్తర్వుల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి ముందుకు వెళ్ళవచ్చు. ఎఫ్ఐఆర్ అనేది కాగ్నిజబుల్ అఫెన్సు జరిగింది అనే విషయాన్ని తెలియజేసే పత్రం మాత్రమే. ఒక నేరం జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఉండవచ్చు. అలాంటి సందర్భంలో సహజంగా నిందితుల పేర్లను పొందుపరచడం జరుగుతుంది. అయితే ఎఫ్ఐఆర్ ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది. పోలీసుల దర్యాప్తులోనే అందులోని నిజానిజాలు, నిందితుల పాత్రలు నిర్ధారించడం జరుగుతుంది. ఫిర్యాదులో నిందితుల పేర్లు లేవు కదా అని దాన్ని స్వీకరించకపోడా నికీ, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉండటానికీ ఆస్కారం లేదు. ఉదాహరణకు దివంగత ప్రధానమంత్రి రాజీవ్గాంధీ హత్య కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు లేవు. పోలీసుల దర్యాప్తు లోనే ఆ పేర్లు, వారి పాత్రలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నిధుల దుర్వినియోగం, ప్రజల సొమ్ము కొల్లగొట్టడం వంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితుల అందరి పేర్లు ఎఫ్ఐ ఆర్లో చేర్చడం మామూలుగా జరగదు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అనేక పత్రాలను పరిశీలించడం, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం జరుగుతుంది. ఆ తర్వాతే బాధ్యులైన నిందితుల పేర్లు వెలుగులోకి వస్తాయి. అరెస్టు అయిన వ్యక్తికీ కొన్ని హక్కులు ఉంటాయి. అరెస్టు చేసే సమయంలో పోలీసులు నిందితుడికి అందుకు కారణాలు చెప్పాలి. బెయిలబుల్ అఫెన్సు అయితే ఆ విషయం తెలియపరుస్తూ బెయిల్ బాండ్స్ ఇస్తే విడుదల చేస్తామనీ నిందితుడికి వివరించాలి. నింది తుడికి సంబంధించిన వ్యక్తికి అరెస్టు కార్డ్ ఇవ్వాలి. ఎలాంటి సాక్ష్యా ధారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లైతే 24 గంటల్లో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని క్రిమినల్ ప్రోసీజర్ కోడ్లోని (సీఆర్పీసీ) సెక్షన్ 167 చెప్తుంది. అయితే ఆ అరెస్టు వేరే ప్రాంతంలో జరిగితే ప్రయాణ సమయాన్ని అదనంగా పరిగణించాలనే నిబంధనా ఉంది. నేరంలో నిందితుడి పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని మేజిస్ట్రేట్ సంతృప్తి చెందితేనే 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు పంపిస్తారు. కేవలం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న వారినే పోలీసు కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ కూడా అరెస్టు చేసిన నాటి నుంచి 14 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నేరంలో నిందితుడి పాత్రపై కీలక విషయాలను రాబట్టడా నికి పోలీసు కస్టడీ దోహదం చేస్తుంది. జ్యుడీషియల్ రిమాండ్ కోరినప్పుడు నేరంలో నిందితుడి పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయో లేదో నిర్ధారించే, కోర్టు తగిన ఆదేశాలు ఇస్తుంది. ఈ ఆధారాలు లేకుంటే జ్యుడీషియల్ రిమాండ్ను మేజిస్ట్రేట్ తిరస్కరించవచ్చు. ఇలా తిరస్కరించినప్పుడు నిందితునికి బెయిల్ ఇచ్చి పంపించివేస్తారు. జ్యుడీషియల్ రిమాండ్ దశలో నిందితుడిని నేరం చేశారా, లేదా? అనే అంశాన్ని న్యాయమూర్తి అడగరు. కేవలం పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా, కొట్టారా? వంటివి మాత్రమే అడుగుతారు. పోలీసులు తనను కొట్టారని నిందితుడు వెల్లడిస్తే వెంటనే ఆస్పత్రికి పంపడానికీ, ఊండ్స్ సర్టిఫికెట్ తీసుకోవ డానికీ తగిన చర్యలు తీసుకుంటారు. పోలీసు కస్టడీలో నిందితుడిని కొట్టారని రుజువైతే సంబంధిత పోలీసులపై అదే కోర్టులో కేసు పెట్టడానికి ఆస్కారం ఉంది. పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేస్తారు. సీఆర్పీసీలోని సెక్షన్ 161 కింద నమోదు చేసే ఈ వాంగ్మూలాల్లో సాక్షుల సంతకాలు తీసుకోకూడదు. ఈ వాంగ్మూలాలను సాక్ష్యాలుగానూ పరిగణించకూడదు. కేవలం వాటిని దర్యాప్తు నిమిత్తం, కోర్టులో సాక్షుల వాంగ్మూలాల కచ్చిత త్వాన్ని నిర్ధారణ చేయడానికి ఉపయోగించవచ్చు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింది సాక్షుల వాంగ్మూలాలను న్యాయమూర్తి నమోదు చేయ వచ్చు. ఆ వాంగ్మూలాల కింద సాక్షుల సంతకాలు తీసుకుంటారు. అందువల్ల ఈ వాంగ్మూలానికి విరుద్ధంగా సాక్షి కోర్టులో సాక్ష్యం చెబితే అందుకు అతడు బాధ్యుడు అవుతాడు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్ని ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు పోలీసులు కోర్టులో నిందితుల విచారణ నిమిత్తం అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. కేసులో ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కోర్టు సీఆర్పీసీలోని సెక్షన్ 190 కింద నేరాన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకుంటుంది. అభియోగం చేసిన నేరారోపణలపై ప్రాథమిక సాక్ష్యాలు లేకపోతే కోర్టు పరిగణనలోకి తీసుకోదు. ఈ దశలో సదరు కేసు విచారణ అదే మేజిస్ట్రేట్ పరిధిలో ఉంటే దానికి సీసీ నంబర్ ఇస్తారు. అందులోని సెక్షన్ల ప్రకారం కేసు సెషన్స్ న్యాయమూర్తి ట్రయల్ నిర్వహించాల్సి ఉంటే పీఆర్సీ నంబర్ ఇచ్చి ఫైల్ను సంబంధిత కోర్టుకు పంపిస్తారు. చార్జ్షీట్ను కోర్టు పరిగణన లోకి తీసుకున్న తర్వాత సమన్లు జారీ చేయడం ద్వారా ఓ తేదీ ఖరారు చేసి నిందితులను న్యాయస్థానానికి పిలుస్తారు. నిందితుడు హాజరైన తర్వాత చార్జ్షీట్తో పాటు ప్రాసిక్యూషన్ వాళ్ళు కోర్టుకు సమర్పించిన ప్రతి డాక్యుమెంట్ను ఉచితంగా అందిస్తారు. ఈ తర్వాత హియరింగ్ డేట్ ఇచ్చి, ఆపై ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ప్రక్రియ చేపడతారు. ఈ సంద ర్భంలో చార్జ్షీట్లోని ఆరోపణలను నిందితుల ముందు చదువు తారు. ఈ దశలో ఏ నిందితుడైనా తనపై ప్రాసిక్యూషన్ ఆరోపించిన సెక్షన్లు చెల్లవని భావిస్తే డిస్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు. ఈ పిటిషన్లు డిస్మిస్ అయిన తర్వాత మాత్రమే నిందితులపై చార్జెస్ ఫ్రేమింగ్ జరుగుతుంది. ఈ దశలో న్యాయమూర్తి నిందితులను ఉద్దేశించి నేరం అంగీకరిస్తావా? అని ప్రశ్నిస్తారు. అంగీకరిస్తే (ప్లీడెడ్ గిల్టీ) వెంటనే శిక్ష విధిస్తారు. అంగీకరించకపోతే (డినై) కేసు ట్రయల్ నిర్వహిస్తారు. కేసు ట్రయల్ దశలో న్యాయస్థానం సాక్షులకు సమన్లు జారీ చేస్తుంది. సాక్షుల విచారణ పూర్తయిన తర్వాత సీఆర్పీసీలోని సెక్షన్ 313 ప్రకారం నిందితులకు ఓ అవకాశం ఉంటుంది. ఏ నిందితుడిపై ఏ సాక్షి ఏం చెప్పాడనేది వారికి తెలియపరుస్తారు. దానిపై వాళ్లు ఏం చెప్పాలనుకున్నది తెలుసుకుని రికార్డు చేస్తారు. ఈ సందర్భంలోనే నిందితుల తరఫున ఎవరైనా సాక్షులు ఉన్నారా? అనేది న్యాయమూర్తి అడుగుతారు. అలాంటి వాళ్ళు ఉంటే లిస్ట్ ఆఫ్ డిఫెన్స్ విట్నెస్ రూపొందించి, వారికి సమన్లు ఇచ్చి కోర్టుకు పిలుస్తారు. ఆపై వీరి వాంగ్మూలం నమోదు, ప్రాసిక్యూషన్ నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ జరుగుతాయి. ఇది పూర్తయిన తర్వాత నిర్ణీత సమయం ఇచ్చి, ఆపై వాదోపవాదాలు మొదలవుతాయి. నిందితుడికి తెలియకుండా న్యాయమూర్తి సాక్ష్యాలు రికార్డు చేయరు. ప్రతి సాక్ష్యమూ అతడి ప్రత్యక్షంలోనే చేస్తారు. సీఆర్పీసీ సెక్షన్ 317 ఆధారంగా దాఖలు చేసే పిటిషన్ ద్వారా నిందితుడు కోరితేనే అతడి న్యాయవాది సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఏ దశలోనూ పౌరుడికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే చట్టంలో నిందితుడికి ఇన్ని సౌలభ్యాలు కల్పించారు. బాధ్యత గల పౌరులు ఎవ రైనా చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సహకరించాలి. వాదోప వాదాలు విన్న తర్వాత కోర్టు వారు ఓ తేదీ ఇచ్చి తీర్పు వెలువరిస్తారు. – జస్టిస్ జి. కృష్ణ మోహన్ రెడ్డి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి -
ఒకేసారి ఓటు ప్రజాస్వామ్యానికి చేటు
‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ను సమర్థించే వారి దగ్గర రెండు వాదనలు ఉన్నాయి. మొదటిది – ఖర్చు తగ్గుతుంది. రెండవది – ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళి ఆంక్షలు దేశవ్యాప్తంగా ఒకే కాలానికి వర్తింపులో ఉంటాయి. దాని వల్ల అభివృద్ధి కుంటుపడదు. ఇక వ్యతిరేక వాదనలు వివేచన, వాస్తవికతల్లోంచి జనించినవి. ఓటు హక్కును ‘ప్రజాస్వామ్యంలోని అత్యంత ప్రాథమికమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’ అని చెబుతారు. ఆ హక్కుకు ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం పరిమితులను విధిస్తుంది. పార్లమెంటరీ ఎన్నికలు ఇప్పటికే అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారుతున్న పరిస్థితుల్లో, ఈ ఏకకాల ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగానే నాశనం చేసే ప్రమాదం ఉంది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ వల్ల ప్రయోజ నాలు, నిష్ప్రయోజనాలను నేను సరిగ్గా, సరళంగా, సమతులంగా చెప్పగలనేమో చూద్దాం! ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అనే భావన పైన, ఆ ఆవశ్యకత పైన అవగాహన కోసం ఇది మీకు సహాయకారిగా ఉండవచ్చు. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ను సమర్థించే వారి దగ్గర రెండు వాదనలు ఉన్నాయి. మొదటిది, ఖర్చు తగ్గుతుంది. కదా మరి, దేశ వ్యాప్తంగా ఒకేసారి ఐదేళ్లకు జరిగే ఎన్నికల ఖర్చు... వివిధ సమయా లలో అనేకసార్లు జరిగే పలు ఎన్నికల మొత్తానికీ అయ్యే ఖర్చు కంటే తక్కువగానే ఉంటుంది. అయితే థరూర్, చక్రవర్తి అదేమంత చెప్పు కోదగిన పొదుపు కాదని అంటున్నారు. ఏడాదికి రూ. 5,000 కోట్ల లోపే ఉండే ఆ పొదుపు మొత్తం లేకున్నా కూడా భారత్ వంటి ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలో అది ఏమంత నిర్ణయాత్మకమైన ఆందోళన కారకం కాదనేది వారి వాదన. రెండవ అనుకూల వాదన ఏమిటంటే, దేశం మొత్తానికీ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళి ఆంక్షలు దేశవ్యాప్తంగా ఒకే కాలానికి వర్తింపులో ఉంటాయి. దాని వల్ల ఎప్పుడూ ఏదో ఒకచోట అమలులో ఉండే ఎన్నికల ఆంక్షల కారణంగా అభివృద్ధి కుంటుపడటం అనే సమస్య ఉండదు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నియమావళి అన్నది దేశవ్యాప్తంగా అమలుకావలసి ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఆ నియమావళి అమలు పెద్ద విషయంగా ఉండటం లేదు. అసలు అమలవుతోందా అన్నది కూడా ముఖ్యమైన ప్రశ్న. అక్కడ ఆంక్షల్ని అతిక్రమిస్తున్నది అధికార పార్టీకి చెందినవారైతే నియమావళి నిస్సందేహంగా అమలు కానట్లే! ఇక వ్యతిరేక వాదనలు వివేచన, వాస్తవికతల్లోంచి జనించే ప్రాథమికమైన స్వభావం కలిగి ఉన్నవి. ఓటు హక్కును ‘‘ప్రజాస్వా మ్యంలోని అత్యంత ప్రాథమికమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’’ అని చెబుతారు. ఆ హక్కుకు ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ పరిమితులను విధిస్తుంది. ఉదాహరణకు, ప్రభుత్వం తన మెజారిటీ కోల్పోయి నప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లకు ఉన్న హక్కును హరించేలా పార్లమెంటును కొనసాగించే మార్గాల అన్వేషణ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే ఈ భావన మనం కోరుకుంటున్న ప్రజాస్వామ్య ప్రయాణ మార్గాన్ని విఘాత పరచనూవచ్చు. ఆ మార్గాన్ని మనం విస్తృతపరచుకోవడానికి, మరింత లోతుకు తీసుకు వెళ్లడానికి ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అడ్డుపడుతుంది. ఉదా హరణకు, ఓటు వేసి ఎన్నుకున్న నాయకులను తిరిగి వెనక్కు పంపే హక్కు మనకు ఉండాలి. 50 ఏళ్ల క్రితమే 1974లో వాజ్పేయి ఈ ‘రీకాల్’ హక్కు అవసరాన్ని గుర్తించారు. అయితే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ ఈ హక్కుకు విరుద్ధమైనది. ఐదేళ్లకోసారి ఎన్నికలు అనే విధానం... ఓటు వేసి, ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు పౌరులకున్న అవకాశాన్ని కుదించడం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని ఇరుకైనదిగా మార్చేస్తుంది. ఇప్పుడిక ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అమలుకు అవసర మైన రాజ్యాంగ సవరణల చిక్కుల దగ్గరికి వద్దాం. మొదటిది–ఎన్నికల ఏకకాలీనత కోసం సవరణలు! ఆ సవరణల వల్ల కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలు పొడిగింపును పొందుతాయి. మరికొన్ని చోట్ల శాసనసభల కాలపరిమితిని కుదించాల్సి వస్తుంది. అప్పుడది కచ్చితంగా ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా ఆడుతున్న ఆట అవదా? ఓటర్లు ఇచ్చిన ఐదేళ్ల కాలాన్ని ఏకపక్షంగా తగ్గించడమో, పెంచడమో చేసినట్లే కదా! ఐదేళ్ల కన్నా ముందే ప్రభుత్వం పడిపోతే అప్పుడు రెండో రకం సవరణలు అవసరం అవుతాయి. మిగిలిన కాలానికి రాష్ట్రపతి పాలన రాష్ట్ర స్థాయిలో అవాంఛనీయమైనదీ, కేంద్రస్థాయిలో అసాధ్యమైనదీ. ఇందుకు ఒక పరిష్కారం– జర్మనీ తరహా నిర్మాణాత్మక అవిశ్వాస తీర్మానం. ఎలాగంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉంటే తప్ప అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి లేదక్కడ. పడగొట్టినవాళ్లే ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. వినడానికి బాగుంది కానీ, ఆచరణలో ఎల్లవేళలా ఇది సాధ్యమా? ఉదాహరణకు, పాలకపక్షం నుంచి చీలిపోయిన పక్షం, ప్రతిపక్షం వైపు మొగ్గు చూపడానికి నిరా కరిస్తే అప్పుడేం జరుగుతుంది? ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం తన మెజా రిటీని కోల్పోతుంది, కానీ ఆ స్థానంలోకి వచ్చేవారెవరూ లేకపోవడం వల్ల అలాగే కుంటుతూ నడుస్తుంది. లేదా ఒకవేళ సంకీర్ణ కూటమిలోని భేదాభిప్రాయాల వల్ల బడ్జెట్కు పార్లమెంటులో ఆమోదం లభించలేదనే అనుకుందాం? అప్పుడిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే. కానీ çసభ్యుల బలం ఉన్న కారణంగా బడ్జెట్కు ఆమోదం పొందలేని ఆ ప్రభుత్వం ఏమీ కుప్పకూలి పోదు. ఇలాంటి సందర్భాలలో ఐదేళ్ల కాల వ్యవధిలో మిగిలి ఉన్న కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. అయితే అది ఓటు అనే వనరును నిర్లక్ష్యంగా ఉపయో గించుకున్నట్టు అవదా? ఓటు విలువ కొన్నిసార్లు ఐదేళ్ల కాలానికీ, మరి కొన్నిసార్లు ఐదేళ్లలో మిగిలిన భాగానికీ ఉంటుందా? ప్రజాస్వామ్యంలో రెండు రకాల ఓట్లు ఉండొచ్చా? ఇవీ ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ భావనకు సంబంధించి పైపైన ఆలో చిస్తేనే ఉత్పన్నమయ్యే ప్రాథమిక ఆందోళనలు. భారతదేశ ప్రజాస్వా మ్యానికి సంబంధించి మరొక మూడు ఆందోళనకరమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొదటిది – పార్లమెంటరీ ఎన్నికలు ఇప్పటికే అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారుతున్న పరిస్థితుల్లో, ఈ ఏకకాల ఎన్నికలనేవి ఆ ధోరణిని తీవ్రతరం చేసి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగానే నాశనం చేసే ప్రమాదం లేదా? రెండవది – ఒక జాతీయ పార్టీ మంచి ఊపులో ఉన్నప్పుడు, ఏక కాల ఎన్నికలు బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ ఉన్న దేశంగా మార్చకుండా ఉంటాయా? మూడవది – ఎన్నికలు మన ప్రజా శాసన సభ్యులను ప్రతిస్పందించే వారిగా, జవాబుదారీగా ఉండేవారిగా చేస్తాయని మనకొక నమ్మకం. అయితే ఐదేళ్లకోసారి మాత్రమే ఎన్నికలను నిర్వహిస్తే మధ్యలో ఏం జరిగినా వారు తమకు పట్టనట్లుగా, అహంకారంగా ఉండిపోయే అవకాశం లేదా? ఈ సమస్యల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. మరీ ముఖ్యంగా మూడు అంశాలపై మీరు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది: ఏకకాల ఎన్నికల ఆవశ్యకత, వాటిని అమలు చేయడంలో వచ్చే చిక్కులు, అనంతరం వచ్చే పర్యవసానాలు. ఆ తర్వాత ‘ఇది సరైనదేనా?’ అనే ప్రశ్నకు జవాబు ఇచ్చుకోండి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఏపీలో ప్రజాస్వామ్యమే గెలిచింది
తాడికొండ: చంద్రబాబు అరెస్ట్తో ఏపీలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడిందని, బహుజనుల ఉసురు తగిలి బాబు జైలు పాలయ్యాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హర్షంవ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం నాటికి 1,078వ రోజుకు చేరాయి. రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని పలువురు ముఖ్యఅతిథులు సందర్శించి, మాట్లాడా రు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి అలవాటుపడ్డ చంద్రబాబు ప్రభుత్వ ధనం రూ. లక్షల కోట్లు దోపిడీ చేసి ప్రజలను మోసం చేశాడని చెప్పారు. బాబు అవినీతి పాపం పండి పక్కా ఆధారాలతో దొరకడంతో చట్టబద్ధంగా ప్రభుత్వం అరెస్ట్ చేయడం హర్షణీయమన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేసిన చంద్రబాబుపై గతంలో ఉన్న కేసులను సైతం వెలికి తీసి స్టేలు ఎత్తివేసి పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బాబు అండ్కో అవినీతి బయటపడకుండా చేసేందుకు ఎల్లో మీడియా చేసిన హడావిడి చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని, పేదలకు ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కోర్టులో అనుమతించి తమకు సహకరించాలని కోరారు. నాయకులు మాదిగని గుర్నాధం, ఈపూరి ఆదాం, పల్లెబాబు, నూతక్కి జోషి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా జరుగుతున్న పోరాటానికి మద్దతివ్వాలని ప్రవాస భారతీయులకు బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతోందంటే ప్రధాని మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధులవల్లేనని చెప్పారు. ముఖ్యంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రమే నిధులిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడటం తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ (ఓఎఫ్ఓబీ) ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్ మాట్లాడారు. ప్రవాస భారతీయులు ఎన్నికల సమయంలో కచ్చితంగా కనీసం 15 రోజుల సమయమైనా వెచ్చించి దేశానికి రావాలని కోరారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించడంతోపాటు పేదలకు పక్కా గృహ సదుపాయం, నిరక్షరాస్యత నిర్మూలన, ఉన్నత విద్యావ్యాప్తితోపాటు తాగు, సాగు నీటి ప్రాజెక్టులను పెద్ధ ఎత్తున నిర్మించాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి అనుగుల (ఓఎఫ్ఓబీ జాతీయ పూర్వ అధ్యక్షులు), ప్రవాస భారతీయులు విలాస్ రెడ్డి, జంబుల సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తుమ్మల, వంశీ యంజాల, ప్రదీప్ రెడ్డి కట్ట పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం బలోపేతంలో ఆర్టీఐది కీలక పాత్ర
సాక్షి, విశాఖపట్నం: ప్రజాస్వామ్యం బలోపేతం కావడంలో సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కీలకపాత్ర పోషిస్తోందని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విశాఖపట్నంలోని ఓ హోటల్లో శనివారం నిర్వహించిన 28 బోర్డు ఆఫ్ గవర్నర్లు, సమాచార కమిషన్ల నేషనల్ ఫెడరేషన్ 12వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 2005లో అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. దేశ ప్రజల ప్రయోజనానికి, ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంపునకు, గోప్యత మినహాయింపునకు దోహదపడుతోందని చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లోని అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకునే శక్తివంతమైన సాధనం ఆర్టీఐ అని పేర్కొన్నారు.ప్రజలు ప్రభుత్వ అధికారులను జవాబుదారీగా చేస్తూ అవసరమైన సమాచారాన్ని తెలుసుకునే హక్కును సులభంగా వినియోగించుకునేలా చేస్తోందన్నారు. ఆర్టీఐ పౌరుల ప్రాథమిక హక్కును గుర్తించడంతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేసిందని వివరించారు. అవినీతిని అరికట్టడంలోను, సుపరిపాలన అందించడానికి, అవినీతి, అధికార దుర్వినియోగాలను బహిర్గతం చేయడానికి ఇది సహకరిస్తోందన్నారు. ఏదైనా తప్పు చేస్తే పరిహారం పొందే అధికారం ఇచ్చిందన్నారు. అలాగే బ్యూరోక్రాట్ల జాప్యాన్ని తగ్గించడం, సత్వర సేవలను మెరుగు పరచడం, ప్రభుత్వ అధికారులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, అట్టడుగు వర్గాలపై ప్రత్యేక సాధికారత వంటి అంశాల్లో సానుకూల ప్రభావం చూపడానికి ఈ చట్టం దోహదం చేస్తోందన్నారు. ఇంకా వివక్ష, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఒక యంత్రాంగాన్ని అందించిందని, ఇది సమాచార అంతరాన్ని తగ్గించడంలో సహాయ పడుతోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల కమిషన్లు ఒకే విధమైన అధికారాలు, బాధ్యతలను, ఒకదానితో ఒకటి స్వతంత్రతను కలిగి ఉంటాయన్నారు. ఈ ఫెడరేషన్ కమిషన్లు, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల కమిషన్లను సభ్యులుగా చేర్చుకున్నందున కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ల మధ్య పరస్పర సంప్రదింపులు సులభతరం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సందేశం పంపించిన సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమాచార కమిషన్ల వార్షిక సమావేశానికి తన సందేశాన్ని పంపించారు. ‘ప్రభుత్వం తరఫున మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. దేశం నలుమూలల నుంచీ మీరు విశాఖకు రావడం సంతోషానిస్తోంది. రెండు దశాబ్దాలుగా సమాచార హక్కు చట్టం ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. అనేక మందికి ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రజాస్వామ్యంలో చట్టం పాత్ర, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, జవాబుదారీతనాన్ని పెంచుతోంది’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సందేశాన్ని రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్. మహబూబ్ బాషా చదివి వినిపించారు. -
G20 Summit - జీ20 అతిధులకు బుక్లెట్లు
న్యూఢిల్లీ: 'భారత్' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ 20 సదస్సుకు ఆయా దేశాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. వారికి ఇవ్వడానికి భారతీయత ఉట్టిపడే విధంగా రెండు పుస్తకాలను ముద్రించింది కేంద్ర ప్రభుత్వం. క్రీస్తుపూర్వం 6000 ఏళ్లనాటి భారత చరిత్ర మొత్తం ప్రతిబింబించేలా వీటిని ముద్రించింది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగబోయే జీ 20 సమావేశాలకు భాగస్వామ్య 20 దేశాలతో పాటు అతిధులుగా మరో తొమ్మిది దేశాలు కూడా హాజరు కానున్నాయి. ఈ నేపథ్యంలో అతిరథ మహారధులందరికి చేతికి అందివ్వడానికి రెండు బుక్లెట్లను ముద్రించింది కేంద్రం. వీటిలో ఒకటి 'భారత్-ప్రజాస్వామ్యానికి మాతృక' కాగా రెండవది 'భారతదేశంలో ఎన్నికలు'. ఈ రెండు పుస్తకాల్లోని 40 పేజీల్లో రామాయాణం, మహాభారతంలోని ఇతిహాస ఘట్టాలు, ఛత్రపతి శివాజీ, అక్బర్ వంటి చక్రవర్తుల వీరగాధలతో పాటు సార్వత్రిక ఎన్నికల ద్వారా భారతదేశంలో అధికార మార్పిడి గురించిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచారు. ప్రజాస్వామ్య తత్వమన్నది భారతదేశ ప్రజల్లో సహస్రాబ్దాలుగా భాగమని చెప్పడము ఈ రెండు బుక్లెట్ల ముఖ్య ఉద్దేశ్యమని తెలుపుతూ ఈ ప్రతుల సాఫ్ట్ కాపీలను జీ20 అధికారిక వెబ్సైట్లో కూడా ఉంచింది. మొదటి 26 పేజీల డాక్యుమెంటు భారత దేశాన్ని ప్రజాస్వామ్యానికి మాతృకగా వర్ణిస్తుంది. దీని ముఖచిత్రంగా 5000 ఏళ్ల నాటి నాట్యం చేస్తున్న మహిళామూర్తి కాంస్య ప్రతిమను ముద్రించారు. సామాన్యులు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల సభనుద్దేశించి చతుర్వేదాల్లో ఆది వేదమైన ఋగ్వేదంలోని శ్లోకాన్ని కూడా ముద్రించారు. రామాయణ, మహాభారతాల్లోని ప్రజాస్వామిక అంశాలను ప్రస్తావించారు. రామాయణం నుంచి దశరధ మాహారాజు ప్రజాప్రతినిధులు, మంత్రులను సంప్రదించి వారు ఆమోదించిన తర్వాతే శ్రీరామచంద్రుడిని చక్రవర్తిగా పట్టాభిషేకం ఘట్టాన్ని ప్రచురించారు. అదేవిధంగా మహాభారతం నుంచి ధర్మరాజుకు భీష్మణాచార్యలు చెప్పినా సుపరిపాలనా నియామాల గురించి.. ప్రజా శ్రేయస్సు, సంతోషాలను కాపాడటమే రాజు ధర్మమని చెప్పిన అంశాలను కూడా పుస్తకంలో ప్రస్తావించారు. బౌద్ధమతం దాని సిద్ధాంతాలు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో, అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ వంటి చక్రవర్తులకు చాణక్యుడి అర్థశాస్త్రం ఏ విధంగా ప్రజాస్వామ్య నిఘంటువుగా నిలిచి నడిపియించిందో అందులో పొందుపరిచారు. ఇది కూడా చదవండి: రాహుల్ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ.. సుప్రీంకోర్టులో పిల్ -
జనాభా పెరుగుదలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు..
ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి (Narayana Murthy) ఇటీవల కోల్కతాలోని టెక్నో ఇండియా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గురించి, జనాభా నియంత్రణ గురించి వ్యాఖ్యానించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నారాయణ మూర్తి స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తన విశ్వాసాలను స్వేచ్ఛగా ఆచరించుకోవచ్చు. అలాంటి సమాజంలో ప్రజాస్వామ్యం ఉత్తమంగా ఉంటుందని వ్యక్తం చేశారు. దేశ జనాభా నియంత్రణకు సరైన ప్రాధాన్యం లేదని వెల్లడించారు. దేశంలోనో కొన్ని ప్రాంతాల్లో నియంత్రణ ఉన్నప్పటికీ.. చాలా ప్రాంతాల్లో దీన్ని పూర్తిగా విస్మరించినట్లు చెప్పుకొచ్చారు. నిజనమైన ప్రజాస్వామ్యానికి నాలుగు స్వేచ్ఛలు ఉంటాయని, అవి.. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల మీద స్వేచ్ఛ, భయం నుంచి స్వేచ్ఛ, కోరికల పట్ల స్వేచ్ఛ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్ మాటలు గుర్తు చేశారు. ఇదీ చదవండి: అదే జరిగితే 70 వేల ఉద్యోగాలు పోతాయ్.. ఎక్కడో తెలుసా? భారతదేశం గత మూడు దశాబ్దాలుగా ప్రశంసనీయమైన ఆర్థిక పురోగతి ఉన్నప్పటికీ, పేదరికం, త్రాగునీరు, విద్య, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిలో ఇంకా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నట్లు తెలిపారు. జనాభా పెరుగుదలను తగ్గించడం ఇప్పుడు చేయవల్సిన ముఖ్యమైన పని. జనాభా సమస్య రానున్న 20 నుంచి 25 ఏళ్లలో మన దేశంపై విధ్వంసం సృష్టించే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు. -
సంస్కరణల స్వీయహననం!
ప్రజలు, ప్రతిపక్షాల నుంచి నెలల తరబడి నిరసన వ్యక్తమవుతున్నా, తాము అనుకున్నదే చేసే పాలకులు ప్రపంచమంతటా ఉంటారు. మొత్తం 93 లక్షల జనాభాలో, రెండున్నర లక్షల మందికి పైగా జనవరి నుంచి వీధికెక్కి నిరసనకు దిగుతున్నా, ఇజ్రాయెల్లోని బెంజమిన్ నెతన్యాహూ సర్కార్ తాను అనుకున్నదే చేసింది. దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని అత్యంత భారీ నిరసనల్ని సైతం తోసి పుచ్చి, ఇజ్రాయెలీ పార్లమెంట్ వివాదాస్పద న్యాయసంస్కరణల్లో మరో కీలక అంశానికి సోమవారం ఆమోదముద్ర వేసింది. దేశంలో అధికార సమతూకాన్ని మార్చేసే ఈ చర్య సంచలనమైంది. మంత్రులు తీసుకొనే నిర్ణయాలు ‘నిర్హేతుకం’ అనిపించినప్పుడు వాటిని కొట్టివేసేందుకు సుప్రీమ్ కోర్ట్కు ఇప్పటి దాకా అధికారముంది. సరికొత్త సోకాల్డ్ ‘సహేతుకత’ బిల్లుతో దానికి కత్తెర పడనుంది. రాబోయే రోజుల్లో మరో ఓటింగ్లో న్యాయ నియామకాలపైనా ప్రభుత్వానికే మరిన్ని అధికారాలు కట్టబెట్టాలన్నది తదుపరి ఆలోచన. ఈ మార్పుల్ని కొందరు సమర్థిస్తున్నప్పటికీ, అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. కలిగే విపరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, అధిక శాతం ఇజ్రాయెలీలు లౌకికవాద, వామపక్ష, ఉదారవాదులు. కానీ, తీవ్ర మితవాద పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుతో అక్కడి ప్రభుత్వ విధానమూ మితవాదం వైపు మొగ్గుతోంది. ఆ ప్రభుత్వాలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య తరచూ ఘర్షణ తలెత్తుతోంది. దీనికి విరుగుడుగా కోర్టు కోరలు పీకేయాలనేది ఛాందస, జాతీయవాద నెతన్యాహూ సర్కార్ ప్రయత్నం. పాలకులపై ఉన్న ఏకైక అంకుశమైన కోర్ట్ను సైతం అలా ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తే, వ్యవస్థల పరంగా ఉన్న సమతూకం దెబ్బతినడం ఖాయం. అందుకే, ఇన్ని నెలలుగా దేశంలో ఈ భారీ ప్రజాందోళనలు. కార్యనిర్వాహక, శాసననిర్మాణ, న్యాయవ్యవస్థలు మూడింటికీ మధ్య అధికార విభజనలో అనేక అంశాలను మార్చాలని నెతన్యాహూ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన సారథ్యంలోని సాంప్రదాయవాద, మతతత్త్వ సంకీర్ణ ప్రభుత్వం అందుకు కంకణం కట్టుకుంది. అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న ఆయన కోర్టు భవిష్యత్ తీర్పులు తనపై ప్రభావం చూపకుండా ఉండేందుకే ఈ పని చేస్తున్నారని విమర్శకుల మాట. నిజానికి, ఇజ్రాయెల్లో రాజ్యాంగమంటూ లేదు గనక, పై మూడు వ్యవస్థల మధ్య వ్యవహారమంతా వ్యక్తిగత చట్టాలు క్రమబద్ధీకరిస్తుంటాయి. పార్ల మెంట్లో రెండో సభ లేదు గనక అది చేసే చట్టాలకు అవసరమైతే ముకుతాడు వేసేలా సుప్రీమ్ కోర్ట్కే బలమైన స్థానం ఉందక్కడ! ఇలా న్యాయవ్యవస్థకు అతిగా అధికారాలున్నాయనేది ప్రభుత్వ మద్దతుదార్ల భావన. ఎంపీల్లా జడ్జీలనేమీ ప్రజలు నేరుగా ఎన్నుకోవడం లేదనీ, ఇప్పుడీ ప్రతిపాదిత సంస్కరణలతో అధికార సమతూకం మెరుగై, ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుందనీ వారి వాదన. సంస్కరణల్ని వ్యతిరేకిస్తున్నవారు మాత్రం దీన్ని ప్రజాస్వామ్య విధ్వంసం అంటున్నారు. లింగ సమానత్వం, లైంగిక అల్పసంఖ్యాకుల రక్షణ లాంటి అంశాలను గతంలో సుప్రీం పదేపదే సమర్థించిందనీ, రేపు ఈ కొత్త సంస్కరణలతో అందుకు అవకాశం లేక సమాజం చీలిపోతుందనీ వాదిస్తున్నారు. తాజా సంస్కరణలు దేశంలో అతి సాంప్రదాయ వర్గాన్ని బలోపేతం చేస్తాయన్నది లౌకికవాదుల భయం. ఈ అంశం సైన్యం దాకా పాకింది. ఇప్పటికే స్త్రీ పురుషులిద్దరూ సైన్యంలో తప్పనిసరిగా సేవలందించాలన్న నిబంధన నుంచి అతి సాంప్రదాయ యూదులను ప్రభుత్వం మినహాయించింది. సుప్రీం దీన్ని తప్పుబట్టి, ఇది దుర్విచక్షణ అని పదే పదే ప్రకటించింది. ఇప్పుడీ న్యాయ సంస్కరణల్ని అమలుచేస్తే, స్వచ్ఛంద సేవ నుంచి వైదొలగుతామంటూ వెయ్యిమందికి పైగా ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ రిజర్విస్టులు హెచ్చరించారు. గూఢచర్య సంస్థలు సహా అనేక ఇతర విభాగాల్లోని వారూ తమదీ ఆ మాటే అంటున్నారు. అదే జరిగితే ఆ దేశ భద్రతకు ముప్పే! మరోపక్క, పార్లమెంట్ ఆమోదించిన సంస్కరణ క్లాజుపై కోర్టుకెక్కనున్నట్టు పౌరసమాజ బృందాలు ప్రకటించాయి. అంటే తమ అధికారాలకు కత్తెర వేయడం సహేతుకమో, కాదో జడ్జీలే పరీక్షించాల్సి వస్తుంది. న్యాయమూర్తులు గనక ఈ సంస్కరణను అడ్డుకుంటే, ఇజ్రాయెల్ ఊహించని జాతీయ సంక్షోభంలో పడవచ్చు. ఒకవేళ దాన్ని నివారించేందుకు ప్రభుత్వం తాజా సంస్కరణను ఉపసంహరించుకుంటే, అది చివరకు పాలక సంకీర్ణం కుప్పకూలడానికి దారి తీయవచ్చు. ఏదైనా చిక్కే! మధ్యప్రాచ్యంలో ఏకైక ఆధునిక ప్రజాస్వామ్యంగా ఇజ్రాయెల్కున్న పేరు ఈ మొత్తం వ్యవహారంలో దెబ్బతింటుంది. దేశ ఆర్థికవ్యవస్థ, విదేశాంగ విధానం పైనా దెబ్బ పడుతోంది. న్యాయసంస్కరణల సంక్షోభంతో ఫిబ్రవరి నాటికి 400 కోట్ల డాలర్లు ఇజ్రాయెల్ నుంచి తరలి పోయాయట. అలాగే, దేశ శ్రామికశక్తిలో 11 శాతం మంది దాకా హైటెక్ రంగ ప్రవీణులు. వారిలో అధికశాతం సంస్కరణల్ని వ్యతిరేకిస్తూ, వీధికెక్కినవారే! ఈ సాంకేతిక ప్రతిభాశాలురు దేశం విడిచి పోవచ్చు. అలా జరిగితే అది మరో దెబ్బ. ఇక, న్యాయ ప్రక్షాళనకు బలమైన మద్దతుదారులంతా ప్రధానంగా ఇజ్రాయెల్ దురాక్రమణను సమర్థిస్తున్నవారే! మరోమాటలో ఈ తీవ్ర మితవాదులంతా దేశాన్ని నిరంకుశ మతరాజ్య వ్యవస్థగా మార్చి, ఆక్రమణలతో దేశాన్ని విస్తరించాలని కోరుకుంటున్న వారే. దశాబ్దాల కష్టంతో నిర్మాణమైన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థల సుస్థిరతకూ, అభివృద్ధికీ, భద్ర తకూ దేనికీ ఇది శ్రేయోదాయకం కాదు. ప్రజాస్వామ్య విలువల పునాదిపై ఎదిగి, పొరుగు దేశాలకు తనను కాస్తంత భిన్నంగా నిలిపిన ఆ మౌలిక సూత్రాన్నే కాలరాస్తానంటే అది ఇజ్రాయెల్కు ఆత్మ హననమే. బిల్లుతో నెతన్యాహూ బలోపేతులయ్యారేమో కానీ, ఇజ్రాయెల్ బలహీనమైపోయింది. -
మన ప్రజాస్వామ్యం కాగితపు పులా?
ఉదార ప్రజాస్వామ్య సూచికలో మన దేశం 97వ స్థానంలో, ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థల్లో 108వ స్థానంలో ఉందని ‘వి–డెమ్’ నివేదిక చెబుతోంది. బయటి ప్రపంచంలో ప్రజాస్వామ్యం అంటే భావప్రకటనా స్వేచ్ఛ, ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్య్రం లాంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. కానీ భారత్ లాంటి దేశంలో ప్రభుత్వాల విధానాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించలేవు. వేల సంవత్సరాలుగా పాతుకు పోయిన కుల వ్యవస్థ ఈ దేశ పాలననూ, ప్రగతినీ నిర్ణయిస్తున్నది. ప్రజాస్వామిక విధానాలకు ఊతం ప్రజల భావాల్లో ఉంది. కులవ్యవస్థను నిర్మూలించే దిశగా ఒక బలమైన ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక కాగితపు పులిగా మాత్రమే మిగిలిపోతుంది. భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం. మానవ హక్కులూ, ప్రజాస్వామ్య భావాలూ, సమానత్వ అంశాలూ మేళవింపుగా ఉన్న ఆధునిక రాజ్యాంగం కలిగిన దేశం కూడా. అయితే ఇటీవల ప్రజాస్వామ్య దేశం తన ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి నియంతృత్వ పోకడలకు దగ్గరవుతున్నట్టు, ‘వి–డెమ్’ తన పరిశోధనలో తేల్చింది. ఉదార ప్రజాస్వామ్య సూచికలో మన దేశం 97వ స్థానంలో, ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థల్లో 108వ స్థానంలోకి వెళ్ళింది. మత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, మహిళా స్వేచ్ఛ, ఆదిమ తెగలు, ఇతర వర్గాలకు సంబంధించిన స్వేచ్ఛల్లో మనం ఇతర దేశాలకన్నా వెనుకబడి ఉన్నామన్న విషయాన్ని చాలామంది చాలాసార్లు ప్రస్తావించారు. బయటి ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనగానే ఒక ఐదారు అంశాలు ప్రస్తావనకు వస్తాయి. భావప్రకటనా స్వేచ్ఛ, ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛతో పాటు పత్రికా స్వాతంత్య్రం లాంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. స్వీడన్ విశ్వవిద్యాలయాల ఆ«ధ్వర్యంలో నిర్వహిస్తోన్న వి–డెమ్ (విభిన్న ప్రజాస్వామ్యాలు) సర్వే కూడా ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలనే పేర్కొంటుంది. అయితే భారత్ సహా మరికొన్ని దక్షిణాసియా దేశాలలో ఈ పరిశీలన మాత్రమే సరిపోదు. ఇక్కడ ప్రభుత్వాల విధానాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించలేవు. వేల సంవత్సరాలుగా పాతుకుపోయిన కుల వ్యవస్థ ఈ దేశ పాలననూ, ప్రగతినీ నిర్ణయిస్తున్నది. మూల కారణం ప్రస్తుతం మన దేశంలో మోదీ పాలన నియంతృత్వాన్ని అమలు చేస్తున్నదనే విషయం ఎక్కువగా చర్చకు వస్తున్నది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. రాజ్యాంగ విలువలకు స్థానం లేకుండా పోతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీని విధించి అణచివేతను కొనసాగించారు. కానీ ఇందిరాగాంధీ నియంతృత్వానికీ, మోదీ నియంతృత్వానికీ గుణాత్మకమైన తేడా ఉన్నదన్న విషయాన్ని గమనించాల్సి ఉంది. ఇందిరాగాంధీ తన పాలనను కాపాడుకోవడానికి తాత్కాలికంగా నిర్బంధాన్ని అమలు జరిపారు. తదనంతరం తన తప్పు తెలుసుకొని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. మోదీ పాలన ప్రజాస్వామ్యాన్ని పాతరేసి, ప్రజలను విభజించి, రాజ్యాంగం ప్రకటించిన ‘మేమంతా భారతీయులం’ అనే భావనకు చరమగీతం పాడుతున్నది. రెండువేల సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న కుల వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి కావాల్సిన చర్యలన్నింటినీ తీసుకుంటున్నది. అయితే మోదీకి గానీ, భారతీయ జనతా పార్టీకి గానీ ఆ ధైర్యం కలగడానికి, అంత బహిరంగంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి పునాది ఇక్కడి కుల వ్యవస్థలో ఉంది. దానితో పాటు రోజురోజుకీ గుత్తాధిపత్యం వైపు వెళ్ళిపోతున్న ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఏర్పడిన ఈ ప్రమాదాన్ని రాజ్యాంగ ముసాయిదాను సమర్థించిన 1949 నవంబర్ 25 రోజున బాబాసాహెబ్ అంబేడ్కర్ బహిరంగంగా దేశం ముందుంచారు. ‘‘ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ ద్వారా మనం రాజకీయ సమానత్వాన్ని సాధించాం. కానీ సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా ఆ తేడాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధ్యమైనంత త్వరలో ఆ వ్యత్యాసాలను తొలగించుకోకపోతే, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది’’ అంటూ ఆనాడు చేసిన హెచ్చరిక ఈరోజు మరింత సత్యంగా కనపడుతున్నది. సోదరభావం కీలకం ఇతర దేశాల ప్రజాస్వామ్య భావనకూ, భారత దేశంలోని ప్రజాస్వామ్య అవగాహనకూ తేడా ఉన్న విషయాన్ని కూడా అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారు. 1936లో రాసిన కుల నిర్మూలనలోనే ఆయన తన ఆలోచనలను ప్రపంచం ముందు పెట్టారు. ప్రజాస్వామ్యం అనగానే అది ఎన్నికలు, పాలన, ప్రభుత్వాల విధానాలు అని అనుకోవడం పొరపాటనీ, అది ప్రజల మధ్య ఉండే సంబంధాలను నిర్వచిస్తుందనీ కూడా అంబేడ్కర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి మూడు ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం కీలకమని చెపుతూ, ఇందులో అత్యంత ముఖ్యమైనది సోదరత్వం అంటారు. ఇది భారత దేశంలో కొరవడిన అంశమని తేల్చారు. గత డెబ్భై అయిదు సంవత్సరాలుగా అటు కాంగ్రెస్ గానీ, ఇతర పార్టీలు గానీ అంబేడ్కర్ హెచ్చరికలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. కులవ్యవస్థను నిర్మూలించే ఎటువంటి ప్రయత్నాన్ని గానీ, ప్రణాళికను గానీ కాంగ్రెస్ తన సుదీర్ఘ పాలనలో ఏనాడూ చేయలేదు. కేవలం ఆర్థిక తోడ్పాట్ల వంటివి మాత్రమే ఈ దేశంలో దళితులు, ఆదివాసుల జీవితాల్లో సమూలమైన మార్పులు తీసుకురాలేవనీ, కులవ్యవస్థను కూకటి వేళ్ళతో పెకిలించగలిగే పక్కా ప్రణాళిక అవసరమనీ గుర్తించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. అదే ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారింది. ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. భారత దేశంలో ప్రభుత్వాల కన్నా ప్రజలే బలవంతులు. ప్రజల్లో తరతరాలుగా నాటుకొని పోయిన కుల వ్యత్యాసాలు, కుల అసమానతలు ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం. గత పదేళ్ళలో ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో బీజే పీ ప్రభుత్వం మనగలుగుతుందంటే కులాలలోని విభేదాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడమే. దానితో పాటు, హిందూ మతంలోని పలు అంశాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నది. గ్రామాల్లో ఏ కులాలైతే ఆధిపత్యంలో ఉన్నాయో వాటిని తమ బలంగా మార్చుకోవడం, అత్యధిక జనాభా కలిగిన కులాలను సమీకరించడం చూస్తే బీజేపీ ఎత్తుగడ ఏమిటో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. అదే సమయంలో గత వందల ఏళ్ళుగా ముస్లింలు, హిందువుల మ«ధ్య ఉన్న వైషమ్యాలను ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చాలా బలంగా వాడుకుంటున్నది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన మాట నిజమే కానీ, దాని బలమేమీ తగ్గలేదు. కులాల పట్ల ప్రజల్లో ఉన్న భావాలను రెచ్చగొట్టడం ఇటీవలి కాలంలో ప్రభుత్వాల విధానాల్లో, న్యాయస్థానాల తీర్పుల్లో స్పష్టంగా కనపడుతున్నది. ఇటీవల దళితుల్లో పెరిగిన చైతన్యం అత్యాచారాల విషయంలో కేసులు నమోదు కావడానికి ఉపయోగపడింది. ఎస్సీ, ఎస్టీల కేసుల విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధిపత్య కులాలకు అండగా నిలబడే ప్రయత్నం చేసింది బీజేపీ. తమ పార్టీ పునాదిగా ఉన్న ఆధిపత్య కులాలను మరింత సంతృప్తి పరిచేందుకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల పేరుతో అసలు రాజ్యాంగాన్నే అపహాస్యం చేసింది. చివరగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఉదారవాద ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పాలన వంటి విధానాలు ఏవి అమలు జరగాలన్నా కుల వ్యవస్థ ప్రధానమైన అవరోధం. దీనికి ప్రభుత్వాల బాధ్యత కన్నా, ప్రజల్లో కుల భావనలను తొలగించడం ముఖ్యం. ప్రజల్లో కుల అసమానతల పట్ల సానుకూలత ఉన్నంత వరకూ, గ్రామాల్లో ఇంకా ఈ కులవ్యవస్థ కొనసాగుతున్నంత వరకూ ప్రజాస్వామ్యమనే భావనకు ఆస్కారమే లేదు. తాత్కాలికంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామిక విధానాలకు ఊతం ప్రజల భావాల్లో ఉంది. అంబేడ్కర్ చెప్పినట్టు, ప్రజాస్వామ్యం, అంటే సమానత్వంతో కూడిన సామాజిక జీవన గమనం కోసం... ప్రభుత్వాల నిర్బంధాలు, నియంతృత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే... ప్రజల్లో ఉన్న కులవ్యవస్థను నిర్మూలించే దిశగా ఒక బలమైన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక కాగితపు పులిగా మాత్రమే మిగిలిపోతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
భారత ప్రజాస్వామ్యం సచేతనమే కాదు, చలనశీలం కూడా!
‘ఇండియాలో ఉన్నది సచేతన ప్రజాస్వామ్య వ్యవస్థ. న్యూఢిల్లీ వెళ్లే ఎవరైనా ఈ వాస్తవం స్వయంగా చూడవచ్చు,’ అని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ వ్యూహాత్మక కమ్యూనికేషన్ల విభాగం సమన్వయకర్త జాన్ కర్బీ వ్యాఖ్యానించారు. భారతదేశంలో గత 75 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న విషయంపై అగ్రరాజ్యం అధికారి ఒకరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ప్రస్తుతం లేనే లేదు. కాని, దేశంలో రోజురోజుకూ పరిణతి, పరిపక్వత సాధిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై కొందరు ప్రపంచ లేదా పాశ్చాత్య మేధావులు తరచు అభాండాలు వేస్తూ, అనుమానాలు వ్యక్తం చేయడం ఈమధ్య అలవాటుగా మారింది. ఈ పరిస్థితుల్లో పైన చెప్పిన వైట్ హౌస్ అధికారి–భారత ప్రజాస్వామ్యం నాణ్యతపై వెలిబుచ్చిన అభిప్రాయం ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం వైట్ హౌస్ విలేఖరుల సమావేశంలో ప్రఖ్యాత అమెరికా మీడియా సంస్థ నేషనల్ పబ్లిక్ రేడియో (ఎన్పీఆర్) ప్రతినిధి అస్మా ఖాలిద్ అడిగిన ప్రశ్నకు జవాబుగా పై మాటలు అన్నారు కర్బీ. ‘ఇండియాలో ప్రజాస్వామ్యం ఆరోగ్యంపై అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఏమాత్రమైనా పట్టించుకుంటోందా? ’ అని అస్మా ప్రశ్నించడంతో అమెరికా ఉన్నతాధికారి నిక్కచ్చిగా సమాధానమిచ్చారు. 21వ శతాబ్దం ఆరంభం నుంచి ఇండియాలో ఆర్థికాభివృద్ధి శరవేగంతో సాగుతున్న విషయం తెలిసిందే. ఒక్క ఆర్థికరంగంలోనే గాక అన్ని రంగాల్లో భారతదేశం, వివిధ పారిశ్రామిక, ధనిక దేశాల్లో భారతీయులు విశేష ప్రగతి సాధిస్తున్న విషయం కూడా అందరూ అంగీకరించే సత్యమే. అయితే, భారత్ కొత్త ప్రపంచ ఆర్థికశక్తిగా అవతరించడం గిట్టని అనేక మంది ఇండియాలో ప్రజాస్వామ్యం ‘ఆరోగ్యం’ లేదా నాణ్యతపై అప్పుడప్పుడూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. 1950 జనవరిలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక పార్లమెంటుకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కొన్నిసార్లు ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న రాజకీయపక్షాలే అధికారంలోకి వస్తే, మరికొన్ని సార్లు ప్రతిపక్షాలు విజయం సాధించి న్యూఢిల్లీలో గద్దెనెక్కాయి. అలాగే, 20కి పైగా ఉన్న అనేక రాష్ట్రాల్లోనూ అధికారం ఎన్నికల ద్వారానే వివిధ పార్టీల మధ్య బదిలీ అవుతోంది. ప్రజాస్వామ్యమే భారత్ ప్రాణం 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొన్ని రాష్ట్రాల్లో, కేంద్రంలోనూ ప్రభుత్వాలు సుస్థిరంగా పనిచేస్తూ ముందుకు వెళ్లలేకపోయిన సందర్భాలు కూడా ఉన్న మాట నిజమే. కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రానప్పుడు భిన్న రాజకీయపక్షాల మధ్య అంగీకారం కుదరకపోవగంతో పదే పదే రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలూ చాలా ఉన్నాయి. కాని, ఇదంతా గతం. ఈమధ్య కాలంలో రాజకీయ అస్థిరత కారణంగా రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అలాగే, పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి అవసరమైన సాధారణ మెజారిటీ రాని పరిస్థితులు చూశాం. 1984 డిసెంబర్ పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన 7 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకున్నా ప్రభుత్వాలు సాఫీగానే నడిచాయి. పూర్తి పదవీకాలం ఐదేళ్లు ప్రభుత్వాలు నడవకపోయినా ఆర్థికవ్యవస్థను, దేశాన్ని కలవరపరిచే సంక్షోభం ఎప్పుడూ తలెత్తలేదు. 1991 నుంచి 2014 వరకూ కేంద్రంలో మైనారిటీ లేదా సంకీర్ణ ప్రభుత్వాలే కొనసాగినా ప్రజాస్వామ్యం నాణ్యత లేదా ఆరోగ్యం సన్నగిల్ల లేదు. దాదాపు పాతికేళ్ల తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినది 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లోనే. ఓ పక్క అంకితభావంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో పయనిస్తూనే మరో పక్క ఇండియా ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. ఈ సానుకూల పరిస్థితుల్లో కూడా భారత ప్రజాస్వామ్యంపై అనుమానాలు రేకెత్తించడం అన్యాయం. అందుకే ఇండియాలో ప్రజాస్వామ్యం సచేతనంగా ఉందని, ఈ వాస్తవం స్వయంగా చూడడానికి న్యూఢిల్లీ వెళ్లి రావాలని అమెరికా అధికారి సలహా ఇవ్వడం శుభసూచికం. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
ఢిల్లీ వెళ్లి చూడండి..భారత్లో ప్రజాస్వామ్యం చాలా శక్తిమంతంగా ఉంది:!
భారత్లోని ప్రజాస్వామ్యం గురించి అమెరికా అద్భుతంగా ప్రశంసించింది. భారతదేశం ఒక శక్తిమంతమైన ప్రజాస్వామ్యం అని మీరు న్యూఢిల్లీ వెళ్తే అది మీకు కచ్చితంగా కనిపిస్తుందని అమెరికా వైట్హౌస్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ అన్నారు. మీరే అక్కడకు వెళ్లి స్వయంగా తెలుసుకోగలరని కూడా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరితోనైనా ఆందోళనకర విషయాలు ఉంటే చెప్పడానికి వెనుకాడం, సిగ్గుపడం. ఆఖరికి స్నేహితులైన.. కలిసి పనిచేయాల్సి వచ్చినా.. కూడా కచ్చింతంగా దీని గురించి చెప్పేస్తామని కిర్బీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను ఉద్దేశిస్తూ..ఈ పర్యటన ఇరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, స్నేహం మరింతగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించింది. ఇది ఇలానే ముదుకు సాగాలని ఆశిస్తున్నానని కిర్బీ అన్నారు. అనేక స్థాయిలలో భారత్ అమెరికాకు బలమైన భాగస్వామి అని కిర్బీ అన్నారు. మీరు షాంగ్రిలా సెక్రటరీలో ఆస్టిన్(అమెరికా రక్షణ మంత్రి) భారత్తో కొన్ని అదనపు రక్షణ సహకారానికి సంబంధించిన పలు అంశాలను ప్రకటించడం చూశారు. వాస్తవానికి ఇరు దేశాల మధ్య చాలా భయంకరమైన ఆర్థిక వాణిజ్యం ఉంది. అదీగాక భారతదేశం ఇప్పుడు ఒక పసిఫిక్ క్యాడ్లో సభ్య దేశం. అలాగే ఇండో పసిఫిక్ భద్రతకు సంబంధించిన కీలక స్నేహితుడు, భాగస్వామి అని కిర్బీ పేర్కొన్నారు. అంతేగాదు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షికంగానే కాకుండా, బహుపాక్షికంగా అనేక స్థాయిలలో భారతదేశం కచ్చితం ముఖ్యమైనదని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. తాను సమస్యలన్నింటి గురించి మాట్లాడటానికి భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడమే గాక మరింతగా స్నేహన్ని పెంచుకునే ఉద్దేశంతో ప్రధాని మోదీ రాక కోసం తాను ఎదురు చూస్తున్నట్లు కిర్బీ చెప్పుకొచ్చారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. (చదవండి: అమెరికాతో రక్షణ రోడ్డు మ్యాప్ ఖరారు) -
ప్రజాస్వామ్యంలో నిరంకుశ నేత
నిరంకుశులు అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యం పేరుకే మిగులుతుంది. అతి జాతీయవాదం ప్రబలినప్పుడు ఆలోచనను అది మింగేస్తుంది. ఆ చేదు నిజానికి టర్కీ (తుర్కియే) మరోసారి సాక్షీ భూతమైంది. తొలి దఫాలో ఫలితం తేలకపోయేసరికి రెండో దఫా సాగిన ఎన్నికలు, నాటకీయ ఫక్కీలో రోజుకొకరిది ఆధిక్యంగా మారిన ఎన్నికల ప్రచారం తర్వాత టర్కీ తాజా అధ్యక్ష ఎన్నికల్లో ఎర్డొగాన్ తన పట్టు నిలబెట్టుకున్నారు. ఎన్నికలు ‘అత్యంత న్యాయవిరుద్ధంగా సాగా’యన్న ప్రత్యర్థి మాటలు ఎలావున్నా లెక్కల్లో అంతిమ విజయం ఎర్డొగాన్దే అయింది. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశానికి ఎగ బాకినా, కరెన్సీ విలువ పాతాళానికి పడిపోయినా ఆయన మాత్రం ప్రపంచ వేదికపై దేశప్రతిష్ఠను పెంచానని పౌరులకు నమ్మబలికారు. కుర్దిష్ వేర్పాటువాదుల్ని తన ప్రత్యర్థి సమర్థిస్తున్నారంటూ నమ్మించారు. అతి జాతీయవాదంతో ఆధిక్యాన్ని నిలుపుకొన్నారు. అదే ఈ ఎన్నికల విడ్డూరం. 2017లో రిఫరెండం ద్వారా టర్కీలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష తరహా పాలనగా మార్చిందీ, ఆ పైన ప్రధాని పదవిని రద్దు చేసిందీ ఎర్డొగానే. న్యాయవ్యవస్థ, ఎన్నికల నిర్వహణ వ్యవస్థ సహా ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ నియంత్రణలో పెట్టుకున్న ఘనుడాయన. నైపుణ్యం కన్నా విధేయతే గీటురాయిగా అయినవాళ్ళతో వాటిని నింపేశారు. ప్రధాన స్రవంతి మీడియా అంతా చేతుల్లో ఉన్న ఆయనకు ఎన్నికల ప్రచారం పరాకాష్ఠకు చేరినవేళ 32 గంటల ప్రసార సమయం లభిస్తే, ప్రత్యర్థికి దక్కింది 32 నిమిషాలే. విజయానికై ఎంతకు దిగజారడానికైనా వెనుకాడకపోవడం ఆయన నైజం. దాంతో, దేశంలో ఎన్నడూ లేనన్నిసార్లు హత్యాయత్నం జరిగిన నేతగా పేరొందిన ప్రతిపక్షాల అభ్యర్థి కెమల్ కిలిచదరోగ్లూ చివరకు బహిరంగ సభల్లో బుల్లెట్ ప్రూఫ్ చొక్కా వేసుకొని, ప్రచారం చేయాల్సిన దుఃస్థితి. మాటల్లో సౌమ్యత, మనిషి కొంత మహాత్మా పోలికలతో ‘గాంధీ కెమల్’ అని ముద్దుగా అందరూ పిలుచుకొనే ప్రజాస్వామికవాది ఓడిపోయారు. నిజానికి 600 సభ్యుల పార్లమెంట్కూ, అధ్యక్ష స్థానానికీ మే 14న జరిగిన ఎన్నికలు ప్రస్తుత అధ్యక్షుడిని ఇంటికి సాగనంపి, ప్రతిపక్షాల సమష్టి అభ్యర్థి కెమల్కు పట్టం కడతాయని భావించారు. ఎన్నికల జోస్యాలూ ఆ మాటే చెప్పాయి. తీరా జరిగింది వేరు. 6.4 కోట్ల మంది ఓటర్లలో 88 శాతం మంది ఓటింగ్లో పాల్గొంటే, 49.5 శాతం ఓట్లు ఎర్డొగాన్కూ, 44.8 శాతం ప్రత్యర్థికీ వచ్చాయి. ఆయన కూటమి ‘పీపుల్స్ అలయన్స్’ పార్లమెంట్లో 323 స్థానాలు, ప్రత్యర్థి ‘నేషన్ అలయన్స్’కు 213 స్థానాలు దక్కాయి. అధ్యక్ష పదవికి కావాల్సిన 50 శాతం ఓట్ల కోసం దేశ చరిత్రలో తొలిసారిగా కథ రెండో దఫా ఎన్నికల దాకా సాగింది. ఈ మదగజాల పోరులో సుమారు కోటి మంది సిరియన్ శరణార్థుల గోడు ఎవరికీ పట్టలేదు. ఇరుపక్షాలూ శరణార్థుల్ని వెనక్కి పంపేస్తామన్నాయి. సౌమ్యుడైన కెమల్ సైతం చివరకు ఓట్ల పునాదిని పెంచుకొనే వ్యూహంతో శరణార్థులపై కటువుగా మాట్లాడారు. అయినా లాభం లేకపోయింది. మే 28న రెండో దఫాలో 84 శాతం ఓట్లు పోలైతే, 48 శాతం వద్దే ప్రత్యర్థి ఆగిపోయారు. 52 శాతం ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడికే పట్టం దక్కింది. ఇల్లలకగానే పండగ కాదన్నట్టు... ఎన్నికల్లో ఎర్డొగాన్ గెలిచారు కానీ, కథ అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పటికి గెలిచినా, భిన్న ధ్రువాలుగా చీలిపోయిన దేశంలో, ఆయన అజెండాను ఇప్పటికీ 47 శాతం పైగా వ్యతిరేకిస్తున్నారని మర్చిపోరాదు. అందుకే, వరుసగా అయిదోసారి అధ్యక్షుడై, అధికారంలో మూడో దశాబ్దంలోకి అడుగిడుతున్న ఆయన ముంగిట అనేక సవాళ్ళు న్నాయి. టర్కీలో ద్రవ్యోల్బణం 44 శాతానికి చేరింది. 2018 నుంచి ఇప్పటికి కరెన్సీ విలువ 80 శాతం క్షీణించింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 151 మిలియన్ డాలర్ల లోటులో పడ్డాయి. ఫిబ్ర వరిలో 50 వేల మంది మరణించిన భారీ భూకంప వేళ సర్కార్ పనితీరూ అంతంత మాత్రమే. ఇన్ని కష్టాల మధ్యా యూఏఈ, సౌదీ, రష్యాల నుంచి గణనీయ విదేశీ సాయంతో బండి నెట్టుకొచ్చారు. రానున్న అయిదేళ్ళలో ఈ నిరంకుశ నేత ఆర్థికవ్యవస్థను ఎలా సుస్థిరం చేస్తారన్నది ఆసక్తికరం. ఇక, భౌగోళికంగా ఆసియా – ఐరోపాల కొసన ఉండడం, ముస్లిమ్ ప్రపంచంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రపంచ దేశాల్లో టర్కీ ఒకటి. రష్యా నుంచి లాభపడుతున్న ఈ ‘నాటో’ సభ్యదేశపు విదేశాంగ విధానం స్పష్టమే. రష్యాకూ, పాశ్చాత్య ప్రపంచానికీ మధ్య సాగుతున్న ప్రస్తుత పోరాటంలో ఆ దేశం తన వైఖరిని మార్చుకోదు. పాశ్చాత్య ప్రపంచానికి కాక పుట్టేలా ప్రాంతీయంగా, విదేశీ వ్యవహారాల్లో వ్యూహాత్మక స్వతంత్రతను చూప నుంది. భారత్తో ఒకప్పుడు బలమైన బంధమున్నా, 370వ అధికరణం రద్దు తర్వాత కశ్మీర్పై ఎర్డొ గాన్ ప్రకటనలు, పాక్తో సాన్నిహిత్యం నేపథ్యంలో మన సంబంధాలెలా ఉంటాయో వేచి చూడాలి. మొత్తం మీద ఎన్నికలనేవి అన్నిసార్లూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్న నమ్మకాన్ని అందిస్తాయని చెప్పలేం. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేసి, అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసే నిబంధనల్ని మార్చేసి, అసలు స్ఫూర్తికే తిలోదకాలిచ్చినప్పుడు ఎన్నికలు నామ మాత్రమే! ప్రజాస్వామ్యం పేరుకే! సైన్యం తెర వెనుక ఉండి కథ నడిపే పాకిస్తాన్ సహా అనేక దేశాల్లో ఇదే ప్రహసనం. దశాబ్ది పైచిలుకుగా టర్కీలో ఎర్డొగాన్ చేసిందీ, జరిగిందీ ఇలాంటి ప్రజాస్వామ్య పరిహాసమే. కానీ, అధికారాన్ని నిలుపుకోవడానికి అక్కరకొచ్చిన ఈ ఆట ఆర్థిక కష్టాల్లోని దేశాన్ని ముందుకు నడిపించడానికి ఇకపైనా పనికొస్తుందా? -
రాజదండం – రాజ్యాంగ దండం
నిప్పు కాలుతుంది, అయినా నిప్పు లేనిదే రోజు గడవదు. కాలకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే నిప్పును వాడుకోవాలి. అధికారం కూడా అంతే; అధికారం చెడగొడుతుందనీ, సంపూర్ణ అధికారం సంపూర్ణంగా చెడగొడుతుందనీ ఒక ఆంగ్ల మేధావి సెలవిచ్చాడు. లోకవ్యవహారం సజావుగా సాగాలంటే అందుకు అవసరమైన అధికారాన్ని ఒక వ్యక్తి చేతిలోనో, వ్యవస్థ చేతిలోనో పెట్టక తప్పదు. మళ్ళీ అది చెడుదారి పట్టకుండా అవసరమైనప్పుడు కళ్లేలు బిగించకా తప్పదు. ఒక తెగకు లేదా ఒక ప్రాంతానికి చెందిన జనం సమష్టి ప్రయోజనాల కోసం ఎప్పుడైతే గుంపు కట్టారో అప్పుడే అధికార– నియంత్రణల రెండింటి అవసరాన్నీ గుర్తించారు. ఆ క్రమంలో ఎన్నో ప్రయోగాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒక కోణంలో చూస్తే మానవచరిత్ర అంతా అధికారమూ, దాని నియంత్రణల మధ్య ఎడతెగని పెనుగులాటే! ఈ పెనుగులాట రూపురేఖలు మన పురాణ ఇతిహాసాలలోనూ కనిపిస్తాయి. దశరథుడు అవడానికి రాజే కానీ పెద్దకొడుకైన రాముడికి పట్టాభిషేకం చేసే స్వతంత్రాధికారం మాత్రం ఆయనకు లేదు. పౌరజానపద పరిషత్తును సమావేశపరచి అనుమతి కోరాడు. ఆ పౌర జానపదులలో తరుజనులు, గిరిజనులూ కూడా ఉన్నారని రామాయణం చెబుతోంది. దశరథుడికి పౌరజానపదుల ఆమోదం సునాయాసంగా లభించింది కానీ; మహాభారత ప్రసిద్ధుడైన యయాతికి మాత్రం అంత సులువుగా లభించలేదు. తన చిన్న కొడుకైన పూరునికి రాజ్యం అప్పగించాలన్న తన ప్రతిపాదనను అతడు పౌరజానపదుల ముందు ఉంచినప్పుడు, పెద్దకొడుకైన యదువు ఉండగా చిన్నకొడుకును ఎలా రాజును చేస్తావని వారు ప్రశ్నించారు. యయాతి వారిని ఎలాగో ఒప్పించి తన నిర్ణయాన్ని అమలు చేశాడు. ప్రజామోదంతో రాజైన వ్యక్తి ఆ తర్వాత సర్వస్వతంత్రుడై విర్రవీగినప్పుడు అతణ్ణి తొలగించిన ఉదాహరణలూ ఉన్నాయి. మహాభారతంలోని పురూరవుడు, నహుషుడు ఆ కోవలోకి వస్తారు. రాజు ధర్మతత్పరతను ఉగ్గడించే కథలు; ధర్మం తప్పిన రాజూ, అతని రాజ్యమూ కూడా భస్మీపటలమైన కథలూ చరిత్రకాలంలోనూ కనిపిస్తాయి. బెజవాడ రాజధానిగా ఏలిన విష్ణుకుండిన రాజు మాధవవర్మ, తన కొడుకు ప్రయాణించే రథం కింద పడి ఒక పౌరుడు మరణించినప్పుడు కొడుకని చూడకుండా మరణశిక్ష అమలు చేస్తాడు. ‘శిలప్పదికారం’ అనే ప్రసిద్ధ తమిళ కావ్యంలో నాయిక కణ్ణగి తన భర్త కోవలన్ కు పాండ్యరాజు ఒకడు అన్యాయంగా మరణశిక్ష అమలు చేసినప్పుడు ఆగ్రహించి అతని రాజ్యాన్ని బూడిదకుప్ప కమ్మని శపిస్తుంది. శిక్షించే అధికారంతో పాటు తప్పొప్పులను నిర్ణయించే అధికారాన్ని కూడా రాజు గుప్పిట పెట్టుకున్న దశను ఈ కథ సూచిస్తుంది. రాజూ, రాజ్యాధికారమూ, ధర్మబద్ధత, దండనీతి గురించిన భావనలు ఏ ఒక్క దేశానికో పరిమితమైనవి కావు; సార్వత్రికమైనవీ, అత్యంత ప్రాచీనమైనవీ కూడా! ఆధునిక భాషాశాస్త్ర నిర్ధారణలనే ప్రామాణికంగా తీసుకుంటే, ప్రోటో–ఇండో–యూరోపియన్ మూలరూపమైన ‘రెగ్’ అనే మాటే సంస్కృతంలో రాజశబ్దంగానూ, ఇతర ఇండో–యూరోపియన్ భాషల్లో దానికి దగ్గరగా ధ్వనించే ‘రెక్స్’ (లాటిన్) వంటి శబ్దాలుగానూ మారింది. ‘సరళరేఖలా తిన్నగా నడిచేది, నడిపించే’ దనే అర్థం కలిగిన ‘రెగ్’ అనే మాట నుంచే నేటి రెగ్యులేషన్, రెగ్యులర్, రైట్, రీజన్, రెజీమ్ మొదలైన మాటలు వచ్చాయని భాషావేత్తలు అంటారు. రాజశబ్దం ఎంత ప్రాచీనమో, కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న రాజదండం కూడా అంతే ప్రాచీనమూ, సార్వత్రికమూ కూడా! మన పురాణ, ఇతిహాసాలలో రాచరికానికీ, రాజుల నియామకానికీ ఇంద్రుడు బాధ్యుడిగా కనిపిస్తాడు. చేది దేశాన్ని పాలించే వసురాజు విరక్తుడై అడవిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఇంద్రుడు అతణ్ణి తిరిగి రాజ్యపాలనకు ప్రోత్సహించి ఇతర రాజోచిత పురస్కారాలతోపాటు, ఒక రాజదండాన్నీ చేతికిచ్చాడని మహాభారతం చెబుతోంది. ఇలాగే ఇంద్రుడు రాజ్యపాలనకు ప్రోత్సహించిన మరో రాజు – మాంధాత. ధర్మరక్షణను రాజుకు నిత్యం గుర్తు చేస్తూ ఉంటుంది కనుక రాజదండాన్ని ధర్మదండంగా కూడా అన్వయించారు. పట్టాభిషేక సమయంలో రాజుకీ, గురువుకీ మధ్య నడిచే ఒక సంభాషణ ప్రకారం, ‘నన్ను ఎవరూ శిక్షించలే’రని రాజు అంటాడు; అప్పుడు, ‘ధర్మం నిన్ను శిక్షిస్తుంది’ అంటూ గురువు మూడుసార్లు ధర్మదండంతో అతని శిరసు మీద కొడతాడు. ఈ రాజదండం ఆనవాయితీ రోమన్లకూ సంక్రమించింది. వారిలో మొదట్లో వ్యక్తికేంద్రిత పాలన కాక, పౌరకేంద్రిత పాలన– అంటే గణతంత్ర వ్యవస్థ ఉండేది. రాచరికాన్నీ, రాజు అనే మాటనూ కూడా వారు ఏవగించుకునేవారు. ఒక దశలో రోమ్ సైనిక నియంతగా ఉన్న జూలియస్ సీజర్ ఈజిప్టు రాణి క్లియోపాత్రా ప్రేమలో పడిన తర్వాత, అక్కడున్న వ్యవస్థ ప్రభావంతో సింహాసనాన్నీ, రాజదండాన్నీ స్వీకరించాడు. అదే చివరికి అతని హత్యకు దారితీసింది. అధికారమంతా రాజు దగ్గరే పోగుబడే ప్రమాదం తలెత్తినప్పుడు అతణ్ణి అదుపు చేసే సంకేత పాత్రను రాజదండం నిర్వహించి ఉండవచ్చు. ఆధునిక ప్రజాస్వామ్యంలో అధికార వికేంద్రీకరణ ద్వారా ఆ ప్రమాదాన్ని అరికట్టేందుకు ఆయా వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఏ వ్యవస్థ ఏ హద్దుల్లో ఉండాలో చెప్పే రాజ్యాంగమూ వచ్చింది. అదే నేటి అసలు సిసలు రాజదండం! -
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఘన విజయానికి ప్రతీక నూతన సన్సద్ భవన్!
భారత పార్లమెంటు నూతన భవనం మే 28న ప్రారంభమవుతోంది. 1927లో నిర్మించిన ప్రస్తుత సన్సద్ భవన్కు సమీపంలోని సెంట్రల్ విస్తాలో నిర్మించిన కొత్త భవనంలో పార్లమెంటు ఉభయసభలు రాజ్యసభ, లోక్ సభ కార్యకలాపాలు ఇక కొనసాగుతాయి. ఈ సందర్భంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు భవనాల చరిత్ర క్లుప్తంగా తెలుసుకుందాం. ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు పుట్టినిల్లుగా ఇంగ్లండ్ను పరిగణిస్తారు. అయితే, బ్రిటిష్ పార్లమెంటును పొరపాటున ఇప్పటికీ చాలా మంది ప్రపంచంలోని పార్లమెంట్లకు మాతృక అని భావిస్తారు. అసలు విషయం ఏమంటే–ప్రఖ్యాత బ్రిటిష్ రాజకీయవేత్త, సంస్కర్త జాన్ బ్రయిట్ 1865 జనవరి 18న బర్మింగ్ హామ్ నగరంలో ప్రసంగిస్తూ ఇంగ్లండ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ‘ఇంగ్లండ్ ఈజ్ ద మదర్ ఆఫ్ పార్లమెంట్స్’ అని అభివర్ణించారు. ప్రాతినిధ్య పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంచుకుని, ఆచరణలో అనుసరిస్తున్న అన్ని దేశాలకు మోడల్ ఇంగ్లండ్ అనే అర్థంలో జాన్ బ్రయిట్ అలా మాట్లాడారు. కాని, యునైటెడ్ కింగ్ డమ్ రాజధాని లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబి ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ పార్లమెంటు భవనాన్ని (అంటే అందులో సమావేశమవుతూ పనిచేసే పార్లమెంటు ఉభయ సభలు–హౌస్ ఆఫ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్) అన్ని దేశాల పార్లమెంట్లకు మాతృక అనే భావనతో కొందరు బ్రయిట్ అన్న మాటలను వాడుతుంటారు. ఈ సందర్భంగా బ్రిటిష్ పార్లమెంటు చరిత్రను ఒకసారి గుర్తుచేసుకుందాం. 1707-1800 మధ్య లండన్ లోని ఈ పార్లమెంటు గ్రేట్ బ్రిటన్ పార్లమెంటుగా పనిచేసింది. 1801 జనవరి 1 నుంచి పార్లమెంట్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్గా నడుస్తోంది. వెస్ట్ మినిస్టర్ ఆబీ ప్రాంతంలో ఉన్న భవనాల్లో బ్రిటిష్ పార్లమెంటు ఉభయసభలు సమావేశమవుతుండడం వల్ల బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థను వెస్ట్ మినిస్టర్ మోడల్ అని కూడా పిలుస్తారు. గతంలో రెండుసార్లు అగ్నిప్రమాదాల్లో పార్లమెంటు భవనాలు ధ్వంసం కావడం, మళ్లీ నిర్మించడం జరిగింది. లండన్ థేమ్స్ (టెమ్జ్) నది తీరాన ఉన్న పార్లమెంటు భవనాలను ఇప్పుడు మళ్లీ ఆధునికీకరించే పనిచేపడుతున్నారు. 2025లో ప్రారంభమయ్యే నవీకరణ ఆరేళ్ల పాటు సాగుతుందని అంచనా. ప్రారంభం తర్వాత 100 ఏళ్లు నిండక ముందే కొత్త భవనంలోకి భారత పార్లమెంటు మారిన పరిస్థితులు, సాంకేతికత, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా భారత పార్లమెంటు ఉభయ సభలకు కొత్త భవనం అవసరం ఏర్పడింది. 1927లో నిర్మాణం పూర్తయి నాటి ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కార్యకలాపాలతో ప్రారంభమైన ప్రస్తుత సన్సద్ భవన్ ను అలాగే ఉంచి దగ్గర్లో కొత్త పార్లమెంటు భవనం నిర్మించడం, ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా కొత్త సన్సద్ భవన్ ప్రారంభించడం నేడు చర్చనీయాంశాలయ్యాయి. భారత రాజ్యాంగ రచనకు వేదికగా ఉపకరించిన పార్లమెంటు భవనంలో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్లమెంటు ఉభయసభల నిర్వహణకు వీలు కల్పించారు. 1952 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకూ 15 మంది ప్రధానమంత్రులు (రెండుసార్లు 13 రోజులు చొప్పున ప్రధానిగా ఉన్న జీఎల్ నందాతో కలిపి), 15 మంది రాష్ట్రపతులు ఈ పార్లమెంటు భవనంలో తమ విధుల్లో భాగంగా ప్రసంగించారు. 14 మంది ఉపరాష్ట్రపతులు (సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి జగదీప్ ధన్ఖడ్ వరకూ) రాజ్యసభ అధ్యక్షుల హోదాలో ఎగువసభ సమావేశాలు నిర్వహించారు. చదవండి: బంగారం కొనుగోళ్లకు డాలర్కు సంబంధమేంటీ? అలాగే, 17 మంది స్పీకర్ల (జీవీ మావలంకర్ నుంచి ఓం బిర్లా వరకూ) ఆధ్వర్యంలో లోక్ సభ సమావేశాలను ఈ భవనంలోనే జరిపించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న పాత సన్సద్ భవన్ నుంచి ఇక ఉభయ సభల సమావేశాలు, కార్యకలాపాలు కొత్త భవనంలోకి మారడం నిజంగా 21వ శతాబ్దం మొదటి పాతికేళ్లలో గొప్ప పరిణామం. భారత రాజ్యాంగం 73 ఏళ్ల క్రితం అమలులోకి వచ్చినప్పుడు అనేక మంది ఇతర దేశాల మేధావుల వ్యతిరేక అంచనాలకు భిన్నంగా ఇండియాలో ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాలపరీక్షను తట్టుకుని నిలిచింది. విజయవంతమైంది. ఈ విజయానికి నూతన సన్సద్ భవన్ ప్రతీకగా నిలుస్తుంది. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. వారిదే నిర్ణయం
దేశంలోగాని, ఏదైనా రాష్ట్రంలోగాని ప్రజా ప్రభుత్వాల పాలనపై అసంతృప్తి పెల్లుబికినపుడు జనం రాజకీయాలపైన, రాజకీయ పక్షాలపైన విరుచుకుపడుతుంటారు. సరైన పరిపాలన అందించలేని ఆయా పాలక పక్షాలపై ప్రజలు నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామిక హక్కు. కాని, కొన్ని సందర్భాల్లో జనం మొత్తంగా రాజకీయాలను, రాజకీయ పార్టీను దుయ్యబడుతూ ప్రజాస్వామ్యానికి పార్టీల వల్లే కీడు జరుగుతున్నట్టు మాట్లాడటం అభిలషణీయం కాదు. ఎందుకంటే రాజకీయపక్షాలు లేని ప్రజాస్వామ్యం ఇప్పట్లో సాధ్యం కాదు. రాజకీయ పార్టీల ఉనికి ప్రజల ఆదరణ, మద్దతుపై ఆధారపడి ఉంటుంది. ఓటర్లే నాయకులను లేదా ప్రజా ప్రతినిధులను (చట్టసభల సభ్యులను) ఎన్నుకుంటారు. ఎన్నికల ప్రక్రియ ప్రజలకు తమకు నచ్చిన పార్టీలను, నేతలను గద్దెనెక్కించడానికి చక్కటి అవకాశం ఇస్తోంది. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఓటర్లకు ఎనలేని అధికారాలు అందిస్తున్నాయి. అయితే, కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలో ఉన్న పరిస్థితులను బట్టి అనేక రాజకీయపక్షాలు అధికారం కోసం పోటీపడే బహుళపక్ష ప్రజాస్వామ్యం అవసరం ఇంకా ఉంది. పార్టీ రహిత ప్రజాస్వామ్యం మెరుగైనదని ప్రఖ్యాత రాడికల్ హ్యూమనిస్టు ఎం.ఎన్.రాయ్ వాదించినా ఇప్పటికిప్పుడు పార్టీలు లేని ప్రజాస్వామ్యం అమెరికా వంటి పరిణతి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థలో సైతం సాధ్యం కాదు. శాంతియుత పద్ధతిలో పాలకపక్షాలను మార్చడానికి ప్రజలకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఎలాంటి హింసకు ఆస్కారం లేకుండా దేశంలో ఆరో లోక్ సభ ఎన్నికల్లో (1977) ప్రజలు సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న పాలకపార్టీని (భారత జాతీయ కాంగ్రెస్) అధికారం నుంచి తొలగించి కొత్త రాజకీయపక్షానికి (జనతాపార్టీ) అవకాశం కల్పించారు. చదవండి: మే 9న ‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభం: సీఎం జగన్ కొత్త రాజకీయపక్షం అంతర్గత కీచులాటలతో హస్తినలో ప్రభుత్వం నడపలేక మూడు సంవత్సరాల లోపే కుప్పకూలిపోయింది. దీంతో ఆగ్రహించిన భారత ఓటర్లు 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టారు. 1956 నుంచీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీని 1983 జనవరిలో ఓడించిన జనం కొత్త ప్రాంతీయపక్షానికి అధికారం అప్పగించారు. అప్పటి నుంచి ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల ద్వారా అధికారం కోసం పోటీ జరుగుతోంది. ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించేది రాజకీయపక్షాలే! అన్ని ప్రాంతాల్లోనూ జాతీయపక్షాలకు పోటీగా ప్రాంతీయ రాజకీయ పార్టీలు బలపడుతూ అవి స్థానిక ప్రజల ఆకాంక్షలకు తగినట్టు పరిపాలన అందిస్తున్నాయి. ఫలితంగా దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఐదేళ్లకో, పదేళ్లకో, పదిహేనేళ్లకో లేదా 20 ఏళ్లకో అధికారం ఒక పార్టీ నుంచి మరో పార్టీ చేతుల్లోకి ప్రశాంతంగా బదిలీ అవుతోంది. వివిధ రాజకీయపక్షాలకు తమకంటూ సొంత అజెండా, కార్యక్రమాలు, రాజకీయ సిద్ధాంతాలు, ఎన్నికల ప్రణాళిక ఉన్న కారణంగా ప్రజలకు ప్రతి ఎన్నికల్లోనూ ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. అధికారం లేదా పరిపాలన అనే గమ్యం చేరడానికి రాజకీయపక్షాలే ప్రధాన రహదారులుగా ప్రజలకు ఉపకరిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అంటే వారు స్వయంగా తమను తాము పరిపాలించుకోలేరు కాబట్టి ప్రభుత్వ వ్యవస్థను నడిపే ప్రజా ప్రతినిధులను ఎంపికచేసి చట్టసభలకు పంపిస్తారు. ప్రజా ప్రతినిధులు రాజకీయపక్షాల ప్రతినిధులుగా గాక, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిస్తే అంతా గందరగోళం అవుతందనే అంచనాతోనే.. ఓటర్లు 95 శాతానికి పైగా నియోజకవర్గాల్లో పార్టీల టికెట్ పై పోటీకి దిగే అభ్యర్థులనే గెలిపిస్తున్నారు. మొదటి సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో, రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో గెలిచే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. చదవండి: సోనియా గాంధీ విషకన్య!: బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఏ ఒక్కరూ గెలవలేదు. ఎన్నికల ప్రక్రియ ద్వారా నడిచే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలకు, రాజకీయాలకు కీలక ప్రాధాన్యం ఉంది. రాజకీయాలు, పార్టీల నాణ్యత పెరగాలని ప్రజలు కోరుకుంటూ ఆ మేరకు ఒత్తిడి తీసుకురావాలేగాని రాజకీయపక్షాలు లేని పరిస్థితిని కోరుకోకూడదు. అందుకే అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ (1809–1865) దాదాపు రెండు శతాబ్దాల క్రితమే ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యంపై మాట్లాడుతూ, ‘ఎన్నికలు ప్రజలవే. వారి నిర్ణయమే ఎన్నికలు ప్రతిబింబిస్తాయి. చలిమంట ముందు వారు శరీరం వెనుక భాగానికి మంట తగిలేలా కూర్చుని, వీపులు కాల్చుకోవాలని నిర్ణయించుకుంటే–కాలిన గాయాలతో వారు కూర్చోవాల్సి ఉంటుంది,’ అంటూ వ్యాఖ్యానించారు. అంటే ఓటర్లు వారి నిర్ణయాలకు వారే బాధ్యులనే విషయాన్ని లింకన్ గారు ఇంత చమత్కారంగా వర్ణించారు. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు -
పరిహాసమైన ప్రజాస్వామ్యం
కంచే చేను మేస్తే? ధర్మం, న్యాయం కాపాడాల్సిన పాలకులే... అధర్మానికి కాపు కాస్తే? మాఫియా డాన్ల అడుగులకు మడుగులొత్తితే? పోలీసు, న్యాయవ్యవస్థలు దోషులుగా నిర్ధారించిన వారిని సైతం శిక్షాకాలం పూర్తి కాక ముందే రకరకాల సాకులతో బాహ్యప్రపంచంలోకి వదిలేస్తుంటే ఏమనాలి? ఎవరికి చెప్పాలి? పార్టీలు, పాలకుల మీద ఏవగింపు గలిగే ఇలాంటి చర్యల వరుసలో తాజా ఉదాహరణ – హంతకుడు ఆనంద్ మోహన్ సింగ్ను పాలకులు నిస్సిగ్గుగా జైలు నుంచి బయటకొదిలేసిన సంఘటన. ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్యను దారుణంగా చంపి, జైలు ఊచలు లెక్క బెడుతున్న ఈ బడా నేరస్థుడు గురువారం బిహార్లోని సహరసా జైలు నుంచి విడుదలైన తీరు నివ్వెరపరుస్తోంది అందుకే. నిరుడు బీజేపీతో బంధం తెంచుకున్నాక ఓట్ల పునాదిని విస్తరించుకొనేందుకు తంటాలు పడుతున్న బిహార్ సీఎం నితీశ్ బలమైన తోమర్ రాజ్పుత్ వర్గానికి చెందిన ఆనంద్లో అద్భుతమైన అవకాశాన్ని చూశారని ఆరోపణ వినిపిస్తోంది. స్వార్థ ప్రయోజనాలే పరమా వధిగా దోషుల్ని వదిలేసే దిగజారుడు పనిలో పార్టీలన్నీ పోటీ పడుతుండడం ఆగ్రహం రేపుతోంది. ఐఏఎస్ అధికారి, గోపాల్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ అయిన కృష్ణయ్యను 1994లో దారుణంగా హత్య చేశాడీ ఆనంద్ మోహన్. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కృష్ణయ్య 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. దళితుడు. విధినిర్వహణలోని ఆయనను ముజఫర్పూర్లో ప్రభుత్వ వాహనం నుంచి లాగి, హేయంగా కొట్టి చంపడానికి 1994 డిసెంబర్ 5న అల్లరిమూకను రెచ్చగొట్టింది ఆనంద్ మోహన్. 2007లో ట్రయల్ కోర్ట్ దోషికి మరణశిక్ష విధించింది. ఏడాది తర్వాత పాట్నా హైకోర్ట్ దాన్ని జీవితకాల శిక్షగా తగ్గించింది. ఈ తీర్పును ఆనంద్ సుప్రీమ్లో సవాలు చేసినా, ఇప్పటి దాకా కోర్ట్›ఉపశమనమేమీ ఇవ్వలేదు. అలా 2007 నుంచి జైలులో ఉన్న వ్యక్తిపై బిహార్ సర్కార్ ఎక్కడ లేని అక్కర చూపింది. ఈ నెలలోనే ‘బిహార్ ప్రిజన్ మ్యాన్యువల్ 2012’లో 481వ రూల్ను మార్చింది. ‘విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వాధికారి హత్యలో దోషి అయిన ఖైదీని విడుదల చేయరాద’న్న నిబంధనను నిర్లజ్జగా తొలగించింది. ఫలితంగా – జైలులో 14 ఏళ్ళు, 20 ఏళ్ళు గడిపిన మరో 27 మంది ఖైదీలతో పాటు ఈ నేరస్థుడికీ అన్యాయంగా స్వేచ్ఛ లభించింది. పౌర సమాజం నుంచి ప్రతిపక్షాల దాకా అందరూ తీవ్రంగా వ్యతిరేకించినా, నితీశ్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. బిహార్లో రాజకీయాలకూ, నేరస్థులకూ మధ్య అనాదిగా పొడిచిన పొత్తుకు ఇది ప్రతీక. రాజకీయ నేతగా ఎదిగిన గ్యాంగ్స్టర్ ఆనంద్ మోహన్ పలుకుబడి సామాన్యమేమీ కాదు. శివ్హర్ లోక్సభా స్థానంలో గతంలో ఎంపీగా గెలిచాడు. కృష్ణయ్య హత్యతో జైలులో ఉంటేనేం, అతని భార్య లవ్లీ ఆనంద్ ఒకసారి ఎంపీ అయ్యారు. 2010 అసెంబ్లీ, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల పక్షాన పోటీ చేశారు. వారి కుమారుడు చేతన్ ఆనంద్ ప్రస్తుతం ఎమ్మెల్యే. తల్లీకొడుకులిద్దరూ బిహార్ అధికార సంకీర్ణ కూటమిలో భాగమైన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) సభ్యులే. కుమారుడి వివాహ నిశ్చితార్థం కోసం ఆనంద్ ఇటీవల 15 రోజులు పెరోల్ మీద బయటే ఉన్నాడు. సదరు నిశ్చితార్థానికి సాక్షాత్తూ బిహార్ సీఎం సహా అధికార కూటమి నేతలందరూ హాజరయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. పెరోల్ ముగిసిన ఆనంద్ ఏప్రిల్ 26న జైలుకు చేరాడో లేదో, సర్కార్ సవరించిన నిబంధనల పుణ్యమా అని మర్నాడే బయటకొచ్చేశాడు. వివిధ రాష్ట్రాల్లోని పాలకుల అవసరానికి తగ్గట్టు నియమ నిబంధనలు మారిపోతున్నాయి. వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. వెరసి, జైళ్ళలోని దోషుల శిక్షాకాలాన్ని తగ్గించి బయటకు వదిలేస్తున్న లజ్జాకరమైన ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. గత ఆగస్ట్లో బయటపడ్డ బిల్కిస్ బానో కేసులోని 11 మంది దోషుల నుంచి తాజా ఆనంద్ మోహన్ దాకా అన్ని వ్యవహారాలూ అలాంటివే. బీజేపీ నుంచి జేడీ–యూ దాకా అన్ని పార్టీలూ ఈ తిలా పాపంలో తలా పిడికెడు పంచుకున్నవే. ఓటు రాజకీయాలు, సమర్థకుల సంరక్షణ – ఇలా ఈ విడుదల వెనుక పైకి కనిపించని కారణాలు అనేకం. గద్దె మీది పెద్దల పరోక్ష సాయంతో బయటపడ్డ వీరికి సమర్థకుల నుంచి లభి స్తున్న స్వాగత సత్కారాలు, నీరాజనాలు మరింత ఆందోళన రేపుతున్నాయి. ఆనంద్ విడుదలతో జరిగిన బైక్ ర్యాలీలు, మిఠాయి పంపిణీలూ అచ్చంగా అలాంటివే. రేపిస్టులనూ, హంతకులనూ గౌరవించి, ఆరాధించే సంస్కృతికి అన్ని పార్టీలూ, అనుయాయులూ దిగజారుతున్న తీరు జుగుప్సా కరం. ప్రజాస్వామ్యాన్ని పరిహసించే ఈ ఘటనల్లో వ్యవస్థలు భాగమైపోతూ ఉండడం శోచనీయం. చేసిన నేరం తాలూకు తీవ్రత, దోషుల వ్యక్తిగత చరిత్రలను బట్టి ఏ కేసుకా కేసు ప్రత్యేకమైనదే. కానీ, అన్నిటినీ ఒకే గాటన కడుతూ, కావాల్సినవారిని కాపాడుకొనే రీతిలో నిర్ణీత కాలవ్యవధి దాటి జైలులో ఉన్నవారందరినీ వదిలేయవచ్చని తీర్మానించడం సబబేనా? అలాంటప్పుడు బాధితులకు సరైన న్యాయం ఏ రకంగా జరిగినట్టు? పశ్చాత్తాపం, పరిణత సత్ప్రవర్తన లాంటివి శిక్షాకాలపు తగ్గింపునకు గీటురాళ్ళు కావాలి. కేవలం జైలులో గడిపిన రోజులే లెక్కలోకి తీసుకుంటే, బాజాప్తాగా బయటకొచ్చిన దోషి రేపు మరో నేరానికి పాల్పడడని నమ్మకం ఏమిటి? బాధిత కుటుంబాల కళ్ళెదుటే నేరస్థులు నిష్పూచీగా తిరుగుతుంటే, చట్టం, న్యాయం పట్ల సామాన్యుడు విశ్వాసం కోల్పోతే ఆ పాపం ఎవరిది? తాత్కాలిక ప్రయోజనాల కోసం హడావిడి పడుతున్న పార్టీలు, ప్రభుత్వాలు ఇవన్నీ లోతైన ప్రభావం చూపే పరిణామాలని ఇకనైనా తెలివిడి తెచ్చుకోవాలి. ఈ దేశంలో చట్టాలన్నీ అధికార బలగానికి చుట్టాలేనన్న భావన బలపడితే ప్రజాస్వామ్యానికే చేటు. -
ఇజ్రాయెల్లో మళ్లీ రాజుకున్న నిరసన జ్వాల!
ఇజ్రాయెల్లో మళ్లీ నిరసన జ్వాల రాజుకుంది. శనివారం వేలాదిమంది నిరసకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. మార్చి 27న ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు న్యాయవ్యవస్థలో తీసుకొచ్చిన కొత్త సంస్కరణలు దేశాన్ని చీల్చేలా ఉన్నాయంటూ నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంస్కరణలను నిలిపి చర్చకు అనుమతించినట్లు ప్రకటించిన 15వ వారంలోనే మరోసారి నిరసనలు చెలరేగాయి. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని, కాపాడుకోవాలంటూ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. దాదాపు పదివేలమందికి పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వారంతా మేము ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామని, మాకు వేరే దేశం లేదంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలు చేపట్టారు. ఈ సంస్కరణలు సుప్రీం కోర్టు అధికారాన్ని తగ్గించి న్యాయమూర్తుల ఎంపికపై రాజకీయ నాయకులకే ఫుల్గా అధికారాలుంటాయంటూ ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే హైఫాలోని మోడిన్లోని న్యాయ శాఖ మంత్రి యారివ్ లెవిన్ ఇంటి వెలుపల కూడా నిరసనలు జరిగినట్లు సమాచారం. కాగా, యూఎస్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇజ్రాయెల్ దృక్పథానికి సానుకూలం నుంచి స్థిరీకరణకు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత శనివారమే నిరసనలు వెల్లువెత్తడం గమనార్హం ఈ కొత్త సంస్కరణల పట్ల పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఆ చట్టాన్ని అర్థాంతరంగా నిలిపి వేసి, ప్రతిపక్షాలతో చర్చలు జరిపేందుకు దారితీసింది. అయితే యూఎస్ మూడీస్ మాత్రం ప్రభుత్వం విస్తృత ఏకాభిప్రాయం కోరకుండా ఇలాంటి సంస్కరణలను అమలు చేయాలని యత్నించే తీరు సంస్థాగత బలం, విధాన అచనాల బలహీనతను సూచిస్తుందని పేర్కొంది. (చదవండి: కెనడాలో వైశాఖి పరేడ్..మూడేళ్ల అనంతరం వేడుకగా జరిగిన నగర కీర్తన!) -
చరిత్రాత్మకమైన తీర్పు
న్యాయం చేయటం మాత్రమే కాదు, అలా చేస్తున్నట్టు కనబడటం కూడా ముఖ్యం అంటారు. ‘మీడియా వన్’ కేసులో సుప్రీంకోర్టు బుధవారం వెలువరించిన తీర్పు ఈ సహజ న్యాయసూత్ర ప్రాధాన్యతనూ, దాపరికం లేని న్యాయవ్యవస్థ ఆవకశ్యతనూ నిర్మొహమాటంగా తెలియజేసింది. అంతేకాదు, ఈమధ్యకాలంలో ‘జాతీయ భద్రత’ను అడ్డం పెట్టుకునే పోకడలను నిశితంగా విమ ర్శించింది. ‘మీడియా వన్’ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే ఆ కేసు నిజానికి ఇంత దూరం రావా ల్సిన అవసరం లేదని సులభంగానే అర్థమవుతుంది. దేశ భద్రతకు ముప్పు కలుగుతుందన్న ఆరోపణతో కేరళలోని ‘మీడియా వన్’ చానెల్ ప్రసారాల కొనసాగింపునకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. దేశభద్రతకు ముప్పు తెచ్చే ఎలాంటి చర్యలనైనా అడ్డుకోవటానికీ, ప్రజల ప్రాణాలు కాపాడటానికీ ప్రభుత్వాలకు సర్వాధికారాలూ ఉంటాయి. ఆ విషయంలో రెండో మాటకు తావులేదు. కానీ అందుకు సహేతుక కారణాలను చూపటం ముఖ్యం. అలా కారణాలు చూపటంవల్ల వ్యక్తులు లేదా సంస్థలు లబ్ధి పొందుతాయా లేదా అన్నది ప్రధానం కాదు. ప్రజా స్వామ్యం నాలుగు కాలాలపాటు మనుగడ సాగించాలంటే ఇది ముఖ్యం. ఇలా చేయటంవల్ల దేశ ప్రజల్లో చట్టబద్ధ పాలనపై విశ్వసనీయత ఏర్పడుతుంది. పాలన పారదర్శకంగా సాగుతున్నదనీ, జవాబుదారీతనం అమల్లో ఉన్నదనీ భరోసా కలుగుతుంది. కారణాలేమైనా గానీ ఇటీవలి కాలంలో కొన్ని కేసుల విషయంలో తన వాదనలకు మద్దతుగాకేంద్రం కొన్ని పత్రాలను సీల్డ్ కవర్లో అందజేయటం, న్యాయస్థానాలు ఆ ధోరణిని అంగీకరించటం కనబడుతుంది. ఇందుకు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు తదితరాలు మొదలుకొని భీమా కోరెగావ్ కేసు వరకూ ఎన్నిటినో ఉదహరించవచ్చు. ఆఖరికి ఇదెంత వరకూ వచ్చిందంటే సీల్డ్ కవర్ అందజేయటం న్యాయవ్యవస్థలో ఒక సాధారణ విషయంగా మారింది. ఇందువల్ల కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులకూ, సంస్థలకూ నష్టం జరుగుతుంది. తమపై ఉన్న ఆరోపణలేమిటో, వాటికిగల ఆధారాలేమిటో తెలియకపోతే ఏ ప్రాతిపదికన వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించాలి? ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాదా? నేరం రుజువయ్యేవరకూ ఎవరినైనా నిరపరాధులుగా పరిగణించాలన్నది అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలూ అనుసరించే విధానం. దానికి సీల్డ్ కవర్ పద్ధతి గండికొడుతోంది. అంతేకాదు, నిందితులకు అన్యాయం జరుగుతున్నదన్న భావన కలిగి ప్రజల్లో వారిపట్ల సానుభూతి ఏర్పడుతోంది. ‘మీడియా వన్’ కేసు విషయానికొస్తే ఆ సంస్థ ప్రసారాలను ఎందుకు నిలిపేయాల్సివచ్చిందో కేంద్రం చెప్పదు. హైకోర్టుకు పోతే అక్కడ ధర్మాసనం తనకు సమర్పించిన సీల్డ్ కవర్లో ఆ ఆరోపణలేమిటో చూస్తుంది. వీటిపై మీ వాదనేమిటని కక్షిదారును ప్రశ్నించదు. పైగా ఆ సీల్డ్ కవర్ సమాచారం ఆధారంగా తీర్పు వెలువడుతుంది. సింగిల్ బెంచ్ ముందూ, డివిజన్ బెంచ్ ముందూ కూడా ‘మీడియా వన్’కు ఇదే అనుభవం ఎదురైంది. అయితే అసలు న్యాయస్థానాలు సీల్డ్ కవర్ను అంగీకరించే ధోరణి గతంలో లేనేలేదని చెప్పలేం. ప్రభుత్వోద్యోగుల సర్వీసు, పదోన్నతుల వ్యవహారాల్లో సంబంధిత అధికారుల ప్రతిష్ట కాపాడేందుకు... లైంగిక దాడుల కేసుల్లో బాధితుల గుర్తింపు రహస్యంగా ఉంచటానికి సీల్డ్ కవర్లో వివరాలు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఆఖరికి రాఫెల్ యుద్ధ విమానాల కేసులో సాంకేతిక అంశాలు వెల్లడిస్తే శత్రు దేశాలకు ఉప్పందించినట్టవుతుందని చెప్పటం వరకూ అంగీకరించవచ్చు. కానీ బీసీసీఐ విషయంలో తానే నియమించిన కమిటీ నివేదికనూ, గుజరాత్కు సంబంధించిన నకిలీ ఎన్కౌంటర్ కేసు, అయోధ్య స్థల దస్తావేజు కేసువంటి అంశాల్లో సైతం గోప్యత పాటించాలని ప్రభుత్వం చేసిన వినతిని న్యాయస్థానాలు అంగీకరించటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 2013లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా ఈ స్థితి ఏర్పడింది. అయితే తాజా తీర్పులో సుప్రీంకోర్టు ప్రస్తావించినట్టు బ్రిటన్, కెనడా సుప్రీంకోర్టులు ఈ విషయంలో ఎన్నదగిన తీర్పులు వెలువరించాయి. కేసులకు సంబంధించిన సమాచారాన్ని దాచివుంచటం వల్ల ఆ కేసుల గురించి చర్చించుకోవటం, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించటం ప్రజలకు నిరాకరించినట్టే అవుతుందని అక్కడి న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. ‘మీడియా వన్’ కేసులో జాతీయ భద్రతను సాకుగా చూపిన కేంద్రం దాన్ని సమర్థించుకునేందుకు సీల్డ్ కవర్లో ప్రస్తావించిన కారణాలు పేలవంగా ఉన్నాయి. అందుకే గాల్లోంచి ఆరోపణలు సృష్టిస్తే అంగీకరించబోమని ధర్మాసనం వ్యాఖ్యానించాల్సి వచ్చింది. ఇకపై ఇలాంటి కేసుల విష యంలో న్యాయస్థానాలు అనుసరించాల్సిన రెండు గీటురాళ్లను కూడా ప్రకటించింది. కేసులోని అంశాలు వెల్లడిస్తే జాతీయ భద్రతకు ముప్పు కలుగుతుందని భావించటానికి అవసరమైన సమా చారం ప్రభుత్వం అందించిందా లేదా అన్నది అందులో మొదటిది. వివేకవంతులైన వ్యక్తులు సైతం ఆ సమాచారం ఆధారంగా అలాగే భావించే అవకాశం ఉన్నదా లేదా అన్నది రెండోది. భావప్రకటనా స్వేచ్ఛకు పూచీపడే రాజ్యాంగంలోని 19వ అధికరణలోనే ఏయే అంశాల్లో నియంత్రణలు అమలు చేయవచ్చో వివరంగా ఉంది. వాటిని బేఖాతరు చేసి నచ్చని అభిప్రాయాలు ప్రకటించారన్న ఏకైక కారణంతో ఆ స్వేచ్ఛకు గండికొట్టడం రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీస్తుంది. అందుకే ‘మీడియా వన్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. -
'మిత్రకాల్'పై పోరాటం.. సత్యమే నా ఆయుధం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో సూరత్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాను పోరాటం చేస్తున్నానని, సత్యమే తన ఆయుధమని పదునైన వ్యాఖ్యలు చేశారు. 'నేను మిత్రకాలంపై పోరాటం చేస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సత్యమే నా ఆయుధం. అదే నాకు అండ..' అంటూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. ये ‘मित्रकाल’ के विरुद्ध, लोकतंत्र को बचाने की लड़ाई है। इस संघर्ष में, सत्य मेरा अस्त्र है, और सत्य ही मेरा आसरा! pic.twitter.com/SYxC8yfc1M — Rahul Gandhi (@RahulGandhi) April 3, 2023 హిండెన్బర్గ్ నివేదిక అనంతరం స్నేహితుడు అదానీ కోసమే మోదీ పనిచేస్తున్నారని రాహుల్ విమర్శల జోరు పెంచిన విషయం తెలిసిందే. అందుకే మోదీ పాలనను మిత్రులకు లాభం చేకూర్చే మిత్రకాల్గా ఆయన అభివర్ణిస్తున్నారు. కాగా.. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో మార్చి 23న రాహుల్ను సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశారు. తీర్పుపై స్టే విధించాలని, శిక్ష రద్దు చేయాలని కోరారు. అయితే న్యాయస్థానం మాత్రం రాహుల్కు ఈ కేసులో ఏప్రిల్ 13 వరకు బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై స్టే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి విచారణను వాయిదా వేసింది. చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్ -
ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి భారత్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘‘అంతర్జాతీయంగా ఎన్నో ప్రతికూలతలు ఉన్నా, వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రజాస్వామ్యంతో సత్ఫలితాలు లభిస్తాయనడానికిదే నిదర్శనం’’ అన్నారు. గురువారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సదస్సు–2023’లో మోదీ వర్చువల్గా ప్రసంగించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు దేశ ప్రజల సమ్మిళిత ప్రయత్నాలే తగిన బలాన్ని ఇస్తున్నాయని చెప్పారు. పాలకులను ప్రజలంతా కలిసి ఎన్నుకొనే ఆలోచన ప్రపంచ దేశాల కంటే చాలా ఏళ్ల ముందే భారత్లో ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ప్రజల ప్రథమ విధి పాలకులను ఎన్నుకోవడమేనని మహాభారతంలో ఉందని తెలిపారు. ప్రాచీన భారతదేశంలో ఎన్నో గణతంత్ర రాజ్యాలుండేవని చెప్పడానికి చారిత్రక ఆధారాలున్నాయని వివరించారు. ‘‘గణతంత్ర రాజ్యాల్లో పాలనాధికారం వారసత్వంగా దక్కేది కాదు. పాలకులను ప్రజలు ఎన్నుకునేవారు’’ అని వెల్లడించారు. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక నిర్మాణం కాదని, అదొక స్ఫూర్తి అని మోదీ పేర్కొన్నారు. ‘ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సదస్సు–2023’కు అమెరికా, కోస్టారికా, జాంబియా, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా దేశాల అధినేతలు ఆతిథ్యం ఇస్తున్నారు. -
గొంతెత్తడం ప్రజల రాజకీయ కర్తవ్యం
అభిప్రాయ ప్రకటనకు వీలులేని స్వాతంత్య్రం నిరర్థకం. పౌరుల సమావేశ స్వేచ్ఛకు, చర్చలకు అవకాశం కల్పించని వ్యవస్థ దేనికి? అలా లేనప్పుడు దేశ సామాజిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి అంతకన్నా పెద్ద ప్రమాదం మరొకటి లేదు. బహిరంగ చర్చలు, నిర్ణయాలు ప్రజల రాజకీయ కర్తవ్యమని మరచిపోరాదని శతాబ్దం క్రితమే సుప్రసిద్ధ అమెరికన్ న్యాయమూర్తి జస్టిస్ లూయీ బ్రాండీస్ అన్నారు. పౌరులకు భారత రాజ్యాంగం హామీపడిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అక్షరసత్యంగా అమలు జరగకుండా పాలక పక్షాలు అడ్డుకుంటూనే వస్తున్నాయి. పౌర స్వేచ్ఛకు ‘శ్రీరామరక్ష’గా నిలబడగలిగిన పాలకులే ప్రజల మన్నన పొందగలరు. పౌరుల సుఖ సంతోషాలే తమ సుఖసంతోషాలని విశ్వసించగలిగినవారే పౌరస్వేచ్ఛకు హామీ ఇవ్వగలరు. ‘‘స్వాతంత్య్రం పొందిన దేశంలో రాజ్య పాలనా వ్యవస్థ అంతిమ లక్ష్యం– దేశ పౌరులు స్వేచ్ఛగా తమ శక్తియుక్తుల్ని వృద్ధి చేసుకునేటట్లు వారికి అండదండలుగా నిలవగల్గడం. ప్రభుత్వంలో నిరంకుశ ధోరణులు ప్రబలి నప్పుడు బుద్ధిగల పాలకులు వాటిని అణచివేయాలి. అలాంటి పాల కులు మాత్రమే ప్రజల మన్ననలు పొందగల్గుతారు. అలాంటి పాలకులు మాత్రమే పౌర స్వేచ్ఛకు ‘శ్రీరామరక్ష’గా నిలబడగలరు. అలాంటి వారు మాత్రమే పౌరుల సుఖ సంతోషాలే తమ సుఖసంతోషాలని విశ్వసించగలరు. పౌరులు స్వేచ్ఛగా ఆలోచించగల్గి, స్వేచ్ఛగా మాట్లాడగల్గడం అనే లక్షణం– రాజకీయ సత్యాల్ని స్వేచ్ఛగా అన్వేషించి కనుగొనడానికి అనివార్యమైన లక్షణమని గుర్తించాలి. స్వేచ్ఛగా అభిప్రాయ ప్రకటనకు, పౌరుల సమావేశ స్వేచ్ఛకు, చర్చలకు అవకాశం కల్పించని వ్యవస్థ నిరర్థకం. ఒక దేశ పౌరులు తమ సమస్యలపై స్పందించడానికి స్వేచ్ఛ లేని దేశ స్వాతంత్య్రం అనర్థం, ప్రమాదకరం. బహిరంగ చర్చలు, నిర్ణయాలు ప్రజల రాజకీయ కర్తవ్యమని మరచిపోరాదు.’’ – సుప్రసిద్ధ అమెరికన్ న్యాయమూర్తి జస్టిస్ లూయీ బ్రాండీస్ ‘‘వచ్చే సాధారణ ఎన్నికలను బలంగా ఎదుర్కోవాలంటే, 2024 పోరాటం ఎవరో ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరిగే పోరుగా కాకుండా దేశంలో ప్రజాస్వామ్యానికీ, నియంతృత్వానికీ మధ్య జరగ వలసిన సంకుల సమరంగా అన్ని ప్రతిపక్షాలూ భావించి ఉమ్మడిగా రంగంలోకి దిగేందుకు నడుం కట్టాలి.’’ – ప్రొఫెసర్ హర్బన్స్ ముఖియా, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం చరిత్రాధ్యాపకులు (27 మార్చ్ 2023) జస్టిస్ బ్రాండీస్ శతాబ్దం క్రితం చేసిన చరిత్రాత్మక హెచ్చరిక పౌర సమాజాలకు అరమరికలు లేని బహిరంగ చర్చలు నిరంతర రాజకీయ కర్తవ్యంగా కొనసాగవలసిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. దేశ రాజ కీయ పాలనా వ్యవస్థను ఒక వైపు నుంచి స్వాతంత్య్రానంతరం గాడి తప్పిన కాంగ్రెస్ (ఐక్య సంఘటన పాలన మినహా) పాలకులు, మరొకవైపు నుంచి బీజేపీ నడిపిస్తూ వచ్చాయి. రాజ్యాంగ మౌలిక సూత్రాలను తమ ఇష్టానుసారం తారుమారు చేసి, భారత పౌరులకు రాజ్యాంగం హామీపడిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అక్షరసత్యంగా అమలు జరగకుండా ఇవి అడ్డుకుంటూనే వచ్చాయి. వ్యక్తిగత ఎజెండా లతో పాలనా పద్ధతుల్ని భ్రష్టు పట్టిస్తూనే వచ్చాయి. ఇక నేటి బీజేపీ పాలకవర్గం ప్రేమించే ఇజ్రాయెల్లో ఒక సరికొత్త పరిణామం తలెత్తింది. ఆ దేశ ప్రధానమంత్రిని ఏ పరిస్థితుల్లోనూ పాలనకు తగడని పదవి నుంచి తొలగించడానికి వీలు లేకుండా ఇజ్రా యెల్ తాజాగా చట్టం చేసింది. దీన్ని ‘ఇజ్రాయెలీ రాజ్యాంగ నిర్మాణ వ్యవస్థలోనే సరికొత్త విపత్కర పరిణామం’గా బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూ ట్లో మధ్యప్రాచ్య విధాన నిర్ణయ కేంద్రం డైరెక్టర్ నతన్ సాక్స్ అభివర్ణించాడు. ఇజ్రాయెల్ కొత్త శాసనం ప్రకారం ఆ దేశపు సుప్రీంకోర్టుకు ఇజ్రాయెల్ పాలకవర్గంపైగానీ, దేశ శాసనాలపైగానీ అవసర మైన అదుపాజ్ఞలను జారీ చేసే హక్కు ఉండదు. ఈ తాజా పరిణామం ప్రభావం భారత పాలనా వ్యవస్థకు విస్తరించకుండా ఉండాలని మాత్రమే మనం కోరుకోగలం. విచ్చలవిడిగా దేశ ఏకైక కుబేర వర్గంగా బలిసినవారి గురించి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన పాదయాత్రలో ప్రస్తావించి, విమర్శిస్తే పాలకులకు అంత ‘గుర్రెందు’కు? ఏ మాటకామాటే చెప్పు కోవాలి. కాంగ్రెస్ హయాంలోనూ, వారు ఈ వర్గంతో అంటకాగుతూ వారి దోపిడీ యథేచ్ఛగా సాగడానికి అనుమతించిన వారేనని మరచి పోరాదు! దీనికి భిన్నంగా తన సుదీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూసిన ప్రజల కడగండ్ల దృష్ట్యా రూపొందించిన ‘నవరత్న’ ప్రణాళికను ఆ ప్రజలకు జీవశక్తిగా మలిచారు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి. కోవిడ్ ఒడుదొడుకుల ఫలితంగా రాష్ట్రం తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి ఇబ్బందులు ఎదురైనా జగన్ తట్టుకోగల్గడం ప్రశంసనీయ పరిణామంగా భావించాలి. అందుకే వేమన అన్నాడేమో: ‘‘భూమిలోన పుణ్యపురుషులు లేకున్న జగములేల నిల్చు పొగులు లేక (కుమిలిపోక)’’ రాహుల్ ఇవాళ ఇన్ని కబుర్లు చెబుతున్నారుగానీ, జగన్కన్నా ముందు ఉన్నత స్థాయికి ఎందుకు దూసుకురాలేక పోయారు? ‘అసూయ’ అనలేంగానీ, తనపై బనాయించిన అక్రమ కేసుల్ని జగన్ ఎదుర్కొంటూ పదహారు మాసాలకు పైగా జైళ్లలో మగ్గుతున్న ఘడియలలో ఒక్కసారైనా రాహుల్ సానుభూతిని ప్రకటించగలిగాడా? ఇవాళ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లను సుప్రీంకోర్టు హెచ్చరికలను సహితం లెక్క చేయకుండా స్వార్థ రాజకీయాలకు బీజేపీ పాలకవర్గం వినియోగిస్తున్న తీరు అభ్యంతరకరమే కాదు, పరమ హాస్యాస్పదం! ‘ఉపా’ చట్టాన్ని తమ మనుగడకు బీజేపీ పాల కులు ‘ఉపాహారం’గా మలుచుకోవడం దారుణ పరిణామం! ప్రస్తుత సుప్రీంకోర్టు చైతన్యంతో నిర్ణయాలు చేస్తూండటం ఒక్కటే జస్టిస్ బ్రాండీస్ సంప్రదాయానికి నేడూ, రేపూ ‘శ్రీరామరక్ష’గా భావించాలి! ఇంతకూ మనం కనీసం కోరుకోదగిందల్లా – సుప్రీంకోర్టు అధికారాలను ఇజ్రాయెల్ పార్లమెంట్ తగ్గించినట్టుగా 2024 ఎన్నికలకు ముందే అలాంటి పరిణామం భారత్లో రాకూడదనే! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాకులు abkprasad2006@yahoo.co.in -
విమర్శ ప్రాధాన్యం మరిచారా?
కొన్నేళ్ల క్రితం నరేంద్ర మోదీ ‘‘ప్రభుత్వాలపై, వాటి పనితీరుపై వీలైనంత కఠినాతికఠినమైన విశ్లేషణ, విమర్శ చేయాలన్నది నా బలమైన విశ్వాసం. లేనిపక్షంలో ప్రజాస్వామ్యం నడవదు’’ అన్నారు. మీడియా విమర్శనాత్మకంగా ఉండకపోతే ప్రభుత్వంలో భయం పోయి దేశానికి తీవ్ర నష్టం జరుగు తుందన్నారు. చాలామంది బలమైన విమర్శను ఆహ్వానిస్తారు, కానీ ప్రభుత్వాన్ని భయంలో ఉంచాలని ఎవరూ చెప్పలేదు. కొంతమంది మంత్రులు మోదీ మాటల్ని మర్చిపోయారు. విమర్శకులను జాతి వ్యతిరేకులు అని నిందిస్తే, ఆ ప్రతిస్పందన విమర్శ కంటే ఎక్కువ ప్రభావాన్ని ప్రేరేపిస్తుంది. సాక్షాత్తూ తన ప్రభుత్వాన్ని విమర్శించ డానికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రధాన మంత్రే చెప్పిన మాటలు ఎంతమందికి గుర్తున్నాయో నాకు తెలీదు. ఆయన ప్రకటనలోని విషయం మాత్రమే కాదు, ఆయన జాగ్రత్తగా వాడిన పదాలు కూడా. ఆ ప్రసంగ వీడియోలోని క్లిప్ను ప్రదర్శించినట్లయితే, ప్రధాని ప్రసంగంలోని ధాటిని కూడా మీరు గమనిస్తారు. ఆ మూడింటినీ కలిపిచూస్తే, ఆయన చెప్పిన మాటల్ని సరిగ్గా అలాగే ఉద్దేశించారని మనల్ని స్పష్టంగా నమ్మమని అన్నట్లుగా ఉంటాయి. ప్రధాని పదవిని చేపట్టిన రెండేళ్ల తర్వాత, అంటే 2016 సెప్టెంబర్లో ‘నెట్వర్క్ 18’ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ అన్నారు: ‘‘ప్రభుత్వాలపై, వాటి పనితీరుపై వీలైనంత కఠినాతి కఠినమైన విశ్లేషణ, విమర్శ చేయాలన్నది నా బలమైన విశ్వాసం. లేనిపక్షంలో ప్రజాస్వామ్యం నడవదు.’’ భయం ఉండాల్సిన అవసరం మొదటగా ఆ పదాల ఎంపికను గమనించండి. ‘కఠినాతి కఠినమైన’ విశ్లేషణ, విమర్శ. మృదువైన, సూక్ష్మ కాదు. పరుషంగా, దాపరికం లేకుండా, శక్తిమంతంగా! రెండవది, ప్రభుత్వ పనిని మాత్రమే కాదు, ప్రభుత్వాన్నే విమర్శించి, విశ్లేషించాలి. మోదీ వీటిని ప్రత్యేక అంశాలుగా పేర్కొన్నారు. ఇది ఉద్దేశపూర్వక విభజన. మోదీ మరింత ముందుకెళ్లారు. అంతే సమానమైన, శక్తిమంతమైన పదాలతో ఒకవేళ ప్రభుత్వాన్ని విమర్శించడంలో మీడియా విఫలమైతే రాదగిన నిర్దేశిత ఫలితమేమిటో చెప్పారు. ‘‘ప్రభుత్వంలో తేవాల్సిన మెరుగుదల, ప్రభుత్వంలో ఉండి తీరాల్సిన భయం లేకుండాపోతాయి. ఒకవేళ ఆ భయం ప్రభుత్వంలో అదృశ్యమైతే, దేశం ఘోరంగా దెబ్బతింటుంది. అందువల్లే మీడియా అత్యంత విమర్శ నాత్మకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’’. అంటే, ప్రభుత్వాన్ని భయపడుతున్న స్థితిలోనే ఉంచాలని ప్రధాని కోరుకుంటున్నారు. ఆయన ‘భయం’ అనేమాటను అను కోకుండా ఉపయోగించలేదు. చెప్పాలంటే, ఆ పదాన్ని ఆయన మూడుసార్లు వాడారు. ప్రభుత్వం భయపడటం మానేస్తే ఏం జరుగుతుందో గమనించండి– దేశానికి తీవ్ర నష్టం! జాతి వ్యతిరేకులా? ఇతర ప్రజాస్వామిక నేతలు విమర్శ అవసరం గురించి ఈ స్థాయిలో చెప్పి ఉంటారా అని నేను గుర్తు చేసుకోలేకపోతున్నాను. చాలామంది బలమైన విమర్శను ఆహ్వానిస్తారు, కానీ ప్రభుత్వాన్ని భయంలో ఉంచాలని ఎవరూ చెప్పలేదు. పైగా మోదీ ప్రభుత్వాలను అని బహువచనంలో మాట్లాడలేదు. ప్రత్యేకించి తన సొంత ప్రభుత్వం గురించే మాట్లాడారు. ఇప్పుడు నేను దీన్ని ఎందుకు పునరుల్లేఖించాను? మామూలు కారణం ఏమిటంటే, కొంతమంది మంత్రులు దాన్ని మర్చిపోయారు లేదా ఉద్దేశపూర్వకంగా విస్మరించేశారు. అందుకు నేను అనేక ఉదాహరణలు ఇవ్వగలను. కానీ రెండింటికి మాత్రమే పరిమిత మవుతాను. కొంతమంది రిటైరైన న్యాయమూర్తులు ‘భారత వ్యతిరేక గ్యాంగ్’లో భాగమయ్యారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఎందుకంటే ఈ న్యాయమూర్తులు పాల్గొన్న ఒక సెమినార్లో– మోదీ ప్రభుత్వం నియమించిన న్యాయమూర్తుల గురించిన విశ్లేషణను ప్రొఫెసర్ మోహన్ గోపాల్ సమర్పిస్తూ, వారిలో 15 శాతంమంది మతరాజ్య వ్యవస్థకు తప్ప రాజ్యాంగబద్ధ న్యాయ మూర్తులాగా లేరని పేర్కొన్నారు. మోదీ ప్రకటన సరిగ్గా ఇదే మాట్లాడుతోందని న్యాయమంత్రి గుర్తించడం లేదా? అయినప్పటికీ ఆయన దాన్ని ‘భారత వ్యతిరేకం’ అన్నారు. న్యాయమూర్తులు దీనికి ‘తగిన మూల్యం’ చెల్లిస్తారని హెచ్చరించారు కూడా! చతురత లేకపోతే... నా రెండో ఉదాహరణ – ఉప రాష్ట్రపతికి సంబంధించినది. ఆయన మోదీ ప్రభుత్వంలో సభ్యుడు కాదు. ఆయన స్థానం ఆయన్ని మించినది. కానీ ‘మేధావర్గం, మీడియా జనాల’ గురించి ఆయన మాట్లాడుతూ, ‘‘మన వృద్ధి వేగాన్ని తగ్గించి చూపడానికి భారత వ్యతిరేక శక్తులు హానికరమైన కథనాలను అల్లుతున్నాయి. మన క్రియాత్మక ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగబద్ధ సంస్థలకు కళంకం తెస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. మోదీ ఇంటర్వ్యూలోని విష యాలు తనకు కూడా వర్తిస్తాయని ఆయన మరిచిపోయినట్లు ఉన్నారు. ‘‘మన వృద్ధి వేగాన్ని తగ్గించాలని చూస్తున్నవారు’’ మన స్థూలదేశీయోత్పత్తి యథార్థతను ప్రశ్నిస్తున్నారు. ‘‘మన క్రియాత్మక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను’’ కళంకపరుస్తున్నవారు పార్లమెంటు, ఎన్నికల కమిషన్, మన భద్రతా సంస్థల పనితీరును ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విమర్శను కేవలం స్వాగతించడం కాదు, ఇది అవసరమే అని మోదీ చెప్పారు. ప్రభుత్వ విమర్శలకు జవాబు ఇవ్వాల్సిన కేంద్ర మంత్రులూ, బీజేపీ అధికార ప్రతినిధులూ ప్రధానమంత్రి వివేకవంతమైన మాటలను కంఠతా పట్టాల్సి ఉంది. నన్ను మరో అంశాన్ని కూడా చేర్చనివ్వండి. విమర్శను ఎదుర్కొన్నప్పుడు చిరునవ్వుతో వినాలి, హుందాగా స్పందించాలి. అప్పుడు ఆ విమర్శ వెంటనే వీగిపోతుంది. అలా కాకుండా విమర్శతో ఘర్షించడం, ఇంకా ఘోరంగా విమర్శకు లను జాతి వ్యతిరేకులు అని నిందించడం చేస్తే, ఆ ప్రతిస్పందన విమర్శ కంటే ఎక్కువ ప్రభావాన్ని ప్రేరేపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, చతురతతో వ్యవహరించు, రాజకీయం చేయవద్దు! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రోడ్డెక్కిన విపక్షాలు..ఢిల్లీలో ఉద్రిక్తత
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలన్ని రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు బ్యానర్లు చేతపట్టుకుని పార్లమెంట్ వరకు నిరసన ర్యాలీలు చేపట్టారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకుని పోలీస్టేషన్కు తరలించారు. రాష్ట్రపతి భవన్ వైపు పాదయాత్రతో వస్తున్న విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదానీ హిండెన్బర్గ్ వ్యవహారం, రాహుల్ గాంధీ అరెస్టు తదితర అంశాల నేపథ్యంలో శుక్రవారం విపక్షాలన్ని ఆందోళనకు దిగాయి. ఈ మేరకు ఈ అంశంపైనే శుక్రవారం కూడా ప్రతిపక్ష సభ్యులు ఉభయల సభల్లో ఆందోళనకు దిగడంతో ఎలాంటి చర్చలు జరగకుండానే సభలు మరోసారి వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలోనే తొలుత పార్లమెంట్ ప్రాంగణంలోనే నిరసనలు చేపట్టిన ప్రతిపక్ష ఎంపీలు..విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్వైపుకు ర్యాలీ ప్రదర్శనలు చేపట్టాయి. అయితే పోలీసులు ర్యాలీలకు అనుమతి లేదంటూ వారిని అదుపులో తీసుకున్నారు. దీంతో విజయ్ చౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదీగాక గత కొంతకాలంగా అదానీ హిండెన్బర్గ్ సమస్యపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేయడమే గాక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కావాలని కోరుతున్నాయి. ఐతే దీనిపై పార్లమెంట్లో చర్చ జరగనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని విపక్ష ఆరోపిస్తున్నాయి. పైగా దీని నుంచి దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్పై అరెస్టు వంటి ఎత్తుగడలను ఉపయోగిస్తుందని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటుందంటూ విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. Democracy in danger.. We stand in support with #RahulGandhi.pic.twitter.com/848QlEQcVt — WB Youth Congress (@IYCWestBengal) March 24, 2023 (చదవండి: రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు.. ప్రకటించిన లోక్సభ సెక్రటరీ జనరల్) -
కొలీజియమే అత్యుత్తమం: సీజేఐ
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థా పరిపూర్ణమూ, లోపరహితమూ కాజాలదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక వ్యవస్థ అయిన కొలీజియాన్ని గట్టిగా సమర్థించారు. కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియం వ్యవస్థ తీవ్ర విభేదాలకు కారణంగా మారడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఇండియాటుడే సదస్సులో సీజేఐ మాట్లాడుతూ కొలీజియంను అత్యుత్తమ వ్యవస్థగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థపై బయటి ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా కాపాడుకోవాల్సి ఉందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పుడే అది స్వతంత్రంగా పని చేయగలుగుతుందన్నారు. కొలీజియం చేసిన కొన్ని సిఫార్సులకు ఆమోదం తెలపకపోవడానికి ప్రభుత్వం పేర్కొన్న కారణాలను కొలీజియం బయట పెట్టడంపై కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అసంతృప్తిని సీజేఐ తోసిపుచ్చారు. ‘‘వీటిపై న్యాయ మంత్రితో చర్చకు దిగదలచుకోలేదు. కానీ భిన్నాభిప్రాయాలు సర్వసాధారణం’’ అన్నారు. అయితే కేసుల విచారణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఏ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వాలో గత 23 ఏళ్లలో ఎవరూ తనపై ఒత్తిడి తేలేదన్నారు. అలాగే న్యాయమూర్తుల లైంగిక ప్రవృత్తికి, వారి సామర్థ్యానికి సంబంధం లేదంటూ ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొలీజియం సిఫార్సు చేసిన వారిలో కొందరు తాము స్వలింగ సంపర్కులమని ప్రకటించుకోవడం తెలిసిందే. -
భారత ప్రజాస్వామ్యం గురించి లండన్లో ప్రశ్నలా? రాహుల్కు మోదీ చురకలు
బెంగళూరు: భారత ప్రజాస్వామ్వం గురించి కొందరు లండన్లో ప్రశ్నలు లేవనెత్తడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోదీ. పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. కర్ణాటక హుబ్బళ్లి- ధార్వాడ్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసన అనంతరం ర్యాలీలో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది. భారత ప్రజాస్వామ్యం గురించి కొందరు లండన్లో ప్రశ్నలు లేవనెత్తడం దురదృష్టకరం. కొందరు వ్యక్తులు ప్రజాస్వామ్యం గురించి తరచూ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో ఏ శక్తి భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలకు హాని తలపెట్టలేదు. కానీ కొందరు దాన్ని రేవులో నిలబెడుతున్నారు.' అని మోదీ ఫైర్ అయ్యారు. కార్యక్రమంలో భాగంగా మోదీ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్ఫాంకు శంకుస్థాపన చేశారు. హుబ్బళ్లిలోని శ్రీ సిద్ధారుదలో 1.5కిలోమీటర్ల పొడవున్న ఈ ప్లాట్ఫాం అరుదైన గుర్తింపు పొందింది. గతవారం లండన్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత పార్లమెంటులో విపక్ష సభ్యుల మైకులు ఆఫ్ చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. దేశంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ రాహుల్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. చదవండి: విద్వేష ప్రసంగంపై ప్రశాంత్ కిశోర్ ట్వీట్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు -
Republic Day: వ్యవస్థకు రక్షణ రాజ్యాంగమే!
ఇవ్వాళ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. మన రాజ్యాంగం అతి దీర్ఘమైన రాజ్యాంగంగా పేరు పొందింది. దీని రచనను పూర్తి చేయడానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. రాజ్యాంగం భారతదేశ అత్యున్నత చట్టం. ఈ పత్రం ప్రాథమిక రాజకీయ నియమావళి, ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణం, విధానాలు, అధికారాలు, ప్రభుత్వ సంస్థల విధులను గుర్తించేలా నిర్దేశించింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పౌరుల విధులనూ నిర్దేశించింది. రాజ్యాంగమే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేది. అదే ప్రభుత్వం, పౌరుల మధ్య... నమ్మకం, సమన్వయాన్ని సృష్టిస్తుంది. రాజ్యాంగాన్ని తెలుసుకోవడం భారత పౌరుని ప్రాథమిక విధుల్లో ఒకటి. అప్పుడే సార్వభౌమ గణతంత్ర సభ్యునిగా, భారతదేశంలోని ప్రతి పౌరుడూ ప్రతిరోజూ వినియోగించుకోవలసిన రాజ్యాంగ హక్కులను పొందుతాడు. ప్రతి పౌరుడి అభివృద్ధి అతని హక్కులు, విధులపై అతనికి ఉన్న అవగాహనపైనే ఆధారపడి ఉంటుంది. ఏ దేశ రాజ్యాంగం అయినా దేశ ప్రగతి కోసం మంచి పాలన, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని ఇవ్వాలి. మన రాజ్యాంగం ప్రకారం జరిగిన ఈ 72 సంవత్సరాల పాలనా కాలంలో దేశం ఎంతో ప్రగతి సాధించింది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం విషయంలో 5వ ర్యాంకులో ఉన్నాం. తయారీ రంగంలో 30వ ర్యాంకులో ఉన్నాం. ఇక వివిధ ఆహార ధాన్యాల, తృణధాన్యాల ఉత్పత్తిలో మనం మొదటి 5 స్థానాన్ని ఆక్రమించాం. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికీ మనం 20 శాతం పేదరికంలోనే ఉన్నాం. 12 శాతం నిరుద్యోగిత రాజ్యమేలుతోంది. విపరీతమైన ఆదాయ అసమానతలూ ఉన్నాయి. వివిధ ప్రపంచ సూచికలలో మనం ఆందోళనకరమైన స్థానాల్లో ఉన్నాం. ఉదాహరణకు ఉగ్రవాద సూచికలో 8వ స్థానం, అవినీతిలో 28వ ర్యాంక్, హ్యాపీ ఇండెక్స్లో 44 ర్యాంక్లో ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమం – రెండింటి కోసం అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు చాలానే ఉన్నా ఇప్పటికీ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే విధానాలు ఉత్తమమైనవే కానీ వాటి అమలులో మాత్రం లోపాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సమస్యలన్నింటినీ మనం ఎప్పటికప్పుడు అధిగమించాలి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ చట్టాలు వంటి ఇటీవలి విధానాలు ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభన సృష్టించాయి. అయితే ఈ సమస్యలన్నీ తగిన రాజ్యాంగ సవరణలతో పరిష్కరించబడతాయి. సానుకూల ఫలితాలను, సమాజ అభ్యున్నతికి హామీ ఇచ్చే విధానాలను సులభంగా స్థాపించగలిగే విధంగా మన చట్టాలను సవరించడం కొనసాగించాలి. రాజ్యాంగాన్ని సముచితంగా అమలు చేయడానికి రాజకీయ రంగంలో, కార్యనిర్వాహక యంత్రాంగంలో నైతిక విలువలు ఉండాలి. ప్రజలు అవసరమైన చోట ప్రశ్నించే అవకాశం ఉండాలి. ప్రతి పౌరుడూ ఇతరుల హక్కులను గౌరవించాలి. చట్టబద్ధంగా, నైతికంగా తన విధులను నిర్వర్తించాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ సారాన్ని ఆస్వాదించగలరు. (క్లిక్ చేయండి: సకల శక్తుల సాధన సబ్ప్లాన్) – డాక్టర్ పి.ఎస్. చారి, మేనేజ్మెంట్ స్టడీస్ నిపుణులు -
National Voters Day 2023: ప్రజల చేతిలోని పాశుపతాస్త్రం
ఈ రోజు భారత ఎన్నికల సంఘాన్ని స్థాపించిన రోజు. 2011 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవంగా కూడా జనవరి 25ను జరుపు కొంటున్నాం. దీని ఉద్దేశం ఓటర్లుగా భారత పౌరులకు ఉన్న హక్కులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించడమే. ఎన్నిల సంఘం (ఈసీ) పనితీరు, నిర్ణయం తీసుకునే స్వతంత్రతను నిర్ధారించడానికి రాజ్యాంగ సభ ఆర్టికల్ 324 ద్వారా రాజ్యాంగ హెూదాను ఇచ్చింది. తక్కువ అక్షరాస్యత, ఉనికిలో లేని ఓటర్ల జాబితా యుగంలో వయోజన ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలను నిర్వహించడానికి శాశ్వతమైన స్వయంప్రతిపత్తి గల కమిషన్ను ఏర్పాటు చేయడం రాజ్యాంగ సభ దూరదృష్టికి ప్రతీక. ఈసీ నిష్పాక్షికత, విశ్వసనీయత ఆధారంగా ఇప్పటివరకు 17 లోక్సభ ఎన్నికలు; రాష్ట్రపతి ఎన్నికలు 16 సార్లు, అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మరో 16 సార్లు ఎన్నికలు నిర్వహించింది. అలాగే 399 సార్లు శాసనసభ ఎన్నికలు నిర్వహించింది. 400వ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చాలావరకు రాజకీయపార్టీల, ప్రజల విశ్వాసాన్ని ఎన్నికల సంఘం చూరగొన్నదనే చెప్పాలి. పటిష్ఠమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి బలమైన, సమ్మిళిత ఎన్నికల భాగస్వామ్యం చాలా కీలకం. శక్తిమంతమైన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సక్రమంగా, విశ్వసనీయంగా ఉండాలి. అదే సమయంలో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ సందర్భంగా ‘మనం విధులను నిర్వర్తించ కుండా వదిలేస్తే, హక్కుల కోసం పరుగు తీయాల్సి ఉంటుంది. అవి మనల్ని ఇష్టానుసారంగా తప్పించుకుంటాయి’ అన్న మహాత్మాగాంధీ మాటలు గుర్తు కొస్తున్నాయి. 94 కోట్లకు పైగా నమోదిత ఓటర్లను కలిగి ఉన్న భారత్... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. గత సార్వత్రిక ఎన్నికలలో (2019) 67.4 శాతం ఓటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. మిగిలిన 30 కోట్ల మంది ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకురావడం ఇప్పుడు మనముందున్న పెద్ద సవాల్. యువత లోనూ, పట్టణ ఓటర్లలోనూ ఉన్న ఉదాసీనత; బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వలసపోవడం వంటి అనేక కారణాల వల్ల ఇంతమంది ఓటింగ్లో పాల్గొనలేదని చెప్పవచ్చు. 2022 నవంబర్ 5న హిమాచల్ప్రదేశ్ కల్పాలో మరణించిన మొట్టమొదటి భారత ఓటర్ శ్యామ్ శరణ్ నేగీకి నివాళులు అర్పించే గౌరవం నాకు లభించింది. ఆయన తన 106వ ఏట మరణించే ముందు కూడా ఓటు హక్కును ఉపయోగించుకుని ఓటు వేయకుండా ఉండే ఉదాసీన పౌరులకు తమ విధి ఏమిటో తెలియచేశారు. ఆయన స్ఫూర్తిని అందరూ అందుకోవాలి. యువ ఓటర్లే భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు. 2000 సంవత్సరం తర్వాత జన్మించిన తరం మన ఓటర్ల జాబితాలో చేరడం ప్రారంభించింది. ఓటర్లుగా వారి భాగస్వామ్యం మొత్తం శతాబ్దమంతా ప్రజాస్వామ్య భవిష్యత్తును రూపుదిద్దబోతోంది. అందువల్ల ఓటు వేసే వయస్సు వచ్చేలోపు పాఠశాల స్థాయిలోనే ప్రజాస్వామ్య బీజం విద్యార్థుల్లో నాటడం అత్యంత క్లిష్టమైనదే కాదు, ముఖ్యమైనది కూడా. ప్రజాస్వామ్యంలో, ఓటర్లకు తాము ఓటు వేసే అభ్యర్థి నేపథ్యం గురించి తెలుసుకునే హక్కు ఉంది. ఈ కారణంగానే అభ్యర్థులపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల గురించి వార్తాపత్రికల్లో తెలియ జేయాలి. ఇప్పటికీ ఎన్నికల్లో కండబలాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించేవారు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం ఉండకూడదు. ఎన్నికల్లో ధనబలాన్ని అరి కట్టడం పెద్ద సవాల్గా మిగిలిపోయింది. చట్టాన్ని అమలు చేసే సంస్థల కఠినమైన నిఘా కారణంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో చాలా వరకు ఇటువంటి విపరీత ధోరణులకు అడ్డుకట్ట పడింది. ఎన్నికలను ప్రభావితం చేయగల స్థాయిలో ఇవ్వాళ సోషల్ మీడియా ఉంది. అందులో నకిలీ వార్తల ప్రచారం జరగకుండా చూడాల్సి ఉంది. ఎన్నికలను అన్ని జాగ్రత్తలతో నిర్వహించడం ఎన్నికల సంఘం విధి. ఎన్నికల ప్రక్రియలో ఓటరే ప్రధాన భాగస్వామి. అందుకే ఓటు వేయడానికి కావలసిన స్నేహపూర్వక, సుహృద్భావ వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఓటర్లు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనేలా ఈసీ తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి కంకణబద్ధమై ఉంది. పౌరులు ఓటరుగా తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి గర్వపడగలిగితే అది వారు ఎన్నుకున్న ప్రభుత్వ పాలనా స్థాయి మీద కూడా ప్రభావం చూపుతుంది. పౌరు లందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు! (క్లిక్ చేయండి: నిర్లక్ష్యానికి గురవుతున్న బాలికా విద్య) - రాజీవ్ కుమార్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం) -
బైడెన్ బెంబేలు.. ఇలాంటి సన్నివేశాన్ని ఇండియాలో ఊహించగలమా?
అమెరికాలో ఏకంగా ఆ దేశ అద్యక్షుడు జో బైడెన్ నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అదికారులు సోదాలు జరిపినట్లు వచ్చిన వార్త సంచలనాత్మకమైనదే. ప్రజాస్వామ్యంలో ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా, తప్పు చేస్తే తత్పరిణామాలను ఎదుర్కోవలసిందేనని అమెరికా అనుభవం చెబుతుంది. బైడెన్ ఇంటిలో సోదాలు ఏకంగా 13 గంటల పాటు జరిగాయి. అందులో ఆరు రహస్య ఫైళ్లు దొరికాయట. గతంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఉంచుకున్న ఆ ఫైళ్లు పదవి పోయిన వెంటనే ఆర్కివ్స్ కు పంపించవలసి ఉండగా, ఇంటిలోనే ఉంచుకోవడం వివాదాస్పదం అయింది. అది ఆయన అధ్యక్ష స్థానంలోకి వచ్చాక వెలుగులోకి రావడం విశేషం. మరో వైపు ఆయన కుమారుడి వ్యాపార లావాదేవీలపై కూడా విమర్శలు వస్తున్నాయి. అది వేరే సంగతి. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే మన భారత దేశం అమెరికాకన్నా పెద్ద ప్రజాస్వామ్య దేశం. కాని ఇక్కడ మాత్రం అధికారంలో ఉన్నవారి జోలికి తప్పనిసరి అయితే తప్ప సంబంధిత దర్యాప్తు సంస్థలు వెళ్లవు. ఒకవేళ వెళ్లినా అది మొక్కుబడిగానే ఉంటుందని చెప్పనవసరం లేదు. అదే ప్రతిపక్షానికి చెందినవారైతే దర్యాప్తు సంస్థలు జోరుగా విచారణకు వెళతాయన్న అభిప్రాయం ఉంది. అందుకే కేంద్రంలో అదికారంలో ఉన్న పార్టీలోకి ఇతర పార్టీలకు చెందినవారు చేరుతుంటారు. అలాకాకుంటే కొన్నిసార్లు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. గతంలో యుపీఏ టైమ్లో శక్తిమంతమైన నేతగా ఉన్న సోనియాగాంధీని ఆ పార్టీ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ ఎదిరించారు. సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. అంతే! సోనియాగాంధీకి కోపం వచ్చింది. ఏపిలో ప్రతిపక్షపార్టీ అయిన తెలుగుదేశంతో కుమ్మక్కై మరీ జగన్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అదే టైమ్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వచ్చిన అభియోగాలపై విచారణ జరపడానికి న్యాయ వ్యవస్థ కూడా ముందుకు రాకపోవడం గమనించవలసిన అంశం. 2014లో చంద్రబాబు అదికారంలోకి వచ్చాక తెలంగాణలో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు. ఆయనను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని తెలంగాణ సీఎం కేసీఆర్ అనేవారు. కాని కేంద్రంలోని ఎన్.డి.ఎ.లో భాగస్వామిగా టీడీపీ ఉండడంతో చంద్రబాబుకు కేంద్రంలోని కొందరు పెద్దలు రక్షణగా నిలబడ్డారు. అదే సమయంలో కొన్ని వ్యవస్థలలోని వారిని కూడా మేనేజ్ చేయగలిగారని చెబుతారు. ఏదైతేనేమీ ఆయనపై కేసు లేకుండా చేసుకోగలిగారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు బీజేపీకి దూరం అయ్యారు. ఆ తరుణంలో సీబీఐపై ఆయన ఎన్ని ఆరోపణలు చేసింది అందరికి తెలిసిందే. బీజేపీ వారు తనపై కేసు పెట్టబోతున్నారని, ప్రజలంతా వచ్చి తనకు అండగా ఉండాలని కోరేవారు. అసలు సీబీఐని ఏపీలోకి రాకుండా ఆంక్షలు పెట్టారు. తర్వాత 2019లో ఆయన అధికారం కోల్పోయారు. తదుపరి ఆదాయపన్ను శాఖ చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడి ఇంటిలో సోదాలు చేసి రెండువేల కోట్ల విలువైన అక్రమాలకు ఆధారాలు దొరికాయని ప్రకటించింది. కానీ చంద్రబాబు తన వైఖరి మార్చుకుని బీజేపీని ఒక్క మాట అనకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎవరూ తన జోలికి రాకుండా కేంద్రాన్ని మేనేజ్ చేసుకోగలిగారని చాలామంది భావిస్తుంటారు. అంతేకాదు. రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారిలో ఇద్దరిపై పలు ఆరోపణలు ఉన్నాయి. వారిపై ఐటీ, ఈడీ వంటి సంస్థలు దాడులు చేశాయి. ఒకాయన అయితే ఏకంగా ఏడువేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు బకాయిపడ్డారు. అయినా ఆయన బీజేపీలో చేరాక దర్యాప్తు సంస్థలు మరీ అంత సీరియస్గా వ్యవహరించలేదన్న అభిప్రాయం ఉంది. మరో వైపు బీజేపీ అంటే పడని పార్టీల నేతలపై సీబీఐ పలుమార్లు దాడులు చేసిందన్న విమర్శలు ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఏకంగా జైలుకు వెళ్లవలసి వచ్చింది. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా ఇలాగే చిక్కుల్లో పడ్డారు. కేరళ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపై సీబీఐ అధికారులు జరిపిన దాడులు సంచలనమే. పశ్చిమబెంగాల్ లో ఒక మంత్రి వద్ద రూ.45 కోట్లు పట్టుబడ్డాయి. ఆ తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ బీజేపీపై మరీ అంత గట్టిగా ఉండకుండా జాగ్రత్తపడుతున్నారు. తెలంగాణలో లిక్కర్ స్కామ్కు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెపైనే ఈడి ఆరోపణలు చేయడం, దానిని బీఆర్ఎస్ నేతలు ఖండించడం జరిగింది. ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ ఊబిలో దిగబడుతున్నాయన్న భావన ఉంది. మరి అమెరికాలో అధ్యక్ష స్థానంలో ఉన్న నేత ఇంటిలోనే ఎఫ్బీఐ సోదాలు జరిపితే మన దేశంలో మాత్రం ఒక్కొక్కరిపట్ల ఒక్కో రకంగా ప్రమాణాలు పాటిస్తున్నాయన్న అభిప్రాయం ఉండడంలో తప్పులేదేమో! -హితైషి -
అంబేడ్కర్ అనంతర భారతం ఇదేనా?
దేశ రాజకీయాలను ప్రభావితం చేసే చారిత్రాత్మక వేదికగా ఖమ్మం సిద్ధమైంది. ఒకనాడు ఎర్రకొండగా ఉన్న స్తంభాద్రి ఇప్పుడు ఎర్రకోటపై ప్రజల అజెండాను ఎగుర వేసే ఒక మహాశక్తికి శంఖారావ క్షేత్రం అవుతోంది. బీఆర్ఎస్ ఒక మహోన్నత సమాజ నిర్మాణం వైపు అడుగులు వేస్తూ సృజనాత్మక మార్పుకు నడుంబిగించే సభకు ఖమ్మం గుమ్మం స్వాగతం పలుకుతోంది. దేశం అన్ని రంగాల్లో దివాళా తీసింది. ఎంతో స్ఫూర్తితో నిర్మించుకున్న ప్రభుత్వ రంగం కొడిగట్టే దీపమవుతోంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతున్న తరుణంలో ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ గొంతు విప్పబోతుంది. ఎమర్జెన్సీ తర్వాత అన్ని ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడటంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు కదిలిన లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ వెంట దేశం నడిచింది. ఆనాడు ప్రజాస్వామ్య పరిరక్షణకు లెఫ్ట్, రైట్లందరూ కలిసి నడిచారు. ఇవ్వాళ కూడా కేంద్రంలో పెద్దలు రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తీరును చాటిచెబుతూ దేశంలోని ప్రజాస్వామిక శక్తులందర్నీ కూడగట్టవలసిన అవసరం ఉంది. దేశానికి అత్యవసరమైన ఆర్థిక విధానాలను రచించుకోవాలి. 2014 నుంచి దేశం ఉత్పత్తిని పెంచుకోవటంలో పూర్తిగా వెనుకడుగు వేస్తూ ఉంది. ప్రభుత్వ రంగ ఆస్తులను మాత్రం తెగనమ్మటంలో ముందుంది. తక్షణం ఈ అమ్మకాల నుంచి దేశాన్ని కాపాడాలి. సహజ వనరులను, అడవి సంపదలను గుత్తకు అప్పజెబుతున్న తీరుకు అడ్డుకట్టవేయాలి. నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగాన్ని తగ్గించడానికి యువతను ఉత్పత్తి రంగంలో ఎక్కువగా వాడుకోవాలి. భారీగా పెరిగిపోయిన ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు జరపాలి. అంబేడ్కర్ పేరు జెప్పి ఆయన ఆశయాలను నిర్వీర్యం చేస్తున్న తీరును ఎత్తి చూపాలి. ఒక కులానికి వ్యతిరేకంగా మరొక కులాన్నీ, ఒక మతానికి వ్యతిరేకంగా మరో మతాన్నీ రెచ్చగొట్టి విద్వేష భారతాన్ని రచిస్తున్న తీరుకు అడ్డుకట్టవేయాలి. భారత గడ్డపై పుట్టిన వాళ్లనే పరాయి వాళ్లను చేస్తున్న తీరు ప్రమాదకరమైనది. దేశభక్తి కావాలి కానీ విద్వేషభక్తి ఉండకూడదు. ఒక్క భాషపైననే ప్రేమకాకుండా దేశ ప్రజలు మాట్లాడే అన్ని భాషలపై ప్రేమ ఉండాలి. ఇతరులపై గుడ్డి ద్వేషాన్ని పెంచే భావజాలం ఏదైనా అది విషాన్ని నింపటం కంటే ప్రమాదకరమైనది. చివరకు పాఠ్యప్రణాళికల్లో కూడా మతభావనలు చూపించే దశకు పోవటం అన్యాయమని ఎవరైనా అడిగితే వారిని జాతివ్యతిరేకి అంటున్నారు. లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థలను పరిరక్షించకపోతే దేశం కుప్పకూలుతుంది. మహాత్మాగాంధీ, జ్యోతిబాఫూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ అనంతర భారతం ఇదేనా? దేశాన్ని సంపన్న భారతం చేయమంటే వలసల భారతంగా మార్చేశారు. వారి దుందుడుకు విధానాల పట్ల మొత్తం జాతిని మేల్కొలిపి ముందుకు నడిపించటానికే ఖమ్మం వేదికగా ప్రజల అజెండాకు రూపకల్పన జరుగుతోంది. కమండలాలకు సరైన సమాధానం చెప్పి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం నిలిపిన లల్లూప్రసాద్ యాదవ్లాగా, ములాయంసింగ్ యాదవ్లాగా, ఒక వీపీసింగ్ లాగా దేశంలోని వలస భారతానికి ధైర్యం చెప్పే సత్తా ఒక్క కేసీఆర్కే ఉంది. తమకు అనుకూల రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక పద్ధతీ, తమకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలపైన కక్షకట్టే రాజకీయాలూ పోవాలి. తమకు అను కూలురైన సీఎంలు లేకపోతే గవర్నర్తో పాలి స్తామనే సంస్కృతి ఫెడరల్ వ్యవస్థను పెను ప్రమాదంలో పడవేస్తుంది. సంప్రదాయాల్లోకి, విశ్వాసాల్లోకి, నమ్మకాల్లోకి, మతాల్లోకి, కులాల్లోకి, గనుల్లోకి, గుడుల్లోకి, బడుల్లోకి, వనాల్లోకి, అడవుల్లోకి మన ఇంటి గడపల్లోకి, మంది మెదడుల్లోకి అన్నిట్లోకి తమ పాత భావాలను, ఛాంద సత్వాన్ని చొప్పించి ప్రజాస్వామ్యాన్ని లౌకికత్వాన్ని అవహేళన చేస్తున్నారు. ఎవరు తమను ప్రశ్నించినా ఈడీలు, బేడీలు వేస్తున్నారు. అన్ని వ్యవస్థలూ కళ్లముందే ధ్వంసం అవుతున్నప్పుడు ఇదేమి న్యాయమని అడిగితే నేరుగా జైలుకే పంపించేస్తున్నారు. ఇది ఫాసిజం కంటే ప్రమాదకమైనది. ఇపుడు తక్షణంగా దేశాన్ని రక్షించుకునేందుకు దేశభక్తియుత ఉద్యమాలు రావాలి. అటువంటి ఉద్యమాన్నే కేసీఆర్ ఖమ్మం వేదికగా ప్రారంభి స్తున్నారు. ఆ ఉద్యమంలో దేశ ప్రజ అంతా భాగం కావాలి. (క్లిక్ చేయండి: జాతీయత కొరవడిన పార్టీ.. స్వార్థ ప్రయోజనానికే పెద్దపీట) - జూలూరి గౌరీశంకర్ ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ (జనవరి 18న ఖమ్మంలో బీఆర్ఎస్ జనగర్జన) -
రాహుల్ స్పీచ్లు చూసి వాళ్లు భయంతో వణికిపోతున్నారు: సీఎం స్టాలిన్
చెన్నై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. భారత్ జోడో యాత్రలో రాహుల్ స్పీచ్లు చూసి కొందరు భయంతో వణికిపోతున్నారని అన్నారు. ఆయన ప్రసంగాలు చూస్తుంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తుకు వస్తున్నారని కొనియాడారు. నేహ్రూ, గాంధీల వారసులు మాట్లాడుతుంటే గాడ్సే భక్తులకు మండుతోందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తన స్పీచ్లలో ఎన్నికలపరమైన రాజకీయాల గురించి మాట్లాడటం లేదని, సిద్ధాంతపరమైన రాజకీయాల గురించే ప్రస్తావిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ ప్రసంగాలు చూసి కొన్ని పార్టీలు భయపడుతున్నాయన్నారు. భారత తొలి ప్రధాని నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యవాది అని స్టాలిన్ అన్నారు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంస్థలను అమ్మెస్తోందని, పార్లమెంటులో ప్రతిపక్షాలు మాట్లాడటానికి కూడా అనుమతించకుండా గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భారత్-చైనా బలగాల ఘర్షణ విషయంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా బీజేపీ నిరాకరించింది. సభ్యులు సభలో ఆందోళనలు చేయడంతో రోజూ వాయిదాల పర్వాన్నే కొనసాగించింది. ఈ నేథ్యంలోనే శీతాకాల సమావేశాలను ఆరు రోజులు ముందుగానే ముగించింది. చదవండి: మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ! -
ప్రజాస్వామ్యం వర్సెస్ నిరంకుశత్వం...బైడెన్కి చైనా కౌంటర్
అమెరికా అధ్యక్షుడు అధ్యక్షుడు జోబైడెన్ ప్రస్తుత ప్రపంచ రాజకీయా స్థితిని విషతుల్యంగా ఉన్నాయని తరచుగా చెబుతుంటారు. ఇలాంటి స్థితిలో ప్రజలకు ప్రజావస్వామ్య వ్యవస్థ, నియంత్రణ వ్యవస్థలలో ఏదో ఒకటి ఎన్నుకునే సందిగ్ధ స్థిత ఏర్పడటమో లేదా ప్రపంచాన్ని పూర్తిగా మార్చే ఆవశ్యకతను గుర్తించడమో జరుగుతుందన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు నాయకుడిగా జీవితాంతం ఉండాలని యోచిస్తున్నాడంటూ ఆందోళన లేవనెత్తారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రజాస్వామ్యం వర్సెస్ నిరంకుశత్వంగా పిలిచే కథనం నేటి ప్రంపచాన్ని నిర్వచించలేకపోవచ్చు కానీ కాలపు ధోరణిని మాత్రం సూచిస్తుందని బైడెన్తో అన్నారు. అలాగే తమ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, మానవాళి తదితరాలు గురించి సదా అన్వేషిస్తోందని చెప్పారు. అలాగే అమెరికాలో అమెరికా స్టైల్లో చైనాలో చైనీస్ స్ట్రైల్లో ప్రజాస్వామ్యం ఉంటుందని బైడెన్కి గట్టి కౌంటరిచ్చారు జిన్పింగ్. ఐతే మానవహక్కుల సంఘాలు, పాశ్చాత్య నాయకులు, విద్యావేత్తలు జిన్పింగ్ని నియంతృత్వం అని పిలిచే చైనీస్ పార్టీకి నాయకుడని విమర్శిస్తారు. చైనాలో స్వతంత్ర న్యాయవ్యవస్థ, స్వేచ్ఛ మీడియాతో సహా జాతీయ కార్యాలయానికి సార్వత్రిక ఓటు హక్కు లేదని, పైగా పార్టీ విమర్శకులు ఆన్లైన్ సెన్సార్ చేయబడటం లేదా ఆఫ్లైన్లో నిర్బంధించబడటం వంటివి జరుగుతాయని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. గతేడాది జో బెడెన్ ఈ అంశాలపై వర్చువల్ సదస్సు కోసం సుమారు 100 మంది ప్రపంచ నాయకులను ఆహ్వనించారు. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యాన్ని స్వాగితిద్దామా? లేదా మనమంతా ఒకే విజన్ని కిలిగి ఉందామా అని నాయకులకు పిలుపునిచ్చారు. ఆ సదస్సులో మానవ పురోగతి, మావన స్వేచ్ఛను ముందుకు నడిపించలా వద్దా అనే దానిపై ప్రసంగించారు. ఐతే ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్కి ఆహ్వానించకపోవడంతో దీన్ని విభజన అంటూ కామెంట్లు చేసింది చైనా. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ 2021 చివరిలో ముప్పులో ఉన్న ప్రజాస్వామ్య దేశాల సంఖ్య రికార్డు స్థాయిలో ఉన్నట్లు పేర్కొంది. (చదవండి: అమెరికా సెనేట్పై పట్టు నిలుపుకున్న డెమొక్రాట్లు) -
న్యాయవ్యవస్థే కాపాడాలి.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యే లేకున్నా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నించడం చిన్న విషయమేమీ కాదని.. ఇలాంటి పద్ధతులు కొనసాగితే దేశంలో ఉద్రిక్తతలు, హింస తలెత్తి.. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. భారత న్యాయవ్యవస్థకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ దుర్మార్గాలను అడ్డుకునేందుకు, దేశాన్ని రక్షించుకునేందుకు చావాల్సి వస్తే.. అందుకు సిద్ధమని, ప్రాణాలు ఇచ్చి పోరాడుతామని ప్రకటించారు. ఎమ్మెల్యే కొనుగోలు అంశాన్ని సింగిల్ కేసుగా చూడకూడదనే ఉద్దేశంతోనే ఎన్నికల సంఘం సహా దేశంలోని అత్యున్నత వ్యవస్థలు, సంస్థలకు ఆధారాలు పంపిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కలకలం రేపిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ఘటనపై సీఎం కేసీఆర్ తొలిసారిగా అధికారికంగా స్పందించారు. ఈ మేరకు గురువారం రాత్రి ప్రగతిభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజానికి రెండు రోజుల క్రితమే మీడియా ముందుకు రావాలనుకున్నానని.. కానీ మునుగోడు ఉప ఎన్నికలో లాభం కోసం చేశారనే చిల్లర ఆరోపణలు వస్తాయనే ఉద్దేశంతో పోలింగ్ ముగిసే వరకు వేచి చూశానని చెప్పారు. సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘మొదటిసారి భారమైన మనసుతో, దుఃఖంతో చెప్తున్నా.. పదవులున్నా లేకున్నా 40, 50 ఏళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న అనుభవంతో చెప్తున్నా. ఈ దేశం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. దేశంలో దుర్మార్గంగా, నిర్లజ్జగా, విశృంఖలంగా, విచ్చలవిడిగా, నిరాఘాటంగా ప్రజాస్వామ్య హత్య జరుగుతోంది. ప్రజాస్వామ్య హంతకుల స్వైర విహారం దేశ పునాదులకే ప్రమాదకరం. ఊహకు కూడా అందే పరిస్థితి లేనందునే షాక్తో మాట్లాడుతున్నా. న్యాయవ్యవస్థకు చేతులు జోడిస్తున్నా.. గతంలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినపుడు న్యాయవ్యవస్థ గొప్ప పాత్ర పోషించింది. ఇప్పుడు దేశం ప్రమాదంలోకి వెళ్లకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని న్యాయవ్యవస్థతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లలిత్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అన్ని రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్లను చేతులు జోడించి కోరుతున్నాను. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఆధారాలను దేశంలోని సీబీఐ, ఈడీ, సీవీసీతోపాటు అన్ని ప్రముఖ జాతీయ, మీడియా సంస్థలకు శుక్రవారం మధ్యాహ్నంలోగా చేరవేస్తున్నాం. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల అధ్యక్షులకు కూడా పంపిస్తున్నాం. రాజ్యాంగేతర శక్తుల చేతిలో దేశం కర్ణాటక ఎమ్మెల్యేలకు మారువేషాలు వేసి తీసుకెళ్లిన తీరును నిందితులు పూసగుచ్చినట్టు చెప్పారు. ఈవీఎంలు ఉన్నంత వరకు బీజేపీకి ఢోకా లేదని చెప్పారు. భారతదేశం రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో ఉన్నట్టు వీరి మాటల ద్వారా వెల్లడవుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక ఉన్న దొంగల ముఠా వీర విహారాన్ని అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన చెదలను నిర్మూలించాల్సి ఉంది. మన రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బీజేపీ నేతలు చెప్పడం ప్రజాస్వామ్యంలో వాంఛనీయమా. నెల రోజుల ముందు నుంచే రామచంద్రభారతి అనే వ్యక్తి ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో మొదట ఫోన్లో, తర్వాత ప్రత్యక్షంగా మాట్లాడటంతో వాళ్ల ప్రణాళిక అర్థమైంది. విచారణ జరపాలని హోంమంత్రికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ముఠాలోని వారికి రెండు మూడు ఆధార్లు అమ్ముడుపోయే ఎమ్మెల్యేలకు ఈడీ, ఐటీ సంస్థలతోపాటు వై ప్లస్ భద్రత కల్పిస్తామని రాజ్యాంగేతర శక్తులు చెప్పడం చూస్తే దేశంలో ఏం జరుగుతోందో అర్థమవుతుంది. ఈ ముఠాలో 24 మంది ఉండగా వారందరికీ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి రెండు మూడు ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు వేర్వేరు వివరాలు ఉన్నాయి. కేరళలోని వయనాడ్లో రాహుల్ గాంధీ మీద బీజేపీ టికెట్తో పోటీ చేసిన తుషార్ అనే వ్యక్తితో బ్రోకర్లు మాట్లాడారు. తుషార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వ్యక్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షానే. ఈ దురాఘాతాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి ఎనిమిదేళ్లలో బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసింది. దేశాన్ని విభజించేలా క్రూర పద్ధతుల్లో ప్రజాస్వామ్య జీవనాడిని కలుషితం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను చూసి బాధపడుతున్నా. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చి బలహీనపర్చే కుట్రలు జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరూ దేశంలో జరుగుతున్న ఈ దురాఘాతాలను తెలుసుకోవాలి. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత నాటి ప్రధాని ఇందిరకు ఎదురేలేదని భావిస్తున్న తరుణంలో ఎమర్జెన్సీ విధింపు, ఆ తర్వాత జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో వచ్చిన ఉద్యమంలో ప్రజలు ఎలా స్పందించారో తెలుసు. ఏళ్లపాటు నిర్బంధం ఎదుర్కొన్న మాలవ్యా, పాశ్వాన్, దండావతే వంటి నేతలు లక్షల మెజారిటీతో గెలిచారు. తద్వారా ప్రజాస్వామ్యానికి ఎవరు భంగం కలిగించినా సహించబోమని ప్రజలు నిరూపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం మేం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్య పద్ధతిలోనే విలీనం చేసుకున్నాం. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటికి వచ్చారు. కానీ కొందరు మునుగోడు ఉప ఎన్నికలో వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి నన్ను కలిశారనే ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ప్రజాతీర్పును గౌరవించాలి. ఎన్నికల సంఘం, సీఈవో ఫెయిల్ అంటూ కొందరు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యమ సమయంలో మేం అనేక ఎన్నికల్లో పోటీ చేసినా ఇంత హేయంగా ఎన్నడూ మాట్లాడలేదు. ప్రజాస్వామ్య మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలతోపాటు మీడియా పట్ల కూడా వారికి గౌరవం లేదు.’’ చూస్తూ ఊరుకోబోం మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామని చెప్పి మా రాజధానిలో వ్యవహారం చేస్తే చేతులు ముడుచుకుని కూర్చుని, అరాచకాలను భరించాలా? చూస్తూ ఊరుకోబోం.. పోరాడుతాం. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాం. ఎమ్మెల్యేలను కొనడానికి అసలు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే పార్టీలకు అతీతంగా కొట్లాడాం. నాలుగింట మూడింతల మెజారిటీ ఉన్న ప్రభుత్వాలను ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా కూల్చేయాలనే కుటిల రాజకీయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. మోదీ.. ఈ దుర్మార్గాలను ఆపండి ప్రధాని మోదీ గారూ.. నేను మీ రాజకీయ సహచరుడిని. మీరు ప్రధానమంత్రి అయినప్పుడే నేను ముఖ్యమంత్రిని. ఎనిమిదేళ్లుగా కలిసి పనిచేస్తున్నాం. రెండుసార్లు ప్రధాని అయ్యారు. ఇంకేం కావాలి? మంచి పనులు చేసి, మంచి పేరు తెచ్చుకోండి. చరిత్రలో గుర్తింపు పొందండి. స్వయంగా అడుగు ముందుకేసి ఈ దుర్మార్గంలో పాత్ర కలిగిన వారందరినీ అరెస్టు చేయించండి. దర్యాప్తు చేయించండి. అలాకాకుండా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం ద్వారా, ప్రభుత్వాలను కూల్చడం ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ దుర్మార్గాలను ఆపండి. ఇలా చేయడం దేశానికి, మీకు మంచిది కాదు. దేశచరిత్రలో మీ స్థానం దిగజారిపోతుంది. ఎంత శక్తివంతుడైనా వందేళ్లకు మించి బతకరు. ఎందుకు చెడ్డ పనులు చేయాలి? దీనికి ఫుల్స్టాప్ పడాలి. పట్టపగలు మీ పేరు, మీ హోంమంత్రి పేరు చెప్పి అరాచకాలకు పాల్పడుతున్నారు. దీనికి కళ్లెం వేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశానికి కళంకం తీసుకురాకండి. అమిత్షా పేరు 20సార్లు చెప్పారు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దాగిన భయంకరమైన దగా, కుట్రలు వింటే ఆశ్చర్యం కలుగుతోంది. వారు 20సార్లు అమిత్షా పేరు, ఒకట్రెండు సార్లు మోదీ పేరు చెప్పారు. రిసార్టుల్లో ఉండి ప్రభుత్వాలను కూలగొట్టానని పసుపు పచ్చ బట్టలాయన (సింహయాజీ) చెప్పారు. ఎనిమిది ప్రభుత్వాలను కూల్చామని, మరో నాలుగు కూల్చే ప్రయత్నాల్లో ఉన్నామని చెప్పారు. తెలంగాణ, ఢిల్లీలలో బేరాలు అయిపోయాయి. తర్వాత ఆంధ్ర, రాజస్థాన్లలో ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పారు. వెంటనే ఢిల్లీ సీఎంను అప్రమత్తం చేశాం. ఇది రాజకీయమా? ఇది ప్రజాస్వామ్యమా? ప్రభుత్వాలు కూలిన చోట మౌనం పాటించారు కాబట్టే ఈ దుర్మార్గ ముఠా ఆగడాలు చెల్లుబాటయ్యాయి. కానీ చైతన్యవంతమైన తెలంగాణ ఈ ముఠా ఆట కట్టించి వారి చర్యలను బయటకు తెచ్చింది. మేధావులు, యువత మౌనం వీడాలి బీజేపీ ఒళ్లు మరిచి చేస్తున్న అరాచక కాండ జుగుప్సాకరంగా ఉంది. ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని స్వయంగా దేశ ప్రధాని చెప్పడం దేనికి సంకేతం? నెల రోజుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని దేశ హోంమంత్రి చెప్పడం ప్రజాస్వామ్యంలో వాంఛనీయమా? దేశ ప్రజలు, యువత, మీడియా ముక్త కంఠంతో ఖండించకపోతే దేశం ఉనికి, ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో దిగజారుతుంది. ఒకసారి దేశం దెబ్బతింటే వందేళ్లు వెనక్కి పోతుంది. మఠాధిపతులు వేషాలు, రూపాలు మార్చి దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఆ పరిస్థితులు మారాలి. రాబోయే రోజుల్లో జయప్రకాశ్ నారాయణ్ తరహాలో జరిగే ఉద్యమాలకు యువత, విద్యార్థులు, మేధావులు మౌనం వీడి మద్దతునివ్వాలి. 2015 నుంచి వారి కాల్డేటా తీశారు బీఎల్ సంతోష్, అమిత్ షా, జేపీ నడ్డా పేర్లను బ్రోకర్లే చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్యేలను ప్రలోభపర్చే కుట్రలో పాల్గొన్న మధ్యవర్తుల ఫోన్లను పోలీసులు సీజ్ చేసిన తర్వాత వారి కుట్ర కోణమంతా బయటపడింది. 2015 నుంచి ఇప్పటివరకు దేశంలో ఏం జరిగిందో వీళ్ల చరిత్ర ఏందో మొత్తం బయటపడింది. పోలీసులు కాల్డేటాను, ల్యాప్టాప్లలోని డేటాను తీశారు. మూడు గంటల వీడియోలో కుట్ర బహిర్గతమైంది. మొత్తం డేటాను ఉన్నదున్నట్టు హైకోర్టుకు సమర్పించారు. 70వేల నుంచి 80 వేల పేజీలు అయింది. హైకోర్టుకు వెళ్లిన తర్వాత ఇది పబ్లిక్ డొమైన్లోకి వెళ్లింది. సీఎం పక్కనే ‘ఆ నలుగురు’ఎమ్మెల్యేలు ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో కీలకమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్రెడ్డి, రేగ కాంతారావు, బి.హర్షవర్ధన్రెడ్డి నలుగురూ మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ పక్కనే కూర్చోవడం గమనార్హం. ఇక ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్గౌడ్లతో పాటు పార్టీ సెక్రెటరీ జనరల్ కే.కేశవరావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: మునుగోడులో పోలింగ్ శాతం 90 ప్లస్ -
Anti Defection Law: మేడిపండు ప్రజాస్వామ్యం
భారత రాజ్యాంగంలో పేర్కొన్న పార్లమెంట్, శాసన సభల వ్యవస్థలు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వంటివి చెప్పే ప్రజాస్వామ్యం మేడిపండు లాంటిదని కొన్ని సంవత్సరాలుగా రుజువవు తూనే ఉంది. నేడు తెలంగాణలో ఫామ్హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆ కంపును మరింత వ్యాపింప చేసింది. భారత రాజ్యాంగంలో ఒక పార్టీ తరఫున చట్ట సభలకు ఎన్నికై మరొక పార్టీలోకి వెళితే అతని సభ్యత్వం రద్దు అవుతుందని మొదట్లో పేర్కొన లేదు. అందువల్ల కొందరు పార్టీలు మారి కొన్ని ప్రభుత్వాల పతనానికి కారకులయ్యారు. 1952–67 మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు జరిగి ప్రభుత్వాలు మారిపోయాయి. 1967లో లోక్సభతో పాటు 16 రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు జరగగా... ఎనిమిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెజారిటీ కోల్పోయింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెద్ద పార్టీగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి, తర్వాత పార్టీ ఫిరాయింపులు చేయించి మెజారిటీ పొందింది. 1967–71 మధ్య పార్లమెంట్, శాసనసభకు ఎన్నికైన నాలుగు వేల మంది సభ్యుల్లో 2 వేల మంది పార్టీ ఫిరాయింపులు చేశారు. ఫిరాయింపుల పట్ల ప్రజల్లో అసహ్యం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1979లో తొలిసారి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించింది. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ చేసి ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది. 2003లో వాజ్పేయి ప్రభుత్వం 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ లోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరికొన్ని సవరణలు చేసింది. దీని ప్రకారం ఒక పార్టీ తరఫున టికెట్టు పొంది ఎన్నికైన సభ్యుడు ఆ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడూ, పార్టీ జారీ చేసిన విప్కు వ్యతిరేకంగా ఓటింగ్కు హాజరు కానప్పుడూ, విప్కు వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడూ, స్వతంత్ర సభ్యులుగా ఎన్నికైన సభ్యులు ఏదైనా పార్టీలో చేరినప్పుడూ; నామినేట్ అయిన పార్లమెంట్, శాసనసభ సభ్యులు 6 నెలల్లోపు ఏదైనా పార్టీలో చేరినప్పుడూ సభ్యత్వాలు రద్దు అవుతాయి. ఈ చట్టంలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ మొత్తం శాసన సభ్యుల్లో 2/3 వంతుల మంది వేరే పార్టీలో చేరినప్పుడు, లేదా స్వతంత్రంగా పార్టీ పెట్టిన ప్పుడు వారి సభ్యత్వాలు రద్దు కావు. చట్టంలో ఉన్న కంతలు ఉపయోగించుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తన వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్నాయి. 2016లో అరుణా చల్ప్రదేశ్లో 45 కాంగ్రెస్ సభ్యుల్లో ఆ పార్టీ ముఖ్యమంత్రితో సహా 44 మంది సభ్యులు ‘పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్’లో విలీనమయ్యారు. ఉత్తరాఖండ్లోనూ ఇలాగే జరిగింది. తెలంగాణలోనూ 2/3 మంది కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్లో చేరారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సభ్యుల చేత రాజీనామా చేయించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టించి, తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 23 మంది వైసీపీ శాసనసభ్యులు రాజీనామాలు చేయకుండానే చంద్రబాబు పార్టీలో చేరి కొందరు మంత్రులయ్యారు. కర్ణాటకలో కొందరు కాంగ్రెస్ శాసన సభ్యుల చేత రాజీనామాలు చేయించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది. చట్ట సభల స్పీకర్లు రాజకీయ పార్టీలు కోరినా... గీత దాటిన సభ్యులపై అనర్హత వేటు వేయడంలో పక్షపాతం చూపిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి ఎడల అనర్హత వేటు వేయకుండా పదవీ కాలం ముగిసేవరకు సభ్యునిగా కొనసాగే వైఖరిని తీసుకుని... వ్యతిరేకంగా ఉన్న సభ్యునిపై వెంటనే అనర్హత వేటు వేస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తాజాగా టీఆర్ఎస్ శాసనసభ సభ్యుల కొనుగోలు వ్యవహారంలో వివాదం సాగుతోంది. పరస్పర ఆరోపణలు జగుస్సాకరంగా సాగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బాగా పరిఢవిల్లుతోందో అర్థమవుతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రజలు ఉద్యమించాలి. (క్లిక్ చేయండి: కళ్లముందున్న వివక్ష కనబడదా?) - బొల్లిముంత సాంబశివరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,రైతు కూలీ సంఘం (ఏపీ) -
ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
కోల్కతా: ‘‘దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అధికారాలన్నింటినీ క్రమంగా అధికార పార్టీ నేతృత్వంలోని ఒకే ఒక వర్గం చెరబడుతోంది. ఈ పెడ ధోరణి ఇలాగే కొనసాగితే దేశం అంతిమంగా అధ్యక్ష తరహా పాలనలోకి వెళ్లేందుకు ఎంతో కాలం పట్టదు’’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన వెలిబుచ్చారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడేందుకు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. ఆదివారం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎన్యూజేఎస్) స్నాతకోత్సవంలో మమత పాల్గొన్నారు. వర్సిటీ చాన్సలర్ అయిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్తో సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దయచేసి ప్రజాస్వామ్యాన్ని, దేశ సమాఖ్య వ్యవస్థను కాపాడండి’’ అంటూ సీజేఐని అభ్యర్థించారు. ఏ అంశంపై అయినా కోర్టుల్లో తీర్పు వెలువరించడానికి ముందే మీడియా సొంత తీర్పులు ఇచ్చేస్తోందంటూ మండిపడ్డారు. ‘‘వారు ఎవరినైనా నిందించొచ్చా? ఎవరి మీదైనా అభియోగాలు మోపొచ్చా? మా ప్రతిష్ట మాకు ప్రాణం. అది పోతే సర్వం పోయినట్టే. ఇలా మాట్లాడుతున్నందుకు మన్నించండి. తప్పయితే క్షమాపణలు చెబుతా. ప్రజలు న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయారని నేననడం లేదు. కానీ కొద్ది రోజులుగా పరిస్థితులు బాగా దిగజారుతున్నాయి. ప్రజలు నిశ్శబ్దంగా రోదిస్తున్నారు. వారి ఆక్రందనను న్యాయ వ్యవస్థ ఆలకించాలి. ఈ అన్యాయం బారి నుంచి కాపాడాలి’’ అని సీజేఐని కోరారు. -
‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’.. సీజేఐకి దీదీ వినతి
కోల్కతా: ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే దేశం రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థను కాపాడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐకి విజ్ఞప్తి చేశారు. కోల్కతాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సైన్స్ కాన్వకేషన్ కార్యక్రమానికి సీజేఐ యూయూ లలిత్ హాజరైన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు మమత. ‘ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. వారు ఎవరినైనా దుర్భాషలాడగలరా? వారు ఎవరినైనా నిందించగలరా? సర్, మన గౌరవం దెబ్బతింటోంది. తీర్పు వెలువడేలోపే ఎన్నో జరిగిపోతున్నాయని చెప్పేందుకు చింతిస్తున్నాను. నేను చెప్పేది తప్పు అనుకుంటే, క్షమించండి.’అని పేర్కొన్నారు మమతా బెనర్జీ. ఎన్యూజేఎస్ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా అభివర్ణించారు దీదీ. ఈ సందర్భంగా సీజేఐ యూయూ లలిత్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: ‘తప్పుచేశా.. క్షమించండి’..గుడిలో చోరీ చేసిన సొత్తు తిరిగిచ్చిన దొంగ -
ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి ట్రంప్ కుట్రలు
వాషింగ్టన్: అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు కుట్రలు పన్నుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. అధికారం దక్కించుకోవడానికి దుర్బుద్ధితో రాజకీయ హింసను ఎగదోస్తున్న వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని, తగిన గుణపాఠం నేర్పాలని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. ‘తీవ్రవాదులను’ కచ్చితంగా ఎదిరించాలని చెప్పారు. ఫిలడెల్ఫియాలోని ప్రఖ్యాత ఇండిపెండెన్స్ హాల్లో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతిపక్ష రిపబ్లికన్లపై విరుచుకుపడ్డారు. ట్రంప్ మద్దతుదారుల అజెండా అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పేనని తేల్చిచెప్పారు. వారి దుశ్చర్యల వల్ల సమానత్వం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. వారికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, అధికారమే పరమావధిగా భావిస్తున్నారని ధ్వజమెత్తారు. డొనాల్డ్ ట్రంప్, ఆయన అనుచరుల ఆటలు సాగవని హెచ్చరించారు. నాయకుడి పట్ల గుడ్డిగా విధేయత ప్రకటించడం, రాజకీయ హింసలో పాల్గొనడం వంటివి ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయన్న సత్యాన్ని చరిత్ర మనకు నేర్పుతోందని బైడెన్ ఉద్ఘాటించారు. -
పదును తగ్గని యుద్ధం చేసినోళ్లం
దాడి ఒకలాగుండదు... ఒక రూపంలో ఉండదు... దాడికి పలు రూపాలు, పలు అవతారాలు! ఏ విశ్వాసాలను నమ్మకాలనైనా అడ్డుపెట్టుకుని అమాంతం దాడి చేయవచ్చు. దాడి చేయటమన్నది పథకం ప్రకారం ఆట మధ్యలో అవాంతరాలు సృష్టించి అడ్డంగా గెలవటం లాంటిది కదా! అధికారం కోసం కల్లోలాలు సృష్టించటం, అంతర్యుద్ధాలు సృష్టించటం, సమాజాన్నే రెండు ముక్కలు చేయటం, రెండు మతాల మధ్య మంట రాజేయటం, కులాల మద్య రాజకీయ కుంపట్లు పెట్టటం, పార్టీలను చీల్చటం... ఎన్ని పన్నాగాలో! ఇలాంటి వారికి కొనుగోలు శక్తి తక్కువేం కాదు... దేశాన్ని ఎన్ని రకాలుగా ప్రైవేటైజేషన్ చేయాలో అన్నీ రకాలుగా చేసేశారు. నానా అగచాట్లు పెడతారు. అరగోసలు, అర్వతిప్పలు! ఇపుడు నా దేశ ప్రజాస్వామ్యమనే సౌధం రకరకాల అధికార దాహాలతో చేసే విచ్చలవిడి దాడులతో నెర్రలు బాస్తోంది... లౌకికత్వం తనను తాను రక్షించుకోలేక... భిన్న సంస్కృతుల, భిన్న జాతుల ఐక్యతను కాపాడలేక దురాక్రమణల దాడులకు నిలువలేక తల్లడిల్లుతుంది. జాతి సంస్కృతే చిన్నాభిన్నమౌతూ ఛిద్రమైపోతుంది. ఏమి దౌష్ట్యం? ఏమి దుర్నీతి? ఏమైపోతున్నాం... ఎటుపోతున్నాం. మన దేశ దశ దిశల లక్ష్యం ఏ వైపునకు పయనిస్తుందో కదా! రాష్ట్రాలపై కేంద్రం దాడులు మాములైపోయాయి. రాష్ట్రాలను అస్థిరపరచటం మామూలు క్రీడైపోయింది. ఒక ప్రభుత్వం ఒక్క పూటలో కూలిపోయి ఎప్పుడది వన్డే క్రికెట్ మ్యాచ్ అవుతుందో తెలియదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవటం, వాళ్ల చేతులతో వాళ్లే కూల్చుకునేలా చేయటం షరా మామూలైన స్థితికి ప్రజలస్వామ్యం రావటం చెప్పలేని బాధ. ప్రశ్నలను జోకొట్టవచ్చనే భ్రమలు బాగా పెరిగాయి. ప్రశ్నిస్తే ప్రశ్న నోటిని మూసేసి ప్రశ్నలను కిడ్నాప్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రశ్నలనే బెదిరిస్తూ ప్రశ్నను ప్రశ్నించకుండా ప్రశ్నల గొంతులపై సీబీఐలను పెడ్తుండ్రు. ప్రశ్నల తలలు లేవకుండా పార్టీల అంతర్గత కలహాలు రాజేస్తుండ్రు. ప్రశ్నలు పురి విప్పకుండా ప్రశ్నల గాలులను ఆపాలని చూస్తుండ్రు. ప్రశ్నించకుండా అధికార ముద్రలతో దాడులన్నీ చేస్తుండ్రు. దుర్నీతి రాజకీయాలు చేస్తున్నవాళ్లే చీకటి రోజుల గురించి మాట్లాడుతుండటమే విచిత్ర చిత్రం. ఎందుకో ఈ తెలంగాణ మట్టి ఆధిపత్యాలను ససేమిరా ఒప్పుకోలేదు. మత ఆధిపత్యాన్ని అస్సలు సహించదు. తెలంగాణ పరమత సహన లౌకికతత్వం కోరుకునే మానవీయ మహాతల్లి. తెలంగాణ అందరికోసం తపన పడే బోళాతనమున్న మహాతల్లి. ఇది సృజనాత్మకమైన నేల. సబ్బండ వర్ణాల మహా సంస్కృతిని తనువంతా నిండిన తెలంగాణ నేల ఇది. ఇదొక మానవీయ మహా సమాజం. మానవీయత మత సామరస్యం తెలంగాణ తల్లివేరు. దీన్ని పెకలించటం ఎవరితరం కాదు. మనం ఉరుముల్లా ఉరిమినోళ్లం. జన జాతర్ల మెరుపులుగా మెరిసిన వాళ్లం. పిడుగుల్లా కురిసినోళ్లం. జన జలప్రళయాలుగా పొంగి పొరలినోళ్లం. ఆవేశ ఆగ్రహాలకు ఆది అంతాలుగా నిలిచిన సింహగర్జనలం. (క్లిక్: లిఫ్టులను ప్రభుత్వమే నిర్వహించాలి!) ఒక సుదీర్ఘ ప్రయాణం చేసి లక్ష్యాన్ని చేరుకున్న విజయ చిహ్నాలం కదా... ఇపుడు కమ్ముకొస్తున్న కుల, మత కారు మేఘాలను చెల్లాచెదురు చేయగల శక్తులం మనమే. ఎంతపోరు చేసి ఎన్నెన్ని త్యాగాలు చేసి తెలంగాణను నిలబెట్టుకున్నమో... గెలిచిన తెలంగాణను మత గత్తరల నుంచి, కుల కలరాల నుంచి కాపాడుకోలేమా. మనకు కొత్తగా చెప్పాల్సిన పన్లేదు. చేసిన యుద్ధం పదును ఏ మాత్రం తగ్గనోళ్లం... మనమే గెలుస్తాం. (క్లిక్: సిన్హా ఇప్పుడు ముర్మును అని ఏమి లాభం?) - జూలూరు గౌరీశంకర్ చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి -
Mann Ki Baat: ‘ఎమర్జెన్సీ’లో ప్రజాస్వామ్యాన్ని అణచే యత్నం
న్యూఢిల్లీ : దేశంలో 1975లో అత్యవసర పరిస్థితులు విధించి ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నాలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ నియంతృత్వ పోకడల్ని ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా తిప్పికొట్టారని ప్రపంచంలో మరెక్కడా ఇది కనిపించదని అన్నారు. భారత్కు స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆదివారం మన్కీ బాత్ కార్యక్రమంలో మరోసారి ప్రధాని మోదీ కాంగ్రెస్ని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. తిరిగి 1977 మార్చి 21న ఎత్తివేశారు. ఎమర్జెన్సీకి 47 ఏళ్లయిన సందర్భంగా ప్రధాని దాని గురించి ప్రస్తావిస్తూ ఆ చీకటి రోజుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ జీవించే హక్కుని హరించివేసిందని, అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రభుత్వ తొక్కి పెట్టి ఉంచిందని అప్పటి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చివరికి గాయకుడు కిశోర్ కుమార్ కూడా ఎమర్జెన్సీ చేదు అనుభవాలు ఎదుర్కొ న్నారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ అంతరిక్ష రంగంలో చేస్తున్న ప్రయోగాలను ప్రధాని ప్రశంసించారు. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ: ఏచూరి ప్రధాని మోదీ ఎమర్జెన్సీ వ్యాఖ్యల్ని సీపీఎం నేత సీతారాం ఏచూరి తిప్పికొట్టారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని అప్పట్లో మాదిరిగానే ప్రజలు దీనిని కూడా ఓడిస్తారని జోస్యం పలికారు. -
రాజకీయాల్లో విలువలు, నైతికత ముఖ్యం
సాక్షి, మచిలీపట్నం: ‘పార్టీలు మారే రాజకీయ నాయకుల పదవుల విషయంలో మార్పురావాలి. విలువలు పాటించిన నాయకులనే జాతి కలకాలం గుర్తుంచుకుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో దిగజారుడుతనం, వ్యక్తిగత విమర్శలు ఆందోళనకరంగా ఉన్నాయి. రాజకీయాల్లో విలువలు, నైతికత అత్యంత ఆవశ్యకం’ అని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన కృష్ణాజిల్లా మాజీ జెడ్పీ చైర్మెన్ పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల నడవడిక, ప్రవర్తన, వ్యవహార శైలి ప్రజలను ప్రభావితం చేస్తాయన్నారు. వారసత్వంతో కాదు... జవసత్వంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శల విషయంలో దిగజారుడుతనం, ప్రసంగాల్లో స్థాయిని మరచి మాట్లాడడం ఆందోళనకరమైన పరిస్థితికి దారి తీస్తోందన్నారు. జాతీయ రాజకీయాలతోపాటు ప్రాంతీయ రాజకీయాల్లోనూ ఈ పరిస్థితి స్థాయి దాటుతోందని తెలిపారు. పార్టీలు మారే రాజకీయ నాయకుల విషయంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్న ఉప రాష్ట్రపతి.. పార్టీ మారడంతో పాటు పదవిని త్యజించే విధంగా చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయపార్టీల ఎన్నికల హామీలకు నిధులు ఎలా వస్తాయనే అంశాన్ని పార్టీలన్నీ ప్రణాళికతో పాటు వివరించేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఉప రాష్ట్రపతి సూచించారు. ప్రచార, ప్రసార సాధనాలు, పత్రికలు అందించే సమాచారం సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండాలని తెలిపారు అసాధారణ నాయకుడు పిన్నమనేని.. ఇరవై ఏడు సంవత్సరాల పాటు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన పేదల పక్షపాతి పిన్నమనేని కోటేశ్వరరావు అసాధారణ నాయకుడన్నారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయులకు సన్మానాలు, పారితోషికాలు అందించేందుకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పేర్ని నాని, దూలం నాగేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్, కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, మాజీ మంత్రులు వసంత నాగేశ్వరరావు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య లక్ష్యాలు కాపాడుకోవాలి
రాజ్యాంగం కనుసన్నల్లో గాక తమ చేతివాటం కొద్దీ రాజ్యాంగ సంస్థల్ని స్వప్రయోజనాలకు వినియోగించుకోవడం చూస్తూనే ఉన్నాం. అన్ని బాధ్యతా యుత సంస్థలూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి తీరాల్సిందేనని ఇటీవల సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ ర మణ వ్యాఖ్యానించడం గమనార్హం. సీజే చేసిన ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే... ‘న్యాయ వ్యవస్థమీద కూడా 1,600కి పైగా ఫిర్యాదులూ, కేసులూ ఉన్నా’యని లోక్సభలో కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజూ ప్రకటించి ఎదురుదాడికి దిగారు. ఈ విధంగా రాజ్యాంగ విభాగాలు లేదా సంస్థల మధ్య పరస్పర విమర్శలు పెరగడం దేశానికి శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్య లక్ష్యాలను కాపాడుకోవలసిన అవసరం, బాధ్యత అందరి మీదా ఉంది. మహా కోటీశ్వరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ ఎందుకన్నాడోగానీ ఇటీవల ఓ గొప్ప సత్యాన్ని గుర్తు చేశాడు: ‘‘ఈ రోజున ఇంత నీడలో కూర్చుని తీరు బడిగా సేద తీర్చుకుంటున్నామంటే అర్థం– ఏనాడో వెనుక ఏ మహానుభావుడో నీడనిచ్చే ఓ చెట్టును నాటిపోయిన ఫలితమే సుమా’’ అని! అలాగే ఈ రోజున స్వతంత్ర భారత రాజ్యాంగ రచనలో అటూ ఇటుగా కొన్ని హెచ్చుతగ్గులు రంధ్రాన్వేషకులకు తగలొచ్చునేమోగానీ, అంతమాత్రాన మొత్తం రాజ్యాంగ రచనా సంవిధానాన్నే ఎకసెక్కా లకు గురిచేయరాదు. ఇందుకు అతి తాజా ఉదాహరణగా కేంద్ర స్థాయిలో నడిచే సాధికార విచారణ సంస్థలే పరస్పరం కుమ్ములాట లకు దిగడాన్ని పేర్కొనకుండా ఉండలేం. రాజ్యాంగం కనుసన్నల్లో గాక కేవలం ఎప్పటికప్పుడు తాత్కాలిక ‘తోలుబొమ్మలాట’గా అధికారం చేపట్టే రాజకీయ పార్టీల నాయకులు తమ చేతివాటం కొద్దీ రాజ్యాంగ సంస్థల్ని తరచూ స్వప్రయోజనాలకు వినియోగించు కోవడం చూస్తున్నాం. కాగా ఇప్పుడు తాజాగా ఈ పుండు న్యాయ వ్యవస్థల్లో కూడా పుట్టి శరవేగాన పెరిగిపోతోంది. ఇందుకు తాజా ఉదాహరణే... కేంద్రాధికార స్థానంలోని పాలకుల కనుసన్నల్లో మసలే విచారణాధికార సంస్థ ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (సీబీఐ)... దేశంలోని ‘‘ప్రతీ పేరుమోసిన ఇతర గౌరవ సంస్థల మాదిరే రోజు రోజుకీ ప్రజల దృష్టిలో పడి, దాని విశ్వసనీయతను ప్రజలు ప్రశ్నించే స్థితి ఏర్పడిందని’’ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (1.4.2022) ప్రస్తావిం చారు. ఇదే సందర్భంలో ఆయన దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్య లక్ష్యాలను ఎందుకు కాపాడుకోవలసిన అవసరం మరింతగా ఉందో వివరిస్తూ ఇలా అన్నారు: ‘‘భారతీయులం స్వేచ్ఛను ప్రేమిస్తాం. ఆ స్వేచ్చను కాస్తా గుంజుకోవడానికి ఎవరు ప్రయత్నించినా జాగరూ కులైన మన పౌర సమాజం స్వేచ్ఛను హరించజూసే నిరంకుశ వర్గాల నుంచి అధికారాన్ని తిరిగి గుంజుకోవడానికి సంకోచించదు. అందు వల్ల పోలీసులు, విచారణ సంస్థలు సహా అన్ని బాధ్యతాయుత సంస్థలూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి తీరాల్సిందే’’. ప్రధాన న్యాయమూర్తి నోటి నుంచి ఈ హెచ్చరిక వెలువడిన వెంటనే కేంద్ర న్యాయ శాఖామంత్రి కిరణ్ రిజిజూ మరునాడు... ఆ మాటకొస్తే ‘న్యాయ వ్యవస్థమీద కూడా 1,600కి పైగా ఫిర్యాదులు, కేసులు ఉన్నాయని’ లోక్సభలో ప్రకటించడంతో– ఈ పరస్పర ఎత్తి పొడుపుల్లో వేటిని నమ్మాలో, వేటిని కుమ్మాలో సామాన్యులకు, పాలనా వ్యవస్థలు నిర్వహిస్తున్న వారికీ అంతుపట్టని పరిస్థితి! నిజానికి ఒకప్పుడు సీబీఐ అంటే జనంలో విశ్వసనీయత ఉండేది. చివరికి తీవ్ర నిరాశకు గురవుతున్నపుడు కూడా ఒక దశ వరకు ప్రజలు న్యాయం కోసం పోలీసు స్టేషన్కు వెళ్లగలిగే వారనీ, ఇప్పుడు ఆ విశ్వస నీయత కూడా ప్రజల్లో కలగడం లేదని కూడా జస్టిస్ రమణ గుర్తు చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాన్ని ఇకనైనా అడ్డుకోవాలంటే– రాజకీయుల్ని లేదా పాలకుల్ని రాసుకు పూసుకుని తిరగడాన్ని పోలీసులు మానుకోవాలని కూడా హితవు చెప్పాల్సి వచ్చింది. ప్రజా స్వామ్య విలువలతో పాటు మన వ్యవస్థలన్నీ ఎలా నిర్వీర్యమై పోతున్నాయో జస్టిస్ రమణ గుర్తు చేస్తున్న సమయంలోనే బీజేపీ మంత్రి రిజిజూ పోటీగా న్యాయవ్యవస్థపైనే ఎదురుదాడికి దిగారు. ఈ ఎదురుదాడితో మొత్తం పాలకులు, పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, విచారణ సంస్థల ‘సగులు మిగులు’ ప్రతిష్ఠలు ఏమైనా మిగిలి ఉంటే గింటే, పోయిన విలువ తిరిగి రాదని గ్రహించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా సంస్కరణల్లో భాగంగా, మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనివార్యంగా ఆమోదిం చాల్సి వచ్చిన పథకం– రాజధానుల వికేంద్రీకరణ! కానీ, సుప్రీం పరోక్ష అనుమతితో కొత్తగా రాష్ట్ర హైకోర్టుకు బదలాయించిన న్యాయ మూర్తి ఒకరు ‘రాష్ట్ర రాజధానిని మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి’ లేదని శాసించారు. అలాగే బీజేపీ తన అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒకవైపు ‘మేలమాడుతూ’నే మరోవైపు నుంచి రాష్ట్రంలో బలం పెంచుకోవడానికి నానా బాపతుతో జట్టుకట్టి కలగాపులగం రాజకీయాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాలనా వికేంద్రీ కరణ ప్రతిపాదనలకు స్థూలంగా సమ్మతించి నాటకమాడుతున్న దశలోనే, కేంద్రాధికారాన్ని కూడా ధిక్కరిస్తూ హైకోర్టు కొత్త బెంచ్ నుంచి ‘రాజధానిని మార్చరాదని’ తాఖీదు వచ్చింది. పైగా హైకోర్టు ప్రకటన ఏ పరిస్థితుల్లో వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో.. విడిపోతున్న కొత్త ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్ణయం కాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోర్టులో పలు వురు ప్రసిద్ధ మాజీ న్యాయమూర్తులు ఆదరాబాదరాగా చంద్రబాబు చేసిన అమరావతి భూముల గోల్మాల్ విషయమై తిరుగులేని రిట్ పిటీషన్ వేశారు. దాన్ని కోర్టు అనుమతించి విచారణకు స్వీకరించింది కానీ, విచారించలేదు. అది ఇంకా పెండింగ్లో ఉన్నట్టే లెక్క. అందులో అమరావతి భూములను బాబు ఎలా గోల్మాల్ చేసి... మూడు నాలుగు పంటలు పండే భూముల్ని అర్ధరాత్రి ఎలా తాను బయట పడకుండా తన అనుయాయుల ద్వారా తగలబెట్టించి, తప్పుకోజూసి ఎలా అభాసుపాలైందీ ప్రస్తుత హైకోర్టు కూడా తెలుసుకో గలిగితే మంచిది. అమరావతి భూములను తగులబెట్టించిన పాపాన్ని బాబు, అతని అనుయాయులు ఎవరిమీదికి నెట్టారు? ఆ పంటల దహన కాండను కళ్లారా చూసి గుండె పగిలినంత పనైన ఈనాటి వైసీపీ ఎంపీ నందిగం సురేష్ (దళితుడు) పైకి! అతణ్ణి ఎలాగోలా పంట దహన కాండ క్రియలో ఇరికించడానికి బాబు గ్యాంగ్ చేసిన ప్రయత్నాలూ, వేధింపులూ అన్నీ ఇన్నీ కావు. వేటికీ సురేష్ లొంగి కాళ్లుపట్టుకోలేదు గనుకనే–ఎన్నికల్లో అనివార్యంగా పార్లమెంట్ సభ్యుడై గడిచిన యావత్తు చరిత్రకు నిండైన, మెండైన ప్రతినిధిగా నిలబడ్డాడు. అంతకు ముందు, వేధింపులలో భాగంగా పోలీసులు సురేష్ను అరెస్టు చేసి, ‘నీవే పంట భూములు తగలబెట్టాన’ని ఒప్పుకుంటే ‘బాబు ద్వారానే రూ. 50 లక్షలు నీకు ముడతాయ’ని రకరకాల ప్రలోభాలు పెట్టారు. అయినా లొంగని మొండి ఘటమైనందుననే సురేష్ మాటకి ఈ రోజుకీ అంత విలువన్న సంగతిని న్యాయమూర్తులూ, న్యాయ వ్యవస్థా మరచిపోరాదు. గౌతమబుద్ధుడు మనకు ఏమి బోధించి పోయాడు? ‘చివరకు నేను చెప్పానని కూడా దేన్నీ నమ్మొద్దు. సొంత బుద్ధితో ఆలోచించి నిర్ణయాలకు రండ’ని చెప్పాడు. అదీ– న్యాయ వాదికైనా, న్యాయ మూర్తికైనా ఉండాల్సిన నీతి, నియమం! ఉమ్మడి హైకోర్టులో నేనూ, ప్రసిద్ధ మాజీ న్యాయమూర్తులూ జమిలిగా అమరా వతి భూముల పంపిణీ తంతుపై వేసిన రిట్ పిటీషన్లు, రిమైండర్లకు ఈ క్షణానికీ జవాబు రావలసే ఉంది. అందుకనే, వాటి తుది తీరు మానానికి మళ్లీ డొంకంతా న్యాయబద్ధంగా మాజీ న్యాయమూర్తులు కదపవలసి వస్తోంది. అంటే అమరావతి భూముల అక్రమ పంపిణీ సమస్య ఇంకా అలాగే ఉండిపోయిందని గౌరవ న్యాయమూర్తులు గుర్తించాలి. ఆ మాజీ న్యాయమూర్తుల అపరిష్కృత ఫైల్కు గౌరవ న్యాయం జరిగే వరకు అమరావతి భూములు అన్యాక్రాంతం కథకు ముగింపు రాదు, ఇతరత్రా ఎన్ని పొంతన లేని మధ్యంతర తీర్పు లొచ్చినా సరే! ‘క్వీన్స్ కౌన్సిల్’ డేవిడ్ పానిక్ అన్నట్టు ‘‘రాజకీయ పాలకులకు నిర్ణయించిన పదవీ కాలం పరిమితమే. కానీ న్యాయ మూర్తులకున్న పదవీ భద్రత పాలకులకు ఉండదు. ఈ పదవీ భద్రత పబ్లిక్ సర్వెంట్లయిన న్యాయ మూర్తులకు మాత్రం ప్రత్యేక వనరు. అందువల్ల జడ్జీలనూ, వారి బాధ్యతల నిర్వహణా తీరునూ, వారి పని తీరునూ స్వేచ్ఛగా, బాహా టంగా విమర్శించవచ్చు. అలాగే, పత్రికలు ఇతర ప్రసార సాధనాలు వెలిబుచ్చే అభిప్రాయాలనూ, విమర్శలనూ జడ్జీలు పట్టించుకోనక్కర లేదు. అలా విమర్శలకు ఉలిక్కిపడే జడ్జీలు, జడ్జీలు కాజాలరు’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రజాస్వామ్యంలో మీడియా కీలకం
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రచార, ప్రసార మాధ్య మాలపై ఉందని, ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పాత్రికేయులు పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్ని ఎంసీహెచ్ఆర్డీలో ‘శ్రీ ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు’ పుస్తకాన్ని ఆదివారం ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేమన్నారు. పత్రికలు సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలని అన్నారు. వార్తలు, వ్యక్తిగత అభిప్రాయాలు కలిపి ప్రచురించరాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపిస్తూ మార్పులను సూచించాల్సిన బాధ్యత మీడియాదేనని స్పష్టం చేశారు. సమాజంలో మనం కూడా భాగస్వాములమనే విషయాన్ని పాత్రికేయులు గుర్తుంచుకోవాలని సూచించారు. తెలుగు పాత్రికేయ చరిత్రలో వ్యాసరచనకు నూతన ఒరవడి ప్రవేశపెట్టిన ముట్నూరి కృష్ణారావు గారికి ఉపరాష్ట్రపతి నివాళులర్పించారు. యువతలో దేశభక్తిని నూరిపోసి, స్వ రాజ్య కాంక్షను రేకెత్తించి జాతీయోద్యమం దిశగా ముందుకు నడిపించేందుకు కృషి చేసిన పత్రికల్లో తెలుగునాట కృష్ణాపత్రికకు ప్రత్యేకస్థానం ఉందన్నారు. ముట్నూరి కృష్ణారావు ప్రవేశపెట్టిన ఒరవడే తర్వాతి తరం పాత్రికేయులకు మార్గదర్శనం అయిందన్నారు. ‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ అన్న ముట్నూరి సంపాదకీయం గురించి మాట్లాడిన ఉపరాష్ట్రపతి, ఆ రోజుల్లో అలాంటి శీర్షిక పెట్టడమంటే దేశం కోసం ప్రాణాలను కూడా వదులుకునేందుకు వెనుకాడకపోవడమేననే విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, శాంతా బయోటెక్ చైర్మన్ డా.వరప్రసాద్ రెడ్డి, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, వల్లీశ్వర్, రచయిత దత్తాత్రేయ శర్మ, దర్శనం పత్రిక ఎడిటర్ ఎం.వి.ఆర్.శర్మ తదితరులు పాల్గొన్నారు. -
Hemakshi Meghani: మా పూర్వ విద్యార్థులు విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది!
దేశ జనాభాలో 65 శాతం యువత ఉన్న దేశం మనది. 35 ఏళ్ల లోపు వాళ్లు 65 శాతం ఉన్న దేశం ఎంత శక్తిమంతంగా ఉండాలి? ఎంత చైతన్యవంతంగా ఉండాలి? నిజానికి... ఉండాల్సినంత చైతన్యవంతంగా ఉందా మనదేశం? పార్లమెంట్లో చట్టాలు చేసే సభ్యుల సరాసరి వయసు యాభై ఏళ్లు. వారందరిలో 35 ఏళ్ల లోపు వాళ్లు కేవలం ఆరుశాతమేనా?.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయించాయామె మెదడులో. ఏ ప్రశ్నకూ ఆశాజనకమైన సమాధానం దొరకలేదు. ప్రశ్నకీ జవాబుకీ మధ్య విశాల విశ్వమంతటి అంతరం ఉందని కూడా అనిపించింది. ఇక మహిళల ప్రాతినిధ్యం విషయానికి వస్తే మనదేశం సాధించిన అత్యున్నత మహిళా ప్రాతినిధ్యం పద్నాలుగు శాతం. ఇది కూడా సిగ్గుపడాల్సిన సమాధానమే. యువత రాజకీయాల పట్ల ఏ మాత్రం ఆసక్తి చూపించకపోతే... దేశంలో చట్టాల రూపకల్పన చైతన్యవంతంగా ఎలా ఉంటుంది? వాటి ఆచరణ సమర్థంగా ఎలా సాగుతుంది? ఇలాగ ఎన్నో అనుబంధ ప్రశ్నలు. అసలు... సామాన్యులు రాజకీయరంగాన్ని కెరీర్గా ఎంచుకోకపోవడం ఏమిటి? వీటన్నింటికీ సమాధానంగా హేమాక్షి మేఘాని ఆధ్వర్యంలో వెలిసింది ఐఎస్డీ. ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ. మంచి కోసం మంచిదారి హేమాక్షి 2011లో హార్వర్డ్ కెన్నడీ స్కూల్లో మాస్టర్స్ చేస్తున్న సమయంలో రూపుదిద్దుకున్న ఆలోచన ఇది. మహిళలు రాజకీయరంగంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆమె నమ్మిన సందర్భం అది. హార్వర్డ్లో చదువు పూర్తయిన తర్వాత బంగ్లాదేశ్లో బిల్డింగ్ రీసోర్సెస్ అక్రాస్ కమ్యూనిటీస్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్లతో పనిచేసింది హేమాక్షి. ఆ తర్వాత 2018లో ప్రఖార్ భర్తియా సహకారంతో న్యూఢిల్లీలో ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీని ప్రారంభించింది. అతడికి యూత్ అలయెన్స్ స్టార్టప్కు సీఈవోగా పని చేసిన అనుభవం ఉంది. ఈ స్కూల్ ప్రారంభించడం వెనుక ఉద్దేశాన్ని వివరిస్తూ ‘పార్లమెంట్ సభ్యుల్లో 43 శాతం మందికి క్రిమినల్ రికార్డు ఉంది. ఈ పరిస్థితిని తొలగించాలి. యువత దృష్టి జెండర్, లీడర్షిప్, పాలిటిక్స్... ఈ మూడు అంశాల మీద కేందీకృతం కావాలి. క్షేత్రస్థాయి నుంచి సూత్రబద్ధమైన రాజకీయాలను కెరీర్గా ఎంచుకునేటట్లు వాళ్లను ప్రోత్సహించాలి. మంచి వ్యక్తులు ఈ రంగంలోకి రావడానికి అవసరమైన ఓ మంచి దారి వేయడమే ప్రధాన ఉద్దేశం. మేము ఒక వెయ్యి మందిని తయారు చేసి సమాజంలోకి పంపిస్తే వారిలో కనీసం పాతికశాతం మంది అయినా ఎన్నికల్లో నెగ్గితే ప్రజాస్వామ్యానికి మా వంతు సేవలు అందినట్లే’ అంటోంది హేమాక్షి. ఇదేం చోద్యం! ఐఎస్డీ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసుల ద్వారా పాఠాలు బోధిస్తోంది. పురుషాధిక్య సమాజంలో రాజకీయరంగం అంటే తమదే అనే భావన నరనరాన జీర్ణించుకుని ఉంది. ఈ నేపథ్యంలో ఒక మహిళ ఇలాంటి ప్రయత్నం చేయడం కూడా వారికి ఆశ్చర్యంగానే ఉంటోంది. శిక్షణ కోసం ఐఎస్డీకి వచ్చిన వాళ్లు కూడా ఆర్థిక వ్యవహారాలు చూసుకునే మా సహ వ్యవస్థాపకుడు ప్రఖార్తో మాట్లాడడానికే ప్రయత్నిస్తారు తప్ప ఈ స్కూల్ నిర్వహిస్తున్న నాతో మాట్లాడాలంటే సందేహంగా, ఇదేం చోద్యం అన్నట్లు చూస్తారు అని నవ్వుతూ చెబుతుంది హేమాక్షి. మార్పు సాధ్యమే! ‘‘ఇప్పటి వరకు మా స్కూల్ నుంచి రెండు వందల మంది శిక్షణ తీసుకున్నారు. వారిలో 26 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు ఉన్నారు. వాళ్లలో కొంతమంది ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు కూడా. ఇటీవల ఒడిషాలో పర్యటించాను. అక్కడి జిల్లా పరిషద్ ఎన్నికల బరిలో మా స్కూలు పూర్వ విద్యార్థి పోటీ చేశాడు. అక్కడ నేను చూసిందేమిటంటే... ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓటు అడగడానికి ఒక గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఓటు వేయడానికి ఏమిస్తారని అడిగారు. బదులుగా మా విద్యార్థి చాలా సంయమనంతో ‘నేను డబ్బిచ్చి ఓట్లు వేయించుకుంటే రేపు మీకు పని ఎవరు చేస్తారు’ అని తిరిగి ప్రశ్నించాడు. గ్రామస్థులు వెంటనే ఏమీ అనలేదు, కానీ ఆలోచనలో పడ్డారని మాత్రం చెప్పగలను. మరొక పూర్వ విద్యార్థి ప్రియాంక విషయానికి వస్తే... ఆమె బిహార్, సీతామర్హిలో ఒక గ్రామానికి ముఖియా ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రచారంలో ఇంటింటికీ వెళ్లింది. ఆ సమయానికి ఒక ఇంటి వాళ్లు భోజనం చేస్తుంటే, వాళ్లు లోపలికి ఆహ్వానించే వరకు ఇంటి బయటే ఎదురు చూసింది. డాలీ గత ఏడాది బీహార్లో పంచాయితీ ఎన్నికల్లో గెలిచింది. అర్చన రాబోయే గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ ఏడాది ఎనిమిది మంది మా పూర్వ విద్యార్థులు పంచాయితీ, కౌన్సిల్ స్థాయుల్లో పోటీ చేయనున్నారు. మా విద్యార్థులు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న విధానాన్ని గమనించినప్పుడు నా ప్రయత్నం విజయవంతం అవుతుందనే నమ్మకం కలిగింది’’ అని హేమాక్షి ఇనుమడించిన ఉత్సాహంతో చెప్పింది. చదవండి: తేడా వస్తే.. ఆ బటన్ను రెండుసార్లు నొక్కితే చాలు.. వాళ్లకు అలర్ట్ వెళ్లిపోద్ది -
నెహ్రూస్ ఇండియా, ఎంపీల నేరచరిత్రపై వ్యాఖ్యలు చేసిన సింగపూర్ పీఎం... తప్పుబట్టిన భారత్!
India has slammed the Singapore Prime Minister's comments: సింగపూర్ పార్లమెంట్లో సిటీ-స్టేట్లో ప్రజాస్వామ్యంపై ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతదేశ మొదటి ప్రధానమంత్రి గురించి ప్రస్తావించారు. నెహ్రూస్ భారత్లో లోక్సభలో దాదాపు సగం మంది ఎంపీలపై అత్యాచారం హత్య ఆరోపణలతో సహా క్రిమినల్ అభియోగాలు పెండింగ్లో ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు వీటిలో చాలా మటుకు రాజకీయ ఆరోపణలు కూడా ఉన్నాయని లీ అన్నారు. ఈ వ్యాఖ్యలను సింగపూర్ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ఎలా పని చేయాలనే అంశంపై జరిగిన ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా లీ ఈ వ్యాఖ్యలు చేశారు. "చాలా దేశాలు ఉన్నతమైన ఆదర్శాలు. గొప్ప విలువల ఆధారంగా ఏర్పడినవే కానీ ఆ తర్వాత రానురానూ రాజీకీయ ఆకృతి మారుతోంది. చాలా రాకీయ పార్టీలు తమ వ్యవస్థాపక నాయకులను విస్మరిస్తోంది." అని లీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈ ప్రసంగంలో ప్రధాని లీ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో సహా వివిధ ప్రధాన మంత్రుల గురించి ప్రస్తావిస్తూ..." చాలా దేశాలు మొదట చాలా ఉద్వేగభరితంగా ఏర్పడ్డాయి. డేవిడ్ బెన్-గురియన్లు, జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్రం కోసం పోరాడి సాధించిన గొప్ప నాయకులు. గొప్ప ధైర్యం అపారమైన సంస్కృతి, అద్భుతమైన సామర్థ్యం కలిగిన అసాధారణ వ్యక్తులు. అంతేకాదు వారు అపారమైన వ్యక్తిగత ప్రతిష్టతో, ధైర్యవంతమైన కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి, దేశంలోని ప్రజల కొత్త భవిష్యత్తును రూపొందించడంలోనూ ప్రజల అంచనాలను అందుకోవడానికి సదా ప్రయత్నిస్తారు. కానీ ఈ ప్రారంభ ఉత్సాహాన్ని తరువాత తరాలకు కొనసాగించడం లేదా నడిపించడంలో విఫలమవ్వడం లేదా కష్టమవుతోంది. అలాగే బెన్-గురియన్స్ ఇజ్రాయెల్ రెండేళ్లలో నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ, కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతోనే సరిపోయిందని, సీనియర్ రాజకీయ నాయకులు అధికారులు నేరారోపణలను ఎదుర్కొన్నారు". అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సింగపూర్లో ప్రజాస్వామ్యం ఎలా ? ఉండాలి, ఆ మార్గంలో పయనించకుండా ఉండాలంటే ఏం చేయాలని ప్రశ్నించారు. మనమేమి గొప్ప తెలివైనవాళ్లం, ధర్మాత్ములం కాదు కాబట్టి తరం వెంబడి తరం వ్యవస్థను పర్యవేక్షించి దాని నిర్మాణాన్ని కొనసాగిస్తే సాధ్యమవుతుందని లీ పేర్కొన్నారు. ఈ మేరకు భారత్ సింగపూర్ ప్రధాని లీ నెహ్రూస్ ఇండియా పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిడమే కాక అనవసరమైన వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. అంతేకాదు విదేశాంగ మంత్రిత్వ శాఖ సింగపూర్ హైకమిషనర్ను పిలిపించి తమ అభ్యంతరాన్ని తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. (చదవండి: ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రునే నిందిస్తున్నారు: మన్మోహన్ సింగ్) -
ఇదేనా ప్రజాస్వామ్యం?
మరో విడత పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. అధికార–ప్రతిపక్షాల వాదోపవాదాలు... సభా మధ్యంలో నిరసనలు... అనివార్యమైన వాయిదాలు... మళ్ళీ అవే సన్నివేశాలు. డిసెంబర్ 23 వరకు జరగాల్సిన శీతకాల సమావేశాలు ఒకరోజు ముందే బుధవారమే ముగిశాయి. వెనక్కి తిరిగి చూస్తే, చట్టసభలు సాగిన తీరులో ఏమున్నది గర్వకారణం అనిపించక మానదు. సభాసమయంలో వృథానే ఎక్కువగా కనిపిస్తుంది. కీలక బిల్లులు ఆమోదం పొందినా, వాటిపై చర్చ జరగలేదనే చేదు నిజం వెక్కిరిస్తుంది. ఎవరి పాలెంతనేది పక్కనపెడితే, అధికార, ప్రతిపక్షాలు రెంటిలో తప్పు కనిపిస్తుంది. నవంబర్ 29న సభ మొదలైన రోజు నుంచే పరిస్థితి అదుపు తప్పింది. వర్షాకాల సమావేశాల్లోని ప్రవర్తన తీరుకు దండనగా 12 మంది ప్రతిపక్ష సభ్యులను మొత్తం ఈ శీతకాల సమావేశాల నుంచి బహిష్కరించడం వివాదాస్పదమైంది. దాని చట్టబద్ధతా ప్రశ్నార్థకమైంది. పలుమార్లు సభలో అంతరాయాలకూ, సభ బయట ధర్నాలకూ కారణమైంది. ఒక రకంగా ప్రతిపక్షాల్లో అనూహ్య ఐక్యతకూ దారి తీసింది. 22 రోజుల పాటు గాంధీ విగ్రహం పాదాల చెంత ప్రతిపక్ష సత్యాగ్రహం సాగింది. సామూహిక పశ్చాత్తాపం కాదు... వ్యక్తిగతంగా ఎవరికి వారు క్షమాపణలు చెబితేనే సభలోకి అనుమతిస్తామన్న అధికార పక్షం మంకుపట్టు ఆఖరి దాకా కొనసాగింది. అదీ విచిత్రం. ఈ విడతలో లోక్సభ, రాజ్యసభ– చెరి 18 సార్లు సమావేశమయ్యాయి. కానీ, అంతరాయాలతో లోక్సభలో 18 గంటల 48 నిమిషాలు వృథా. అంతరాయాలు, వాయిదాలతో రాజ్యసభలో ఏకంగా 49 గంటల 32 నిమిషాలు కృష్ణార్పణం. మొత్తం మీద లోక్సభ ఉత్పాదకత 77 శాతమైతే, రాజ్య సభది 43 శాతమేనని చట్టసభలపై స్వచ్ఛంద పరిశోధనా సంస్థ పీఆర్ఎస్ లెక్కేసింది. ప్రభుత్వం లెక్క మాత్రం అంతకన్నా కాస్తంత మెరుగ్గా ఉంది (లోక్సభ 82 శాతం, రాజ్యసభ 47 శాతం). ఏ లెక్కనైనా ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకురాదనేది నిర్వివాదాంశం. ఈ సమావేశాల్లో 12 బిల్లులు లోక్సభలో, ఒక బిల్లు రాజ్యసభలో– మొత్తం 13 బిల్లుల్ని ప్రవేశ పెట్టారు. వాటిలో 11 ఉభయసభల ఆమోదం పొందాయి. అందులో అద్దె గర్భం, సహాయ పునరు త్పాదక టెక్నాలజీ (ఏఆర్టీ), నార్కోటిక్ డ్రగ్స్ లాంటి కీలక బిల్లులున్నాయి. లోక్సభలో మెజారిటీ ఉండడంతో వీటిని పాస్ చేయించుకోవడం పాలకపక్షానికి కష్టమేమీ కాదు. కానీ, రాజ్యసభలో ప్రతిపక్షాలదే ఇప్పటికీ స్వల్ప మెజారిటీ (ప్రతిపక్షాలు 120, ఎన్డీఏ సభ్యులు 118). అందుకే, ప్రభుత్వం వ్యూహాత్మకంగా పాత తప్పుల సాకుతో 12 మంది విపక్ష సభ్యుల్ని ఇప్పుడు సస్పెండ్ చేసి, కృత్రిమ మెజారిటీ సంపాదించి, బిల్లులను పాస్ చేయించుకుందనేది కాంగ్రెస్ ఆరోపణ. నిందారోపణలు ఏమైనా, చర్చ లేకుండా నిమిషాల వ్యవధిలోనే అనేక బిల్లులకు ఆమోద ముద్ర పడడం మటుకు నిజం. సమావేశాల మొదట్లోనే తెచ్చిన కొత్త సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు మొదలు చివరలో తెర మీదకు తెచ్చిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు దాకా అనేకం అర్థవంతమైన చర్చ ఏమీ లేకుండా, అరగంటలో పాలకపక్షం మమ అనిపించినవే! ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు గుర్తింపు కార్డునూ – ఆధార్నూ అనుసంధానించడానికి వీలు కల్పించే అత్యంత కీలక ఎన్నికల చట్టం మార్పుపై చర్చించడానికి అధికార పక్షానికి సమయమే లేదా అన్నది విమర్శకుల ప్రశ్న. భిన్నాభిప్రాయాల చర్చావేదికగా నిలవడం, ఆ చర్చల్లో ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకోవడం పార్లమెంట్ ప్రాథమిక లక్షణం. కానీ, బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ ప్రజాస్వామ్య వేదిక ఆ గుణాన్ని కోల్పోయినట్టు కనిపిస్తోందన్నది కొందరి విమర్శ. 17వ లోక్సభలోని తాజా 7వ విడత సమావేశాల్లో సగటున ప్రతి బిల్లూ లోక్సభలో 10 నిమిషాల్లో, రాజ్యసభలో అరగంటలో పాసైపోయాయి. చట్టసభల్లో పరిఢవిల్లాల్సిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని బీజేపీ పరిహసించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది అందుకే. బిల్లులపై భిన్నాభిప్రాయాలున్నప్పుడు వాటిని పార్లమెంటరీ కమిటీలకు పంపడం సాధారణం. ఇటీవల ఆ ధోరణి కూడా తగ్గుముఖం పడుతోంది. తాజా సమా వేశాల్లో 6 బిల్లుల్ని మాత్రం పార్లమెంటరీ కమిటీలకు నివేదించారు. ఆడపిల్లల వివాహ వయస్సును పెంచే ప్రతిపాదనపై సందేహాలు వ్యక్తమయ్యాక ఆ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. ఇక, ప్రజాసమస్యలను ప్రస్తావించి పాలకపక్షాన్ని ఇరుకునపెట్టడానికి అవకాశమున్న కీలకమైన ప్రశ్నోత్తరాల సమయంలోనూ 60 శాతం సమయం వృథా తప్పలేదంటే, ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రంగస్థల ప్రదర్శనలా మారిపోతున్న తమ సభావ్యూహాన్ని పునరాలోచించుకోవాలి. నిజానికి, ఈసారి సభలో గట్టిగా చర్చ జరిగింది – కోవిడ్ పైన, పర్యావరణ మార్పుల పైనే! రైతుల ప్రాణాలు బలిగొన్న లఖిమ్పూర్ ఖేరీ ఘటన పథకం ప్రకారం జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చడంతో, కన్నకొడుకే నిందితుడైన హోమ్ శాఖ సహాయ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు చివరి దాకా పట్టుబట్టాయి. కానీ, కీలక అంశాల చర్చకు ప్రభుత్వాన్ని ఒప్పించడమూ అంతే ముఖ్యమని గ్రహించాల్సింది. సభ్యులు భిన్నంగా ప్రవర్తించి ఉంటే సమావేశాలు మరింత మెరుగ్గా జరిగి ఉండేవి. రాజ్యసభ ఛైర్మన్ అన్న ఆ మాట నిజమే. కానీ, అందుకు పాలకపక్షం కూడా కలసి రావాలి. పట్టువిడుపులతో ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి. ఎంతైనా, ఒంటి చేతితో చప్పట్లు కొట్టలేం కదా! పాలకులు ఏకపక్ష ప్రకటనలు చేయడానికీ, అనుకున్నవాటికి రబ్బరు స్టాంపు రాజముద్రలు వేయడానికీ పార్లమెంట్ సమావేశాలతో పని ఏముంది! -
మయన్మార్ నియంతల ఆగడం
నిరంతర అప్రమత్తత కొరవడితే ప్రజాస్వామ్యం క్రమేపీ కొడిగట్టడం ఖాయమని గ్రహించనిచోట చివరకు నియంతలదే పైచేయి అవుతుంది. వర్తమాన మయన్మార్ ప్రపంచానికి చాటిచెబుతున్న పాఠం అదే. తన జీవితంలో ఇప్పటికే పదిహేనేళ్లపాటు చెరసాలలో గడిపిన సీనియర్ నేత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీపై రెండు నాసిరకం ఆరోపణల ఆధారంగా నడిచిన కేసులో సైనిక న్యాయస్థానం సోమవారం నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన వైనం అక్కడి సైనిక పాలకుల పోకడలు తెలిసినవారికి ఆశ్చర్యం కలిగించలేదు. తీర్పు వెలువడిన వెంటనే ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తున్నట్టు సైన్యం ఉదారత ప్రకటించడం దాని నయవంచనకు నిదర్శనం. ఆమెపై మరో తొమ్మిది అభియోగాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా ‘విచారణ’ పూర్తయితే ఆమెకు మొత్తం 102 ఏళ్ల వరకూ శిక్ష పడుతుందంటున్నారు! సూకీని గుర్తు తెలియని ప్రాంతంలో నిర్బంధించడం, ప్రత్యేక కోర్టు విచారణకు వేరెవరినీ అనుమతించకపోవడం, కేసు గురించి ఆమె న్యాయవాది బయటెక్కడా మాట్లాడకూడదని ఆంక్ష పెట్టడం సైనిక ముఠా దుర్మార్గానికి నిదర్శనం. ఆరు దశాబ్దాలుగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన సైనిక దుశ్శాసనులు అప్పుడప్పుడు తగ్గి నట్టు నటించడం, అదునుచూసి తమ వికృత రూపాన్ని ప్రదర్శించడం రివాజే. నిరుడు నవంబర్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వరసగా రెండోసారి కూడా ఆంగ్సాన్ సూకీ నాయకత్వంలోని నేష నల్ లీగ్ ఫర్ డెమాక్రసీ(ఎన్ఎల్డీ) విజయం సాధించడాన్ని చూసి కడుపుమండిన సైనిక ముఠా... మొన్న ఫిబ్రవరిలో ఉన్నట్టుండి ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కుప్పకూల్చి అధికారాన్ని హస్త గతం చేసుకుంది. వాస్తవానికి ఇదంతా లాంఛనమే. అధికార పీఠాన్ని సైన్యం ఎప్పుడూ వదిలింది లేదు. పేరుకు ప్రజాస్వామ్య వ్యవస్థకు చోటిచ్చినట్టు కనబడినా తన హవా నడిచేందుకు అనువైన రాజ్యాంగాన్ని సైన్యం ముందే రాసిపెట్టుకుంది. పార్లమెంటులో తనకు 25 శాతం స్థానాలు రిజర్వ్ చేసుకుంది. ఆ స్థానాలకు ప్రతినిధులను తానే నామినేట్ చేస్తుంది. మిగిలిన 75 శాతం స్థానాలకు జరిగే ఎన్నికల్లో సైతం కీలుబొమ్మ పార్టీలను నించోబెట్టి తమ పలుకుపడికి ప్రమాదం రాకుండా చూసుకోవడం మొదటినుంచీ సైనిక పాలకులకు అలవాటైన విద్య. కానీ 2020 ఎన్నికల్లో కీలుబొమ్మ పార్టీ అయిన యూనియన్ సాలిడారిటీ అండ్ డెవెలప్మెంట్ పార్టీ(యూఎన్డీపీ)కి కేవలం 25 స్థానాలే లభించేసరికి సైన్యానికి దిక్కుతోచలేదు. ఈ మెజారిటీతో సూకీ రాజ్యాంగాన్ని మార్చేస్తారని రూఢీ చేసుకుని మళ్లీ అది పంజా విసిరింది. సైనిక ముఠా రూపొందించిన రాజ్యాంగమంతటా కంతలే. విదేశీయుల్ని పెళ్లాడినా, విదేశాల్లో పుట్టిన పిల్లలున్నా అధ్యక్ష పీఠం అధిష్టించడానికి అనర్హులవుతారని అందులో ఉన్న ఒక నిబంధన కేవలం సూకీని దృష్టిలో పెట్టుకుని చేసిందే. అయితే 2015లో అధికారంలోకొచ్చిన తర్వాత సూకీ ఈ దొంగల రాజ్యాంగంపై పోరాడవలసింది. సైన్యం దురాలోచనను ఎండగట్టవలసింది. కానీ ఆమె రాజీపడ్డారు. దేశాధ్యక్ష పదవి దక్కకపోయినా సరిపెట్టుకుని వెనకుండి పాలనను పర్యవేక్షించారు. కీలకమైన ఆంతరంగిక భద్రత, రక్షణ శాఖలను సైన్యం తన చేతుల్లో పెట్టుకున్నా అదేమని ప్రశ్నిం చిన పాపాన పోలేదు. సైన్యం ఆగడాలు అంతకంతకు మితిమీరుతున్నా చూసీచూడనట్టు మిన్న కుండిపోయారు. చివరకు దేశ పౌరుల్లో భాగమైన రోహింగ్యాలపై జాత్యహంకార బుద్ధిస్టులతో ఏకమై సైన్యం దమనకాండకు దిగినా ఖండించడానికి సూకీ ముందుకు రాలేదు. సైనిక నియంత లపై నిలకడగా, నిబ్బరంగా శాంతియుత పోరాటాన్ని కొనసాగించి నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న ధీరవనిత ఇలా మూగనోము పట్టడమేకాదు... ఆ తర్వాత అంతర్జాతీయ వేదికలపై వారిని సమర్థిస్తూ మాట్లాడిన తీరుకు ప్రపంచ ప్రజానీకం విస్తుపోయింది. నిజానికి ఆమె ఇంటా బయటా కూడా ఒంటరి కాదు. ఆమెకు దేశ ప్రజానీకంలోనూ మద్దతుంది. విదేశాల్లోనూ ఆదరణ ఉంది. కానీ ఆమె దాన్ని కాపాడుకోలేకపోయారు. ప్రజాస్వామ్యం కోసం జనం సాగించిన పోరాటం కేవలం సూకీని అధికార పీఠంపై ప్రతిష్టించడానికి కాదు... వ్యవస్థలన్నిటినీ చెరబట్టిన సైనిక ముఠాను గద్దెదించి, మానవ, పౌరహక్కులనూ సాధించుకోవడానికి. సకలరంగాల్లోనూ ప్రజా స్వామ్య సంస్కృతిని పునఃప్రతిష్టించడానికి. వాటి సాధనకై ఉద్యమానికి నాయకత్వం వహించ డంలో, ప్రజలను చైతన్యవంతం చేయడంలో అధికారంలోకొచ్చాక సూకీ విఫలమయ్యారు. తాను రాజీపడితే సైన్యం కూడా ఒక మెట్టు దిగుతుందనుకున్నారు. అది అడియాసే అయింది. చెప్పుకోదగ్గ నాయకత్వం లేకున్నా మయన్మార్ విద్యార్థులు, యువజనులు మొక్కవోని దీక్షతో పోరాడుతున్నారు. వివిధ సందర్భాల్లో గత ఎనిమిది నెలలుగా 1,300మంది ప్రాణాలు తీసినా వారు వెనక్కు తగ్గటంలేదు. ఐక్యరాజ్యసమితివంటి అంతర్జాతీయ సంస్థలు, అమెరికా తదితర దేశాలు మాటల్లో సైనిక పాలకులను ఖండిస్తున్నా చేతల్లో చూపిస్తున్నదేమీ లేదు. చైనా సరేసరి. దానికి లాభార్జన మినహా ఏదీ పట్టదు. అక్కడి పాలకులను వ్యతిరేకిస్తే ఈశాన్య భారత్లో తిరుగుబాటు దార్ల ఆటకట్టించడం అసాధ్యమవుతుందని మన ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ప్రజానీకం మయన్మార్కు నైతిక మద్దతునీయాలి. అక్కడి ప్రజాస్వామ్య ఉద్యమానికి చేయూతనందించాలని ఎక్కడికక్కడ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. అప్పుడు మాత్రమే మయన్మార్ పాలకులు దిగివస్తారు. -
ప్రజాస్వామ్యానికి పనికిరాని క్యారెక్టర్ చంద్రబాబు
-
పర్యావరణ ధ్వంసంతో విచ్చలవిడిగా డబ్బు సంపాదన
-
ఆ మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం
అది ఆదివారం. రైతులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి గారు వస్తున్నారని తెలిసింది. ఆయన కారుకు అడ్డం పడి నిరసన తెలియజెప్పాలనుకున్నారు. కానీ ఒక నల్ల కారు వెనుకనుంచి రైతుల మీదుగా దూసుకువచ్చింది. నలుగురి ప్రాణాలు పోయాయి. రైతులే దాడి చేశారనే ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించారు. కారుపైన కూర్చుని నడపడం వారికి ఒప్పు. కారు కింద పడడం వీరికి తప్పు. మంత్రి గారి కుమారుడి కారో, తండ్రి గారి కాన్వాయ్ కారో తెలియదు. ఆ కారు శరీరాలను నుజ్జు చేస్తూపోయిన సంగతి మాత్రం తెలుసు. మరణాలు నిజం; కారణాలు, కారకులు, బతికున్న నేరగాళ్లు బయటపడరు. నిర్జీవ శవాలు మాత్రం దాక్కోలేవు, మరణించిన మానవత్వానికి క్షీణించిన సమపాలనకు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. కానీ వారి సాక్ష్యం ఎవరూ వినరు. శవపరీక్షలు చేసిన డాక్టర్ల నిజాయితీ బతికి ఉంటే, నిజాయితీ ఉన్న డాక్టర్లు బతికి ఉంటే, న్యాయం బతికే అవకాశం. చివరకు మిగిలేవి ప్రాణం లేని నివేదికలు, బూడిద. సుప్రీంకోర్టు స్వయంగా ఎవరినైనా అరెస్టు చేస్తున్నారా ఇప్పడికైనా అని అడిగింది. నిజానికి ఆ ప్రశ్న మొత్తం భారతీయ జనులది. జనం తలలు శరీరాలు చిదిమేస్తూ ఏలినవారి అధికారిక వాహనాలు మరణ మృదంగం మోగించడం కన్నా ఘోరం ఏమంటే దాని తరవాత నిర్వహించవలసిన బాధ్యతలు వదిలేయడం. వీడియో ప్రసారాలు నిషేధించారు. రాజకీయ వికృత కల్లోలాలు. ఇంటర్నెట్ సేవల రద్దు, ప్రతిపక్ష నాయకుల రాకపోకలపై నిషేధం. నగర ప్రవేశంపై అనేకానేక నిర్బంధాలు. తప్పుడు కథనాలు, కావాలని çసృష్టించిన అనుమానాలు. నేరాలు దాచే ప్రయత్నాలు చేయడం, మీడియా నోరు నొక్కడం, తలలు చిదిమేయడమే కాదు తలపును కూడా చిదిమేసే ప్రయత్నాలు జరగడం. దేశ భద్రత కోసమే ఆ కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. పోతే పోయింది ఇంటర్నెట్. చట్టాలను ఆమోదించకపోతే ప్రాణాలకు ప్రమాదం అని నిరసనకారులకు ఇంకా ఎందుకు తెలియడం లేదో ప్రభువులకు అర్థం కాదు, మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం కదా. అన్నిటికన్నా భయంకరమైనది నిస్సిగ్గు. బాహాటంగా తమ వీపు తామే తట్టి మెచ్చుకోవడం, వెంటనే విచారణకు ఆదేశించినందుకు ముఖ్యమంత్రి చురుకైన కార్యశీలతను ప్రశంసిస్తూ అభినందించడం, అందుకోసం లజ్జను త్యాగం చేసే మహాసంస్థలు, అతిరథులు, మహారథులు ఎందరో. కొందరు నోరు విప్పరు. కొందరు నోరువిప్పితే అన్నీ అబద్ధాలే. నలుగురు రైతులతో సహా ఎనిమిది మందిని నలిపేసిన ఈ క్రూర, అధికార, అహంకార దుర్మార్గాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఖండిస్తున్నది. సుప్రీంకోర్టు స్వయంగా విచారణకు స్వీకరించి ఏం జరిగిందో, ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పండి అని అడిగింది. ఈ పని చేయవలసింది డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి. వారంతా ప్రతిపక్షాలను ఎలా కట్టడి చేయాలా అని తమ రాజకీయ అనుభవాన్ని వాడుతూ ఆలోచిస్తుండటం వల్ల వారికి తీరిక లేదని గమనించి సుప్రీంకోర్టు దయతో ఆ బాధ్యతను స్వీకరించింది. రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత సుప్రీంకోర్టుదే కదా మరి. బ్రిటిష్ క్వీన్స్ కౌన్సిల్గా అత్యంత ప్రఖ్యాతుడైన హరీశ్ సాల్వేగారు ఉత్తర ప్రదేశ్ అధికార యంత్రాంగం తరఫున వాదిస్తున్నారు (ఫీజెంత అని అడక్కండి). తదుపరి చర్యలేవీ బాగా లేవని న్యాయమూర్తులు పెదవి విరుస్తున్నారు. ‘‘ప్రశ్నించడానికి రమ్మన్నాం. రాకపోతే మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రాకు చట్టం కాఠిన్యం ఏమిటో చూపిస్తాం’’ అని హరీశ్ సాల్వే హామీ ఇచ్చారు. మంత్రికొడుకు ఇంటి ముందు జాగ్రత్తగా నోటీసు అంటించి వచ్చారు. అవును. అరెస్టు చేసే ముందు అన్ని హక్కులూ అరెస్టు కాబోయే వారికి కల్పించాలి. ఎన్ని నిందలొస్తే మాత్రం ఆయన బీజేపీ నాయకుడే అవుతాడు గానీ నిందితుడని అనగలమా? మన రాజ్యాంగం వారికిచ్చిన చాలా హక్కులు వాడుకోవలసిందే. అధికార పక్షం కాని వారికి కూడా ఆ హక్కులు ఇస్తే బాగుండేదనే ఒక సూచన. ఎట్టకేలకు ఆయనను అరెస్టయితే చేశారు! దేశ హోంశాఖ సహాయ మంత్రిని డిస్మిస్ చేయాలని శిరోమణి అకాలీదళ్ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఇంకా ఆయనను మంత్రి పదవిలో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. డిమాండ్ చేయగానే డిస్మిస్ చేస్తే అసలు మంత్రి వర్గాలేవీ ఉండవు. మంత్రులు లేకపోతే, అందులోనూ హోంశాఖ సహాయ మంత్రి లేకపోతే దేశ వ్యవహారాలన్నీ ఎవరు నడిపిస్తారు? బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఈ అధికార అహంకార కారు వీడియోను జనం ముందుకు తెచ్చారు. కావాలని రైతుల వెనుకనుంచి దూసుకొచ్చి ఓ నల్ల ఎస్యూవీ కారు వారి శరీరాల మీదుగా వేగంగా నడిచిపోతున్నట్టు స్పష్టంగా ఉంది. రైతులే మంత్రి కారు మీద దాడి చేశారన్నది ప్రచారం. ‘ఈ వీడియో స్పష్టంగా ఉంది. నిరసనదారుల నోళ్లను హత్యల ద్వారా మూయలేరు. రోడ్డుమీద చిందిన అమాయక రైతుల నెత్తురుకు ఎవరు బాద్యత వహిస్తారు. ఈ క్రూర దురహంకార చర్యలను ఆపలేరనే సందేశం చేరకముందే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలగజేయా’లని వరుణ్ గాంధీ ట్వీట్ వ్యాఖ్య చేశారు. మంత్రిగారిని మంత్రివర్గం నుంచి తొలగించలేదు; కానీ వరుణ్, మేనకాగాంధీలను బీజేపీ కార్యవర్గం నుంచి అక్టోబర్ 7న తొలగించేశారు. ఇక అంతర్ ‘గత’ ప్రజాస్వామ్యం గురించి చెప్పేదేముంది! మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
ఓటే ఆయుధం.. అందరూ వేయండి
ఓటే ఆయుధం.. అందరూ వేయండి‘మనం మనకోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది.’ – జాతిపిత మహాత్మాగాంధీ సాక్షి, కరీంనగర్: అహింసే ఆయుధంగా.. సహనమే డాలుగా దేశానికి స్వేచ్ఛావాయువులందించిన మహోన్నతుడు మన జాతిపిత మహాత్మాగాంధీ. ఆంగ్లేయుల బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించిన స్ఫూర్తి ప్రధాత. రాజకీయాల్లో అడుగడుగునా విలువలు పెరగాలని.. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆకాంక్షించిన గొప్ప వ్యక్తి. పల్లెలే పట్టుగొమ్మలుగా సిద్ధాంతాలతో కూడిన నాయకత్వం పెంపొందాలని పరితపించిన ఆదర్శనీయుడు కోట్లాది మంది భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ ఓటర్లు, అభ్యర్థులు, ఎన్నికల యంత్రాంగం బాపూజీ మాటల్ని మననం చేసుకొని, విలువల మంత్రాల్ని ఆచరించాల్సిన తరుణమిది. ఓటరన్నా.. విలువ కాపాడుకో.. ఓటు విషయంలో నీ విలువ కాపాడుకో. మంచి నాయకుడిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకునేందుకు ఓటు అనే ఆయుధాన్ని వాడుకోవాలి. హుజూరాబాద్ ఎన్నికలో మొత్తం 305 పోలింగ్ కేంద్రాలు వినియోగిస్తుండగా 2,36,283 మంది ఓటర్లున్నారు. ప్రతిఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలి. మంచి నాయకుడికి పట్టం గట్టాలి. సిద్ధాంతాలు లేని రాజకీయాలు వ్యర్థం ఎన్నికల్లో గెలుపోటములు సహజం. విలువలతో ప్రజల మనసుని గెలవాలి. సిద్ధాంతాలకు లోబడి ఉండలేని రాజకీయాలు వ్యర్థం. అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడాలి. ఆయా పార్టీల అభ్యర్థులుగా బరిలో ఉండే నాయకులంతా ప్రజాసేవపై దృష్టి సారించాలి. విలువలకు కట్టుబడాలి.. విధి నిర్వహణకు మించిన సేవ లేదు. విలువలకు కట్టుబడకుండా.. వ్యక్తిత్వాన్ని కోల్పోయి సేవలందించినా అది నిరుపయోగమే. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించడంలో బాధ్యత ముఖ్యమన్నది మరవొద్దు. చెడుకు సహాయ నిరాకరణ చేయడం ద్వారా విలువల్ని పరిరక్షించవచ్చు. బంధుప్రీతి.. ఇతర వ్యామోహాలకు వెరవకుండా ఎన్నికల్లో సమర్థంగా పనిచేస్తే ఎన్నికల ఆశయానికి ఊపిరిపోసినట్లే. నైతికత.. పారదర్శకత అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు.. రంగు గో డలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన అభివృద్ధి. అలాగే నాయకులు అందించే పాలనలో పారదర్శకత ముఖ్యం. సమాజానికి మేలు చేయాలనే భావన నాయకుల హృదయాంతరాల్లో నుంచి రావాలి. అందుకు ప్రణాళికతో కూడిన సాధన అవసరం. ప్రగతితో కూడిన పాలన నిత్యం అత్యవసరం. మద్యం జోలికి వెళ్లకండి.. ప్రజాస్వామ్య వ్యవస్థ పునర్నిర్మాణంలో యువతే కీలకం. నేను కన్న కలల లోకంలో విహరించాలంటే నా బాటలో నడవండి. అహింసాయుత జీవనానికి నాంది పలకండి. ఏరులై పారే మద్యం జోలికి ఈ ఎన్నికల్లో అసలు వెళ్లకండి. ఎవరినీ వెళ్లనివ్వకండి. 305 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను ప్రలోభపెట్టే అవినీతి సొమ్ము సహా మద్యాన్ని కట్టడి చేసేలా ఊరూరా మీ బాధ్యత చూపండి. స్వచ్ఛమైన మనసుతో ఆలోచించండి. అసత్య ప్రచారాల్ని నమ్మకండి. నీతి, నిజాయతీలకు పట్టం కట్టండి. చదవండి: తొలి రోజు మూడు నామినేషన్ల దాఖలు -
బీట్ కానిస్టేబుల్దే కీలక పాత్ర
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వాతంత్య్రం, ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ అత్యంత కీలకమైనవని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. పోలీస్ వ్యవస్థకు వీటితో ప్రత్యక్ష సంబంధం ఉంటుందన్నారు. స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను నిరంతరం మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోలీసు వ్యవస్థలో కింది స్థాయిలో ఉండే బీట్ కానిస్టేబుల్ ప్రజలను రక్షించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడని కొనియాడారు. శనివారం బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్, డెవలప్మెంట్ (బీపీఆర్ అండ్డీ) 51వ వ్యవస్థాపక దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. సమాజంలో శాంతి భద్రతలు అదుపులో లేకపోతే ప్రజాస్వామ్యం విజయవంతం కాబోదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యం అనేది మనకు సహజసిద్ధమైందని వ్యాఖ్యానించారు. ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ నేరుగా శాంతి భద్రతలతో ముడిపడి ఉంటుందన్నారు. -
అఫ్గన్ పాలన: తాలిబన్ల సంచలన ప్రకటన
Afghanistan Taliban Crisis: అఫ్గానిస్తాన్ను హస్తగతం చేసుకున్నతాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. షరియా చట్టాల ఆధారంగానే తమ పాలన ఉండనుందని తేల్చి చెప్పారు. షరియా చట్టాలపై ఆధారపడి ఇస్లామిక్ ప్రభుత్వం పనిచేయనుందని సీనియర్ తాలిబన్ నాయకుడు తాజాగా ప్రకటించారు. అఫ్గానిస్తాన్ను ఎలా నడిపిస్తారనే అంశంపై ఇంకా అనేక అంశాలు ఖరారు కాలేదని, గ్రూప్ నాయక్వతం త్వరలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తాలిబన్ సీనియర్ నేత వహీదుల్లా హషిమి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ అఫ్గన్లో ప్రజాస్వామ్యం పద్ధతిలో పాలన ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ అస్సలు ఉండదు, ఎందుకంటే దీనికి తమ దేశంలో ఎలాంటి ఆధారం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి రాజకీయ వ్యవస్థను వర్తింపజేయాలన చర్చేలేదు.. ఎందుకంటే తాము అమలు చేయబోయేది షరియా చట్టమే అనేది సుస్పష్టం అసలు అఫ్గానిస్తాన్లో ప్రజాస్వామ్య పునాదులే లేవన్నారు. సుప్రీమ్ లీడర్ హైబతుల్లా అఖుంద్జాదా దేశాధినేతగా ఉంటారని హషీమీ చెప్పారు. పాలక మండలిలో సాయుధ దళాల నుండి మాజీ పైలట్లు ,సైనికులను చేరవచ్చన్నారు. అయితే ప్రభుత్వ నిర్మాణంపై అంతర్జాతీయ నేతలతో ఇంకా చర్చిస్తున్నామని చెప్పారు. కాగా కాబూల్లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లోకి ప్రవేశించిన తర్వాత తాలిబన్లు అఫ్గాన్పై పూర్తి నియంత్రణ సాధించారు. ఈ క్రమంలో భవిష్యత్ ప్రభుత్వ ప్రణాళికల గురించి దోహాలో తాలిబన్ నాయకులు చర్చలు సాగిస్తున్నారు. ముఖ్యంగా అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తాలిబాన్ కమాండర్, హక్కానీ నెట్వర్క్ గ్రూప్ సీనియర్ నాయకుడు అనాస్ హక్కానీని కలిశారని తాలిబన్ ప్రతినిధి ఒకరు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాలిబాన్లు చివరిసారిగా అధికారంలో ఉన్నప్పటి 1996-2001 నాటి పాలనను పోలి ఉండనుందని అంచనాలు నెలకొన్నాయి. చదవండి: Afghanistan: ఆమె భయపడినంతా అయింది! Afghanistan Crisis: తాలిబన్లకు బైడెన్ సర్కార్ భారీ షాక్! -
భావ ప్రకటనా స్వేచ్ఛపై భారత్కు చెప్పక్కర్లేదు!
పుణె: ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛపై భారత్కు లెక్చర్లు ఇవ్వాల్సిన పనిలేదని సోషల్ మీడియా సంస్థలకు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చురకలంటించారు. ఇలాంటి సంస్థలను ‘‘లాభార్జన సంస్థలు’’గా నిర్వచించిన ప్రసాద్, ఈ కంపెనీలు భారత్లో సంపాదించాలనుకుంటే తప్పక భారత రాజ్యాంగాన్ని, చట్టాలను అనుసరించాలని స్పష్టం చేశారు. ‘‘సోషల్ మీడియా అండ్ సోషల్ సెక్యూరిటీ’’ మరియు ‘‘క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ రిఫామ్స్’’ అనే అంశాలపై సింబయాసిస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. కొత్త ఐటీ చట్టాలు సోషల్ మీడియా వాడకాన్ని నిరోధించవని, కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను దుర్వినియోగం చేయడాన్ని నిరోధిస్తాయని వివరించారు. కొత్త చట్టాలకు అనుగుణంగా సోషల్ మీడియా కంపెనీలు ఫిర్యాదుల పరిష్కార అధికారి, కంప్లైయన్స్ అధికారి, నోడల్ అధికారిగా భారత సంతతికి చెందినవారిని నియమించాలన్నారు. ఇదేమీ అసాధ్యమైన పనికాదన్నారు. అమెరికాలో ఉంటూ మనదగ్గర లాభాలు పొందుతున్న కంపెనీల నుంచి భావప్రకటనా స్వేచ్ఛపై సందేశాలు వినాల్సిన అవసరం భారత్కు లేదన్నారు. దేశీయ కంపెనీలు అమెరికాలో వ్యాపారానికి వెళితే అక్కడి చట్టాలను పాటించినట్లే, అక్కడి కంపెనీలు ఇక్కడకు వచ్చినప్పుడు ఇక్కడి చట్టాలను పాటించాలని హితవు పలికారు. ఎవరినైనా విమర్శించండి, కానీ ఇక్కడి చట్టాలను మాత్రం పాటించమంటే కుదరదన్నారు. భారత్లో వ్యాపారం చేయాలంటే ఇక్కడి రాజ్యాంగాన్ని అనుసరించితీరాలన్నారు. కొత్త చట్టాల అమలుకు ఈ సంస్థలకు అదనపు సమయం ఇచ్చామని, కానీ అవి నియమాలను అనుసరించలేదని గుర్తు చేశారు. చట్టాలకు అనుగుణ మార్పులు చేయనందున ఇకపై ఈ కంపెనీలు కోర్టుల చుట్టూ తిరగకతప్పదన్నారు. చదవండి: 70 ఏళ్లు పైబడిన ఖైదీలను వెంటనే విడుదల చేయాలి -
ఓటుకు పనితీరే కొలమానం
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, ఎన్నుకోబోయే వ్యక్తి పనితీరు, ప్రజా ప్రయోజనాలనే కొలమానంగా తీసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పోటీచేసే వ్యక్తి గుణగణాలు, సామర్థ్యం, యోగ్యత, నడతను కచ్చితంగా అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కులమతాలు, ధన ప్రభావంతో ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఉపరాష్ట్రపతి తన నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి రచించిన ‘ఎకోటి కాలింగ్’పుస్తకాన్ని తెలుగులో అనువదించిన ‘సుపరిపాలన’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రభుత్వం కంటే పాలనే కీలకమైందని, పాలనా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేయ వలసిన అవసరం ఉందని సూచించారు. సౌకర్యాల కల్పనతో పాటు ప్రజలకు అడ్డంకులు లేని ఆనందమయ జీవితాన్ని కల్పించడమే సుపరిపాలన ధ్యేయమన్నారు. ఎన్నుకోబడిన ప్రతినిధులు తమ బాధ్యతలను త్రికరణశుద్ధిగా నిర్వహించాలని, ప్రజలకు పరిపూర్ణమైన సేవలు అందించాలన్నారు. కరదీపికలా సుపరిపాలన పుస్తకం.. కొత్తగా సివిల్ సర్వీసుల్లోకి వచ్చే వారికి సుపరిపాలన పుస్తకం కరదీపికలా పని చేస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎదురయ్యే సమస్యలు, ఒత్తిడులు, అడ్డంకులు తదితర ఎన్నో అంశాలను ఇందులో చర్చించినట్లు తెలిపారు. థర్డ్ జండర్స్, న్యాయం లాంటి అనేక అంశాల మీద తమ అభిప్రాయాలను వెలువరించిన ఈ పుస్తకం, ఉద్యోగంతో పాటు సమాజం పట్ల జోషి చేసిన అధ్యయనాన్ని తెలియజేస్తుందని, రచయిత జోషి రచించిన ఇంగ్లీషు పుస్తకాన్ని సరళమైన, చక్కని తెలుగులో అనువాదం చేసిన అన్నవరపు బ్రహ్మయ్యకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్ ఎస్.కె.జోషి, అనువాదకుడు బ్రహ్మయ్య పాల్గొన్నారు. -
ప్రజాస్వామం చచ్చిపోయింది.. చైనాకు తాకట్టు
తూత్తుకూడి: దేశ ప్రయోజనాలను చైనాకు తాకట్టు పెట్టడంతో దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనాకు సాగిలపడ్డాడని ఆరోపించారు. భారతదేశాన్ని చైనాకు అప్పగించారని మండిపడ్డారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తూత్తుకూడిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. సుదీర్ఘ రాజ్యాంగం ఉన్న భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికిలేదు.. ఆరేళ్లుగా ఒక ప్రణాళికపరంగా ప్రభుత్వ సంస్థలన్నింటిని ప్రభుత్వం వదిలేసుకుంటుందని రాహుల్ చెప్పారు. దేశంలో పార్లమెంట్, న్యాయ వ్యవస్థ, జర్నలిజం బలహీన పడుతుండడంతో దేశంలో ప్రజాస్వామ్యం ఇంకెక్కడిది అని ప్రశ్నించారు. విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థలను సమానంగా ఆరెస్సెస్ వాదులు నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థల నిర్వీర్యంతో రాష్ట్రాల పాత్రను కూడా తగ్గించేస్తున్నారని.. అదే మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని రాహుల్ తెలిపారు. డబ్బు, అంగబలం ఎమ్మెల్యేలను నడిపిస్తోందని.. వాటితో ఎమ్మెల్యేలను బీజేపీ వేటాడుతోందని రాహుల్ పుదుచ్చేరి పరిణామాలను పరోక్షంగా ప్రస్తావించారు. -
జో బైడెన్ ఉద్వేగ భరిత ప్రసంగం
వాషింగ్టన్: ‘ఈ రోజు అమెరికాది. ఈ రోజు ప్రజాస్వామ్యానిది. ఇది ప్రజాస్వామ్యం విజయం సాధించిన రోజు. దేశ పునరుజ్జీవానికి మనమంతా అంకితమైన రోజు’ అని అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ తన తొలి ప్రసంగంలో అభివర్ణించారు. గత నాలుగేళ్లుగా లోతుగా గాయపడిన దేశానికి చికిత్స చేసి, విడిపోయిన దేశాన్ని ఒక్కటిగా చేయడం ప్రస్తుతం తన ముందున్న ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ‘ఇది వ్యక్తిగత విజయం కాదు. ఈ విజయాన్ని ఒక ప్రత్యేక కారణంతో ఉత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ కారణం ప్రజాస్వామ్యం.. ప్రజాస్వామ్య విజయం’ అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు, వారి వాణికి గుర్తింపు లభించిన రోజు ఇదన్నారు. ‘ప్రజాస్వామ్యం అత్యంత విలువైనదన్న విషయాన్ని మనం మరోసారి గుర్తించాం. చదవండి: (ప్రెసిడెంట్.. బైడెన్) డెమోక్రసీ అత్యంత సున్నితమైందన్న విషయాన్నీ నేర్చుకున్నాం. మిత్రులారా.. ఈ క్షణం.. ప్రజాస్వామ్యం విజయం సాధించిన క్షణం’ అని ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. గత అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార తీరు కారణంగా.. గతంలో ఎన్నడూ జరగని విధంగా అధికార మార్పిడిలో సంక్లిష్టతలు చోటు చేసుకున్న నేపథ్యంలో బైడెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అధ్యక్షుడిగా దాదాపు 21 నిమిషాల పాటు చేసిన తొలి ప్రసంగంలో దేశ ప్రజలకు బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని వారిని కొనియాడారు. జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై జరిపిన హింసాత్మక దాడిని ప్రస్తావిస్తూ.. ‘రెండు వారాల క్రితం ఇక్కడే ప్రజాస్వామ్యాన్ని ఓడించేందుకు విఫల ప్రయత్నం జరిగింద’ని బైడెన్ గుర్తు చేశారు. అధ్యక్షుడిగా తన ముందున్న సవాళ్లను, అమెరికా గత ఘనతను, అంతర్జాతీయ ప్రతిష్టను మళ్లీ సాధించేందుకు రూపొందించిన ప్రణాళికలను తొలి సందేశంలో దేశ ప్రజలకు బైడెన్ వివరించారు. కరోనా మహమ్మారిని నియంత్రించడం, జాత్యహంకారాన్ని రూపమాపడం, వాతావరణ మార్పును ఎదుర్కోవడం.. తన ముందున్న ప్రధాన సవాళ్లని పేర్కొన్నారు. వీటిపై విజయం సాధించేందుకు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా శ్వేత జాత్యంహకారాన్ని ఐక్యంగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. అందరికీ సమాన న్యాయం ఎంతో దూరంలో లేదన్నారు. ‘బైడెన్ అమెరికాకు అధ్యక్షుడు. అమెరికన్లందరికీ అధ్యక్షుడు. తనకు ఓటేసిన వారికి, ఓటేయని వారికీ అధ్యక్షుడు’ అని స్పష్టం చేశారు. ‘మార్పు సాధ్యం కాదని అనకండి. మార్పు సాధ్యమే. కమల హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేయడమే దేశంలో వచ్చిన సానుకూల మార్పునకు ప్రత్యక్ష సాక్ష్యం’ అని వ్యాఖ్యానించారు. కమల హ్యారిస్ దేశ ఉపాధ్యక్షురాలైన తొలి ఇండో–ఆఫ్రో అమెరికన్ మహిళ అన్న విషయం తెలిసిందే. దేశ ప్రజల మధ్య ఆగ్రహావేశాల్ని రగల్చి, దేశాన్ని విభజించే కుట్ర చేశారని ఈ సందర్భంగా ప్రత్యర్థులపై బైడెన్ ఆరోపణలు గుప్పించారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వారు అబద్ధాలను ప్రచారం చేశారన్నారు. సవాళ్లను ఎదుర్కో వడం అమెరికాకు కొత్తేం కాదని, ప్రతీ సారి సవాళ్లు, సమస్యలపై విజయం సాధిస్తూనే ఉందని దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపారు. కరోనా వైరస్ అమెరికాను ఆర్థికంగా, సామాజికంగా దారుణంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన అమెరికన్ల కన్నా కరోనా కారణంగా చనిపోయిన అమెరికన్ల సంఖ్య ఎక్కువని గుర్తు చేశారు. వేలాది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని, లక్షలాది వ్యాపారాలు మూతపడ్డాయని ఆవేదన చెందారు. దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను కలసికట్టుగా ఎదుర్కుందామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా.. గత నాలుగేళ్ల ట్రంప్ హయాంలో రూపుదిద్దుకున్న అంతర్జాతీయ కూటములను సమీక్షిస్తామని బైడెన్ స్పష్టం చేశారు. ‘ప్రపంచంలోని మంచి అంతటికి అమెరికా నాయకత్వం వహించే కాలం మళ్లీ వస్తుంది’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా భాగస్వామిగా ఉన్న అంతర్జాతీయ కూటములను ప్రస్తుత, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతామన్నారు. ‘శాంతి, అభివృద్ధి, భద్రతలకు విశ్వసనీయ భాగస్వామిగా అమెరికా ఉంటుంది’ అని ప్రపంచ దేశాలకు భరోసానిచ్చారు. కమలా హ్యారిస్ డ్రెస్ డిజైనర్లు నల్లజాతీయులే వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్ ప్రమాణ తన స్వీకారోత్సవం సందర్భంగా క్రిస్టోఫర్ జోన్ రోజర్స్, సెర్గియో హడ్సన్ అనే ఇద్దరు నల్ల జాతీయులు రూపొందించిన వస్త్రాలు ధరించారు. నల్ల జాతీయురాలైన కమలా హ్యారిస్ ఈ విధంగా అమెరికా ప్రజలకు ఒక సానుకూల సందేశం ఇచ్చినట్లయ్యింది. ఆమె భర్త డగ్లస్ ఎమోఫ్ రాల్ఫ్ లారెన్ సూట్లో మెరిసిపోయారు. బైడెన్ దంపతుల ఆత్మీయ ఆలింగనం, కమలను అభినందిస్తున్న భర్త డగ్లస్ -
ప్రజాస్వామ్యంపై మీ పాఠాలా?
న్యూఢిల్లీ/జమ్మూ: ప్రజాస్వామ్యం గురించి కొందరు వ్యక్తులు తనకు నిత్యం పాఠాలు చెబుతున్నారని, వారి నిజస్వరూపం ఈరోజు బయటపెడతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్లో ఇటీవల జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడం, ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనడం దేశానికి గర్వించే క్షణమని చెప్పారు. ఆయన శనివారం జమ్మూకశ్మీర్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇక్కడ మూడంచెల పంచాయతీ వ్యవస్థ పూర్తిరూపం సంతరించుకుందని మోదీ తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతోందని అన్నారు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన కొద్ది కాలంలోనే పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పటికీ పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ప్రభుత్వం(కాంగ్రెస్) స్థానిక ఎన్నికలు ఇంకా నిర్వహించలేదని ఆక్షేపించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రజాస్వామ్యంపై వారికున్న గౌరవం ఇదేనా? ‘‘ఢిల్లీలో కూర్చున్న కొందరు వ్యక్తులు నన్ను నిత్యం శాపనార్థాలు పెడుతున్నారు. అభ్యంతరకర పదజాలం వాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి నాకు రోజూ పాఠాలు చెబుతున్నారు. వారి నిజస్వరూపం ఈరోజు బయటపెడతా. ప్రజాస్వామ్యం గురించి నాకు బోధిస్తున్న పార్టీ పుదుచ్చేరిలో అధికారంలో ఉంది. ఆ పార్టీ అక్కడ స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు. పుదుచ్చేరిలో చివరిసారిగా 2006లో స్థానిక ఎన్నికలు జరిగాయి. పదవీ కాలం 2011లోనే ముగిసింది. అయినా ఎన్నికలే జరపడం లేదు. అంటే వారు చెప్పేదానికి, చేసేదానికి ఏమాత్రం పొంతన లేదని దీన్నిబట్టి తెలుసుకోవచ్చు. ప్రజాస్వామ్యం పట్ల వారికున్న గౌరవం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కొత్త నాయకత్వానికి శ్రీకారం జమ్మూకశ్మీర్లో డీడీసీ ఎన్నికలు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాయి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశాయి. ప్రతికూల వాతావరణం, కరోనా భయం ఉన్నప్పటికీ ఓటర్లు ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటేశారు. నాకెంతో గర్వంగా ఉంది. దేశానికి ఇదొక గర్వించే క్షణం. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం, భద్రతా సిబ్బంది అహోరాత్రులు శ్రమించారు. ప్రజల కోసం పని చేసినవారు ఎన్నికల్లో గెలిచారు. కొత్త దశాబ్దంలో కొత్త నాయకత్వానికి ఇది శ్రీకారం. గతంలో జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్తో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలతో ప్రజలు వారి హక్కులను వారు పొందారు. పాత చరిత్రను వెనక్కి నెట్టేసి, కొత్త భవిష్యత్తు కోసం ఓటేశారు.’’ ‘ఫెరాన్’ ధరించిన మోదీ జమ్మూకశ్మీర్లో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కశ్మీరీ సంప్రదాయ ఫెరాన్ వస్త్రాలు ధరించారు. ఈ వస్త్రాలను గత ఏడాది కశ్మీర్ వ్యవసాయ కూలీ ఒకరు మోదీకి బహూకరించారు. కశ్మీర్ పర్యటనలో ఈ వస్త్రాలు ధరించాలని మోదీ భావించినప్పటికీ కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా అది సాధ్యం కాలేదు. ఇది చరిత్రాత్మక దినం ‘‘ఆయుష్మాన్ భారత్ పథకంతో జమ్మూకశ్మీర్లో ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాకు అర్హులవుతారు. ఈ ప్రాంతానికి ఇది చరిత్రాత్మక దినం. జమ్మూకశ్మీర్ సమగ్ర అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో దశాబ్దాలపాటు అధికారం చెలాయించిన నేతలు సరిహద్దు రాష్ట్రాల అభివృద్ధిని విస్మరించారు. ఆ తప్పిదాన్ని మేము సరిచేస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద జమ్మూకశ్మీర్లో 12 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. మోదీ పాలనలో జమ్మూకశ్మీర్లో శాంతి: అమిత్ షా ప్రధానమంత్రి మోదీ ఆరేళ్ల పాలనాకాలం జమ్మూకశ్మీర్లో చరిత్రలో 1990 తర్వాత అత్యంత శాంతియుతమైన కాలంగా గుర్తుండిపోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ప్రారంభోత్సవం లో ఆయన ప్రధాని మోదీతోపాటు గువాహటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ ప్రజలతో నరేంద్ర మోదీకి ప్రత్యేక అనుబంధం, ప్రేమ ఉన్నాయని తెలిపారు. ఆయనను తాను ఎప్పుడు కలిసినా జమ్మూకశ్మీర్లో చేపట్టాల్సిన అభివృద్ధి, ప్రజల బాగోగులు, శాంతి భద్రతల గురించి కచ్చితంగా ప్రస్తావిస్తుంటారని గుర్తుచేశారు. 2019 ఆగస్టు 5 తర్వాత జమ్మూకశ్మీర్లో ప్రతిరంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. శాంతి లేకుంటే అభివృద్ధి జరగదని వ్యాఖ్యానించారు. యువత కలలు నిజం కావాలంటే శాంతి చాలా ముఖ్యమని చెప్పారు. జమ్మూకశ్మీర్కు ఇచ్చిన అన్ని హామీలను ప్రధాని మోదీ తప్పనిసరిగా నెరవేరుస్తారని ఉద్ఘాటించారు. -
డెమోక్రసీ పట్ల పడిపోయిన విశ్వాసం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల యువతకు క్రమంగా విశ్వాసం సన్నగిల్లుతోంది. తాజాగా ప్రపంచంలోని 160 దేశాల నుంచి 35 ఏళ్ల లోపు యువత నుంచి అభిప్రాయాలను కేంబ్రిడ్జి యూనివర్శిటీ సేకరించగా కేవలం 48 శాతం మంది మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. 1990, 2000 దశకాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థపై మూడింట రెండు వంతుల మంది విశ్వాసం వ్యక్తం చేయగా, ఇప్పుడు వారి శాతం యాభైకన్నా దిగువకు పడిపోవడం గమనార్హం. అప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల 62 శాతం యువత విశ్వాసం వ్యక్తం చేయగా ఇప్పుడు కేవలం 48 శాతం యువత మాత్రమే విశ్వాసం వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం 54 శాతం ఉండగా, అది 1950వ దశకానిని 57 శాతానికి పెరిగింది. 1990, రెండువేల సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరం భారీగా పెరగడంతో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం 62 శాతానికి పెరిగింది. అమెరికాలోని మిన్నియాపోలిస్ నగరంలో మే 25వ తేదీన ఓ నల్లజాతీయుడు, ఓ తెల్లజాతి పోలీసు చేతిలో చనిపోవడం, ఇంగ్లండ్లోని బ్రిస్టల్ సిటీలో ప్రజా ఉద్యమంలో భాగంగా జూన్ ఏడవ తేదీన ఎడ్వర్డ్ కొలస్టన్ విగ్రహాన్ని విధ్వసం చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో యువతలో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. 160 దేశాల నుంచి 50 లక్షల మంది యువతను శాంపిల్గా తీసుకొని కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఈ సర్వేను నిర్వహించింది. -
ఫేస్బుక్ తీరుతో దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్న కాంగ్రెస్
-
విద్వేషంపై ఉదాసీనత
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్బుక్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేసింది. భారత్లోని బీజేపీకి చెందిన కొందరు నేతల విద్వేషపూరిత పోస్టులపై ఫేస్బుక్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ అమెరికా ‘వాల్స్ట్రీట్ జర్నల్’లో వచ్చిన కథనంపై ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించిన విషయం తెలిసిందే. ఈ కథనంపై రాజకీయ దుమారం రేపడంతో సోమవారం ఫేస్బుక్ స్పందించింది. హింసను ప్రేరేపించే విద్వేష పూరిత అంశాలను అడ్డుకుంటున్నామని, రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాన్ని పాటిస్తున్నామని వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా, తనను కొందరు ఆన్లైన్లో తీవ్రంగా బెదిరిస్తున్నారనీ, ప్రాణహాని ఉందంటూ ఆ సంస్థ ఉన్నతాధికారిణి ఒకరు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్బుక్ చూసీచూడనట్లుగా వదిలేస్తోందంటూ ఇటీవల వాల్స్ట్రీట్ జర్నల్లో ఒక కథనం వెలువడింది. మత విద్వేష వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్న తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యేపై శాశ్వత నిషేధం విధించాలని తీసుకున్న నిర్ణయం భారత్లోని తమ ఉన్నతాధికారి జోక్యం కారణంగా ఆగిపోయిందని ఫేస్బుక్ ఉద్యోగులు కొందరు తెలిపారంటూ ఆ కథనంలో పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం స్పందించారు. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారత్లో ఫేస్బుక్, వాట్సాప్లను నియంత్రిస్తున్నాయి. వీటి ద్వారా తప్పుడు వార్తలను, విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నాయి’అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ ప్రతినిధి సుప్రియా శ్రీనాతే సోమవారం మీడియాతో మాట్లాడుతూ..ప్రపంచంలో ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్లో.. విద్వేషాన్ని ప్రేరేపించే వ్యక్తులు లేదా వేదికలను వదలకూడదు. ఫేస్బుక్ నిష్క్రియాపరత్వం ఫలితంగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుంది. అభ్యంతరకర అంశాలు ఆ సంస్థ దృష్టికి వచ్చినప్పటికీ కొనసాగించడంతోపాటు ఎలాంటి చర్య తీసుకోకపోవడం హాస్యాస్పదం, ఘోరం’అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర దేశాల్లో వదంతులు సృష్టించే, విద్వేషాలను పెంచే పోస్టులను తొలగించే ఫేస్బుక్.. భారత్లో మహిళలపై వేధింపులు, కొన్ని వర్గాలను, మతాలను లక్ష్యంగా చేసుకుని పెట్టే పోస్టులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ విధంగా ఒక్కో దేశానికి ఒక్కో నిబంధనను ఫేస్బుక్ అమలు చేయడం సరికాదని తెలిపారు. ఫేస్బుక్తోపాటు వాట్సాప్లోనూ వదంతుల వ్యాప్తి, విద్వేషపూరిత సమాచారంపై అదుపూ లేదన్నారు. ఫేస్బుక్–బీజేపీ కుమ్మక్కు: సీపీఎం విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఫేస్బుక్ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ వాల్స్ట్రీట్ కథనంలో వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఎం డిమాండ్ చేసింది. అధికార పార్టీ నేతలకు ఫేస్బుక్లో పెట్టుబడులున్నాయనీ, కేంద్రంతో ఆ సంస్థ కుమ్మక్కయిందని సీపీఎం పొలిట్ బ్యూరో ఆరోపించింది. ఈ వ్యవహారంపై వెంటనే జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. నాకు ప్రాణహాని ఉంది: ఫేస్బుక్ అధికారిణి తనకు ప్రాణహాని ఉందని, చంపుతామని బెదిరిస్తూ కొందరు ఆన్లైన్లో పోస్టులు పెడుతున్నారంటూ ఫేస్బుక్ సంస్థ సౌత్ అండ్ సెంట్రల్ ఏసియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంఖి దాస్ ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్ వ్యవహారంపై ఒకపక్క రాజకీయ దుమారం చెలరేగుతుండగా ఆదివారం ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. ‘నా జీవితాన్ని నాశనం చేస్తామని, నన్ను చంపుతామంటూ ఆన్లైన్లో నా ఫొటో పెట్టి మరీ బెదిరిస్తున్నారు. వార్తా కథనాన్ని సాకుగా చూపుతూ నా ప్రతిష్టను దెబ్బతీసేలా, నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆన్లైన్ ఈవ్టీజింగ్కు పాల్పడుతున్నారు. వీటి కారణంగా నాతోపాటు నా కుటుంబసభ్యుల భద్రత ప్రమాదంలో పడింది’అని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు బాధ్యతలను సైబర్ విభాగానికి అప్పగించినట్లు ఢిల్లీ పోలీస్ విభాగం అదనపు పీఆర్వో అనిల్ మిట్టల్ తెలిపారు. మరింత చేయాల్సి ఉంది: ఫేస్బుక్ వాల్స్ట్రీట్ కథనంపై చెలరేగిన రాజకీయ దుమారం నేపథ్యంలో ఫేస్బుక్ ప్రతినిధి స్పందించారు. ‘విద్వేష ప్రసంగాలను, హింసను ప్రేరేపించే అంశాలను మేం అడ్డుకుంటున్నాం. ఏ రాజకీయ పార్టీ లేదా నేతతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాం. ఈ విషయంలో చేయాల్సింది ఇంకా ఉందని మాకు తెలుసు. ఈ ప్రక్రియ నిష్పక్షపాతంగా, కచ్చితత్వంతో ఉండేలా ఆడిట్ చేపట్టాం. ఇది కొనసాగుతుంది’అని తెలిపారు. -
ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం
న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్యానికిది పరీక్షా సమయమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ప్రశ్నించడానికి, విభేదించడానికి, జవాబుదారీతనం గురించి అడగడానికి తగిన స్వేచ్ఛ ఉందా? అని ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని తన స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ఆమె కోరారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్య విలువలు క్రమంగా బలపడుతూ వచ్చాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలు, తరతరాల సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యానికిది పరీక్షా సమయమని అన్నారు. ‘రాయడానికి, మాట్లాడటానికి, ప్రశ్నించడానికి, విభేదించడానికి, సొంత అభిప్రాయాలు కలిగి ఉండటానికి, జవాబుదారీతనాన్ని కోరడానికి నేడు స్వాతంత్య్రం ఉందా?’అని సోనియా ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను కాపాడటానికి బాధ్యతాయుత ప్రతిపక్షంగా తాము ప్రతి ప్రయత్నం చేస్తామన్నారు. ఈ రోజు యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో సతమతమవుతోంది. మనమంతా కలిసికట్టుగా దీన్ని జయించి ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలవాలి. గల్వాన్ లోయలో చైనాతో ఘర్షణలను ప్రస్తావిస్తూ... ‘కల్నల్ సంతోష్బాబుతో సహా 20 మంది ప్రాణత్యాగం చేసి 60 రోజులు అవుతోంది. వారి ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తున్నాను. చైనా దురాక్రమణలను తిప్పికొట్టి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటమే మనం వారికిచ్చే ఘన నివాళి’అని సోనియా పేర్కొన్నారు. -
స్వేచ్ఛను హరిస్తే ప్రజాస్వామ్య పతనమే
గత 73 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఆయా దశలలో పౌరుల అభివ్యక్తి స్వేచ్ఛపై ఆంక్షలు అధిక మవుతూనే ఉన్నాయి. అస మ్మతిని గౌరవించినపుడే ప్రజాస్వామిక మనుగడ సాధ్యమనే వాస్తవాన్ని పాల కులు మరిచిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు కేంద్రంలోని భాజపా సర్కార్, దేశభక్తి జాతీయవాదం– సంస్కృతి పేరిట ఈ అసమ్మతి హక్కును అన్ని విధాలా అణచి వేస్తున్నది. ప్రజా ఉద్యమాలు ఏ రూపంలో ఉన్నా తమ అధికారానికి ముప్పు వాటిల్లగలదనే మానసి కత రాజ్యం చేస్తున్నది. అందులో భాగంగానే భీమా కోరేగావ్ దళితుల కార్యక్రమంపై క్రిమి నల్ కేసులు పెట్టి, మిత్రులు వరవరరావు ఇతర ప్రజా స్వామిక ఉద్యమకారులపై కక్షపూరితంగా నేరాలు మోపి, కనీసం బెయిల్ రాకుండా చేస్తున్నారు.ప్రస్తుతం ఉపా (యూఏపీఏ) చట్టం కింద కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఏకపక్ష నిర్బంధాల మూలానా వివిధకేసులలో, విచారణ లేకుండా మేధా వులు–ప్రజాస్వామికవాదులు జైళ్లలో మగ్గిపోతు న్నారు. కనీసం బెయిల్పై వచ్చే అవకాశాలు కోల్పో తున్నారు. ఒకవిధంగా ఇది రాజ్యహింసకు మరో రూపం. ఈ నేపథ్యంలో రాజ్యాంగ యంత్రాంగం ముసుగులో పాలకులు నియంతలుగా మారిపోతే, ప్రజల ఆగ్రహాన్ని తిరుగుబాట్లను చూడవలసి ఉంటుంది. అభివ్యక్తి స్వేచ్ఛను హరించినప్పుడల్లా ప్రజల గొంతులుగా, నాడిగా రచనలు చేసే కవులు– రచయితలు తమ ఆత్మవిశ్వాసాన్ని–నిబద్ధతను చాటు తూనే ఉన్నారు. మరోవైపు రాజ్యాంగపరంగా పేదలకు రక్షణ ఉన్నా, వలస కాలం నాటి చట్టాలు, నేరస్మృతిలో భాగంగా– ఆ రక్షణను లాగేసి, నిర్బంధాలను అమలు చేస్తున్నారు. ఈ దేశంలోని సెక్యులర్ వామపక్ష భావాలు గల వారందరినీ అణచివేయాలనే కక్షపూరిత వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నారు. 1948లోనే రాజ్యాంగసభలో ప్రసంగిస్తూ మహానాయకుడు డా. అంబేడ్కర్ ఇలా వ్యాఖ్యానించారు. ‘ఈ నూతన రాజ్యాంగపరంగా ఏవైనా తప్పులు జరిగితే మనకు చెడ్డ రాజ్యాంగం ఉందనేది కారణం కాదు. మనిషి నీచుడిగా (దుష్టుడిగా) పరిణమించాడని మనం అను కోవలసి ఉంటుంది’. ‘స్వేచ్ఛాభివ్యక్తి నేరం కాదు’ అనే శీర్షికన వెలువడిన పెంగ్విన్ ప్రచురణ ఇలాంటి అనేకానేక నిషేధాలను, నిర్బం ధాలను వెల్లడిస్తున్నది. వివిధ రూపాలలో రచయిత లను, జర్నలిస్టులను ఆయా దేశాలలోని ప్రభుత్వాలు ఎలా పీడిస్తున్నాయో వివరిస్తున్నది. ఇటీవల మన దేశంలో వెలువడిన ప్రచురణ (భారత్ అసమ్మతి) సంపాదకుడు అశోక్ వాజ్పేయి. ఈ దేశంలో భిన్నాభిప్రాయంతో ప్రశ్నించే సాంప్ర దాయం తరతరాలుగా కొనసాగుతున్నదనే చరిత్ర సంకలనమది. అన్ని కోణాల నుంచి నిజాన్ని దర్శించ గలిగే స్వతంత్రమైన చర్చ మాత్రమే యథార్థాన్ని వెలికితీయగలదు! ఈ ఆలోచనా క్రమంలోనే హెరాల్డ్ పింటర్ (2005 నోబెల్–సాహిత్య పురస్కార ప్రసంగం) జాతి–రంగు–భాష–లింగ భేదాలను దేశాల సరిహద్దులను దాటి ప్రపంచ రచయితల ఆత్మపరిశీలన కోసం, మనమంతా మననం చేసుకో వలసిన భావాలను వ్యక్తం చేశాడు. గతంలో అంతర్జాతీయ వార్తలతో సంచలనం లేవ దీసిన ప్రఖ్యాత టర్కిష్ నవలా రచయిత, నోబెల్ పురస్కార గ్రహీత అర్హన్ పాముక్ ఉదంతంతో ముగిస్తాను. పాముక్ ఒక స్విస్ వార్తా పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా అన్నాడు ‘మా దేశంలో గతంలో 30 వేల కుర్దు జాతీయులను, 10 లక్షల ఆర్మేనియన్లను చంపివేశారు. నేను తప్ప మరెవరూ కూడా దాని గురించి మాట్లాడే సాహసం చేయడం లేదు’. ఈ చారిత్రక వాస్తవాన్ని తమ జాతీయుడే వెల్లడించేసరికి, టర్కీ ప్రభుత్వం జీర్ణించుకోలేక, పాముక్పై దేశద్రోహ నేరం మోపి న్యాయస్ధానానికి ఈడ్చింది. అయితే టర్కీ దేశంలోని న్యాయస్థానాలకు ప్రజాస్వామ్యంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ పవిత్ర మైనదనే నమ్మకం ఆనాటికి ఉంది కాబట్టి పాముక్కు ఎలాంటి శిక్ష విధించలేకపోయింది. విచారణను వాయిదా వేస్తూ, టర్కీ దేశంలోని ప్రజాస్వామిక అభి వ్యక్తి స్వేచ్ఛకు అర్థమేమిటని కోర్టులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.మనదేశంలో కూడా ప్రజా ఉద్యమాలు, రచ యితల, మేధావుల సంఘీభావ సహకారం, న్యాయాన్ని పరిరక్షించే న్యాయమూర్తులు–రాజ్యం విధించే నిషేధాలను ఎప్పటికప్పుడు ఎదిరిస్తూ సృజ నాత్మక రచయితలను రక్షించుకోగలరనే నమ్మకం మిగిలి ఉంది. వ్యాసకర్త: నిఖిలేశ్వర్ ప్రముఖ కవి, మొబైల్ : 91778 81201 -
భారత్ను తరచుగా ఓడించేవాళ్లం: ఇమ్రాన్
దావోస్: భారత క్రికెట్ జట్టును ఎన్నోసార్లు తమ జట్టు ఓడించిందంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. దావోస్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..తాను క్రికెట్ ఆడే సమయంలో ఎన్నోసార్లు భారత్ను ఓడించామని అన్నారు. పరిమాణంలో తమ కంటే 7 రెట్లు పెద్ద దేశమైన భారత్ను తరచూగా ఓడించేవాళ్లమంటూ, అప్పట్లో హాకీ, ఇతర క్రీడలలో పాక్ అద్భుతంగా రాణిస్తుండేదని పేర్కొన్నారు. అప్పట్లో ఓడిన జట్టుకు ఏ బహుమతి ఇచ్చేవారు కాదని, కనీసం సానుభూతి చూపేవారు కాదని ఇమ్రాన్ అన్నారు. తాను రాజకీయాల్లోకి రాగానే కొందరు నవ్వారని..కానీ తానెప్పుడు లక్ష్యాన్ని వదిలిపెట్టలేదన్నారు. దేశంలో అనేక సహజ వనరులున్నాయని..సులభతర వాణిజ్య సూచీలో మెరుగైన స్థానాన్ని పొందడమే తమ లక్ష్యమన్నారు. 1960లో పాకిస్తాన్ చాలా అద్భుత దేశమని..ఆసియా దేశాలకు ఆదర్శంగా నిలిచేదని చెప్పుకొచ్చారు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా తమ దేశంలో ప్రజాస్వామ్యం కుప్పకూలిందని..సైన్యం అధికారంలోకి తీసుకోవడానికి అవకాశం ఏర్పడిందని తెలిపారు. దేశంలో మంచి పరిపాలన అందించగలిగితే పాకిస్తాన్ అభివృద్ధి చెందడం ఖాయమని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. చదవండి: ఇమ్రాన్పై ఒవైసీ ఫైర్ -
ప్రజాస్వామ్యం
-
ఇది ప్రజాస్వామ్య వైఫల్యం
హైదరాబాద్: పరిపాలన ప్రజలకు అర్థం కాకపోవటం అంటే అది ప్రజాస్వామ్య వైఫల్యమేనని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో ‘స్థానిక ప్రభుత్వాలు– సాధికారత, ఆవశ్యకత’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు విద్య అందటం లేదంటే సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. ఇన్నాళ్ల ప్రజాస్వామ్యంలో పిల్లలకు చదువు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 40 వేల కోట్లు పాఠశాల విద్యకు ఖర్చు అవుతున్నా నూటికి 60 శాతం మందికి చదువు రావటం లేదన్నారు. స్థానిక నాయకత్వ లోపం వల్లనే మెరుగైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నామమాత్రంగా విద్యకు ఖర్చు చేసినప్పుడే మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఇప్పుడు కోట్లు ఖర్చు చేసినా ఫలితాలు లేవన్నారు. ఇన్ని అనర్థాలకు మూలం అధికారాన్ని ప్రజలకు దూరం చేయటమేనన్నారు. మనుషులు మారుతున్నారే తప్ప పాలన మారటం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వేల కోట్ల మిగులు తో ఏర్పడినప్పటికీ ఇప్పుడు ఏమీ లేదని, వృథా ఖర్చులు పెరగటం వల్లనే అప్పుల పాలవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, లోక్సత్తా పార్టీ కన్వీనర్ తుమ్మనపల్లి శ్రీనివాసు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, కటారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
దటీజ్ వైఎస్ జగన్!
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టడంలో రాజీ పడబోనని రాజన్న తనయుడు మరోసారి నిరూపించారు. కుళ్లు రాజకీయాలు చేయబోమని ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. రాజకీయాల్లో విలువలకు కట్టుబడతామన్న మాటను అక్షరాల పాటించి ఆదర్శంగా నిలుస్తున్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు మడమ తిప్పని పోరాటం చేస్తానని జనం సాక్షిగా ఇచ్చిన మాటకు అనుక్షణం కట్టుబాటు చాటుతున్నారు. ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామమే దీనికి తిరుగులేని రుజువు. (రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరమన్నారు) వైఎస్సార్ సీపీ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జున రెడ్డి మంగళవారం వైఎస్ జగన్ను కలిశారు. టీడీపీలో ఇమడలేకపోతున్నానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని వైఎస్ జగన్ను కోరారు. ఎమ్మెల్యే సహా అధికార పదవులన్నింటికీ రాజీనామా చేయాలని ఆయనకు వైఎస్ జగన్ సూచించారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని చంద్రబాబు విలువలు దిగజార్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత ముఖ్యమని పునరుద్ఘాటించారు. వైఎస్ జగన్ సూచనతో పదవులకు రాజీనామా చేసేందుకు మల్లికార్జున రెడ్డి అంగీకరించారు. అధికార పదవులు వదులుకున్న తర్వాతే వైఎస్సార్ సీపీలో చేరతానని ప్రకటించారు. వైఎస్ జగన్ ప్రజాస్వామ్య విలువలు కలిగిన నాయకుడని ప్రశంసించారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఇదే స్ఫూర్తిని వైఎస్ జగన్ చాటారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డిని రాజీనామా చేసిన తర్వాత పార్టీలో చేర్చుకున్నారు. వేరొక పార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చే నాయకులు ఆయా పార్టీల కారణంగా వచ్చిన పదవులను వదులుకోవాల్సిందేనంటూ స్పష్టం చేయడం ద్వారా రాజకీయాల్లో విలువలకు పెద్దపీట వేశారు వైఎస్ జగన్. మాటకు కట్టుబడి విలువలు పాటిస్తున్న జననేతకు జనం జేజేలు పలుకుతున్నారు. అభిమానులు ‘దటీజ్ వైఎస్ జగన్’ అంటూ పొంగిపోతున్నారు. -
ఫలితాల సరళిపై మమతా బెనర్జీ ఏమన్నారు?
సాక్షి, కోలకతా: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పందించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న తాజా ఫలితాలు బీజేపీకి పెద్ద షాక్ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నతరుణంలో ఆమె వరుస ట్వీట్లతో బీజేపీపై చురకలంటించారు. ఇది ప్రజల తీర్పు .. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజల విజయమని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విజేతలకు అభినందనలు తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. ఇది ప్రజాస్వామ్య విజయం. అన్యాయానికి, అమానుషానికి, ఏజన్సీల దుర్వినియోగం, పేద ప్రజలు, రైతులు, యువత, దళితులు, ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, మైనారిటీలపై దాడులు, విచ్ఛిన్నానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు సాధించిన విజయమని మమత పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి చోటు లేదని సెమీఫైనల్ రుజువు చేసిందన్నారు. 2019 ఫైనల్ మ్యాచ్కు ఇది నిజమైన ప్రజాస్వామిక సూచన. చివరకు, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' డెమాక్రసీ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. Semifinal proves that BJP is nowhere in all the states. This is a real democratic indication of 2019 final match. Ultimately, people are always the ‘man of the match’ of democracy. My congrats to the winners 3/3 — Mamata Banerjee (@MamataOfficial) December 11, 2018 -
ప్రజాస్వామ్యానికి ఓటే రక్ష
సిరిసిల్ల : ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును మించిన ఆయుధం లేదని, రాజ్యాంగం ఇచ్చిన ఈఅవకాశాన్ని ఓటర్లు సద్వినయోగం చేసుకోవాలని ప్రముఖ లలిత గేయ కవి, సినీ దర్శకుడు వడ్డెపెల్లి కృష్ణ అన్నారు. ఆదివారం గాంధీనగర్ హనుమాన్ దేవాలయంలో సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటు విలువ తెలుసుకుని నోటురూటు మార్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రతీపౌరుడు బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాధ్యక్షుడు పొరండ్ల మురళీధర్ మాట్లాడుతూ మందుకో, విందుకో లొంగి ఓటును అమ్ముకుంటే ప్రశ్నించే హక్కును కోల్పోతామన్నారు. అనంతరం సాహితీ సమితికి చెందిన పలువురు కవులు తమ కవితల్లో ఓటు ప్రాధాన్యతను వర్ణించారు. సమితి ప్రతినిధులు వడ్డెపెల్లి కృష్ణను సత్కరించారు. కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య, కవులు, రచయితలు వెంగళ లక్ష్మణ్, వాసరవేణి పరుశరాం, మడుపు ముత్యంరెడ్డి, జక్కని వెంకట్రాజం, నేరోజు రమేశ్, సబ్బని బాలయ్య, వడ్నాల వెంకటేశం, పాముల ఆంజనేయులు, కనపర్తి హనుమాండ్లు, తుమ్మనపల్లి రామస్వామి, సిద్దిరాం, సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఏనాటి నుంచో ఈనాటి ‘ఈ బంధం’
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో రాజకీయాలకు, మతానికి మధ్యనున్న తెర క్రమంగా తొలగిపోతోంది. ఇక మనది లౌకిక రాజ్యాంగం అనడానికి వీల్లేకుండా అర్థం మారిపోతోంది. పొరుగునున్న భూటాన్ దేశం మత రాజకీయ వ్యవస్థకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు అడుగులు వేస్తే అందుకు పూర్తి విరుద్ధంగా భారత్ లౌకికవాద ప్రజాస్వామ్య వ్యవస్థకు స్వస్తి చెప్పి మత వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయాలకు మతానికి మధ్య ఆమడ దూరం ఉండాలని భావించి అలా ఉంచేందుకు ప్రయత్నించారు. రాజకీయ నాయకులు స్వాములను, సాధువులను సందర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడంతో మొదలైన రెండింటి మధ్య బంధం, స్వాములనే ఎన్నికల్లో నిలబెట్టి, వారి ఆదేశాలను ఆచరించే స్థాయికి పెనవేసుకుపోయింది. పీఠాలు, పీఠాధిపతుల వద్దకే కాకుండా రాజకీయ నాయకులు కర్ణాటకలోని మఠాలు, పంజాబ్, హర్యానాలోని డేరాలను కూడా సందర్శిస్తుంటే వారే ఏ రాజకీయ పార్టీకి ఓటేయాలో ప్రజలకు సూచించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా మత రాజకీయాలను ఆచరించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికెళ్లినా దేవాలయాలను సందర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శివాలయాలు తిరుగుతూ క్షీరాభిషేకాలు చేస్తున్నారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా కేంద్రంలో చంద్రస్వామి నిర్వహించిన పాత్రను మనం మరచిపోలేం. యోగా గురువు రామ్దేవ్, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్లు బీజేపీకి మద్దతుగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో నిర్వహించిన పాత్ర తెల్సిందే. ఆ ఎన్నికల సందర్భంగా వారు సూచించిన అభ్యర్థులకు కూడా బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీ తూర్పు ఢిల్లీ పార్లమెంట్ సభ్యుడు మహేశ్ గిరి ఇంతకుముందు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఎన్నికల రాజకీయాల కోసం మతాలను ఉపయోగించుకోవడం ఇటు భారతీయ జనతా పార్టీకి, అటు శిరోమణి అకాలీ దళ్కు కొత్త కాదు. బీజేపీ హిందూ మత పార్టీ అని, అలాంటప్పుడు హిందూత్వ ఎజెండాను దాచుకోవాల్సిన అవసరం లేదని ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన గోరక్నాథ్ మఠం పీఠాధిపతి ఆదిత్యనాథ్ యోగి, అటు పీఠాధిపతిగా, ఇటు యూపీ ముఖ్యమంత్రిగా రెండు పదవులు నిర్వహిస్తున్నారు. అందుకేనేమో పాపం! ప్రజల సమస్యలను పట్టించుకోవడానికి సమయం దొరకడం లేదు. ఉమాభారతి నుంచి మొదలు పెడితే సాధ్వీ నిరంజన్ జ్యోతి, స్వామి ఆదిత్యనాథ్ వరకు, సాక్షి మహరాజ్ నుంచి సత్పల్ మహరాజ్ వరకు బీజేపీలో స్వాములు జాబితా చాంతాడులా పెరిగిపోతోంది. మొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఐదుగురు హిందూ గురువులను పిలిపించి ఏకంగా మంత్రి హోదాను కల్పించారు. నర్మదా నది ప్రాంతంలో జల వనరులను, అడవులను రక్షించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వారితోని ఓ కమిటీని వేశారు. నర్మదా నది వెంట అక్రమ మైనింగ్ను అరికట్టకపోతే తాను రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తానని హెచ్చరించిన నామ్దేవ్ దాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబుకు నలుగురితోపాటు మంత్రి పదవి ఇవ్వడం గమనార్హం. నవంబర్ 28వ తేదీన మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బాబాలను మంచి చేసుకోవడం మంచిదని మన శివరాజ్ సింగ్ చౌహాన్ భావించారు. ఢిల్లీలో నవంబర్ 4,5 తేదీల్లో అఖిల భారతీయ సంత్ సమితి ఏర్పాటు చేసిన సమ్మేళనానికి 124 తెగలకు చెందిన మూడువేల మంది సాధువులు హాజరై అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తీర్మానించడంతోపాటు ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. 2019, మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 2019, జనవరి–మార్చి మధ్యన జరుగనున్న మహా కుంభమేళాకు ఎంత డబ్బయినా ఖర్చుపెట్టి అత్యంత ఆర్భాటంగా నిర్వహించాలని పాలకపక్షం బీజేపీ నిర్ణయించినట్లు తెల్సింది. భూటాన్లో ఒకప్పుడు ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే స్థాయిలో బౌద్ధ మతం ఉండేది, ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా బౌద్ధ గురువులు జోక్యం చేసుకునేవారు. 2008లో భూటాన్లో తొలిసారిగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయి. నాటి నుంచి అక్కడ మత గురువులు ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు, ఎన్నికల వ్యవహారాల్లోనే జోక్యం చేసుకోవడం లేదు. వారికి ఓటు వేసే హక్కు కూడా లేదు. రాజకీయాలకు మతం అతీతంగా ఉండాలనే దృష్టితో మత గురువులు రాజకీయాలకు గుడ్బై చెప్పారు. ఆ దేశానికి భిన్నంగా మన మత గురువులు రాజకీయాల్లోకి వస్తున్నారు. మున్ముందు పార్లమెంట్లో వీరి సంఖ్య పెరిగితే ‘జై శ్రీరామ్’ నినాదాలతో పార్లమెంట్ హాలు మారుమోగి పోవచ్చు. ఇక అక్కడ ప్రార్థనలు, పూజలు కూడా మొదలు వెడితే ప్రజలు కూడా ఎంచక్కా భక్తి ఛానళ్లను కట్టేసి పార్లమెంట్ ఛానల్ను చూస్తూ పారవశ్యంతో తరించవచ్చు. -
భిన్నాభిప్రాయ స్వేచ్ఛే ప్రజాస్వామ్యం
ప్రభుత్వాలు రాజద్రోహం పేరిట అణచివేసే చర్యలతో లా కమిషన్ తన సమాలోచనా పత్రంలో విభేదిస్తూ ‘‘ప్రజలకు విమర్శించే హక్కు ఉందని పాలకులు గ్రహించాలి. రాజద్రోహం అనే అభియోగంతో దేశపౌరులతో ప్రభుత్వం చెలగాటమాడాలనుకుంటోంది’’ అని హెచ్చరించింది. భారతదేశంలో కాలం చెల్లిన రాజద్రోహం అభియోగం పెట్టడం సరికాదని తేల్చిచెప్పింది. తన దేశ చరిత్రను తానే విమర్శించడం లేదా వ్యతిరేకించడం భావప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగమని గుర్తించాలని లా కమిషన్ సమా లోచనా పత్రం స్పష్టం చేసింది. అంతేగాని, ప్రభుత్వాల తాత్కాలిక విధానాలను వ్యతిరేకించే భావాలను రాజద్రోహ నేరంగా పరిగణించడానికి వీల్లేదని తెలిపింది. భిన్నాభిప్రాయ స్వేచ్ఛ లేకుండా దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టలేదు. ప్రజా స్వామ్య రక్షణకు భిన్నాభిప్రాయ వ్యక్తీకరణే సరైన నియంత్రణ శక్తి. ఆ శక్తినే అడ్డుకుంటే ప్రజాస్వామ్యమే ఆ ఒత్తిడిలో బదాబదలై పోతుంది. సామాజిక ఆందోళనకారులను, కార్యకర్తలను పెద్ద పెట్టున అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం. సుప్రీంకోర్టు ధర్మాసనం (న్యాయమూర్తులు దీపక్మిశ్రా, డీవై చంద్రచూడ్, ఏఎం.ఖాన్విల్కర్, 30–8–2018) ఇటీవల దేశంలో ప్రభుత్వ స్థాయిలో సామాజిక, రాజకీయ దౌర్జన్య కాండపై నిరంతరం బలంగా గొంతువిప్పే ప్రముఖులపై దాడులు పెరిగి పోతున్నాయి. ప్రజాతంత్ర పద్ధతుల్లోనే ఉద్యమాలు సాగుతున్నా ఆందో ళనకారులను సహించలేని ప్రభుత్వాలు వారిపై నిర్బంధాన్ని అమలు జరపడానికి సాహసిస్తున్నాయి. ఆకస్మిక అరెస్టుకు గురైన ఐదుగురు ప్రముఖుల తరఫున దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రసిద్ధ చరిత్ర కారులు రొమీలా థాపర్, ప్రభాత్ పట్నాయక్తో పాటు సతీష్ దేశ్ పాండే, దేవకీ జైన్, మాజా దారూవాలా వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బెంచీ పై వ్యాఖ్య చేసింది. బహుశా, అందుకనే ప్రభుత్వం పోలీసులతో చేయించిన మూకుమ్మడి అరెస్టులుగా త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానిం చాల్సి వచ్చింది. కనుకనే డీవై చంద్రచూడ్ ప్రభుత్వ చర్యను భిన్నాభిప్రా యాన్ని అణచివేయడంగా అభివర్ణించారు. ఇంతకుముందు పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి పాల్పడినప్పుడు ప్రధానమంత్రి ‘ఇందుకు నన్ను చంపుతారని నాకు తెలుసు’ అని ఓ ప్రకటన చేసి ప్రజలను ఆశ్చర్యచకితు లను చేశారు. అలాగే, తాజా అరెస్టులకు పాలకులు వ్యాపింపచేస్తున్న కారణాలు నమ్మదగ్గవిగా లేవు. భీమాకోరెగావ్లో ఎల్గార్ పరిషత్ ఆధ్వ ర్యంలో దళితులు జరిపిన ఆందోళనతో ఈ అరెస్టులను ముడివేశారు. ఈ ఆందోళనకు మావోయిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిధులు సమ కూర్చుతున్నారని, ఈ పని ఎల్గార్ పరిషత్ సమావేశాలకన్నా ముందు నుంచే జరుగుతోందన్నది అభియోగ ప్రచారం. ఇంకా, నిర్బంధంలోకి తీసుకున్న కార్యకర్తలకూ, మావోయిస్టులకు మధ్య నడిచిన ఉత్తరాల్లో ఒక దాన్లో ‘‘మోదీ పాలన అంతమొందించడానికి రాజీవ్ హత్య తర హాలో పథకం గురించిన ప్రస్తావన ఉందని కూడా ఆరోపించారు. అప్రకటిత ఆత్యయిక పరిస్థితి! దేశంలో బీజేపీ ‘గ్రాఫ్ పడిపోతోందని’ మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా గుర్తుచేస్తూ, ‘‘1975లో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీని మించిపోయేలా మోదీ పాలన సాగుతోంది. అప్రకటిత ఆత్యయిక స్థితిని సర్కారు కొనసాగిస్తోంది’ అని అన్నారు. ఇదే మాటలను బీజేపీ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్శౌరీ, శత్రుఘన్సిన్హా పదేపదే చెబుతున్నారు. అలాగే, రిటైర్డ్ జడ్జీలు పీబీ సావంత్ (సుప్రీంకోర్టు), బీసీ కోల్సేపాటిల్ (బొంబాయి హైకోర్టు) ఈ అరెస్టులపై తీవ్ర నిరసన తెలి పారు. భీమాకోరెగావ్ ఆందోళనతో సంబంధం ఉందనే కారణంతో ప్రభుత్వం అరెస్టు చేసిన ఐదుగురికి ఎల్గార్ పరిషత్తో ఎలాంటి సంబంధాలు లేవని జస్టిస్ సావంత్ చెప్పారు. ఎల్గార్ పరిషత్ సమా వేశం జరపడానికి తనకూ, జస్టిస్ కోల్సేపాటిల్కు మాత్రమే సంబంధం ఉందనీ, అరెస్టు చేసిన ఐదుగురితో తమకు ఎలాంటి ఫోన్ సంబంధాలు గాని, ఇతరత్రా వ్యవహారాలుగాని లేవని సావంత్ ప్రసిద్ధ ఇంగ్లిష్ దిన పత్రిక ‘హిందూ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేగాక, చట్టవ్యతి రేక కార్యకలాపాల నిరోధక చట్టం పేరుతో ఈ అరెస్టులు చేయడానికి రుజువుగా మారిన ఆ అజ్ఞాత లేఖను సైతం సర్కారు వెల్లడించలేక పోయింది. ప్రధాని మోదీ హత్య విషయం ప్రస్తావించారం టున్న లేఖను పూర్తిగా వెల్లడించలేకపోవడం పాలనా నిర్వహణలోని ప్రజా వ్యతిరేక కార్యకలాపంగానే జనం భావిస్తారు. ఈ తప్పుడు చట్టం ధనికవర్గ ప్రయోజనాల కోసం, వారి కొమ్ముకాసే పాల కుల అవసరాల కోసం తరచుగా అమలు జరుగుతోంది. ఈ బ్రహ్మస త్యాన్ని చివరికి లా కమిషన్ కూడా ఇటీవలే తూర్పారబట్టింది. తన విధా నాలు, చర్యలను విమర్శించే వారిని కొరత వేయజూసే దేశీయ ప్రభుత్వా లనూ, కేంద్రపాలకులను హెచ్చరించాల్సివచ్చింది. మానవ హక్కులు హరించ చూస్తున్న ప్రభుత్వాలు రాజద్రోహం పేరిట అణచివేసే చర్య లతో లా కమిషన్ తన సమాలోచనా పత్రంలో విభేదిస్తూ ‘‘ప్రజలకు విమర్శించే హక్కు ఉందని పాలకులు గ్రహించాలి. రాజద్రోహం అనే అభియోగంతో దేశపౌరులతో ప్రభుత్వం చెలగాటమాడాలనుకుం టోంది’’ అని హెచ్చరించింది. బ్రిటన్లో రాజద్రోహం సెక్షన్ లేదు! రాజద్రోహం అభియోగం మోపడానికి అవకాశమిచ్చే ఐపీసీ సెక్షన్ 124 –ఏను తిరగదోడాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించాలని కూడా లా కమిషన్ సూచించింది. ఈ రాజద్రోహం అభియోగానికి దోహదం చేసే సెక్షన్ను రూపొందించిన వలసపాలకులైన బ్రిటిష్వారే తమ దేశంలో దీన్ని చట్టం నుంచి తొలగించారని గుర్తుచేసింది. ఈ అభియోగం మోప డం సరికాదని బ్రిటిష్ సర్కారు భావించిన ఫలితంగా పదేళ్ల క్రితమే ఈ సెక్షన్ను రద్దుచేశారు. బహుశా బ్రిటిష్ ప్రభుత్వానికున్న ఇంతటి విచ క్షణా జ్ఞానం అభినవ భారత పాలక వ్యవస్థలకు లేదు. రాజకీయ ప్రత్య ర్థులపైనా, ప్రతిపక్షాలపైనా ఈ అభియోగం మోపి రాజకీయ లబ్ధిపొంద డానికి ఐపీసీ సెక్షన్–124 ఏను పదునైన ఆయుధంగా వాడుకుంటు న్నారు. ఇలాంటి నిరంకుశ చట్టాలకు ఉదాహరణగా తమ దేశం పేరు పేర్కొనవద్దని బ్రిటిష్వారు కోరుతున్నారని మన లా కమిషన్ డాక్యు మెంటు తెలిపింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్నందున రాజద్రోహం అన్న పదాన్ని సమూలంగా నిర్వ చించుకోవాలని కమిషన్ కోరింది. ఎందుకంటే, భావప్రకటనా స్వేచ్ఛను రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఒకటిగా పరిగణిస్తున్నాం కాబట్టి. కేవలం ప్రభుత్వాన్ని ఆచ రణలో హింసామార్గం ద్వారా కూల్చే సందర్భంలో మాత్రమే రాజ ద్రోహం అభియోగం చెల్లుబడి అవుతుందని కమిషన్ వివరించింది. అంతేగాని, తన దేశ చరిత్రను తానే విమర్శించడంగాని లేదా వ్యతిరే కించడం గాని భావప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగమని గుర్తించాలని లా కమిషన్ సమాలోచనా పత్రం స్పష్టం చేసింది. అంతేగాని, ఎప్పటి కప్పుడు దేశంలో ఏర్పడే ప్రభుత్వాల తాత్కాలిక విధానాలను వ్యతి రేకించే భావాలను రాజద్రోహ నేరంగా పరిగణించడానికి వీల్లేదని లా కమిషన్ తెలిపింది. ఈ సందర్భంగా కొన్ని మాసాల క్రితం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థిసంఘం నాయకుడు కన్హయ్య కుమార్పై మోపిన రాజద్రోహ నేరాన్ని కమిషన్ ఉదాహరణగా పేర్కొంది. జాతీయ ఐక్యత లేదా సమగ్రతా పరిరక్షణ సందర్భాలకే పరి మితం కావలసిన ఈ ‘సెక్షన్124 ఏ’ను భావప్రకటనా స్వేచ్ఛను అణ గదొక్కడానికి ఉపయోగించరాదని ఆ విశిష్ట పత్రం స్పష్టం చేసింది. అంతేగాదు, చలనశీలమైన, స్పందించే శక్తిగల ప్రజాస్వామిక వ్యవస్థలో విధాన సమస్యలపై ఆరోగ్యకరమైన, పటిష్టమైన చర్చ జరగాలంటే భిన్నాభిప్రాయ ప్రకటన, విమర్శ ప్రధానం, ప్రాణసమానమని ఆ పత్రంలో ఉంది. నీతి నియమాల గురించి, ప్రజాస్వామ్యం గురించీ ఊద రగొట్టే దేశీయ పాలకులు తమ పార్టీ, ప్రతిపక్షాల పార్లమెంటు సభ్యులు, శాససభ్యులకు వ్యతిరేకంగా నమోదైన కేసుల వివరాలను ఇవ్వడంలో, వెల్లడి చేయడంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తరచుగా ప్రశ్నిస్తోందని (31.8.2018) మరచిపోరాదు. చివరికి, ఇంత వరకూ లెజిస్లేటర్లపై క్రిమినల్ కేసులలో శిక్షలు పడిన వారందరినీ ఎన్ని కల రాజకీయాలలో శాశ్వతంగా పాల్గొనకుండా నిరోధించాలన్న బీజేపీ నాయకుడు అశ్వనీకుమార్ ఉపాధ్యాయ కోరుతూ కోర్టులో ప్రజా ప్రయో జన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయవలసి వచ్చిందని ‘లైవ్ లా’ రిపోర్టు వెల్లడించింది. అసలు, న్యాయంకోసం నిలబడి తీర్పులిస్తున్న కొందరు జడ్జీల జీవితాల్నే తుదముట్టిస్తూ లేదా పదవీ విరమణానంతర పదవులు చూపి అనుకూలంగా తీర్పులు రాబట్టుకుంటున్న రాబందులున్న వాతా వరణంలో అశ్వనీకుమార్ లాంటి బీజేపీ నాయకుల స్వరం కూడా మూగ పోతోందని గ్రహించాలి. అందుకే కాబోలు మహారాష్ట్ర కవి, ప్రసిద్ధ దళిత బహుజనుల ప్రతినిధి, సామాజిక అన్యా యాలకు గురైన ప్రొఫె సర్ వినాయక్ లష్కర్ –తులారామ్ చతుర్చంద్ కళాశాల సామాజిక శాస్త్రవేత్త హోదాలో తన గుండె బరువును ఈ కింది కవితలో తీర్చుకోవలసి వచ్చింది: ‘‘ఓ ప్రపంచమా! విను, విను – ఏళ్లూ, పూళ్లూ గడుస్తున్నా మన అణగారిన ప్రజల మనస్సుల్ని గుండెల్ని ఇంకా ఇనుపకంచెలతోనే బంధించి ఉంచారు! ఈ రోజుకీ దళిత గ్రామాలపై దేశంలో దాడులకు విరామం లేదు! బ్రిటిష్ పాలనలో మాదిరే ఈనాడూ తమకు న్యాయం జరగాలని గొంతెత్తలేని అవస్థ– బహుశా పరాయివాడి మాదిరే నేటి పాలకుల నుంచీ న్యాయాన్ని ఆశించలేని దుస్థితి వారిది! ఇక న్యాయ వ్యవస్థ చూద్దామా దానిది కళ్లకు గంతలు కట్టుకున్న గాంధారి పాత్రే! దేశ స్వాతంత్య్ర పోరాటంలో మాకూ పాత్ర ఉంది అయినా పోరాట యోధుల జాబితాలో చివరికి– చరిత్రలో సీబీఐ కళ్లకూ మేం ఆనలేదు! మేం కనపడం!! సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ abkprasad2006@ahoo.co.in -
ప్రజాస్వామ్య పాలనతోనే ప్రగతి
ఎచ్చెర్ల క్యాంపస్ : పారదర్శకమైన, ప్రజాస్వామ్య పాలనతో నే దేశ ప్రగతి సాధ్యం అవుతుందని కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచారి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రజాస్వామ్యంలో పాదర్శక పాలన ప్రాధాన్యత, ప్రస్తుతం సమాచా ర హక్కు చట్టం ప్రాధాన్యతపై విద్యార్థులు, బోధనా సిబ్బందినుద్దేశించి మాట్లాడారు. దేశం అభివృద్ధి చెందాలంటే పేద ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. పేద ప్రజలు ప్రగతి సాధించా లంటే నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు చేరాలని చెప్పారు. రాజకీయ జోక్యం, లంచాల వ ల్ల సమాజంలో పేదలకు, అర్హులకు ప్రభుత్వ పథకాలు చేరకుండా పోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన, లబ్ధిదారుల ఎంపిక, ప్రజాస్వామ్యంలో కార్యనిర్వహక శాఖ పనితీరు ప్రజలు తెలుసుకునే అవకాశం సమాచార హక్కు చట్టం ద్వారా అందుబాటులోకి వచ్చిందన్నారు. తెల్ల రేషన్ కార్డు, రూ. 10 ఖర్చుతో ఎటువంటి అవినీతి అక్రమాలను అయినా ప్రజలు వెతికి తీయవచ్చునన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు ఈ హక్కును ఆయుధంగా ఉపయోగించుకొని అవినీతి పాలకులు, ఆధికారులపై పోరాడాలని సూచించారు. 1990 సంవత్సరం నుంచి సమాచార హక్కు చట్టం కోసం పోరాటం సాగిందని, చివరకు 2005లో అమల్లోకి వచ్చిందని వివరించారు. 20 ఏళ్ల సమాచారం ప్రజలు తీసుకోవచ్చునన్నారు. రేషన్ కార్డుకు లంచం అడిగిన అధికారిపై, మైనర్ బాలిక కిడ్నాప్పై స్పందించని అధికారిపై, లంచాలు. ప్రలోభాలకు సిద్థమై ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా చేసిన ఎందరో అధికారులపై సామాన్యులు విజయం సాధించినట్టు శ్రీధర్ చెప్పారు. ప్రభుత్వ పథకాలు అర్హత ప్రామాణికంగా అందజేయకపోతే సమాచార హక్కు చట్టం ద్వారా నిలదీయ వచ్చునన్నారు. ప్రస్తుతం సమాజంలో జాగృతి పెరగాలని, అవినీతిని కూకట వేళ్లతో సమాజం నుంచి బయటకు తీయవల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఏయూ వీసీ ప్రొఫెసర్ కూన రామ్జీ మాట్లాడుతూ విద్యార్థులు సచార హక్కు చట్టం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిజస్ట్రార్ కురపాన రఘుబాబు, ప్రిన్సిపాల్ గుంట తులసీరావు, శ్రీకాకుళం ఆర్డీవో టి.వెంకటరమణ, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి పి,జగన్నాథరావు, ఎచ్చెర్ల తహసీల్దార్ శ్రీనివాసరావు, జిల్లా సమచార హక్కు చట్టం ప్రతినిధి కె.వసంతరావు పాల్గొన్నారు. -
ఉదారవాద ‘పీఠాధిపతులు’!
ఉదారవాద గురుపీఠానికి చెందిన అయతుల్లాలు, లేక ఆర్చిబిషప్లు అని ఈ వ్యాసానికి నేను శీర్షికను పెడినట్లయితే సరిగ్గా సరిపోవచ్చు. శంకరాచార్యులు ఎన్ని ప్రభోధాలు చేసినప్పటికీ వారు ఫత్వాలు మాత్రం జారీచేయరు. లేదా రంకెలేయరు కూడా.య కానీ ఈ రోజుల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఇలాంటి వ్యాఖ్యలు నేను చేశానంటే ఇరుపక్షాలూ నన్ను లక్ష్యంగా చేసుకోవచ్చు. విశ్వాసాలకు సంబంధించినంతవరకు ఛాందసులు, ఉదారవాదులు ఇరువురూ మైనారిటీలపై ఆరోపించడంలో సమాన స్థాయిలో ఉంటున్నారు. కాబట్టి, నేను నా సొంత హిందువుల వ్యవహారాలతో జోక్యం చేసుకుంటేనే ఉత్తమంగా ఉంటుంది. నేను చేస్తున్న ఈ వాదన పైన చెప్పిన మహా విశ్వాసాలలో దేనిగురించో కాదు. మనుషుల చరిత్రలో (మానవజాతి అనే పదం నేను వాడటంలేదు) ఆవిర్భవిస్తున్న సరికొత్త మతం అంటే ఉదారవాద వ్యవస్థ గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఇది కొత్త వ్యవస్థ కాబట్టి అనేక వైవిధ్యపూరితమైన ప్రయాసల గుండా ముందుకు వెళ్లాల్సి ఉంది. తన సొంత పవిత్ర గ్రంథం నుంచి కాస్త పక్కకు పోయినా ఈ కొత్త వ్యవస్థ కూడా సహించదు. షియా/సున్నీ అని కాదు, కాథలిక్/ప్రొటెస్టెంట్ అని కాదు, వైష్ణవులు/శైవులు అని కాదు. నువు నా పీఠానికి లేక నా అధికారానికి చెంది ఉంటే, దానికి నీవు పూర్తిగా విధేయుడవై ఉండాల్సిందే. ఎలాంటి మినహాయింపులు, రాయితీలు లేవు. మార్గం నుంచి కాస్త పక్కకు పోవడానికి లేదు. వారాంతాల్లో కూడా హాజరు కాకుండా ఉండటానికి లేదు. నువ్వు మాతో అయినా ఉండు, లేదా మాకు వ్యతిరేకంగా అయినా ఉండు. ఇలాంటి పంథాను గతంలో జార్జి బుష్ జూనియర్ నుంచి విన్నాం. కానీ తాను ఉదారవాది కాదు. ఉదారవాది అంటే నిర్వచనం ఇదా? నా ప్రశ్న ఏదంటే, ఏమాత్రం వెసులుబాటు లేని నిబంధనలను, ప్రవర్తనను, ప్రసంగాలను కలిగి ఉంటూ మీరు ఎలా ఉదారవాదిగా ఉంటారన్నదే. కాకపోతే ఇతరులకోసం మీరు రూపొందించిన కనీస ప్రవర్తనా నియమావళిని వివరించడానికి నన్ను ప్రయత్నించనివ్వండి. మొదటిది, నా నిబంధనల ప్రకారం లౌకికవాదిగా ఉండండి. ఆవిధంగా మీ మతధర్మాలను, దేవుళ్లను డంప్ చేయండి. రెండు, స్వేచ్ఛా–మార్కెట్, ప్రపంచీకరణ, క్రమబద్ధీకరణను తీసివేయడం, లేదా వ్యర్థమైన నయా ఉదారవాదపు సకల రోతలను ఆమోదించండి. రాజ్యవ్యవస్థను మీ పవిత్రమైన దేవతగా అంగీ కరించడమే కాకుండా దాన్ని మరింత పరిపూర్ణంగా రూపొందించడంలో మాకు సహా యం చేయండి. కార్పొరేట్ సంస్థలు మొత్తంగా దొంగలని చెప్పండి. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలు, గజదొంగలు కాకపోతే పవిత్ర సంస్థలన్నింటికీ నిధులు సమకూర్చిపెట్టేది ఎవరు అనే ప్రశ్న మాత్రం నన్ను అడక్కండి. దానికి ప్రతిఫలంగా ఫోర్డ్, రాక్ ఫెల్లర్, బిల్ – మెలిందా గేట్స్, మెకార్థర్, ఇన్లేక్స్, టాటా వంటి పవిత్రవాద సంస్థలన్నీ నాకు చాలినన్ని నిధులు ఇస్తారు. అంతే కానీ మీ నయా ఉదారవాద వ్యాపార సంస్థలు ఇవ్వవు. అలాగే అన్ని రకాల డ్యామ్లు, విద్యుత్ సంస్థలు, గనులు, పురుగుమందులు కంపెనీలను మొత్తంగా మీరు కచ్చితంగా వ్యతిరేకించాలి మరి. మూర్ఖపు అమెరికన్లు ట్రంప్ భూతాన్ని ఎన్నుకున్నారనే విషయాన్ని మీరూ ఆమోదించండి. కానీ పుతిన్, గ్జి జిన్పింగ్ ఈ జాబితాలోకి రారు. వీళ్లను ఎన్నుకున్నందుకు గాను ఆ దేశాల ప్రజలను కనీసంగా అయినా మీరు తప్పుపట్టరు. ప్రభుత్వం ఘనమైనదే కానీ ఎన్జీవోలే మెరుగైనవి. ప్రైవేట్ సెక్టర్ నియంత్రణలో ఉంది కాబట్టి సైన్స్ కూడా ప్రమాదకరమైనదే. ఇకపోతే మానవజాతికి అతి గొప్ప ప్రమాదం ఏదంటే జన్యుపరంగా మెరుగుపర్చిన ఆహార పదార్థాలే. ఈ తరహా షరియత్ ఆంక్షలను కాదని ఏమాత్రం పక్కకు పోయినా సరే మీరు దుష్ట కార్పొరేట్ సంస్థలు, అమిత్ షా లేక ఈ ఇద్దరినుంచి డబ్బులు పుచ్చుకుంటున్న ఉదారవాద వ్యతిరేక పందులుగా మిగిలిపోతారు. అందుకే సంక్షిప్త సందేశం ఏమిటి: ఉదారవాదిగా ఉండు, కానీ నా మార్గంలో, కచ్చితంగా నేను చెప్పినట్లుగా మాత్రమే పాటించు. నేర నిర్ధారణకు ముందే ఉరి తీయండి అమిత్ షా గురించి మేం చెప్పలేదా? న్యాయమూర్తి లోయా ఉదంతాన్ని జడ్జి లోయా వివాదాస్పద మృతిగా మీరు వర్ణించి దానిపై న్యాయబద్ధమైన దర్యాప్తును చేపట్టాల్సిందిగా కోరినట్లయితే నా పవిత్ర మార్గం నుంచి పక్కకు వెళ్లినట్లే. నిజమైన ఉదారవాది సరైన భాషను ఉపయోగిస్తాడు. న్యాయమూర్తి లోయా మృతిని చూద్దాం. ఆయన ఎలా చనిపోయారో దర్యాప్తు చేసి సమయం వృధా చేసుకోవడం ఎందుకు? ఆయన చనిపోయిన విషయం, ఎవరు చంపారు అనేది కూడా మీకు తెలుసు. ఈ ఆరోపణలన్నింటినీ బలమైన దారాలతో ముడివేసి అమిత్షాను ఉరి తీయండి. ఈ ఆరోపణలకు మీరు దూరంగా ఉండవచ్చు. అప్పుడు మీరు అమిత్ షా భయంకర లక్షణాలను కలిగి ఉన్నట్లే మరి. మిగతావారు సహజంగానే అనుసరిస్తారు. మీరు మేధావి అయినట్లయితే, సోషల్ మీడియా మిమ్మల్ని ప్రభావశీలురిగా పేర్కొన్నట్లయితే, మీరు మాట్లాడే ప్రతి మాటా మీకు వ్యతిరేకంగానే నిలుస్తుంది. చివరగా, మీరు సంపాదకులయినట్లయితే, మీరు పిలిచే ప్రతి న్యూస్ రూమ్ కాల్కి గాను మీపై విచారణ జరుగుతుంది. ఉదారవాద శంకరాచార్యులు, స్వయం ప్రకటిత పవిత్రుల్లో కెల్లా అతిపవిత్రులు మిమ్మల్ని అనుక్షణం గమనిస్తూనే ఉంటారు. పోయిన బుధవారం దిప్రింట్.ఇన్ లో ముంబైకి చెందిన రూపా సుబ్రహ్మణ్య కథనాన్ని ప్రచురించాం. ఆవిడ ఒక ఆర్థికవేత్త, దృఢమైన ట్విట్టర్ యుద్ధవీరురాలు. గత అయిదేళ్లుగా, ఆమె నరేంద్రమోదీకి అత్యంత మద్దతుదారుగా ఉంటూవస్తున్నారు. ఎవరైనా మోదీని విమర్శించినట్లయితే ఇక వారిని ఆమె క్షమించే ప్రసక్తే లేదు. ఈ రచయితను కూడా ఆమె వదిలిపెట్టలేదు. ఆమె ఇప్పుడు తనకు మోదీ పట్ల భ్రమలు ఎలా తొలిగిపోయాయో చెబుతూ మాకు ఒక కథనం పంపారు. ఆర్థిక సంస్కరణలు చేపడతాననీ, మత దురభిమానాన్ని, ఆర్థికవ్యవహారాల్లో ప్రభుత్వ పెత్తనానికి అవకాశం ఇవ్వనని మోదీ ఇచ్చిన హామీవల్లే తాను ఆయన్ని సమర్థిస్తూవచ్చానని రూపా వివరించారు. నిజంగా కూడా ఆమె రచన చక్కటి వాదనా పటిమతో రూపొందింది. ఊహించినట్లుగానే ఆమె వ్యాసం బీజేపీ నుంచి తీవ్ర అపనిందలను, దూషణలను ఎదుర్కొంది. విద్రోహిగా మారినందుకు ఆమెను, ఆమె విద్రోహాన్ని మా ఎజెండాను పరిపూర్తి చేసుకోవడానికి ఉపయోగించుకున్నందుకు మమ్మల్ని కలిసికట్టుగా తూర్పారబట్టారు. అనూహ్యంగా స్వయం ప్రకటిత ఉదారవాద ప్రత్యర్థులు కూడా దీనిపై కారాలూ మిరియాలూ నూరారు. ఒకప్పుడు మితవాద కోణంగి (ట్రోల్)లా వ్యవహరించిన రూపాకు మేం వేదిక ఎలా ఇచ్చాం? ఆమెకు గౌరవం ఆపాదిస్తు మా గౌరవాన్ని ఎలా తగ్గించుకుంటాం? న్యూస్ రూమ్ అనేది కోర్టు కాదని, పోలీసు స్టేషన్ అసలే కాదనే మా వాదనను ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అవివేకపు, బుద్ధిహీన గతం పట్ల ఆమె ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు, పైగా మన క్షమాపణను ఆమె గెల్చుకోలేదు మరి. ఇతరులకు మాత్రమే నిబంధనలా? ఇప్పుడు ఇది అయోమయానికి దారతీస్తోంది. ఉదారవాదం అంటే ఇతరులకు నిబంధనలు రూపొందించి వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందిగా చెప్పడం కాదు. లేక, మీరు నాకోసం నిబంధనలను రూపొందించినట్లయితే, సత్ప్రవర్తనా నియమావళి అనేది ఎలా ఉంటుందో, మీరు ఆమోదించదగిన ప్రవర్తన ఏదో మీరు నిర్వచిం చాల్సి ఉంది. మీరు ఉదారవాది కాదు. మీరు శీలవంతులే అయి ఉండవచ్చు. నాకంటే మంచి వ్యక్తి కావచ్చు, బహుశా గోవు కంటే పవిత్రమైన వ్యక్తి కావచ్చు. కానీ మీరు ఉదారవాది కాదు. మీరు ఒక అయతుల్లా వంటివారు. క్రీస్తు మతాధిపతి వంటివారు లేక శంకరాచార్యులు కావచ్చు. మీ దండాన్ని మీరు తీసుకుని ఇతరులు ఎలా ప్రవర్తించాలో, ఏం చెప్పాలో, దేన్ని ప్రచురించాలో ఆదేశాలు జారీ చేసేస్తారు. కానీ ఒక ప్రత్యేక ఇజాన్ని అంటే జర్నలిజాన్ని విశ్వసిస్తున్న మాలాంటి వారికి ఇది పెద్ద సవాలుగానే ఉంటుంది. సరిగ్గా మూడేళ్ల క్రితం, ఒక అమెరికన్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని తాను విశ్వసిస్తున్న ఉదారవాదంపై చిన్నపాటి యుద్ధమే చేసింది. కానీ తన విశ్వాసం కారణంగా ఆ యుద్ధంలో ఓడిపోయింది. దీని వివరాలకోసం హలోవెన్, సిల్లిమన్ కాలేజ్, యేల్ యూనివర్శిటీ అన్న సెర్చ్ పదంతో గూగుల్లో వెతకండి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ రెసిడెన్షియల్ కాలేజీలోని కొంతమంది విద్యార్థులు ఆల్ సెయిట్స్ డే సందర్భంగా ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అంటూ తలకుమించిన ఆంక్షలు విధిస్తున్నారంటూ (ఇలా దుస్తులు ధరించొద్దు, దానివల్ల ఒక సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతింటాయి) వారి మాస్టర్, ఆయన సహోద్యోగి, ఆయన భార్యపై ఆరోపణలు గుప్పించారు. ప్రొఫెసర్ ఎరికా క్రిస్టకిస్ ఈ సందర్భంగా సరదాగా గడపండి అంతే కానీ అతిశయించిన రాజకీయ సవ్యమార్గం గురించి పట్టించుకోవద్దని అందరిగీ చిలిపి ఈమెయిల్ పంపారు. ఇది ఉదారవాద విద్యార్థి బృందాల్లో ఆగ్రహం రగిలించి నిరసనలకు దారితీసింది. అధ్యాపకుడు నికోలస్ క్రిస్టకిస్ను ఒక విద్యార్థి నేరుగా ప్రశ్నించిన దృశ్యం కెమెరా కంటపడింది. ‘‘ఇలాంటి ఆంక్షలను మీరు ఎలా అంగీకరిస్తారు? నిన్ను ఉద్యోగంలోకి తీసుకొచ్చిన వెధవ ఎవరు? వెంటనే ఉద్యోగం మానేయి! నీవు రాత్రి పూట నిద్రపోకూడదు!అసహ్యం కలిగిస్తున్నావు!’’ రాజకీయ పరిశుద్ధత తెచ్చి పెట్టే ఇక్కట్లు ఒక నిమిషం 20 సెకన్ల పాటు సాగిన ఆ వీడియో దృశ్యం ఫాక్స్ న్యూస్లో వచ్చింది. అప్పటికే ఆగ్రహంతో రగిలిపోతున్న శ్వేత అమెరికన్లను ఇది మరింతగా మండిం చింది. ఉదార వాద రాజకీయాల పరిశుద్ధతకు ఇది అతిశయించిన రూపమని వారు ఆరోపించారు. అది ‘అప్రసిద్ధమైన’ ఉదారవాద ఈస్ట్ కోస్ట్ క్యాంపస్ అని ఆగ్రహించి నది నల్లజాతికి చెందిన విద్యార్థిని అని ప్రత్యేకించి చెప్పడంద్వారా ఒరిగిదేమీ లేదు. ట్రంప్ ఎన్నికకు ఈ ఉదంతం మార్గం కల్పించిందని చెప్పడం తొందరపాటే అవుతుంది. ఈ సందర్భంగా ఎరికా క్రిస్టకిస్ వాషింగ్టన్ పోస్ట్కు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘‘అక్టోబర్ 31 రాత్రి హలొవిన్ సందర్భంగా నేను పంపిన ఈమెయిల్ క్యాంపస్ను మండించింది. ఇది స్వయం సెన్సార్షిప్కు సంబంధించిన చక్కటి గుణపాఠం’’ దీనిపై ఆమె మరింతగా వివరిస్తూ, ‘‘స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మన దేశం లోని అతి గొప్ప విశ్వవిద్యాలయాలు కొన్నింటిలో వెలిగిపోతూండవచ్చు. కానీ ఇతరులు చెప్పేది వినాల్సిన సంస్కృతిని కాస్త చక్కదిద్దాల్సి ఉంది’’ అని ముగించారు. మరింత ముందుకెళ్లి ఇప్పుడు ట్రంప్పై సెమినార్లలో, పబ్లలో, కాఫీ షాపుల్లో, ట్విట్టర్, ఫేస్బుక్లలోనే కాకుండా మీ టీ షర్టులపై కూడా ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేయండి. రాబర్ట్ డి నీరో వంటి సుప్రసిద్ధ వ్యక్తి లాగా ట్రంప్ గురించి దూషణ భూషణలకు దిగి జనంచే చప్పట్లు కొట్టించుకోండి. భారతదేశంలో మోదీ పట్ల కూడా మీరు ఇలాగే వ్యవహరించవచ్చు. ఫలితం మాత్రం ఒకేవిధంగా ఉంటుంది. అలా విమర్శించడం ద్వారా, దూషించడం ద్వారా, గేలి చేయడం ద్వారా ట్రంప్, మోదీ వంటి వారి పునాది మరింత బలపడుతుంది. ఎందుకంటే మీరు చేసే ఇలాంటి దూషణలు, ఖండనమండనలు ఉదారవాద వ్యతిరేక మితవాదులు విజయవంతంగా నిర్మిస్తూవస్తున్నట్లుగా ట్రంప్, మోదీ వంటివారిని బాధితులుగా మార్చివేస్తాయి. అలాంటి పరిణామానికి మీవంటివారి సహాయం కూడా లభిస్తున్నట్లే మరి. విశ్వాసులు అధికారాన్ని కట్టబెట్టలేరు వర్గాలుగా విడిపోయిన ప్రజాస్వామిక వ్యవస్థల్లో అధికారాన్ని ఎవరు గెల్చుకుంటారు అనే అంశాన్ని రెండు పక్షాలలోని నిజమైన విశ్వాసుల సంభాషణ నిర్థారించదు. ఈ రెండు పక్షాలకు చెందని వారే నిజంగా అధికారాన్ని కట్టబెడుతుంటారు. ఇలాంటివారందరినీ మీరు బుర్రతక్కువవారనీ, నాగరికత తెలీనివారని, నిరక్షర కుక్షిలని, ఉదారవాద రహిత క్షుద్రులని మీరు మీవైన తీర్పులు చెబుతున్నప్పటికీ, వాళ్లు మాత్రం మీకూ, మీ వ్యతిరేక పక్షం వారికి మధ్య ఎలాంటి వ్యత్యాసాన్నీ చూడలేరు. వారు కచ్చింతగా మీకు దూరమౌతారు. లేక మీరు వారిని కోల్పోతారు. అలాగే మీ ప్రత్యర్థి పక్షం వారు సైతం క్షమాపణ అన్నదే ఎరుగని జాతీయవాదంపైవు కొట్టుకుపోతారు. అంతిమంగా ఇది యావత్ ప్రజానీకానీకి ఉపద్రవం కలిగించక మానదు. కాబట్టి, తమకు తాము ఉదారవాదులుగా పిలుచుకుంటున్నావారు తమ పరిధిని కాస్త విస్తరించుకోవాలి. ఉష్ట్ర పక్షిలాగా తమలో తాము కూరుకుపోవడం కాకుండా తమ చోటును ఇతరులకు కూడా కాస్త పంచిపెట్టాలి. అలా కాకుండా దానికి భిన్నమైన మార్గంలో వెళితే గోతులు తీసి గోడలు కడతారు కానీ ద్వీపం మాత్రం ఒరుసుకునిపోతుంది. అందుకని, మనలో చాలామంది ఎరికా క్రిస్టకిస్ చెప్పినట్లుగా ఇతరులు చెప్పింది వినడం అనే సంస్కృతికి మరమ్మతులు చేయాల్సి ఉంది. వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
‘ప్రధాని ప్రోత్సాహంతోనే ఐఏఎస్ల ఆందోళన’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ప్రోత్సాహంతోనే ఢిల్లీ ఐఏఎస్లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. రాష్ట్ర హక్కులను కేంద్రం హరిస్తుందంటూ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ఆద్మీ పార్టీ నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వద్ద గత ఆరు రోజులుగా నిరసన వ్యక్తం చేస్నున్న సంగతి తెలిసిందే. ఏడో రోజు కూడా తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఐఏఎస్లు విధులు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రధానికి లేఖ కూడా రాశారు. గత వారం రోజులు పోరాటం చేస్తున్నా.. ప్రధాని నోరు మెదపడం లేదని విమర్శించారు. అధికారులను పనిచేయవద్దని చెప్పి ప్రధాన మంత్రి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ‘ ఢిల్లీ ఐఏఎస్ అధికారులకు పని చేయవద్దని చెప్పి, వారితో ఆందోళన చేయిస్తున్న ప్రధాని చేతుల్లో ప్రజాస్వామ్యం భద్రంగా ఉందా’ అని ట్వీటర్ ద్వారా ప్రశ్నించారు. కాగా కేజ్రీవాల్ ధర్నాకు శనివారం నలుగురు ముఖ్యమంత్రులు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, కేరళ సీఎం విజయన్ శనివారం రాత్రి 9 గంటలకు ఏపీ భవన్ నుంచి పాదయాత్రగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి వెళ్లారు. -
బయోడేటా కాదు.. బ్యాలెన్స్ షీటు ముఖ్యం..!
సాక్షి, విశాఖపట్నం : నోట్లకు ఓటు వేయడం అంటే అవినీతికి లైసెన్స్ ఇవ్వడమేనంటూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని చూస్తే గుండే ఆగిపోయే పరిస్థితి నెలకొందని, ఈ ప్రభావం వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై కూడా పడే అవకాశం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ రాజకీయ పార్టీ తమ సిద్ధాంతాలు, ప్రజల పట్ల అంకితభావం గల వారిని కాకుండా కేవలం 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే వారినే అభ్యర్థులుగా నిలబెడుతున్నాయంటూ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే బయోడేటా కాకుండా బాలన్స్ షీట్ చూపించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇలా ఓటుకు కోసం నోట్లు పంపిణీ చేసే నేతలు నిజాయితీగా పనిచేస్తారని ఆశించడం ప్రజల పొరపాటే అవుతుందని.. అందుకే ‘మార్పు అనేది ప్రజల నుంచే ప్రారంభం కావాలని, అధికార పార్టీలు మారితే ప్రయోజనం ఉండబోదు’ అన్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మాటలను రామకృష్ణ ఉటంకించారు. రాజకీయ వ్యభిచారం జరుగుతోంది... తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు లభించడం లేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్న రామకృష్ణ.. ‘వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసమే 2 వేల కోట్ల రూపాయలను ఇక్కడున్న రాజకీయ నాయకులు రహస్య స్థావరాలకు తరలించారని’ ఒక కేంద్రమంత్రి స్వయంగా చెప్పారంటే రాజకీయ వ్యభిచారం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. డబ్బు సంపాదించడం కోసం అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు ఎంతటి ద్రోహులో.. నోట్లు తీసుకుని ఓటు వేసే ప్రజలు సైతం అంతటి ద్రోహులేనంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినీతి పెరుగుతూనే ఉంది.. ఒక సర్వేలో భాగంగా.. గత నాలుగేళ్లలో అవినీతి పెరిగినట్లు 65 శాతం మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారని రామకృష్ణ తెలిపారు. ఏసీబీ అధికారులు చిన్న చిన్న ఉద్యోగులపై కేసులు నమోదు చేస్తున్నారే గానీ.. భారీ అవినీతి తిమింగళాలను ఏమీ చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడితే తప్ప గెలవలేని పరిస్థితులు ఉన్నంతకాలం అవినీతి లేని పాలన అందించడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఈ రోజుల్లో అన్నింటా విజృంభిస్తున్న అవినీతికి సాధారణ ప్రజలే కారణమని పేర్కొన్నారు. విద్యార్థి నాయకులే రాజకీయాల్లోకి.. గతంలో విద్యార్థి నాయకులుగా ఉన్నవారే తదుపరి రాజకీయాల్లో మేటి నాయకులుగా ఎదిగేవారని రామకృష్ణ అన్నారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, సీఎం కేసీఆర్ వంటి వారు ఆవిధంగానే రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. ధన రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, ప్రజలు పోరాటం చేయలేని పక్షంలో పారిశ్రామిక వేత్తలే రాజకీయ పార్టీలను సొంతం చేసుకునే ప్రమాదం ఉందని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసేవకు కాకుండా అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా రాజకీయాలను భావించడం దురదృష్టకరమైన విషయమని రామకృష్ణ విచారం వ్యక్తం చేశారు. -
ఆ అర్హత చంద్రబాబుకు లేదు..!
సాక్షి, విజయవాడ: కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదంటూ బీజేపీ నేతలు లక్ష్మీపతి రాజా, జమ్మల శ్యామ్ కిషోర్ తీవ్ర స్థాయలో విమర్శించారు. ‘వైఎస్సార్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకున్నప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి బలవంతంగా అధికారం లాక్కున్నపుడు ఎక్కడికి వెళ్ళింది ప్రజాస్వామ్యం. ముందు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తరువాత చంద్రబాబు ప్రజాస్వామ్య విలువల గురించి మట్లాడాలి. రాజకీయ జీవితం ఇచ్చిన ఎన్టీఆర్పై చెప్పులు వేయించినప్పుడు ఎక్కడికి వెళ్ళింది చంద్రబాబు ప్రజాస్వామ్యం. నిండు శాసన సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్ కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం. మేము అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పి తరువాత చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలి’ అని బీజేపీ నేతలు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. -
ప్రజాస్వామ్యం పరువు తీసిన తృణమూల్
సాక్షి, న్యూఢిల్లీ : ఇదివరకటిలాగే ఈసారి కూడా పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య హింసాకాండ చెలరేగింది. సోమవారం జరిగిన ఎన్నికల సందర్భంగా ఉత్పన్నమైన హింసాకాండలో దాదాపు 18 మంది మరణించారు. రాష్ట్రంలో హింసాకాండ పెరగలేదని వాస్తవానికి తగ్గిందంటూ ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను పాలకపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడుతోంది. 2003లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 61 మంది మరణించారు. ఆ విషయంతో పోలీస్తే హింసాకాండ తగ్గింది. అంతమాత్రాన ఎన్నికలు సవ్యంగా జరిగాయని, ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగ్గా పనిచేసినట్లు భావించలేం. తొలి ఓటు కూడా వేయకముందే 34 శాతం పంచాయతీలను ఎలాంటి పోటీ చేయకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడమే అందుకు కారణం. ఇతర రాజకీయ పార్టీలకు సంస్థాగత బలం లేకపోవడం వల్ల ఈ 34 శాతం పంచాయతీల్లో పోటీ చేయలేకపోయిందని, అందుకనే పోటీ లేకుండా తమ పార్టీ విజయం సాధించినదని పాలకపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటోంది. కానీ ఎవరిని పోటీ చేయకుండా బెదిరించడం వల్లనే పోటీ లేకుండా పాలకపక్షం గెలిచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్రమంగా ఎదుగుతూ ఇప్పుడు ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించిన భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి తృణమూల్ కాంగ్రెస్లో అభద్రతా భావం ఏర్పడిందని, అందుకనే తృణమూల్ బీర్భమ్ జిల్లాలో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని వారంటున్నారు. ఈ జిల్లాలోనే ఎక్కువ పంచాయతీలను పోటీ లేకుండా తృణమూల్ కైవసం చేసుకుంది. 2019లో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ పంచాయతీలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే బీజేపీని అడ్డుకునేందుకు తృణమూల్ తీవ్రంగా కృషి చేసింది. ప్రజాస్వామ్యం బూడిదపై రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడం మంచిదికాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
సర్కారును జనంలోనే ఎండగడతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీని తరిమేసి కీలకమైన బిల్లును ఆమోదించుకున్నారని మండిపడ్డారు. ‘‘అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రతిపక్షాలు హక్కు మేరకు నిరసన వ్యక్తం చేస్తే బడ్జెట్ సమావేశాలు అయ్యే వరకు సస్పెండ్ చేశారు. అంతేగాకుండా ఇద్దరు శాసన సభ్యులను బర్తరఫ్ చేశారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇది ప్రజాస్వామ్యమా? దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన ఈ పాలకుల నిజస్వరూపాన్ని ప్రజల్లోనే ఎండగడతాం’’అని తెలిపారు. ప్రజాచైతన్య బస్సు యాత్ర రెండో విడతపై ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ షబ్బీర్ అలీ అధ్యక్షతన బుధవారం గాంధీభవన్లో సమావేశం జరిగింది. అనంతరం షబ్బీర్తో కలిసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ అన్ని విషయాల్లో ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని, రిజర్వేషన్ల అంశాన్ని ముందుంచి వారం రోజులుగా పార్లమెంట్ నడవకుండా అడ్డుకుంటోందని విమర్శించారు. అన్యాయంగా ఇద్దరు ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేశారని కేసు వేశామని, దీనిపై స్పందించిన కోర్టు.. అసెంబ్లీ వీడియో పుటేజీలు అడిగితే ఇవ్వకుండా దాటవేస్తున్నారన్నారు. దీన్ని బట్టే ఎమ్మెల్యేలను అక్రమంగా బర్తరఫ్ చేసినట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. ‘‘ప్రధాన ప్రతిపక్షం లేకుండా అత్యంత కీలకమైన ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు, పంచాయతీ సవరణ బిల్లులను ఆమోదించారు. ఎలాంటి చర్చ లేకుండా ఇలాంటి బిల్లులను ఆమోదించుకోవడం ప్రజాస్వామ్యమా? ఎవరి మెప్పు కోసం ఈ బిల్లు తెస్తున్నారు? ఓవైపు రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో పోరాటాలు చేస్తున్నామని చెబుతున్న టీఆర్ఎస్... రిజర్వేషన్ల ప్రస్తావన లేకుండా ఎలా యూనివర్సిటీ బిల్లు తెచ్చింది? ఇది రెండు నాలుకల ధోరణి కాదా’’అని ప్రశ్నించారు. ఏప్రిల్ 1 నుంచి రెండో దశ ప్రజా చైతన్య బస్సుయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. ఏప్రిల్ 1న సాయంత్రం రామగుండంలో సభ ఉంటుందని, రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు సింగరేణి కార్మిక సంఘాలతో సమావేశమవుతామని వివరించారు. ఈ యాత్రకు మాజీమంత్రి దానం నాగేందర్తోపాటు మండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి కో చైర్మన్గా ఉంటారన్నారు. ఇదీ బస్సు యాత్ర షెడ్యూల్.. 2వ తేదీన పెద్దపల్లిలో, 3న మంథనిలో, అదేరోజు సాయత్రం 6 గంటలకు భూపాల్పల్లిలో, 4న స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తిలో, 5న నర్సంపేటలో, 6న పరకాల, వరంగల్లో, 7న ఇల్లెందు, పినపాకలో, 8న డొర్నకల్, మహబూబాబాద్లో సభలు నిర్వహిస్తామన్నారు. 9న భద్రచలంలో దేవాలయంలో దైవ దర్శనం అనంతరం వెంకటాపురంలో, ములుగులో, 10న వర్ధన్నపేటలో సభలు ఉంటాయన్నారు. ‘డబుల్’లో ప్రభుత్వం విఫలం ఏ పథకాల విషయంలో టీఆర్ఎస్ విఫలమైందో ఆ పథకాలను కాంగ్రెస్ ఆచరణలో చేసి చూపాలని ఉత్తమ్ అన్నారు. జీవన్రెడ్డి అధ్యక్షతన బుధవారం గాంధీభవన్లో హౌజింగ్, పెన్షన్ల సలహా సంఘం సమావేశం జరిగింది. ఇందులో ఉత్తమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతంగా చేపట్టిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. -
‘పెద్దన్న’పాత్ర దిశగా భారత్ అడుగులు..
సాక్షి,న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య పురోగతి, స్వేచ్ఛాయుత వాతావరణం విషయంలో భారత్ ముందడుగేస్తోంది. ప్రపంచస్థాయిలో ప్రజాస్వామ్యానికి చేదోడు వాదోడుగా నిలిచే కృషిలో భాగస్వామి అవుతోంది. ఇరవయ్యో శతాబ్దం చివరి వరకు ప్రపంచ ప్రజాస్వామ్యానికి, ఆర్థికాభివృద్ధికి దారిచూపే దీపస్తంభంగా నిలిచిన అమెరికా పాత్ర ఇప్పుడు మారింది. ఒకప్పుడు అమెరికా పోషించిన పాత్రను ఇప్పుడు ఇండియా నిర్వహిస్తోంది. ఆర్థికాభివృద్ధిలో ఇతర దేశాలను భాగస్వాములను చేయడంతో పాటు సమ్మిళిత అభివృద్ధి నినాదానికి భారత్ చేయూతనిస్తోంది. రోజు రోజుకు వివిధ దేశాల్లో ప్రజాస్వామ్యం ఒడిదుడుకులకు గురవుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టపరచి, మరింత ఉజ్వల భవిష్యత్ సాధనకు ప్రణాళికలు సిద్ధం చేయడంలో భారత్ ముందుందని ఫ్రీడం హౌస్ వార్షిక నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు అమెరికా వంటి పెద్ద దేశాల మద్దతు కొరవడడం కూడా ఈ పరిస్థితికి కారణమని అంచనా వేస్తున్నారు. ‘ప్రజాస్వామ్య సంక్షోభం’– ఫ్రీడం ఇన్ది వరల్డ్ –2018 పేరిట విడుదల చేసిన ఈ నివేదికలో భారత్ చేస్తున్న కృషిని కొనియాడింది. మరింతగా ప్రజాస్వామ్య స్ఫూర్తి వ్యాపించేందుకు ప్రపంచ ప్రాధాన్య వేదికలను ఉపయోగించుకుంటున్న తీరును శ్లాఘించింది. గత పదేళ్లతో పోల్చితే 2017 లో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, పౌరహక్కులు మరింతగా దిగజారాయి. వ్యక్తిగత స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం ప్రపంచస్థాయి పోరాటంలో అమెరికా నాయకత్వ స్థానం నుంచి వైదొలిగిందని పేర్కొంది. ఇదీ పరిశీలన... మొత్తం 195 దేశాల్లో స్వేచ్ఛాస్వాతంత్య్రాలపై 25 అంశాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ప్రభుత్వాలు, వాటి పనితీరు అధారంగా కాకుండా ఆయా దేశాల ప్రజలు వ్యక్తులుగా అనుభవిస్తున్న స్వాతంత్య్రం, వాస్తవంగా పొందుతున్న హక్కులను బట్టి ఆయా అంశాలపై అంచనాకు వచ్చారు. స్వాతంత్య్రం, స్వేచ్ఛ (ఫ్రీడం స్కోర్ రేటింగ్)కు సంబంధించిన సగటు రేటింగ్లో అమెరికా 8 స్థానాలు దిగజారినట్టు ఈ నివేదిక పేర్కొంది. 2008లో వందకు 94 పాయింట్లు ఉన్నది కాస్తా, 2017లో 86కు పడిపోయింది. ఇందులో భారత్ 77 పాయింట్లు సాధించింది. పలు దేశాల స్కోరు 90 పాయింట్లు, ఆపైనే ఉన్నా అవన్నీ కూడా చిన్న దేశాలే. ప్రపంచ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ లేదా నాయకత్వ బాధ్యతలు చేపట్టే స్థాయి లేని దేశాలు. ప్రజాస్వామ్యం, ఇతరత్రా అంశాలపై గతంలో నిర్వహించిన పాత్ర నుంచి అమెరికా తప్పుకుంటే వాటిని చేపట్ట గలిగేంత స్థోమత, బలం వీటికి లేదు. ఈ విషయాల్లో భారత్ మెరుగైన స్థితిలో ఉందని ఈ పరిశీలన అంచనా వేస్తోంది. భారత్ పురోగతి... దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు దేశాభివద్ధికి అంతర్జాతీయ సహకారాన్ని, సమ్మిళిత భాగస్వామ్యాన్ని భారత్ కోరడం ఇందుకు ఉపకరిస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అనువైనదనే ప్రచారం కూడా లాభిస్తోంది. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఇందుకు విరుద్ధంగా స్వీయరక్షణ ఆర్థిక విధానాలు అవలంబిస్తోంది. ముఖ్యమైన అంశాలపై ప్రపంచదేశాలను భాగస్వాములను చేయడంలో భారత్ అనుసరిస్తున్న సానుకూల, నిర్మాణాత్మక వైఖరి మున్ముందు నాయకత్వ స్థానానికి ఎదిగేందుకు ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో అధ్యయనంలో అగ్రస్థానం... ప్రపంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థల పరిస్థితిపై వరల్డ్ ఎలక్టోరల్ ఫ్రీడం ఇండెక్స్ 2018 నిర్వహించిన అధ్యయనంలో కూడా భారత్కు అగ్రస్థానం లభించింది. యాక్టివ్ సఫ్రెజ్ ఫ్రీడం ఇండెక్స్ (ఏఎస్ఎఫ్ఐ)లో భారత్ 87.15 పాయింట్లు సాధించింది. హంగేరి–83.86, యూకే–83.78, న్యూజిలాండ్–83.71, ఆస్ట్రేలియా–82.88, రష్యా–82.44 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా మాత్రం 79.35 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో, ఫ్రాన్స్–79.26 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాయి. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
విభేదాలు సహజమే!
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో భేదాభిప్రాయాలు ఉండొచ్చని.. కానీ ప్రతి ఒక్కరు ఐకమత్యం కోసం కృషిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలోని మూఢవిశ్వాసాలను తరిమేసేందుకు, సమాజంలో మార్పు తీసుకురావటంలో బాధ్యత తీసుకోవాలని ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, శకటాల కళాకారులకు ప్రధాని సూచించారు. ‘బలోపేతమైన, ప్రగతిశీల దేశాన్ని నిర్మించేందుకు అవసరమైన శక్తి అందరు ఐకమత్యంగా ఉంటేనే లభిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయాలు వేర్వేరుగా ఉండటంలో తప్పులేదన్నారు. కులం, మతం, సమాజం వంటి జాఢ్యాలను పక్కనపెట్టి సమాజాన్ని ఏకం చేసేందుకు ప్రతిఒక్కరు ప్రయత్నించాలన్నారు. మూఢనమ్మకాలను పారద్రోలటాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటినుంచే ప్రారంభించాలని యువతకు సూచించారు. 2019 కల్లా స్వచ్ఛభారత్ లక్ష్యాలను చేరటంలో చొరవతీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశసేవలో భాగంగా పౌర,మిలటరీ పురస్కారాలను పొందిన వారి గురించి యువత తెలుసుకుని ప్రేరణ పొందాలని మోదీ తెలిపారు. కంబోడియాతో 4 ఒప్పందాలు భారత్–కంబోడియాల మధ్య రక్షణ బంధాల బలోపేతానికి కృషిచేయాలని ఇరుదేశాల ప్రధానులు నిర్ణయించారు. ఉగ్రవాద నిర్వీర్యం చేయటంలో అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేయటంపై కలిసి పోరాడాలని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య మధ్య రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పరస్పరసాయానికి చర్చలు జరిగాయి. అనంతరం వీరిరువురి సమక్షంలో ఇరుదేశాల మధ్య 4 ఒప్పందాలపై శనివారం ఢిల్లీలో ఒప్పందాలు జరిగాయి. నేరస్తుల అప్పగింత, నేర సంబంధిత విచారణకు న్యాయసాయం, కంబోడియాలోని స్వా హబ్ నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టుకు భారత రుణసాయం (దాదాపు రూ.234 కోట్లు) అంశాలపై ఈ ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కంబోడియాకు ఆరోగ్యం, రోడ్ల అనుసంధానత, డిజిటల్ అనుసంధానత తదితర అంశాల్లోనూ రుణసాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉగ్రవాదం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అని.. ప్రపంచశాంతికి ఇది పెనువిఘాతం కల్గిస్తోందని మండిపడ్డారు. కాగా, ప్రధాని మోదీ ఫిబ్రవరి 9నుంచి నాలుగురోజుల పాటు విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. వరుసగా పాలస్తీనా, యూఏఈ, ఓమన్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. -
‘ప్రజాస్వామ్యానికి మంచిదని చెప్పలేం’
శాన్ఫ్రాన్సిస్కో, అమెరికా : ప్రజాస్వామ్యానికి సోషల్మీడియా మంచి చేస్తుందనే గ్యారెంటీని ఇవ్వలేమని సోమవారం ఫేస్బుక్ స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో రష్యా తదితర దేశాల ప్రభావం ప్రజలపై పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల ఎన్నికల సమయంలో సోషల్మీడియాను వినియోగించుకుని రష్యా ఫేక్న్యూస్ను సర్క్యూలేట్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలను రష్యా ఖండించింది. దాదాపు రెండు బిలియన్ల యూజర్లను కలిగిన ఫేస్బుక్ ‘ప్రజాస్వామ్యంలో సోషల్మీడియా పాత్ర’ అనే అంశంపై చర్చించింది. ఇకపై ఎన్నికల సమయంలో అనుమానిత అకౌంట్లను సస్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఎన్నికల యాడ్లను ఎక్కువమందికి చేరేలా చూస్తామని చెప్పింది. అయితే, ఇందుకోసం యాడ్లు ఇచ్చే వారి దగ్గర నుంచి గుర్తింపును కోరనున్నట్లు తెలిపింది. కాగా, ఫేస్బుక్ బాటలోనే ట్విటర్, గూగుల్, యూట్యూబ్లు కూడా నడవనున్నాయి. -
‘2017లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది’
సాక్షి, విశాఖపట్టణం : 2017లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రి మండలికి ఒక ఔన్నత్యం ఉందని, అలాంటి పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం కంటే దారుణం మరొకటి లేదని అన్నారు. -
'2017లో ప్రజాస్వామ్యం ఖూనీ'
-
‘హిందువుల వల్లే.. ప్రజాస్వామ్యం పదిలం’
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం సృష్టించే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి అదే తరహా మాటల తూటాలు పేల్చారు. ‘భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు కావడం వల్ల.. ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంది’ అని అన్నారు. దేశంలో మెజారిటీ వర్గం సంఖ్య తగ్గితే.. సామాజిక అభివృద్ధి ప్రమాదంలో పడుతుందని ఆయన చెప్పారు. మెజారిటీ ప్రజల సంఖ్య తగ్గితే.. జాతీయతావాదం కూడా మరుగున పడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత సురక్షితంగా ఉందని, హిందువులు ఇంకా ఇక్కడ మెజారిటీ జనాభాగా ఉండడమే ఇందుకు కారణం అని గిరిరాజ్ స్పష్టం చేశారు. దేశంలో ఎప్పుడైతే మెజారిటీ ప్రజల సంఖ్య తగ్గుముఖం పడుతుందో అప్పుడు ప్రజాస్వామ్యం, అభివృద్ధి, సామాజిక సామరస్యం ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు. దేశంలో సుమారు 54 జిల్లాల్లో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో ఇదీ మరీ ఎక్కువగా ఉంది. ముస్లింలు మెజారిటీ వర్గంగా అవతరిస్తే దేశసమగ్రత, ఐకమత్యానికి భంగం కలిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. -
నిజమైన ప్రజాస్వామ్యం లేదు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమంటారు. కానీ ఇక్కడ నిజమైన ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. అసమానత్వం పెరిగిపోతోంది. అధికారంలో ఉన్న వారికే దేశ సంపద చెందుతోంది. పేదల పరిస్థితిలో పురోగతి కానరావడం లేదు. రాష్ట్రంలోనూ దాదాపు అదే పరిస్థితి అని తిరుపతి ఎంపీ వెలగపూడి వరప్రసాద్ ఆవేదన వెలిబుచ్చారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మూడేళ్ల కాలంలో తిరుపతి లోక్సభ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. రాజకీయంగా ప్రజలకు సేవలందించడం పవిత్రమైన వృత్తిగా ఎంపీ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ఈ రంగాన్ని చాలా మంది తప్పుగా భావిస్తున్నారన్నారు. ఈ మూడేళ్ల కాలంలో 1,300 గ్రామాల్లో పర్యటించిన తాను రాజకీయాలకతీతంగా సమస్యలు పరిష్కరించానన్నారు. ఇప్పటివరకూ 90 మందికి ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కింద రూ.1.50 కోట్ల మేర ఆర్థిక సాయం అందించానని వెల్లడించారు. ఏర్పేడు లారీ దుర్ఘటనలో మృతి చెందిన 17 కుటుంబాలకు రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించడం తనకెంతో తృప్తినిచ్చిందని చెప్పారు. ఇకపోతే రైల్వేస్టేషన్ల అభివృద్ధి, కొత్తగా ఆర్యూబీల నిర్మాణం, కొత్త రైళ్ల ఏర్పాటు వంటి పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. మురికివాడల అభివృద్ధి, ఇతరత్రా పనుల కోసం ఇప్పటివరకూ రూ.22 కోట్ల ఎంపీ ల్యాడ్స్ వినియోగించామని తెలిపారు. త్వరలో తిరుపతి నుంచి మలేషియా, సింగపూర్, దుబాయ్ దేశాలకు ఎయిరిండియా విమానం ప్రారంభం కానుందని, ఈ మేరకు విమానయాన శాఖ మంత్రి నుంచి ఆమోదం లభించిందని వివరించారు. ఉపాధి పనులు గాడి తప్పుతున్నాయి.. దేశమంతా ఉపాధి పనుల కోసం రూ.48 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇందులో మన రాష్ట్రంలో ఈ పనులు అధ్వానంగా జరుగుతున్నాయని తిరుపతి ఎంపీ వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి లోక్సభ పరిధిలోని 1,300 గ్రామాల్లోనూ కేవలం 30 శాతం పనులే పేదలకు ఉపాధి కల్పించాయని చెప్పారు. వైఎస్ హయాంలో 90 శాతం వేజ్ కాంపోనెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజలతో చేయించాల్సిన పనులను మెషీన్లతో చేయిస్తున్నారని తెలిపారు. నీరు–చెట్టు పనుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. పంట సంజీవని పనులనూ ఉపాధి పనులుగా చూపించి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలదే పెత్తనంగా మారిందని, చివరకు కలెక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. అర్హత గలవారికే ట్రాక్టర్లు ఇవ్వాలని కోరితే కలెక్టర్లు చేతులెత్తేస్తున్నారని తెలిపారు. పేదల భూములను గుంజుకుని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. జీడీపీ ప్రకటనల్లో మాత్రమే పెరిగిందని, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని తెలిపారు. 1982–83లో దేశసంపద 90 శాతం బీసీలు, ఎస్సీలు అనుభవించారని, ఇప్పుడు 40 శాతానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుబులిటీ రిపోర్టు ఉన్నా దుగ్గరాజపట్నం పోర్టుపై శ్రద్ధ పెట్టడం లేదని ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు మరోసారి అవకాశమిస్తే దుగ్గరాజపట్నం పోర్టును సాధిస్తానన్నారు. -
‘నియంత్రణతోనే ప్రజాస్వామ్యానికి మనుగడ’
మొహాలీ: స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయనీ, నియంత్రణ ఉంటేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం అన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు పేరుతో ఎవ్వరూ మరొకరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం, సమాజంలో ఉద్రిక్తతలను సృష్టించడం చేయకూడదని ఆయన హితవు పలికారు. పంజాబ్లోని మొహాలీలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగిన నాయకత్వ సదస్సులో ఆయన ప్రసంగించారు. లౌకికవాదం, సహనం అనేవి భారతీయుల డీఎన్ఏలో ఉన్నాయనీ, దేశంలో ఎక్కడో జరిగిన సంఘటనలు మొత్తం దేశ వైఖరిని ప్రతిబింబించలేవని వెంకయ్య పేర్కొన్నారు. -
జనస్వామ్యంలో వారసత్వమా?
రాజకీయ అర్హతలు లేకుండా పాలనలో యువ వారసులను ప్రజల నెత్తిన రుద్దాలనుకోవడం రాచరిక వ్యవస్థకు సంకేతమే కానీ ప్రజాస్వామ్యం కాదు. అర్హత, అనుభవం లేని వారసులను ప్రజలు తిరస్కరిస్తారు. నేటి ప్రజాస్వామ్యంలో రాజ కీయ వారసులుగా యువ నాయకులు ఎంతోమంది ఆవిర్భవిం చడం చూస్తున్నాం. అలా పాలనా పగ్గాలు చేతపట్టిన వారిలో విజే తలూ ఉన్నారు, పరాజితులూ ఉన్నారు. వారసులు పరిపాలనా పగ్గాలు చేపట్టకూడదన్నది ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేదు. కానీ, అందుకు కావలసిన అనుభవం, తగిన కసరత్తు అవసరం. వారసులకు సమానంగా ఆస్తుల పంపకం వంటిది కాదు రాజకీయ వారసత్వం. ఎవరికైనా సరే.. రాజకీయ అర్హత అంటే మంచి వ్యక్తిత్వం, ప్రజా సంబంధాలు, నాయకత్వ లక్షణాలు ముఖ్యం. రాజకీయాల్లో, పరిపాలనలో యువ నాయకుడుగా రాణించాలంటే.. ప్రధానంగా ప్రాంతీయ, జాతీయ భాషా పరిజ్ఞానంపై పూర్తి పట్టు సాధించాలి. మంచి ఉపన్యాసకుడుగా ప్రజల్ని ఆకర్షించాలి. ప్రజా సంబంధాల్లో చురుగ్గా వ్యవహరించే మంచి నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందాలి. రాజకీయాల్లో నాయకుడు ఏదైనా ఒక విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ఎంత ముఖ్యమో... అందులో అక్షర దోషం లేకుండా మాట్లాడటం అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. అలాగే తెర వెనుక రాజకీయాలు చేయడం ఎంత అవసరమో... ప్రజల్ని ఆకట్టుకునేలా మాట్లాడటం కూడా రాజకీయాల్లో అంతే అవసరంగా భావించాలి. పార్టీ కార్యకర్తలను భావనాత్మకంగా ప్రభావితం చేయగల్గే వ్యక్తిత్వం, ధైర్య సాహసాలు, సామాజిక స్పృహ వంటి గుణాలు అవసరం. అంతేకాదు, పాలనలో సీనియర్లను అనుసరిస్తూ రాజకీయ అనుభవజ్ఞులు, మేధావుల వద్ద శిష్యరికం అవసరం. పుట్టుకతో ఏ ఒక్కరూ ప్రత్యక్షంగా నాయకుడవటం చరిత్రలో ఎక్కడా లేదు. ప్రజల హృదయాల్ని గెల్చిన ఏ నాయకుడి జీవిత చరిత్రను పరిశీలించినా ఇవి స్పష్టంగా గోచరిస్తాయి. స్వాతంత్య్రోద్యమ కాలంలో మహాత్మాగాంధీ కూడా తను అనుకున్నంత వేగంగా ఒకేసారి నాయకుడు కాలేక పోయాడు. బ్రిటీష్ చెరనుండి దేశాన్ని విడిపించాలన్న తపనతో అందరితోపాటు తను కూడా ఆనాడు ఎక్కడ తెల్లదొరలపై వ్యతిరేక ఉద్యమాలు, సభలు జరిగినా హాజరయ్యేవాడు. ఆ సభలు, ఉద్యమాలలో ఆయనకు ఎక్కడా తగిన గుర్తింపు రాలేదు. అయినా, నిరుత్సాహపడకుండా నిత్యం తన లక్ష్యాలవైపు గురిపెడుతూనే ఉండేవాడు. లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో.. తనకు తప్పకుండా ఒక రాజకీయ గురువు అవసరంగా భావించి, క్రీ.శ. 1912 ప్రాంతంలో ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలేని తన గురువుగా ఎంపిక చేసుకున్నాడు. గురుబోధనలో భాగంగా ఆనాడు దేశ జనాభాలో దాదాపు 95 శాతం ఉన్న గ్రామీణ భారతీయుల సంస్కృతి– సంప్రదాయాలకు అనుగుణంగా తన వేష–భాషలతోపాటు జీవనశైలిలో మార్పు ను తెచ్చుకొని, దేశం నలుమూలలా పర్యటించి, ప్రజల సమస్యలపై వారికి అండగా ఉంటూ.. ఆ విధంగా జాతి ఐక్యతకు బాటవేసి స్వాతంత్య్రోద్యమ నేత అయ్యాడు. ఉమ్మడి రాష్ట్రంలో మేధావి, అక్షర జ్ఞాని, మృదు స్వభావి, బహు భాషా కోవిదులు దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావును దక్షిణాది నుంచి ఒక తెలుగువాడుగా, నెహ్రూ–గాంధీల వారసత్వంలో ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి దేశానికి 10వ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మైనార్టీ ప్రభుత్వం అయినప్పటికీ తన రాజకీయ అనుభవాన్ని మేళవించి పరిపాలనకు కావలసిన పూర్తి మెజార్టీని సంపాదించుకొని ఐదేళ్లు దేశాన్ని ఏకధాటిగా పరిపాలించారు. స్వాతంత్య్రం సాధిం చిన తొలినాళ్లలో బూర్గుల రామకృష్ణారావు, స్వామి రామానంద తీర్థ వంటి రాజకీయ గురువులను ఆశ్రయించడంవల్లనే ఆయన అందర్నీ మెప్పించగల నాయకుడయ్యాడు.ఆంధ్రప్రదేశ్లోని మూడు పార్టీలు వైఎస్సార్సీపీ, జనసేన, తెలుగుదేశంలలో.. టీడీపీ వారసుడిగా చంద్రబాబు కొనసాగుతున్నారు. ఇక వైఎస్ జగన్మోహన్రెడ్డి, పవన్ కల్యాణ్లు తమ పార్టీల వ్యవస్థాపక అధ్యక్షులే కానీ వారసులు కారు. వారే ఆ పార్టీలను స్థాపించుకున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు లోకేశ్ను తన వారసుడుగా ప్రకటించాడు. లోకేశ్ను ఇదివరకే టీడీపీలోకి చేర్చుకొని, ఆయన్ను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించటం తెలిసిందే. ఆయనలో నాయకత్వ లక్షణాల లేమిని పసిగట్టిన చంద్రబాబు, ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గడం కష్టమని, పెద్దల సభే సురక్షితంగా భావించి తన వారసుడిగా లోకేశ్ను పెద్దల సభకు పంపి, మంత్రిగా పట్టాభిషిక్తుడిని చేసాడు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుటుంబంలో వారసులు ఉన్నా... ఆయన మరణం తర్వాత కుటుంబ వారసత్వ తగాదాలు వంటి కారణాల వలన టీడీపీ వారసత్వాన్ని అనూహ్యంగా, అడ్డగోలుగా ఎన్టీఆర్ చిన్న అల్లుడు చంద్రబాబు చేజిక్కించుకుని.. నందమూరి వంశ స్థులను తెరమరుగు చేశారు. చిన్న వయసులోనే కాంగ్రెస్ రాజకీయాలు వంట బట్టిన చంద్రబాబుకు తన రాజకీయ భవిష్యత్తుని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడు లక్ష్మీపార్వతి వారసత్వం కోసం పోరాడటం తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ పెద్ద కూతురు, మాజీ కేంద్ర మంత్రి డి. పురందేశ్వరిని, అలాగే హరి కృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ను ప్రజలు ఆ పార్టీ వారసులుగా గుర్తించే అవకాశం నేటికీ ఉంది. అందుకే ముందుచూపున్న చంద్రబాబు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని కోడలుగా చేసుకొని టీడీపీని తన కుటుంబంలో సుస్థిరం చేసుకున్నారు. ఏ తండ్రి అయినా తనయుడి నాయకత్వ లక్షణాలు ముందుగా పసిగట్టలేరా? ఆ విధంగా భవిష్యత్తును ముందుగా తెలుసుకోగల్గే రాజకీయ మేధావిగా చంద్ర బాబు 2019లో తాను అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు అన్న అనుమానంతో ‘అన్నప్రాసన రోజునే ఆవకాయ వడ్డించినట్టు’ ఈ రెండేళ్లలోనే రాజకీయ అక్షరాభ్యాసం కోసం తనయుడ్ని చిన్న వయస్సులోనే పెద్దల సభతోపాటు, అధికారంలో రెండు శాఖలకు యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేశారు. ఈత రాకపోయినా నీటితో నిండి ఉన్న ఈతకొలనులోకి ఒకేసారి నెట్టితే.. ఈత దానంతట అదే వస్తుందన్నది చంద్రబాబు తత్వం. కానీ ఆ వారసుడిని భరాయించవలసింది ప్రజలే కదా? రాజకీయ అర్హతలు లేకుండా పాలనలో యువవారసులను ప్రజల నెత్తిన రుద్దాలనుకోవడం రాచరిక వ్యవస్థకు సంకేతమే కానీ ప్రజాస్వామ్యం కాదు. అంతిమంగా... ప్రజాస్వామ్యంలో కుటుంబ వారసులకు పార్టీ పగ్గాలు అప్పగించే నేపథ్యంలో వారి నాయకత్వ అర్హతను సరిగా పరిశీలించకపోతే అలాంటి నాయకులను, పార్టీలను ప్రజలు తిరస్కరిస్తారు. యాతం వీరాస్వామి వ్యాసకర్త రచయిత, విశ్లేషకుడు ‘ 95816 76918 -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు
పులివెందుల : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవి నాష్రెడ్డి విమర్శించారు. సోమవారం పులి వెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం పూర్తిగా తుడిచిపె ట్టుకపోయిందన్నారు. చంద్రబాబు అనైతిక రాజకీయాలను చూస్తుంటే ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానం క లుగుతోందన్నారు. టీడీపీ నాయకులు పో లీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డా రు. రాజకీయాలలో హత్యా రాజకీయాలకు పాల్పడటం మంచి పద్ధతి కాదని హి తవు పలికారు. చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రొత్సహించడం ఎంతవరకు స మంజసమని ప్రశ్నించారు. ప్రజలకు మం చి పనులు చేసి వారి అభిమానాన్ని చూరగొనాలి కానీ, వారిని భయభ్రాంతులకు గురిచేసి సాధించేది ఏమీ ఉండదన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్ ఏ నాడు ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించలేదన్నారు. టీ డీపీ నేతల చేతిలో హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల కుటుం బాలకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. టీడీపీ ఆరాచకాలపై వైఎస్ జగనన్న సారథ్యంలో వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాడుతుందన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. -
మట్టికి మొక్కుత!
నేను నా దైవం ఏ దిక్కుకు దండం పెట్టాలి? దేవుడే దిక్కు కదా! ఆకాశంలోని కుండకు మొక్కాలా? కుండను చేసిన మట్టికి మొక్కాలా! మట్టికి మొక్కాలా? దాని బిడ్డకు మొక్కాలా! ఏ మొక్కకు మొక్కాలి? అడవంతా దేవుళ్లే కదా! రాతిని చేసిన దేవుడికి మొక్కాలా? దేవుణ్ణి చెక్కిన ఉలికి మొక్కాలా! ప్రతిమకు మొక్కాలా? ప్రతినిధికి మొక్కాలా! ప్రసాదం పెట్టే దేవుడికి మొక్కాలా? నైవేద్యమే లేని అమ్మోరికి మొక్కాలా! గర్భగుడిలో సామికి మొక్కాలా? ఆకలి కడుపులో గర్భానికి మొక్కాలా! అవ్! దైవానికి మొక్కాలా? దైవత్వానికి మొక్కాలా! ‘ఏదీ... దేవుణ్ణి చూపించూ!’ అన్న తర్కానికి మొక్కాలా? ‘ఇందుగలడందులేడన్న సందేహం వలదు’ అన్న విశ్వాసానికి మొక్కాలా! అయ్యకు మొక్కాలా? అమ్మకు మొక్కాలా! పదాలకు మొక్కాలా? పాటకు మొక్కాలా! అక్షర మల్లెల్ని అల్లే... జానపదానికి మొక్కాలా? జానపదానికి తోబుట్టువు... మన గద్దరన్న మొక్కిన దేవుళ్లకు మొక్కాలా! సాక్షి... తన పాఠక దేవుళ్లకు ప్రతి బుధవారం... ఇలా మొక్కు తీర్చుకుంటుంది. ఆఫీసులో ‘నేను నా దైవం’ శీర్షిక అనుకున్నప్పుడు ముందు ఎవరితో మాట్లాడితే బాగుంటుందనే చర్చ వచ్చింది. దైవాన్ని ఓ కొత్త కోణంలో చూసే వ్యక్తి, పాటనై వస్తున్నానమ్మా! అని పలకరించే వ్యక్తి గద్దర్ అయితే బాగుంటుందనుకున్నాను. ఇరవై ఏళ్ల క్రితం గద్దర్పై బుల్లెట్ దాడి జరిగింది ఈ నెలలోనే! బతుకుపోరాటంలో దేవుణ్ణి గద్దర్ ఏవిధంగా దర్శించారు? ఈ ఆలోచనతోనే హైదరాబాద్ అల్వాల్లోని గద్దర్ ఇంట్లో ఉదయం 9 గంటలకు ఆయన్ను కలుసుకున్నాం. ∙ గుడ్మార్నింగ్ సర్. ఉదయం నిద్ర లేస్తూనే ఏ దైవాన్ని తలుచుకున్నారు. (తెల్లని జుట్టును వెనక్కి తోసుకుంటూ... జెండాను భుజానికి ఆనించుకొని రెండు చేతులతో నమస్కారం చేస్తూ..) మా అమ్మను యాది జేసుకున్న. అమ్మకు దండం పెట్టుకున్న. అప్పుడే నన్ను బతుకంతా నడిపిన అమ్మలకు మొక్కుతా.. ‘ననుగన్నతల్లుల్లారా వందనమో.. దయగల తల్లుల్లారా పాదాభివందనమో!’ అని పాడుకున్న. ∙ అంటే, మీరు ఏ దేవుణ్ణీ పూజించరా? ఇగో, ఈ మొక్క పేరేందో తెల్వదు.(బాల్కనీలో ఉన్న ఓ మొక్క ఆకును పట్టుకొని చూపుతూ) దీనికి మొక్కుత. ఇది నాకు పండిస్తది, గాలిస్తది. బతుకునిస్తది. నేను అడవిల ఉన్నప్పుడు అక్కడ అడవి బిడ్డలతో కలిసి విత్తనం వేసేటప్పుడు మొక్కేది. పంట వచ్చేటప్పుడు మొక్కేది. కోతలేసినప్పుడు, కుప్పలు నూర్చినప్పుడు మొక్కేది. ఆ గింజలను వండి, ముందు అడవితల్లికి పెట్టి, ఆ తర్వాత తినేవాళ్లం. మా ఇంట్ల మొత్తం జూడు ఒక్కతాన కూడా దేవుని పటం కనపడదు. తులసి చెట్టు మాత్రం ఉంది. ఆ మొక్క మా నాయినమ్మ మా అమ్మకు ఇచ్చిందంట. మా అమ్మ మా ఆవిడ (విమల)కు ఇచ్చింది. మా ఆవిడ ఆ మొక్కకు రోజూ నీళ్లు పోస్తది. ‘ననుగన్న తులసీ నీకు వందనాలమ్మా, వందనాలమ్మా! ఈ మనిషి కోసం నీవు ఆక్సీజన్ అయితావంట. సచ్చేముందు నువ్వు తీర్థమైతావంట. ఓ తులసీ మొక్కమ్మో నీకు వందనాలమ్మ!’ అని తులసి మీద పాటగట్టిన. ∙ ఈ మధ్య గుళ్లకు తిరుగుతున్నారు... ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలని పల్లె పల్లె తిరుగుతున్న. దీంట్ల భాగంగనే అక్కడి గుళ్లకూ పోతున్నా. కోట్లాది మంది మొక్కే కొమరెల్లి మల్లన దగ్గరకు మొన్నీమధ్యేబోయిన. అక్కడ మా అమ్మను తల్సుకొని పాట పాడిన. ‘సిరిమల్లె సెట్టుకింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఎన్నాళ్లు ఏడ్సేవు ఎంతాని ఏడ్సేవు లచ్చుమమ్మో! ఏడ్సినా తుడ్సినా ఏమి సాధించేవు. నీ సాటి చెల్లెళ్లు, నీతోటి తమ్ముల్లు ఎర్రదండుల జేరి ఎత్తిండ్రు కొడవళ్లు. కొడవళ్లు నూరుకొని లచ్చుమమ్మో కొమరెల్లి కొండల్లో కొరివి రాజేసిండ్రు’ అంటూ ‘నువ్వూ కొడవళ్లు నూరుకో’ అని జెప్పిన. సాంస్కృతిక ఉద్యమంలో ప్రజల నమ్మకాలను విప్లవీకరించాలి. ∙ గుడికి వెళ్లివనప్పుడు ఏమని మొక్కుతరు? మొన్నామధ్య యాదగిరి గుట్టకుబోయిన. పంతులుతో– ‘సామీ.. 1970లో జూసినప్పుడు నర్సన్న బండ సొరెకల ఉండేటోడు. ఇదేంది ఇట్లున్నడు అనడిగితే ‘ఒరిజనల్ దేవుడు అడ్నే ఉన్నడు. ఇక్కడున్నది డూప్లికేట్’ అన్నడు. అప్పుడే పాటందుకున్న– ‘యాదన్న మా యాదన్న.. యాదగిరి నర్సన్న. యాదాద్రివైనావ్ యాది మర్సిపోకన్నా! పుట్టినా మా బిడ్దకు, పుట్టబోయే కొడుకుకు యాదమ్మ, యాదగిరి అని పేరుబెట్టుకున్నామ్. నువ్వు పేరు మార్సుకోని మా పేరు తుడిపేయకో యాదన్న మా యాదన్న’ అని పాడిన. 1980ల తిరుపతి కొండ ఎక్కిన. ఆ కొండ మీద పాట గట్టిన, ఆ బస్సుల మీద పాట గట్టిన. ఆడ పంతులు నెత్తిన శఠగోపం బెట్టిండు. ఇగ జూస్కో అందరూ ఇదే ముచ్చట. (నవ్వులు). ఆ మధ్య పోలవరం వస్తది. గుడి మునుగతది అన్నరు. అప్పుడు భద్రాచలం పోయిన. గుళ్లోకిపోయి వచ్చినంక అడిగిండ్రు. ‘ఎవరికి మొక్కినవ్!’ అని. ‘సీతమ్మతల్లికి మొక్కిన’ అంటే ‘ఎందుకు?’ అని అడిగిండ్రు. రామునికి సీతమ్మపై ఒట్టి ప్రేమనే ఉంది. సీతమ్మకు రాముని మీద ప్రేమ, విశ్వాసం రెండూ ఉన్నాయి. ప్రేమ, విశ్వాసం రెండూ ఉంటెనే పెండ్లి నిలబడ్తది అని జెప్పిన. ఈ గద్దర్ సీతమ్మ పక్షపాతి. ∙ మరి ఈ మధ్య శివుడిని తలుస్తున్నారు. శివతత్త్వం గురించి పాడుతున్నరు... ఏదో ఒకటి తోక పట్టుకుంటరు. అదే గుంజతరు. ఇప్పుడు ఓం నమఃశివాయ నడుస్తుంది. నడవనీ! చిన్నప్పట్నించి దేవుండ్లను గౌరవించేవాణ్ణి. కానీ, నమ్మలేదు. మా నాయిన గొప్ప శివభక్తుడు. చిన్నప్పుడు మా నాయనతో కూడి వందలాది భజనలు జేసిన. కీర్తన్లు పాడిన. బాగోతులు ఆడిన. అట్ల అని పొద్దున లేచి స్నానం చేసి శివ శివ అంటూ పూజలు చేస్తూ కూర్చోను. ∙ క్రీస్తు, బుద్ధుని గురించీ చెబుతుంటారు... బుద్దిజాన్ని నమ్మిన. దాంట్ల కనపడని దేవున్ని మొక్కమని జెప్పరు. ‘గుజిమల్లే పూలో గుజిమల్లే పూలో.. రాగి చెట్టుకింద రాజెవ్వడమ్మ గుజిమల్లెపూలో! ప్రజ్ఞ, కరుణా సమత.. ఆ మూడు కలిసినాడే మనిషిన్నన్నదెవరో.. గుజిమల్లేపూలో! భగవంతుడే ఒక్క భ్రమ అని చెప్పిన భాగ్యశీలి ఎవ్వడే గుజిమల్లెపూలో!..’ అని పాడిన. అట్లనే ఏసు గురించి...‘ శిలువ మీద నిలిచిన దీపమా! మరణమే లేని శాంతి రూపమా!’ అని పాడిన. అట్లనే బసవన్న గురించి ‘వందనాలు వందనాలూ బసవన్నో. అంటరాని గుండె మీద ఆత్మలింగం నీవన్నో!’ ఇట్ల పాడని పాట లేదు తల్లీ! చెట్టు, కొమ్మ, చేమ, పుట్ట, రాయి, చీపురు అన్నీ పాడిన. ∙ కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి కొలుస్తరు... మరి మీరు ఎవరిని తలుచుకునేవారు.. ఏ కష్టమొచ్చినా ‘అమ్మా’ అని అమ్మను తలుసుకుంట. ఉద్యమాలలో అసువులు బాసిన వారిని, వారి కన్నతల్లులను చూసినప్పుడు ఆ దుఃఖం గురించి ఎంతని సెప్పేది. అప్పుడొచ్చిందో పాట.. ‘ఓలీ ఓలీల రంగ ఓలీ చెమ్మకేళిల ఓలి. కొడుకులారా మిమ్మలానూ వోలీ కల్లగూడ మర్సిపోను ఓలీ! బిడ్డలారా మిమ్ములానూ ఓలీ, బాధలల్ల మర్సిపోను ఓలీ. కసి తీర్సుకో నీవు ఓలీ చెమ్మకేళిల వోలీ.. కాళమ్మలవుతాం ఓలీ చెమ్మకేళల ఓలీ..’ అంటూ పాడిన. ఆ తల్లులను మీరంతా కాళికవ్వాలని పాటలో చెప్పిన. నిన్న మొన్న అన్ని పార్టీలోల్లు బోనాలు ఎత్తుకుండ్రు. బతుకమ్మలను ఎత్తుకున్నరు. ‘ఇయ్యాల రేపంట లస్కర బోనాలంట. మన బోనాలెన్నడమ్మో లచ్చుమమ్మా, లచ్చుమమ్మా! నా ఈపెనక ఈపోడు ఇల్లిడిసిపోయిండు. ఆడు యుద్ధంల గెలిసి ఇంటికిస్తే బాలమ్మో ఎర్రబోనం సిద్దం చేస్తా ఓ బాలమ్మ!, మా ఊరి లీడరోడు మహా చాలుగాడు తల్లీ. ఓట్లేసుకునేదాక ఒంగి ఒంగి మొక్కిండు. ఓట్లల్ల గెల్సినంక బూట్లు జూపిస్తుండు’’ అని పాడిన. ప్రజల విశ్వాసాలను గౌర వించాలి. వారి నమ్మకాలను మూఢనమ్మకాలుగా మార్చకూడదు. ∙ ఇప్పుడున్న ఆచారాలు... వ్యవహారాల గురించి? మనిషి తరతరాలుగా కొన్ని ఆచరాలు పెట్టుకొని, వాటిని ఆచరిస్తూ ఉన్నాడు. వాటిని అందరూ గౌరవించాలి. అయితే, అవి రాను రాను మూఢాచారాలు అయ్యాయి. వాటిని గౌరవించలేం. మేం దళితులం. దళితలకు ఏం ఆచారాలు ఉంటయి. మావి అంటరాని కుటుంబాలు. మాకు దేవుడు లేడు. గుడి లేదు. మనుషులుగా గుర్తించబడని మనుషులం. పొద్దుగుంకేదాక కష్టం చేస్తం. మా అమ్మకో, నాయినకో ఏడాదికొక్కమారు తల్చుకొని దణ్ణం పెట్టుకొని, భోజనం పెట్టి, అదే మేం తింటం. ఇప్పుడు మావోళ్లూ కొందరు పూజలు, వ్రతాలు జేస్తుంటరు. పిలుస్తరు. పోతా! దణ్ణం పెట్టుకోమంటే పెడ్త. ప్రసాదం తీసుకోమంటే తీసుకుంట. ఎవరినీ అగౌరపరచను. ∙ మనుషుల్లో దైవం ఉందంటారు. అలా ఆ దైవం మీకు కనిపించిన సందర్భాలు.. ఎందుకు లేవు? నేను అరణ్యంల ఉన్నప్పుడు. కన్నబిడ్డలకు తిండిపెట్టకుండా మా కోసం సద్ది కట్టి పంపించిన తల్లులున్నారు. ఆళ్ల కడుపులుగట్టుకొని మాకు ముద్ద పెట్టేవోళ్లు. వాళ్లు మాకు దేవతలు. దైవం ఉపశమనం ఇవ్వదని నేను అన. అయితే, అది తాత్కాలిక ఉపశమనం ఇస్తది. రాకెట్ పంపించేటప్పుడు ‘దేవుడా, ఇది ఫలించేలా చేయ్’ అని మొక్కుతుండ్రు. గుళ్లో కొబ్బరికాయలు కొడుతుండ్రు. అదంతా తాత్కాలిక ఉపశమనమే ఇస్తది. పరిష్కారం ఇవ్వదు. ∙ మీ కుటుంబ జీవితంలో దైవం గురించి... నా కుటుంబంతో జీవించిందే శానా తక్కువ. నా పిల్లలకు ఏనాడూ దేవుణ్ణి గురించి చెప్పలేదు. నా భార్య విమలనే ఆళ్లను పెంచింది. ఆమె గుళ్లూ గోపురాలకు తిప్పలేదు. మాబతుకే ఒక పోరాటం. పాట ద్వారా ప్రజల్లోకి మహోన్నతమైన శక్తిని తీసుకెళ్లగలిగిన. మీ మతాలు మీవి. మీ విశ్వాసాలు మీవి. దాన్ని నేను కాదన. కానీ, నా పాట ద్వారా ఏది మంచిదో చెబతా! గుడి–బడి రెండింటిలో ఏది మంచిదంటే బడే అంట. అక్కడ కులం లేదు మతం లేదు. జ్ఞానం ఒక్కటే ఉన్నది. చనిపోయిన మా చిన్నకొడుకు ఇక్కడి బడిలో గోడమీద మీద రాసిన ఓ మాట ఇప్పటికీ ఉంది. ‘జ్ఞానం ఒక్కటే చివరకు మిగిలిపోవును’ అని. అదే నేను నమ్ముతా! అదే, అందరికీ కావాలని మొక్కుత. ∙ మీ మాటల్లో స్పిరిచ్యువల్ డెమొక్రసీ అనే పదం వినిపిస్తోంది! గా చెట్టుకింద పోశమ్మ గుడి ఉంది. దానికి తలుపుల్లేవు. తాళం లేదు. పూజారి లేడు. ఆ గుళ్లనే కుక్కలు పంటయి. అండ్లనే పిల్లలను గంటయ్! పోశమ్మను ఊరూర్లో మొక్కుతరు. మరి ఈడేంది?! మా ఇంటికి దగ్గర్లనే ఏడు గుళ్లు అని పెద్ద గుడి ఉంది. అక్కడ దేవుడ్ని లోపలపెట్టి తలుపు, తాళం వేస్తరు. పూజారిపోయి గంట గొట్టి తాళం తీస్తడు. ఈ జనం అక్కడకే పోయే హుండీల పైసలేస్తరు. చెట్టుకింద పోశమ్మ గుడీ గుడే! తాళం వేసిన ఆ పెద్ద గుడీ గుడే! అయితే, అందరిలో ఉన్న దేవుడే నాకు దేవుడు. తాళాలు వేసుకొని భద్రంగా ఉండేటోడు కాడు. అడవిబిడ్డలకు సమ్మక్క, సారమ్మలు చెట్లరూపంలనే ఉన్నరు. పోశమ్మ, మైసమ్మ దేవతలను ఊరూర్లో మొక్కుతరు. దీన్నే స్పిరిచువల్ డెమాక్రసీ అంటాను. ఇదే నాకు నచ్చుద్ది. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
నిరసనల హోరు
- వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ‘సేవ్ డెమోక్రసీ’ నిరసనలు - హోరెత్తిన బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు, ఆందోళనలు - మద్దతు పలికిన ప్రజలు, ప్రజాసంఘాలు - ప్రజాకోర్టులో చంద్రబాబును దోషిగా నిలబెడతామని హెచ్చరిక కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఫిరాయింపు ఎమ్మెల్యేకు మంత్రి పదువులు ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, ప్రజాస్వామాన్ని కాపాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు..శుక్రవారం కదంతొక్కాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో నిరసన తెలిపారు. బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో కదంతొక్కారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీలు, ముఖ్య నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడంతో సేవ్ డెమోక్రసీ ఆందోళనలు విజయవంతమయ్యాయి. నిరసనలకు ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కర్నూలు: స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంపీ బుట్టా రేణుక, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీ హఫీజ్ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే కొత్తకొట ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి పాతబస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేడ్క ర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. నాయకులు తెర్నేకల్ సురేందర్రెడ్డి, సీహెచ్ మద్దయ్య పాల్గొన్నారు. పాణ్యం: కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనైకిత రాజకీయాలను గౌరు దంపతులు ఎండగట్టే సమయంలో ప్రజల నుంచి భారీ స్పందన కనిపించింది. నాయకులు కర్నాటి పుల్లారెడ్డి, దేశం సత్య నారాయణరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. డోన్: వైఎస్ఆర్సీపీ నాయకుడు, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు ఆధ్వర్యంలో డోన్లో నిర్వహించిన సేవ్ డెమోక్రసీ నిరసనకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. పార్టీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో సుమారు 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు రామచంద్రుడు, కోసిగి హరి, రజావర్దన్, దినేష్గౌడ్, రఫీ, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. పత్తికొండ: పార్టీ పత్తికొండ నియోజవర్గ ఇన్చార్జీ చెరుకులపాడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వెల్దుర్తి మండల కేంద్రంలో ‘సేవ్ డెమోక్రసీ’ నిరసన పెద్ద ఎత్తున జరిగింది. రామళ్లకోట రోడ్డు నుంచి తహశీల్దార్ కార్యాలయంలో వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు బజారప్ప, వెంకటరాముడు, శ్రీరంగడు, జగన్నాథరెడ్డి పాల్గొన్నారు. కోడుమూరు: సేవ్ డెమోక్రసీ నిరసనల్లో వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్చార్జీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నాయకులు కృష్ణారెడ్డి, లింగారెడ్డి, సుధాకరరెడ్డి, జూలకల్భాస్కరరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మిగనూరు: పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నాయకులు కేఆర్ రాఘవరెడ్డి, కాశీవిశ్వనాథ్రెడ్డి, బుట్టా రంగయ్య, గోవిందురెడ్డి పాల్గొన్నారు. నందికొట్కూరు: ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్రెడ్డి, తవుడయ్య, లోకేష్రెడ్డి, వంగల భతర్కుమార్రెడ్డి పాల్గొన్నారు. శ్రీశైలం: ఆత్మకూరులో పార్టీ ఇన్చార్జ్ బుడ్డాశేషారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి గౌడ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ రాస్తారోకో చేశారు. విజయభాస్కరరెడ్డి, ఈశ్వరరెడ్డి, శరభారెడ్డి పాల్గొన్నారు. బనగానిపల్లె: నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. కాటసాని ఇంటి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో సుమారు 600 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు చిన్నబాబు, నాయకులు శివరామిరెడ్డి, రామ్మోహన్రెడ్డి, కర్రా హర్షవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. ఆళ్లగడ్డ: గంగుల బీజేంద్రనాథ్రెడ్డి(నాని) ఆధ్వర్యంలో ఆళ్లగడ్డలో వెయ్యి మందికార్యకర్తలతో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నాయకులు రాఘవరెడ్డి, బాబులాల్, సలాం, నారాయణ పాల్గొన్నారు. నంద్యాల: నంద్యాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాధవరెడ్డి, ఖాద్రీ ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ నిరసనలు జరిగాయి. పార్టీ ఆఫీసు నుంచి భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయంలో వరకు వెళ్లి అక్కడ ఆందోళన చేపట్టారు. ఆలూరు: వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఈరన్న ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆదోని: పాతబస్టాండ్లో సేవ్ డెమోక్రసీ నిరసన హోరెత్తింది. ముందుగా పార్టీ నాయకులు గోపాల్, మధుసూదన్, ప్రసాదరావు, దేవ, మహేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడి నిరసన వ్యక్తం చేశారు. మంత్రాలయం: రాఘవేంద్ర సర్కిల్లో నిర్వహించిన సేవ్ డెమోక్రసీ నిరసనలో రాష్ట్ర యూత్ నాయకులు ప్రదీప్రెడ్డి, నాయకులు బీమ్రెడ్డి, బీమన్న పాల్గొన్నారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం నిరసన వ్యక్తం చేశారు. -
ఇదేమి ప్రజాస్వామ్యం?
- నడిబజారులో నవ్వులపాలు - వైఎస్సార్సీపీ పిలుపునకు ప్రజా మద్ధతు - సేవ్ డెమోక్రసీకి అనూహ్య స్పందన సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపునకు జిల్లాలో అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించింది. పార్టీ రహితంగా నేతలు, విద్యార్థులు, మేధావి వర్గం నుంచి నిరసనకు మద్ధతు లభించింది. రామచంద్రపురం నియోజకవర్గం (ఇక్కడ స్థానిక ఎన్నికలున్నాయి) మినహాయిస్తే మిగిలిన 18 నియోజకవర్గాల్లో సీఎం చంద్రబాబు అప్రజాస్వామికంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బయటకు వచ్చి వైఎస్సార్సీపీ ఆందోళనల్లో పాల్గొనడం కనిపించింది. పలు ప్రాంతాల్లో వామపక్షాల నేతలు, పార్టీ శ్రేణులు వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి నిరసన గళాన్ని వినిపించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్లు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, తహసీల్థార్ కార్యాలయాల వద్ద ధర్నాలు, కొన్ని చోట్ల నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని, మరికొన్నిచోట్ల వెనక్కు నడుస్తూ, ఇంకొన్ని చోట్ల చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించమంటూ దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేసి వినూత్న నిరసన తెలియచేశారు. అటు ఏజెన్సీలో సైతం గిరిజనులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాలుపంచుకోవడం కనిపించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో జిల్లాను సమన్వయం చేసుకుంటూ సేవ్ డెమొక్రసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయించారు. - సేవ్ డెమెక్రసీ పేరుతో జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటరీ పార్టీ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్తో కలిసి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ, జాతీయ రహదారి దిగ్భంధనం, తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా, రెండు గంటలపాటు రాస్తారోకో చేసి భారీ మోటారు సైకిళ్ళ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి,ప్రచారసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, జిన్నూరి బాబి తదితరులు పాల్గొన్నారు. - ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, చంద్రబాబు తీరుతో మేధావులు అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు జోక్యం చేసుకోవాలని కొత్తపేటలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రజలతో ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయడమే కాకుండా టీడీపీలో సమర్ధులు లేనట్టు మంత్రి పదవులను ఇచ్చి రాజ్యాంగాన్ని చంద్రబాబు అపహస్యం చేశారని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. తుని శాంతినగర్లోని పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్ధార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. - రంపచోడవరంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, నియోజకవర్గనేత, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (బాబు) ఆధ్వర్యంలో నాయకులు , కార్యకర్తలు, భారీ ప్రదర్శన నిర్వహించి అంబేడ్కర్ సెంటర్లో రాజమండ్రి–భద్రాచలం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రఘుదేవపురం నుంచి సీతానగరం వరకు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పాదయాత్రతో నిరసన తెలియచేశారు. పాదయాత్ర ఆద్యంతం ‘సేవ్ డెమోక్రసీ నినాదాలతో మారుమోగింది. అనంతరం సీతానగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. - అమలాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీను, బొమ్ము ఇజ్రాయిల్, బీసీ, విద్యార్థి విభాగాల అధ్యక్షులు మట్టపర్తి మురళీకృష్ణ, జక్కంపూడి కిరణ్ తదితరులు ఆందోళన నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీలో కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు తదితర నేతల ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. కడియం తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, రూరల్ కో–ఆర్డిటర్ గిరాజాల బాబు, రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు నేతలు భారీ ధర్నా, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని, వెనక్కు నడుస్తూ నిరసన తెలియచేశారు. కో–ఆర్డినేటర్ పర్వత శ్రీపూర్ణప్రసాద్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ముమ్మిడివరంలో కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి పెయ్య చిట్టిబాబు తదితరులు 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. - పి.గన్నవరంలో కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండుగుదిటి మోహన్ తదితరులు భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పి.గన్నవరం సెంటర్లోæ చిట్టిబాబు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. రాజోలు కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సఖినేటిపల్లి రేవు నుంచి రాజోలు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మండపేటలో కో–ఆర్డినేటర్ వేగుళ్ళ పట్టాభిరామయ్య, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రా«ధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కో–ఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు తదితరులు బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కరాచీ సెంటర్లో బాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. - పెద్దాపురం నుంచి సామర్లకోట వరకు కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో భారీ మోటారు సైకిల్ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అనపర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కాకినాడ సిటీ గాంధీనగర్ నుంచి బైక్ర్యాలీని సిటీ కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్ ప్రారంభించగా నగర అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబి తదితరులు పిఠాపురంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించి పార్టీ కార్యాలయం నుంచి మోటారు సైకిళ్లపై ప్రదర్శన నిర్వహించి ఉప్పాడ సెంటర్లో ధర్నా నిర్వహించారు. కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట సెంటర్లో వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ
– పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులా ? - దమ్ముంటే రాజీనామ చేయించి గెలిపించుకోవాలి - ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్సీ గంగుల సవాల్ ఆళ్లగడ్డ : రాజ్యాంగానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి ప్రజాసా్వమ్యాన్ని ఖూనీ చేశారని ఎమ్మెల్సీ గంగుల ప్రతాప్రెడ్డి మండిపడ్డారు.నోరు తెరిస్తే తాను నిప్పునని... నిజాయితీపరుడినని చెప్పుకునే బాబు ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువులా కొనుగోలు చేసి ప్రజా స్వామ్యాని్న పాతరేశారని చెప్పారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ నాడు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన తలసానికి మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్ పై, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. మరి ఇప్పుడు ఆయన ఏపీలో చేసింది అలాంటి తప్పుడు పనే కదా అని ప్రశ్నించారు. బాబు నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దమ్ముంటే ఇప్పటికైనా జంపు జిలానీలతో రాజీనామ చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. -
ప్రజాస్వామ్యంలో చీకటి రోజు
► నడివీధిలో రాజ్యాంగం ఖూనీ ► టీడీపీలో సమర్థులు లేకే ఫిరాయింపుదారులకు అందలం ► నీచ రాజకీయాల చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగలడం ఖాయం ► ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ధ్వజం ► అంబేడ్కర్ విగ్రహా కళ్లకు గంతలు కట్టి నిరసన తిరుపతి రూరల్: చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని నడివీధిలో ఖూనీ చేసిందని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మె ల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ చెవిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఎస్వీ యూనివర్సిటీ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట వినూత్న నిరసన చేపట్టారు. అంబేడ్కర్ కళ్లకు నల్లగుడ్డలతో గంతలు కట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. చెవిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పచ్చి అవకాశవాది అని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారని, టీడీపీలో సమర్థులు లేకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అందలం ఎక్కిం చారని మండిపడ్డారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో చీకటిరోజు అన్నారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోవటం ఖాయమని పేర్కొన్నారు. రాస్తారోకో..అరెస్ట్.. చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు తిరుపతి–చిత్తూరు రహదారిపై రాస్తారోకో చేపట్టాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఎస్వీయూ సీఐ శ్రీని వాసులు సిబ్బందితో వచ్చి ఎమ్మెల్యే చెవిరెడ్డిని, నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారిని పోలీస్స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించగా పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఎస్వీయూ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అ«ధ్యక్షుడు దామినేటి కేశవులు, పార్టీ మండలాధ్యక్షుడు మూలం బాబు, మాధవరెడ్డి, మస్తాన్, మల్లారపు వెంకటరమణ, హరినా«థ్, చిన్నియాదవ్, కొటాల చంద్రశేఖర్రెడ్డి, జోగి మోహన్, గోపి, యుగంధర్రెడ్డి, అజయ్కుమార్రెడ్డి, వీరనారాయణరెడ్డి, మునస్వామియాదవ్, భాస్కర్రెడ్డి, ఒంటేల శివ, భానుకుమార్రెడ్డి, పాల్గొన్నారు. గవర్నర్ తీరు సిగ్గుచేటు స్వార్థరాజకీయాల కోసం పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్ తీరు దారుణమని ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్ తీరు సిగ్గుచేటన్నారు. గవర్నర్ పదవికే మచ్చ తెచ్చిన నరసింహన్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రజాస్వామ్యం .. అపహాస్యం
- ప్రొటోకాల్ పాటించిన అధికారులు - డోన్ నియోజకవర్గంలో అడ్డగోలుగా పింఛన్ల పంపిణీ - అధికారపార్టీ నాయకుల ఇష్టారాజ్యం డోన్ టౌన్: ప్రజాస్వామ్య విధానాలను టీడీపీ నాయకులు తుంగలోకి తొక్కుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలను సొంతంగా అమలు చేస్తున్నారు. అధికారులు సైతం..టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రొటోకాల్ను పాటించడం లేదు. ప్రజలతో ఎన్నికైన వారు కాకుండా ఓడినవారే అక్కడ అధికార దర్పం ప్రదర్శిస్తుంటారు. డోన్ నియోజకవర్గంలో ఈ తంతు సాగుతోంది. డోన్ నియోజకవర్గానికి ఇటీవల 2 వేల పింఛన్లు మంజూరయ్యాయి. వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శనివారం డోన్ పట్టణంలో నిర్వహించారు. అయితే స్థానిక శాసన సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి సమాచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ మేరకు అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చి సఫలీకృతులయ్యారు. ఎమ్మెల్యేను స్వయంగా కాని, ఫోన్ ద్వారా కాని ఆహ్వానించే తీరిక అధికారులకు కూడా లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటాడుతున్న భయం.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఆహ్వానించకుండానే.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపట్టడం, ప్రారంభోత్సవాలు చేయడం టీడీపీ నేతలకు షరా మామూలైంది. ఈ కార్యక్రమాలకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఆహ్వనిస్తే ప్రజలందరి సమక్షంలో టీడీపీ నేతల అవినీతిని ఎత్తి చూపుతారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారనే భయం అధికారపార్టీ నాయకులను వెన్నాడుతోంది. ఇటీవల ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ సమయంలో నందికొట్కూర్ ఎమ్మెల్యే ఐజయ్య.. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. దీంతో అధికారపార్టీ నాయకులు చేపడుతున్న కార్యక్రమాల్లో మరింత జాగ్రత్తలు తీసుకొంటున్నారు. పిలిస్తే ఏ కార్యక్రమానికైనా హాజరై టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల సమక్షంలో ఎండగట్టేందుకు వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉంటారని తెలిసే వారిని ఆహ్వానించకుండానే ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆగమేఘాలపై కార్యక్రమం.. పీఏసీ చైర్మన్, స్థానిక శాసన సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అందుబాటులో లేని సమయం చూసి ఆగమేఘాలపై నియోజకవర్గపు స్థాయి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, డోన్ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రికె గాయత్రీదేవిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ ఫింఛన్లను అధికారపార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా.. తాము ఒక రోజు ముందుగానే ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటికి సమాచారం అందించినట్లు తెలిపారు. ఆయన అందుబాటులో లేకపోతే తాము భాద్యులమెలా అవుతామని వారు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే హడావిడిగా పింఛన్లను పంపిణీ చేశామని చెబుతున్నారు. నీతిమాలిన రాజకీయాలు ప్రజాప్రతినిధులను ఏ ఒక్క కార్యక్రమానికి కూడా ఆహ్వనించకపోవడం ప్రజాస్వామ్యానికే అగౌరవం. ఇలాంటి నైతికతలేని, నీతిమాలిన రాజకీయాలకు టీడీపీ నాయకులు పాల్పడడం దురదృష్టకరం. ప్రొటోకాల్ పాటించాలనే ఇంగిత జ్ఞానం కూడా టీడీపీ నాయకులకు , అధికారులకు లేకపోవడం శోచనీయం. డోన్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురించి నాకు కనీస సమాచారం కూడా లేదు. - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , పీఏసీ చైర్మన్, డోన్ శాసన సభ్యులు -
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు
–జాతీయ ఓటర్ల దినోత్సవంలో జిల్లా జడ్జి అనుపమా చక్రవర్తి – కలెక్టరేట్ నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండు వరకు భారీ ర్యాలీ – అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు –ఓటర్ల జాబితా సవరణలో బాగ పనిచేసిన వారికి ప్రశంసాపత్రాల పంపిణీ కర్నూలు(అగ్రికల్చర్): మంచి పాలకులను ఎన్నుకునేందుకు, ప్రజాస్వామా్యన్ని పరిరక్షించేందుకు ఓటే ఆయుధమని జిల్లా జడి్జ అనుపమా చక్రవర్తి అన్నారు. ఓటరుగా నమోదయిన ప్రతి ఒక్కరు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండులో 7వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ కలెక్టరేట్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పచ్చ జెండా ఊపీ ర్యాలీ ప్రారంభించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ... 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోద కావాలని సూచించారు. దేశ దిశ, దశను మార్చే శక్తి యువతకు ందని అన్నారు. సమర్థనాయకత్వం దేశానికి రావాలంటే ఓటుహక్కు వినియోగించుకోవాలని చెపా్పరు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన వారు సార్వభౌములు వంటి వారన్నారు. ఎవరైనా అర్హులుంటే ఓటరుగా నమోదుకు నిరంతరం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ నరసింహులు మాట్లాడుతూ... యువతీ యువకుల్లో చాలా మంది ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అసక్తి చూపడం లేదని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఓటు వేసే ముందు ఆలోచించి మంచివారికి వేయాలన్నారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ... దేశాన్ని అసాంఘిక శక్తుల నుంచి కాపాడే శక్తి ఓటుకు ఉందని దీనిని స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకుంటామని అందరితో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞచేయించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. చాంద్బాష ప్రదర్శించిన ఇంద్రజాలం, వివిధ నృత్య ప్రదర్శనలు అందరిని మంత్రముగ్దులు చేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అన్ని బృందాలకు జిల్లా కలెక్టర్ రూ.10వేల ప్రకారం నగదు బహుమతి ప్రకటించారు. ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించుకుని ఓటర్ల జాబితా సవరణలో భాగ పనిచేసి అర్హులయిన వారందరిని ఓటర్లుగా నమోదు చేసేందుకు కృషి చేసిన వారికి, సీనియర్ ఓటర్లను కలెక్టర్, రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, జిల్లా ఎస్పీ ప్రశాంసా పత్రాలతో సత్కరించారు. 18ఏళ్లు నిండిన వెంటనే ఓటర్లుగా నమోదైన యువకులకు ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్గౌడు, జిల్లా పరిషత్ సీఈఓ ఈశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, మెప్మా పీడీ రామాంజనేయులు, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఈఓ రవీంద్రనాథరెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్వలి, ఆర్ఐఓ పరమేశ్వరరెడ్డి, కర్నూలు, కల్లూరు తహసీల్దార్లు రమేష్బాబు, నరేంద్రనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఉందా?’
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, నిరసనలు తెలిపిన సభ్యులను అరెస్ట్ చేయడం ఏమిటని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. అసలు అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు. అసెంబ్లీని, ప్రభుత్వాన్ని నిరంకుశంగా నడిపే విధానాన్ని సీఎం కేసీఆర్ మార్చుకోవాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు. బుధవారం శాసనసభలో జరిగిన పరిణామాలను ఖండిస్తున్నామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వందల కోట్లు పేరుకుపోతే బుకాయించే ధోరణిలో సీఎం మాట్లాడడం సరికాదన్నారు. గవర్నర్ కూడా ప్రజా సమస్యలపై, ప్రజా సంక్షేమంపై ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఏజెన్సీలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలుమార్లు విజ్ఞప్తులు చేసినా, లేఖలు రాసినా గవర్నర్ కార్యాలయం నుంచి స్పందన లేదన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఇన్చార్జి మంత్రి
- ' మునుగాల ' నిందితులను అరెస్ట్ చేయకపోతే హై కోర్టును ఆశ్రయిస్తాం – వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొత్తకోట ప్రకాష్రెడ్డి గూడూరు: టీడీపీకే చెందిన రౌడీలకే పనులు జరగాలని ఆ పార్టీకి చెందిన జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు అ«ధికారులకు ఆదేశాలు ఇస్తూ ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్నాడని వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి మెంబర్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్రెడ్డి ఆరోపించారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం మండల అధ్యక్షుడు బండిరాజు గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తకోట మాట్లాడుతూ టీడీపీ కోడుమూరు ఇన్చార్జి విష్ణువర్దన్రెడ్డిపై 60 కేసులున్నాయని, ఆయనపై రౌడీ షీట్ కూడా ఉందని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తి సూచించిన పనులనే చేయాలని ఇన్చార్జి మంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి ఓట్లు లేవని కేవలం ఎన్నికల్లో గెలిచిన వారిని కొనుగోలు చేసుకోవడం తప్ప విష్ణువర్దన్రెడ్డి సాధించింది ఏమీ లేదన్నారు. తన స్వంత ఊరి ప్రజలు(ఎదురూరు)చేతిపంపుల ద్వారా వచ్చే ఉప్పు నీటినే తాగుతూ కష్టాలు పడుతున్నా పట్టించుకోకుండా గూడూరులో అభివృద్ధి చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఢిల్లీలో అధికారులను పలుమార్లు కలిసి గూడూరుకు రూ.42 కోట్లతో ప్రత్యేక పైప్లైన్ స్కీమ్ మంజూరు చేయిస్తే తన వల్లే జరిగిందని చెప్పుకోవడం విష్ణు అవివేకమన్నారు. మునుగాల ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టు రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన టీడీపీ స్థానిక నేతలను వారం రోజుల్లో అరెస్ట్ చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రకాష్రెడ్డి హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో పార్టీ గూడూరు, కర్నూలు మండలాల కన్వీనర్లు ఎల్.భాస్కర్రెడ్డి, వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి చనుగొండ్ల దౌల, స్థానిక నేతలు డీటీ విఠల్, ఎస్.సంజీవరావు, రవిప్రతాప్, డీలర్ బజారి, జె.కొండల్ ఉన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ
– ఓటమి భయంతోనే కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా – విలేకరుల సమావేశంలో ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి కర్నూలు సిటీ: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ ఖూనీ చేస్తోందని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సీఎం అయి రెండున్నరేళ్లు అయినా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడ నేరవేర్చేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిదీ డబ్బుతో కొంటున్నారన్నారు. ఒక పార్టీపై గెలిచిన వారిని సంతలో పశువులను కొన్నట్లు కోట్లు ఖర్చుపెట్టి కొంటున్నారని విమర్శించారు. రెయిన్గన్లతో సీమను సస్యశ్యామలం చేశామని ప్రకటించడం దారుణమన్నారు. పంటలు కాపాడి ఉండిటే పనులు లేక రైతులు వలసలు ఎందుకు పోతున్నారో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఓటమి భయంతోనే నగర పాలక సంస్థ ఎన్నికలను వాయిదా వేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థి పోటీ చేస్తారని త్వరలోనే పేరు ప్రకటిస్తామన్నారు. -
ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు
– కాలుష్య కారక కర్మాగారాన్ని అడ్డుకుంటే జైల్లో పెడతారా – హత్యాయత్నం కేసులు నమోదు చేస్తారా – తుందుర్రు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ దారుణం – ప్రజాఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు కుట్ర – తణుకు సబ్జైలులో ఆరేటి సత్యవతిని పరామర్శించిన వైఎస్ జగన్ సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతూ అరెసై ్ట 38 రోజులుగా రిమాండ్లో ఉన్న తుందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి సత్యవతిని తణుకు సబ్జైల్లో కలుసుకుని పరామర్శించారు. పోలీసుల వైఖరిని, అక్కడ ఫ్యాక్టరీ వద్దంటూ జరుగుతున్న పోరాట వైనాన్ని అడిగి తెలుసుకున్నారు. సత్యవతి చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన జగన్మోహనరెడ్డి ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత సత్యవతి కూతురు కల్యాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం వల్ల గ్రామాలు కలుషితమవుతాయని, పంటలు నాశనమవుతాయని ఆందోళన చేస్తుంటే వారిపై హత్యాయత్నం చేసులు నమోదు చేస్తారా అని జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. కేవలం ప్రశ్నించినందుకే హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆరేటి సత్యవతిని తణుకు çసబ్జైలులో, ఆమె కుమారుణ్ణి నరసాపురం సబ్జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకించినందుకు మొత్తం ఏడుగురిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారన్నారు. ఎఫ్ఐఆర్లో ఇతరులు అని రాసి.. ఆ ఇతరులుగా మిమ్మల్నీ అరెస్ట్ చేస్తామంటూ గ్రామస్తులను పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఆ ఇతరుల్లోనే సత్యవతిని చూపించి అరెస్ట్ చేశారని ఆయన విమర్శించారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టకు పోయి ఆక్వా పార్క్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేయడం దారుణమన్నారు. దానికి వ్యతిరేకంగా నిలబడిన వారిపై ఇలా కేసులు నమోదు చేస్తూ గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేయడం దుర్మార్గమన్నారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన డెల్టా పేపర్ మిల్లు వల్ల ఇప్పటికే యనమదుర్రు డ్రెయిన్ కాలుష్య కాసారంగా మారిందని గుర్తు చేశారు. దాని కారణంగా భీమవరం పరిసర ప్రాంతాలు ప్రాంతాలు కలుషితమై దుర్వాసన వెదజల్లుతున్నాయని, పంటలు సైతం పండని పరిస్థితి నెలకొందన్నారు. గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం చేపడితే గొంతేరు డ్రెయిన్ కూడా ఇలాగే కలుషితం అవుతుందని స్థానికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. సముద్ర తీరాన్ని ఆనుకుని ఆక్వా పార్క్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఎన్నో గ్రామాలకు చెందిన ప్రజలు వ్యతిరేకిస్తుంటే చంద్రబాబు సర్కారు ఉసురు పోసుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కాలుష్యం ఉండదని చెబుతూనే మరోవైపు ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలను పైపులైన్ ద్వారా సముద్రంలోకి మళ్లిస్తామని చెబుతూ.. కాలుష్యం ఉంటుందనే వాస్తవాన్ని చంద్రబాబు ఒప్పుకుంటున్నారన్నారు. రోజుకు 3 వేల టన్నుల రొయ్యలను రసాయనాలతో కడిగి కోల్ట్స్టోరేజీలో ఉంచుతారని, దీనివల్ల కాలుష్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్రైవేటు సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్ట్కు ప్రభుత్వం పైపులైన్ ఏర్పాటు చేయడం ఏమిటని నిలదీశారు. పైపులైన్ నిర్మిస్తే స్థల సేకరణకు, దాని నిర్మాణానికి రూ.25 కోట్లు అవుతుందన్నారు. ప్రై వేటు సంస్థకు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారని ప్రశ్నించారు. ఒకవేళ పైపులైన్లు ఏర్పాటు చేస్తే అవి ఎక్కడైనా లీకేజీలు ఉంటే ఆ ప్రాంతంలోని పొలాలు సర్వనాశనం అవుతాయన్నారు. దీనిద్వారా మత్స్యకారులు, రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఆక్వా పార్క్ను తక్షణమే సముద్ర తీరప్రాంతానికి తరలించాలని కోరారు. గత రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా ముందుకెళుతుండటం సమంజసం కాదన్నారు. సముద్ర తీరంలో ఆక్వా పార్క్ యాజమాన్యానికి 350 ఎకరాల సొంత భూములు ఉన్నాయని, ప్రాజెక్ట్ను అక్కడికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అందరి సహకారం ఉంటుందని చెప్పారు. వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ముఖ్య నాయకులు వంకా రవీంద్రనాథ్, కారుమూరి నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, కవురు శ్రీనివాస్, రాష్ట్ర ప్రోగామింగ్ కమిటీ కన్వినర్ తలశిల రఘురామ్ తదితరులు ఉన్నారు. -
సమాజపు కక్కసు కడిగే అమ్మలు!
ఫస్ట్ పర్సన్ సరిగ్గా అన్నం తినేటప్పుడే అనుకుంటా.. ఒక్క పూట కాదు .. ఒక్క రోజు కాదు.. ప్రతి పూటా.. ప్రతి రోజూ సరిగ్గా అన్నం తినేటప్పుడే... అమ్మ తినేటప్పుడే బిడ్డ దొడ్డికెళ్తాడు! ఎంగిలి చేయి కొడుక్కొని బిడ్డ ముడ్డి కడిగి మళ్లీ చేతులు కడుక్కొని అమ్మ అన్నం తింటుంది!! ఆమె అమ్మ... మరి వీళ్లు..?? - రామ్, ఫీచర్స్ ఎడిటర్ స్వచ్ఛ భారత్పై మీ అభిప్రాయం? 1.6 లక్షల మంది మహిళలు ఇతరుల మలాన్ని ఎత్తిపోసే దయనీయమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ప్రతిరోజూ ఒకరు లేదా ద్దరు మనుషులు ఇందులో చనిపోతున్నారు. ఈ పనిచేస్తున్న స్త్రీలలో అయితే అబార్షన్ రేట్ అధికంగా ఉంది. ఆస్తమా, చర్మవ్యాధులూ వీరిని అనుక్షణం పట్టిపీడిస్తున్నాయి. విద్య, వైద్యం వీరికి ఏరకంగానూ అందుబాటులో లేదు. కనీస గుర్తింపుకి సైతం వీరు నోచుకోలేదు. తరతరాలుగా ఇదే పనిలో ఉండి, ఇందులోనే ప్రమాదంలో చనిపోతే ఒక్క రూపాయి కూడా వీరికిరాదు. చనిపోయిన కుటుంబాలకు ఆరులక్షల రూపాయలివ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. సఫాయి కర్మచారీ ఆందోళన్ పోరాటంతో 2013లో చట్టం కూడా చేశారు. ఈ వ్యవస్థని నిషేధిస్తూ 1993లోనే చట్టం వచ్చింది. చట్టాలు అమలుచేయడానికి కూడా పోరాడాల్సిన దుస్థితి మనది. ఎన్ని చట్టాలొచ్చినా వీరి బతుకుల్లో వీసమెత్తు మార్పులేదు. కానీ ఒక్కరోజు చీపురు పట్టుకుని ఊడ్చినందుకు ప్రపంచమంతా స్వచ్ఛభారత్ చర్చనీయాంశం అయ్యింది. ఇదే రియల్ ఫేస్ ఆఫ్ అవర్ డెమొక్రసీ. పాకీ రిపోర్టర్. ఇదేదో చెడ్డమాటలా స్ఫురించడం లేదూ? వినసొంపుకాని అశుద్ధం లాంటి శబ్దమేదో మనకి అంటుకున్నట్టు అనిపిస్తోంది కదూ? మానవ మలమూత్రాలను చేతులతో ఎత్తివేసే అమానవీయ పనిని నిషేధించే మహోద్యమంలో భాగమైనందుకు, అశుద్ధ భారతాన్ని అక్షరాలతో కడిగేసే యుద్ధంలో పాల్గొన్నందుకు బాషాసింగ్ అనే జర్నలిస్టుకి తోటి జర్నలిస్టుమిత్రుల నుంచి దక్కిన వ్యంగ్యపు బిరుదే ‘పాకీ రిపోర్టర్’. ఔట్లుక్ బ్యూరోచీఫ్గా ఉన్నప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ మొదలు కర్నాటక వరకు పాకీ పనివారి జీవితాల్లోని అమానవీయ కోణాన్ని అక్షరీకరించేందుకు దొడ్లల్లో మలాన్ని ఎత్తివేసే పాకీపనివారితోనే తిరిగి వారితోనే తిని, ఆ అంటరాని జనంతో మమేకమౌతూ బాషాసింగ్ రాసిన ‘అన్సీన్’ పుస్తకపు జర్నీయే ఈ ఇంటర్వ్యూ. మీ పుస్తకానికి ‘అన్సీన్’ అని పేరెందుకు పెట్టారు? సమాజంలో మనకి కనిపించే రంగులు చాలా ఉన్నాయి. కానీ కనిపించని రంగులు ఇంకా ఎక్కువ. అశుద్ధాన్ని కడిగేపనిలో తరాల తరబడి గడిపిన స్త్రీలకు ఇంటికెళ్ళాక పసుపు రంగు ఆహారాన్ని చూస్తే కడుపులో దేవుతుంది. అది గుర్తుకొస్తే ఆ పూటకి మెతుకు దిగదు. అంతర్జాతీయ మానవ హక్కుల గురించి మాట్లాడుకుంటున్న మన దేశంలో మానవ మలమూత్రాలను ఎత్తివేసే అమానవీయ పనిలో రోజూ ఛస్తూ బతుకుతోన్న అనేకానేక మంది స్త్రీల జీవితాలు ఎవ్వరికీ పట్టవు. మనుషుల మలమూత్రాలను చేతులతో ఎత్తివేసి, మ్యాన్హోల్స్లో దిగి, సెప్టింక్ ట్యాంకుల్లో పడి భారత దేశ స్వచ్ఛత కోసం ప్రాణాలర్పిస్తున్నవారు మన చుట్టూనే ఉన్నా వారి ఉనికినే మనం గ్రహించం. చూడ లేక కాదు, చూడడానికి ఇష్టపడని ఈ పనిలో మునిగితేలుతోన్న వారి జీవితాలను గురించి రాసాను కనుకనే దీనికి ‘అన్సీన్’ అని పేరు పెట్టాను. పారిశుద్ధ్య పని వారిపై కథనాలను రాయాలని ఎందుకనుకున్నారు? నేను ఔట్లుక్ బ్యూరో చీఫ్గా ఉన్నప్పుడు ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ అసోసియేషన్కి చెందిన శ్రీలతా స్వామినాథన్ మానవ మలమూత్రాలను ఎత్తివేసే ఓ అనాగరిక కుల వ్యవస్థను గురించి నాకు తొలిసారి తెలియజేశారు. రాజస్థాన్లోని ఝున్ఝున్ జిల్లాలోని ఆ దుర్మార్గమైన సంఘటన నన్ను కలచివేసింది. అది రాయడానికి వెళ్ళిన నేను పాకీ పనిపేరుతో కొనసాగుతోన్న దుర్మార్గమైన కుల వ్యవస్థ మూలాలను తెలుసుకోగలిగాను. దొడ్లల్లో డ్రైలెట్రిన్స్ని తమ చేతులతో శుభ్రంచేసేవారికి ఇళ్లలోనికి ప్రవేశం నిషేధం. ఆ ఇంటి దొడ్డి తప్ప ఆ పరిసరాల్లో కూడా వారు సంచరించడానికి అనర్హులు. పొరపాటున వారు అక్కడికి వస్తే ఆ ప్రాంతమంతా పసుపునీళ్ళు చల్లుతారు. ‘‘నిండు గర్భిణీగా ఉన్న నేను జారిపడిపోయి లేవలేకపోతే పక్కనున్న కర్ర ని నావైపు నెట్టారు తప్ప నన్ను ముట్టుకునేందుకు సాహసించలేదు. వాళ్ళ అశుద్ధాన్నంతా మేం మా చేతుల్తో ఎత్తివేసి మేం అపవిత్రమైపోయామన్నమాట’’ ఓ స్త్రీ అనుభవం ఇది. అందుకే ఇంటివెనుకవైపు వీధి తలుపులెప్పుడూ వీరికోసం తెరిచే ఉంటాయి. అశుద్ధాన్ని ఎత్తివేసిన తరువాత వారు మోకరిల్లితే పెద్దమనుషులు జాలిపడి వారి వీపులపైన రొట్టెలు విసురుతారు. వారు చేసిన అమానవీయ పనికి డబ్బులకి బదులు దక్కిన గౌరవ వేతనమది. ఈ పుస్తకం రాయాలని ఎందుకు అనిపించింది? నా రిపోర్టింగ్లో భాగంగా ‘సఫాయి కర్మచారీ ఆందోళన్’ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న మానవతామూర్తి ఎస్ఆర్ శంకరన్గారిని కలిసాను. బెజవాడ విల్సన్ వీరి కోసమే పని చేస్తున్నారనీ అతనిని కలవమని చెప్పారు. అతనితో మాట్లాడకుండా ఈ వ్యాసాన్ని పూర్తిచేయొద్దని కూడా చెప్పారు. అతనితో మాట్లాడాకనే వ్యాసం పూర్తి చేశాను. ఈ వ్యాసం ఔట్లుక్లో ప్రముఖంగా ప్రచురించారు. దీనికి అత్యంత ఆదరణ లభించింది. ప్రముఖులెందరో ఔట్లుక్ కార్యాలయానికి లేఖలు రాసారు. అభినందించారు. అప్పుడే నాకు రామనాథ్ గోయెంకా అవార్డు వచ్చింది. ఎస్ఆర్ శంకరన్ గారు నా వ్యాసాన్ని చదివి, పుస్తకంగా తేవాలని సూచించారు. అదే ప్రేరణతో నేను రాయడం కొనసాగించాను. దాని ఫలితమే ఈ పుస్తకం ‘అన్సీన్’. దాన్నే రచయిత్రి సజయ అశుద్ధ భారత్గా తెలుగులోనికి అనువదించారు. పాకీ పనివారితో ప్రయాణం మీపైన ఎటువంటి ప్రభావాన్ని చూపింది? మానవ విసర్జితాల్లోనే జీవితాలను వెళ్ళబుచ్చుతోన్న వారి కన్నీళ్ళుతెప్పించే కథలు జర్నలిస్టుగా నా బాధ్యత కంటే ఓ మనిషిగా నా కర్తవ్యాన్ని నాకు గుర్తుచేశాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన పాకీపనివారనుభవిస్తోన్న అంటరానితనాన్ని నేను స్పష్టంగా అర్థం చేసుకున్న తరువాతే నేను డీక్యాస్టిఫై కావడం మొదలయ్యింది. కానీ నాతోటి జర్నలిస్టులు, మిత్రులు కూడా నేను చేస్తున్న పనిని హర్షించలేకపోయారు. ఎప్పుడూ పాకీ పనివారిని గురించి తప్ప నువ్వింకేమీ రాయవా అని వేళాకోళం చేసేవారు. నాకు పాకీ రిపోర్టర్ అనే బిరుదుని కూడా ఇచ్చారు. వీరు ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు? డ్రైలెట్రిన్స్ని శుభ్రం చేసీ, చేసీ వేళ్ళు పాచిపోయి, వంకర్లుపోయిన వారు కొందరైతే, వళ్ళంతా పుళ్ళయి, ఇన్ఫెక్షన్స్తో బతుకుభారమైన వాళ్ళు మరికొందరు. ఇందులో పనిచేస్తున్నవారిలో 96 శాతం మంది స్త్రీలే. ఇన్ఫెక్షన్స్ కారణంగా వారికి పుట్టే పిల్లలు సైతం అంగవికలురుగానూ, మానసిక వికలాంగులుగానూ పుడుతున్నారు. ఈ కుటుంబాల్లోని స్త్రీలు ఏమనుకుంటున్నారు? ఈ అమానవీయ పనికి కులమే కారణం అని నాకర్థం అయ్యింది. అందుకే ఈ పనికి యంత్రాలక్కర్లేదన్న ఈ అగ్రకుల ఆధిపత్య భావజాలం మనల్ని వెంటాడుతోంది. ఈ సమాజంలో కొందరు ఈ పనికోసమే పుడతారని నిర్దేశించారు. ఈ పని ఈశ్వరేచ్ఛ అనికూడా నిర్వచించారు. ఇదే పవిత్రకార్యమైతే అందరూ ఎందుకు చేయరు? కొన్ని కులాలే ఈ పనిని ఎందుకు చేయాల్సి వస్తోందన్నది నా ప్రశ్న? ఇందులో మగ్గిపోతున్న వారంతా ఈ అమానవీయ వ్యవస్థ అంతం కోసం పోరాడుతున్నారు. కలెక్టరు కార్యాలయాల ముందు పెంట తట్టలను తగులబెడుతున్నారు. బకెట్లను గిరాటు వేస్తున్నారు. తమజీవితాలు ధారపోసిన ఈ దుర్గంధం ఛాయలు కూడా తమ బిడ్డలకు సోకకూడదనుకుంటున్నారు. బెజవాడ విల్సన్ అణగారిన వర్గాలతో కలిసి మిగిలిన సమాజం చేయి చేయి కలిపి పనిచేయాల్సిన సమయమిది. ఈ జనంతో కలిసి పనిచేసే వారికి కూడా ఈ కులం అంటుకుంటుంది. అది వారిని ఆ వర్గాల నుంచి వెలివేస్తుంది. ఈ వర్గం వారితో మమేకమయ్యేందుకు ఉపయోగపడుతుంది కూడా... అని ఇంటర్వ్యూ ముగించారు. సఫాయికర్మచారీ ఆందోళన్లో కలిసి 13 ఏళ్ళపాటు ప్రయాణించిన బాషాసింగ్ కులరహితంగా మారడంలో సఫలీకృతమయ్యారు. బాషాసింగ్ మార్క్సిస్టు కుటుంబం నుంచి వచ్చారు. ఇటు తల్లి కులం, అటు తండ్రి కులం కాకుండా తను వేరే కులస్థుడిని వివాహమాడారు. ఇప్పుడు ఆమె కూతురికి ఏ కులం వర్తిస్తుందని ఆమె ప్రశ్నిస్తూ ఉంటుంది. సంభాషణ: అత్తలూరి అరుణ ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి -
ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులకు అసలు ప్రజాస్వామ్యం సరికాదని, అందువల్లనే దేశ వ్యవహారాల్లో ఆర్మీ కీలక పాత్ర పోషిస్తుందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగా చెప్పుకున్నవారు సరిగా పనిచేయనందున దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పాలనలో ఆర్మీనే కీలకంగా వ్యవహరిస్తోందని వాషింగ్టన్ ఐడియాస్ ఫోరం ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా ప్రజాస్వామ్యం లేదని ఇది పాక్కు ఉన్న వారసత్వ బలహీనత అని ముషారఫ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రజలు సమస్యల పరిష్కారానికి సైన్యం వైపు చూస్తారని అందువల్లనే సైన్యం ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విఫలం కావడం మూలంగానే ఈ పరిస్థితులు తలెత్తాయని సైనిక తిరుగుబాటు చర్యలను ఆయన సమర్థించారు. పాకిస్తాన్ ప్రజలు ఆర్మీ నుంచి ఎక్కువ ఆశిస్తారని ఆయన వెల్లడించారు. పాక్ ఆర్మీతో సుమారు 40 ఏళ్ల అనుబంధం ఉందని.. ఆర్మీ తనను సపోర్ట్ చేయడం పట్ల గర్వపడతానని.. సైన్యమే తనకు రాజ్యాంగం అని ముషారఫ్ ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. దేశంలో రాజకీయ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని ముషారఫ్ అభిప్రాయపడ్డారు. -
సోదరత్వ భావనే కీలకం
కొత్త కోణం భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వంతో కూడిన సమాజం కావాలని అంబేడ్కర్ ప్రకటించారు. అందులో సోదరత్వం అత్యంత ఆవశ్యకమని కూడా ఉద్ఘాటించారు. ప్రజా స్వామ్యమంటే ప్రభుత్వాలు అనుసరించే విధానం మాత్రమే కాదనీ, ప్రజల జీవన విధా నంలో ప్రతిబింబించే సోదరత్వమే ప్రజాస్వామ్యమనీ అన్నారు. అందుకే భారతదేశ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రజాస్వామ్యాన్ని సోదరత్వ భావనగా చూడాలి. అటువంటి సమానత్వ విలువల కోసం సాగిన మహా సంగ్రామమే రెండున్నర వేల ఏళ్ల ప్రజాస్వామ్య ఉద్యమం. మనుషులందరికీ సమాన హక్కులూ, సమాన అవకాశాలూ, సమాన భాగస్వామ్యం, పాలనలో పారదర్శకత, గౌరవప్రదమైన జీవితం, వివక్షకు తావు లేని మానవ సంబంధాలు అన్నీ కలిస్తే ప్రజాస్వామ్యం. ఆ పేరు ఎత్తగానే మనకు గ్రీకు తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లేటో ఆనాటి పాలనా వ్యవస్థలు గుర్తొస్తాయి. ప్రజాస్వామ్య పునాదులు అక్కడే ఉన్నట్టు చరిత్రకారులు ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లోకానీ, ఇతర పరిశోధక గ్రంథాల్లో కానీ భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణాన్ని ప్రస్తావించిన దాఖలాలు మాత్రం కనిపించవు. ఇప్పటి వరకు ఆధిపత్యం చెలాయిస్తున్న శక్తులన్నీ భారత ప్రజల ప్రజాస్వామిక పోరాటాల చరిత్రను రకరకాల పేర్లతో వక్రమార్గం పట్టించారు. భారతదేశ చరిత్రను ప్రజల దృక్కోణంలోనుంచి విశ్లేషించిన వాళ్లు సైతం, కొద్దిగా అటూ ఇటూగా హిందూత్వ ఆధిపత్య శక్తుల ఆలోచనల మూసలోనే ప్రయాణాన్ని కొనసాగించినట్టు చరిత్ర చెపుతోంది. గ్రీకు రాజ్యంలో సమానత్వం అనే మాట వేళ్లూనుకొనకముందే, భారతదేశం అని ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఈ గడ్డమీద సమానత్వం, స్వేచ్ఛ, సోదరత్వ భావనలు పరిఢవిల్లాయి. వాటికోసం ఇక్కడ నిరంతరా యంగా సంఘర్షణ జరుగుతూనే ఉంది. అప్పటి నుంచి వివిధ రూపాల్లో జరిగిన ఉద్యమాలన్నింటినీ ప్రజాస్వామిక ఉద్యమాలుగా కాక, మతపరమైన సంస్కరణ ఉద్యమాలుగా పక్కకుతోసి, యూరప్, అమెరికాల నుంచి ప్రజా స్వామ్య భావనలను మనం అరువు తెచ్చుకున్నాం. ఆధిపత్యం కొనసాగించే శక్తులు వీటిని రాక్షసకృత్యాలు, దైవవ్యతిరేక ఘటనలు, దుర్మార్గపు చర్యలుగా పేర్కొంటే, ప్రగతిశీల, అభ్యుదయ భావాలు కలిగిన మేధావులు వీటిని మత సంస్కరణోద్యమాలకు కుదించారు. ఈ రెండు ధోరణులు భారత ప్రజా స్వామిక చరిత్రలోని సత్యాలను మరుగుపరిచాయి. ఇప్పుడైనా భారత ప్రజాస్వామిక చరిత్రలోని చారిత్రక వాస్తవాలపై చర్చ జరగాలి. అంత ర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా మన ప్రజాస్వామ్య మహ త్తర చరిత్రను మననం చేసుకుందాం. ప్రజాస్వామ్య పరిధి విస్తృతమైనది అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించాలని 2007లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. ఇది 2008 సంవత్సరం నుంచి అమలవుతోంది. ఈ అంశం మీద 1997, సెప్టెంబర్ 16న ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన సమావేశం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో మొదటి భాగంలో మొట్టమొదటి పేరాలో ‘సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక తేడాలు లేకుండా ప్రపంచంలోని ప్రజలందరూ ఒకే విధమైన విలువలపైన ఆధారపడి జీవితాలను గడిపే హక్కు ప్రజాస్వామిక విలువలలో అత్యంత ముఖ్యమైన అంశం’ అంటూ దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్యం వివిధ దేశాల్లో రకరకాల రూపాల్లో అమలు జరుగు తున్నది. కొన్ని దేశాలు చిత్తశుద్ధితో ప్రజాస్వామ్య విలువలను పాటిస్తుంటే, మరికొన్ని ఆ పేరును వల్లెవేస్తున్నాయి. భారత ప్రజాస్వామ్యం కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నది. మన ప్రజాస్వామ్యం యూరప్, అమెరికా నమూనాల నుంచి కొన్ని అంశాలను తీసుకొని చట్టాలలో పొందుపరుచుకొని ఉండవచ్చు. కానీ గత రెండున్నర వేల సంవత్సరాల ప్రజల బలమైన సమా నత్వ కోరికలు, సంఘర్షణలు, త్యాగాలు ఈ ప్రజాస్వామ్యం భావజాలం వెనుక ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనగానే ‘ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల ప్రభుత్వం’ అన్న అబ్రహం లింకన్ మాటలను ఉటంకిస్తుంటాం. కానీ ఇది పాక్షిక సత్యం. ప్రజాస్వామ్య భావనను భారతదేశానికి అన్వయించే విధంగా వ్యాఖ్యానించిన వారు బాబాసాహెబ్ అంబేడ్కర్. భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వంతో కూడిన సమాజం కావాలని ఆయన ప్రకటించారు. అందులో సోదరత్వం అత్యంత ఆవశ్యకమని కూడా ఉద్ఘాటిం చారు. సోదరత్వానికి మరో రూపమే ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు. ప్రజా స్వామ్యమంటే ప్రభుత్వాలు అనుసరించే విధానం మాత్రమే కాదని, ప్రజల జీవన విధానంలో ప్రతిబింబించే సోదరత్వమే ప్రజాస్వామ్యమని స్పష్టం చేశారు. అందుకే భారతదేశ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రజాస్వామ్యాన్ని సోదరత్వ భావనగా చూడాలి. అటువంటి సమానత్వ విలువల కోసం, జీవితాల కోసం సాగిన మహా సంగ్రామమే రెండున్నర వేల సంవత్సరాల ప్రజాస్వామ్య ఉద్యమం. బౌద్ధం కృషి మరువలేనిది భారతదేశంలో వేదాల ప్రామాణికతని ఉన్నతంగా చూపెట్టి, తమ ఆధి పత్యాన్ని నిలుపుకోవడానికి వర్ణ వ్యవస్థను, అనంతరం కుల వ్యవస్థను సృష్టించి, పెంచి పోషించిన పూజారి వర్గానికి వ్యతిరేకంగా ఆది నుంచే ప్రతిఘటన మొదలైంది. మొదట్లో చార్వాక, లోకాయుక్త, అజీవక, జైనులు బ్రాహ్మణ పురోహిత ఆధిపత్యాన్ని నిరసించారు. మనుషులంతా ఒక్కటేననే విషయాన్ని ఆ సిద్ధాంతాలు ముందుకు తీసుకొచ్చాయి. వీటన్నింటి ఆచరణ ఆధారంగా ఆ భావాలను మరింత శక్తిమంతంగా ముందుకు తీసుకెళ్లగలిగిన చైతన్యమే బౌద్ధం ఆవిష్కరణకు మూలం. గౌతమ బుద్ధుడు ప్రతిపాదించిన త్రిశరణాలలో ధమ్మం, సంఘం అనేవి ప్రజాస్వామ్య విలువలకు ప్రాథమిక రూపాలు. బుద్ధుడు ప్రతిపాదించిన సంఘంలో వివక్షకు చోటులేదు. కులం, లింగం, ప్రాంతం ఎటువంటి భేదాలు పాటించని వ్యవస్థ బౌద్ధ సంఘం. ఆనాటి అసమాన సామాజిక వ్యవస్థకు ఎదురైన మొదటి ప్రతిఘటన బహుశా అదే. ఈ విధానాలే తదనంతరం ముఖ్యంగా అశోకుడు, కనిష్కుడు హర్షవర్ధనుడి లాంటి చక్రవర్తులు బుద్ధుని ప్రజాస్వామ్య భావాలను తమ పాలనలో భాగం చేసుకున్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించడా నికి అశోకుడు చేసిన ప్రయత్నం మరువలేనిది. ప్రజలకు నాటి అభివృద్ధి ఫలాలు అందడానికి ఆయన రూపొందించిన విధానాలు ఎంతో ప్రాము ఖ్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రజలు తమ జీవితాలను సుఖ సంతోషాలతో ఉంచడానికి అశోకుడు చేసిన ప్రయత్నం ప్రజాస్వామ్య భావనలో భాగంగానే చూడాలి. అయితే ఈనాటి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థను ఆనాటి పాలనతో పోల్చిచూడడానికి ప్రయత్నం చేసేవాళ్లు కొందరు న్నారు. అది పొరపాటు. ఆనాడున్న సామాజిక పరిస్థితుల్లో ఆ విధానాలు ఏమేరకు సమాజంలో సమానత్వ భావనకు కృషిచేశాయి, ప్రజలను సమా నత్వం వైపు ముందుకు నడిపించాయి అనేది ముఖ్యం. ఆనాడున్న ఆధిపత్య భావజాలాన్ని, ప్రజాస్వామిక విధానాలు ప్రతిఘటించిన తీరును మనం గమనంలోకి తీసుకోవాలి. దీనినే చరిత్రను భౌతికవాద దృష్టితో చూడడంగా చెప్పుకోవాలి. ఐక్యపోరాటాలతోనే ప్రజాస్వామ్యం ఆనాడు బుద్ధుడు, అశోకుడు సాగించిన ప్రజాస్వామిక విప్లవాన్ని మళ్లీ బ్రాహ్మణ పురోహిత వర్గాలు క్షత్రియులతో కలసి దెబ్బతీశాయి. దానినే అంబేడ్కర్ ప్రతీఘాత విప్లవంగా పేర్కొన్నాడు. చరిత్రను ఎవ్వరూ మరుగు పర్చలేరు. వివిధ రూపాల్లో చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. పాత భావాల నుంచి విముక్తమయ్యేందుకు విప్లవోన్ముఖం అవుతూనే ఉంటుంది. ఏదో రూపంలో అసమానతలను ప్రతిఘటిస్తూనే ఉంటుంది. అశోకుడి పాలన తర్వాత క్రమక్రమంగా బలాన్ని పుంజుకున్న బ్రాహ్మణ పూజారి వర్గం కులవ్యవస్థను వ్యవస్థీకృతం చేసే పనిని సాగించింది. ఆ విధంగా కుల వ్యవస్థకు ఒక రూపాన్నీ, శక్తినీ అందించింది. ఆ క్రమంలోనే భగవంతుని చట్రంలోనే, మత పరిధిలోనే మధ్య యుగాల్లో భక్తి ఉద్యమాలు బయలు దేరాయి. అందులో బసవేశ్వరుడు సాగించిన వీర శైవం, రామానుజుడు సాగించిన వీర వైష్ణవం కుల వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించాయి. ఈ రెండు ఉద్యమాలు కులాలన్నింటికీ తమలో భాగస్వామ్యం కల్పించాయి. తద్వారా అన్నికులాలు సమానమనే భావానికి దైవత్వాన్ని జోడించి ప్రజలముం దుంచాయి. ఆ తర్వాత కబీర్ తీసుకొచ్చిన వాదన, సాగించిన ఉద్యమం, ఉత్తరాదిని ప్రభావితం చేసింది. అందువల్లనే వృత్తికులాలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి బ్రాహ్మణ వ్యతిరేక భావంతో ఈ ఉద్యమాలలో భాగస్వా ములయ్యాయి. వీర శైవంలో అంటరానికులం నుంచి మాదిగలు, వీరవైష్ణ వంలో మాలలు ప్రధాన భాగస్వాములు కావడం గమనించాలి. ఆ తర్వాత రవిదాసు, నానక్, మీరాబాయి, తమిళనాడులో సిద్ధ ఉద్యమం, తెలుగునేలపైన బ్రహ్మంగారు, వేమన సాగించిన ఉద్యమాలు కూడా ఇందులో భాగంగానే చూడాలి. మహారాష్ట్రలో సాగిన వరకర ఉద్యమం, ఆ తర్వాత మహాత్మా జ్యోతీరావ్ఫూలే ప్రతిఘటన ఉద్యమం ప్రారంభమయ్యే నాటికి ఆధునిక ధోరణులు మొదలయ్యాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో సాగుతున్న బానిస వ్యతిరేక పోరాటాలు ఫూలేను ఆధునిక ప్రజాస్వామ్య భావాల వైపు నడిపించాయి. అయితే వాటిని మరింతగా శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి అసమాన సమాజానికి ప్రతినిధిగా మనువాద సిద్ధాంతానికి నిర్దిష్టమైన ముగింపు పలికే అస్త్రశస్త్రాలను సమకూర్చింది బాబాసాహెబ్ అంబేడ్కర్. స్వాతంత్య్రం కోసం జరిగిన రాజకీయ పోరాటాల్లో రూపొందించుకున్న విధానాలు కూడా కుల వ్యవస్థను ప్రశ్నించాయి. వీటన్నింటితో పాటు బాబాసాహెబ్ తన నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో నిరంతరంగా అధ్యయనం - పోరాటం అనే విధానంతో సాగించిన సంఘర్షణ భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య విలువలకు స్థానం కల్పించింది. బుద్ధుడు ప్రారంభించిన ప్రజాస్వామ్య పోరాటం, బాబాసాహెబ్ అంబేడ్కర్ వరకు కొనసాగి భారతీయ ప్రజలకు రాజ్యాంగం అనే ప్రజాస్వామ్య ఆయుధాన్ని అందించింది. అయితే ఇంకా ఆ పోరాటం పరిపూర్తికాలేదు. అంబేడ్కర్ చెప్పినట్టు ప్రజాస్వామ్యం విలువ దాని అమలుపైనే ఆధారపడి ఉంటుంది తప్ప కేవలం రాజ్యాంగం ప్రతిపై కాదు. అందుకే నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను సాధించుకోవడానికి విశాల ప్రాతిపదికపై మరింత శక్తిమంతమైన ఐక్య పోరాటాలు అవసరం. మల్లెపల్లి లక్ష్మయ్య (నేడు ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం) వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
30 గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నా పట్టదా
భీమవరం టౌన్ : పోలీసులను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నియంతలా రాజ్యమేలుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు ప్రైవేట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మూడు నియోజకవర్గాల్లోని 30 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమించినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు, పర్యావరణం ఏమైపోయినా పర్వాలేదు, పెట్టుబడిదారులు, వారి ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించడం దారుణమన్నారు. సోమవారం ఫ్యాక్టరీ లోపలికి లారీల్లో యంత్ర సామాగ్రిని పంపేందుకు 600 మంది పోలీసులను మోహరించి కర్ఫ్యూ వాతావరణాన్ని నెలకొల్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఆ మూడు గ్రామాల్లో ప్రతి రెండిళ్లకు ఒక పోలీసును కాపలా పెట్టి ఫ్యాక్టరీలోకి యంత్ర సామాగ్రి పంపించడం పెట్టుబడిదారులపై ముఖ్యమంత్రికి ఉన్న అభిమానాన్ని చాటుతుందని విమర్శించారు. రైతులు పొలానికి వెళతామంటే కూడా ఒక పోలీస్ వెంట వచ్చారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చన్నారు. మంతెన సీతారామ్, ఆర్.సత్యనారాయణరాజు, సీహెచ్ బాబూరావు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కుంది
జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉంటుందన్న విషయాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలుసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. అలాకాకుండా ప్రజల గొంతును నొక్కేస్తాను, భయపెడతానంటే కుదరదన్నారు. తాను 16వ ఏట నుంచే ఉద్యమాల్లో ఉన్నానని.. 1969 నుంచే రైతు, విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నానని.. ఈ విషయం తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. తాను ఉద్యమంలో పాల్గొన లేదంటే ఆ సమయంలో ఎక్కడ ఉన్నాను, ఏం జడ్జిమెంట్ ఇచ్చాను అనే విషయాలు తెలుసుకోవాలని అన్నారు. తన తండ్రి రజాకార్లకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేశారని.. అలాంటి కుటుంబం నుంచి తాను వచ్చానని తెలిపారు. జర్నలిస్టుగా, రచయితగా పనిచేసిన వ్యక్తి ఎంతో సమున్నతంగా, విశాలంగా ఆలోచించాలని అందుకు భిన్నంగా తప్పును ప్రశ్నించే వారిని భయపెట్టిస్తామనడం సబబు కాదన్నారు. తెలంగాణ లోక్సత్తా పార్టీ అధ్యక్షులు మన్నారం నాగరాజు, సోగెరా బేగం, రైతు సంక్షేమ సంఘం ప్రతినిధి రాంనర్సయ్య, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు సాంబశివ గౌడ్లు మాట్లాడుతూ.. ప్రెస్ అకాడమీ చైర్మన్గా రెండున్నరేళ్లుగా ఉంటూ జర్నలిస్టుల సమస్యలు ఒక్కటైనా పరిష్కరించకపోగా.. అవి ప్రస్తావించిన వారిపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ అల్లం నారాయణ ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. ఒక ఉన్నతమైన, మచ్చలేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. -
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు: వెంకయ్యనాయుడు సాక్షి, హైదరాబాద్: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గోవు భారతీయ జీవన విధానంలో భాగమని, గోవు పేరుతో దాడులు చేయొద్దని, దాడులకు దిగేవారు హిందువులు కాలేరని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారిని సహించబోమని వెంకయ్యనాయుడు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తం చేసిన త్యాగ పురుషులను మరిచిపోవద్దని, దేశభక్తిని రగిలించడానికే స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండుగగా నిర్వహిస్తున్నామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ పోరాటం చేసిన కుటుంబాలను గౌరవించుకోవాలన్నారు. రజాకారుల ఆగడాల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ను కూడా ఆగస్టు 15 లాగానే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని గుర్తుచేసే విధంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 17 దాకా రాష్ర్టమంతా తిరంగా జెండా పండుగను చేస్తామని చెప్పారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం పెద్దఎత్తున నిధులను కేటాయించిందని, రెండేళ్లలో తెలంగాణకు రూ.96 వేల కోట్లు ఇచ్చిందని వివరించారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పి.మురళీధర్రావు, బీజేపీ శాసనసభాపక్షనేత జి.కిషన్రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీని వెంకయ్యనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. -
అందరి భాగస్వామ్యంతోనే సుపరిపాలన
-
అందరి భాగస్వామ్యంతోనే సుపరిపాలన
ప్రధాని మోదీ ఉద్ఘాటన * ప్రజాస్వామ్యంలో ఫిర్యాదుల పరిష్కారమే కీలకం * ప్రజాస్వామ్యం ఓటుకే పరిమితం కాకూడదు * తొలి టౌన్హాలు ప్రసంగంలో వ్యాఖ్యలు * 8% వృద్ధి కొనసాగితే మనదే అగ్రస్థానం న్యూఢిల్లీ: ఉత్తమ పాలనకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తప్పనిసరని, ప్రజాస్వామ్యంలో అదే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సుపరిపాలన సాధించాలంటే ప్రతి ఒక్కరూ పాలనలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. అమెరికా తరహాలో మొదటిసారి నిర్వహించిన టౌన్హాలు(పాలనలో పౌరుల సమస్యలపై చర్చ) కార్యక్రమంలో భాగంగా ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో శనివారం మోదీ ప్రసంగించారు. MyGov.in వెబ్సైట్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన ఈ సభలో పీఎంఓ వెబ్సైట్ను అనుసంధానించే మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు మోదీ సమాధానమిచ్చారు. ప్రసంగం ముఖ్యాంశాలు మోదీ మాటల్లోనే సుపరిపాలనతో సాధ్యం.. ‘ప్రజాస్వామ్యంలో అంత్యంత ప్రభావిత అంశం ఏంటంటే ప్రజా ఫిర్యాదుల్ని పరిష్కరించే వ్యవస్థే.. ప్రతి పౌరుడి సమస్యకు స్పందించడంతో పాటు పరిష్కరించాలి. ప్రభుత్వ వ్యవస్థ నెమ్మదిగా సాగే చోట్ల, పౌరుల పనులు సులువుగా పరిష్కారమయ్యేందుకు సుపరిపాలనను అభివృద్ధి చేయాలి. పాలనలో అందరూ భాగస్వాములే... ప్రతి దశలో ఏ సమస్య వచ్చినా ప్రధానినే బాధ్యులుగా చూస్తారు. అది సరైన విధానం కాదు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ బాధ్యతాయుత పాలన సాగితేనే సుపరిపాలన సాధ్యం. అభివృద్ధి, సుపరిపాలన సమతుల్య సంబంధాలు కలిగి ఉండాలి. చిట్టచివరి లబ్ధిదారుడికి ప్రభుత్వ లబ్ధి చేకూరాలి’. ప్రభుత్వాల మార్పుతో అభివృద్ధి అసాధ్యం... ‘ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వంతో ప్రజలు ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఆ ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే వచ్చే ఎన్నికల్లో వేరే రాజకీయ పార్టీకి విజయం కట్టబెడుతున్నారు. ఓటు వేసి ఐదేళ్లు వేచిచూడడం అలవాటుగా మారడంతో పాటు ప్రభుత్వమే అన్ని పనులు చేస్తుందన్న అలక్ష్యం నెలకొంది. కేవలం ఓటు వేసేందుకు ప్రజాస్వామ్యం పరిమితమైతే దాని స్ఫూర్తి వృద్ధి చెందదు. ఎన్నికల్లో గెలిచాక తర్వాతి ఎన్నికల్లో ఎలా గెలవాలా? అని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. దీంతో అభివృద్ధి కుప్పకూలుతోంది.’ నిరుపేదలకు ఆరోగ్య బీమా... ‘వ్యాధుల్ని అదుపు చేసే, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలపై దృష్టిపెట్టాలి. టీకాల కోసం ప్రకటనల రూపంలో ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నాం. అయినా చాలా మంది పిల్లలకు టీకాలు వేయించడం లేదు. ఆరోగ్య విభాగం ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరిని కలుస్తుంది. బడ్జెట్లో ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టడంతో నిరుపేదలు కూడా మంచి వైద్యం పొందుతారు.’ ఆధునిక సేద్యం అవసరం ‘మన ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే సామర్థ్యం వ్యవసాయ రంగానికుంది. సంప్రదాయ విధానాల నుంచి ఆధునిక వ్యవసాయం వైపు రైతులు మారాల్సి ఉంది. వ్యవసాయంతో పాటు ఆదాయం పెంచుకునేందుకు పశుపోషణ, తేనెటీగల పెంపకాన్ని రైతులు చేపట్టాలి.’ చేనేతకు చేయూత ‘ఆగస్టు 7న చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రజలు తమ దుస్తుల అవసరాల్లో 5 శాతం ఖాదీ, చేనేత వస్త్రాలు వినియోగించండి. వస్త్ర పరిశ్రమకు సహాకారం అందిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మారిపోతుంది.’ ఆర్థిక వృద్ధితో అగ్రస్థానం ‘ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండాలి. మనం అగ్రస్థానంలో నిలిచేందుకు ఇది తప్పనిసరి. 30 ఏళ్ల పాటు మనం 8 శాతం వృద్ధి రేటు కొనసాగిస్తే మనం ప్రథమస్థానంలో నిలుస్తాం. ప్రపంచం ప్రస్తుతం ఆర్థిక మాద్యంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు శక్తి తగ్గుతున్నా 7.6 శాతం వృద్ధి రేటుతో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారింది. గత ఆరు నెలల్లో 40 లక్షల మంది పర్యాటకులు దేశాన్ని సందర్శించారు. పారిశుద్ధ్యం ఈ మార్పుకు దోహదపడింది.’ విదేశాంగ విధానంలో రాజీలేదు ‘ద్వైపాక్షిక అంశాల్లో దేశ వ్యూహాత్మక ప్రయోజనాలే ముఖ్యం. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడ్డాయి. చాలా అంశాల్లో కలిసికట్టుగా సాగడం ఒక నిబంధనగా మారింది. విదేశాలతో భారత్ ఒప్పందాలు బలోపేతమయ్యేలా ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత దేశం బలమంతా భిన్నత్వంలోనే ఉంది.’ అలసటకు చోటులేదు.. ‘విదేశాల్లోని భారతీయులు త రచూ జెట్లాగ్(విమాన ప్రయాణ అలసట) గురించి మాట్లాడతారు. అంతదూరం ప్రయాణించి మళ్లీ వెంటనే ఆఫీసుకు ఎలా వెళతారని ప్రశ్నిస్తుంటారు. నేనెప్పుడూ అలసిపోను. 125 కోట్ల మంది ప్రజలు, వారి కలలు, వారి పరిస్థితులు హృదయపూర్వకంగా ముందుకు సాగేలా చేస్తున్నాయి. ఎక్కువ శక్తి ఉండడంతో అంతగా కష్టపడుతున్నారని నాతో చెపుతుంటారు. అది సరికాదు. అంతపని చేయాల్సి ఉందని తెలిసినప్పుడు శక్తి దానంతట అదే వస్తుంది. ’ రూర్బన్ పథకంపై... ‘నగరాల్లోని మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ సేవలు గ్రామాల్లోను కల్పించేందుకు దేశవ్యాప్తంగా 300 గ్రామాల్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికతో ఉంది. రూర్బన్ మిషన్ పేరిట ‘స్మార్ట్ సిటీ ప్లస్’ కింద ఈ గ్రామాల్ని గుర్తించాం. నగర తరహా సదుపాయాలు కల్పించేటప్పుడు గ్రామీణ వాతావరణం చెడిపోకుండా చూస్తాం.’ గోరక్షణ పేరిట అక్రమాలు ‘రాత్రిళ్లు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పగలు గోరక్షకులుగా ప్రచారం చేసుకుంటున్న వారిపై ఆగ్రహంగా ఉన్నాను. తమ అక్రమ వ్యాపారాల్ని కప్పిపుచ్చుకునేందుకు చాలా మంది గోరక్షకులుగా చెప్పుకుంటున్నారు. వారిలో 80 శాతం సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో ఉన్నట్లు సమాచారం. వారి పూర్తి వివరాల్ని సిద్ధం చేయమని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నా. ప్రజల్ని భయపెట్టడం, దాడులు చేసేందుకు స్వచ్ఛంద విభాగాలు, సంస్థలు ఏర్పాటు చేయొద్దు. గోవధ కన్నా ప్లాస్టిక్ బ్యాగులు తినడం వల్లే ఎక్కువ గోవులు మరణిస్తున్నాయి. జంతు పరిరక్షణకు కృషిచేయాలనుకుంటే గోవులు ప్లాస్టిక్ను తినకుండా చూడాలి. అదే పెద్ద సేవ. జంతువుల కోసం గతంలో నేను నిర్వహించిన ఒక వైద్య శిబిరంలో ఒక ఆవు నుంచి రెండు బకెట్ల ప్లాస్టిక్ ను తొలగించాం’ -
‘ఫిరాయింపులతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం’
సాధారణ ఎన్నికల్లో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల పార్టీల ఫిరాయింపులతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సోమాజీగూడలోని ప్రెస్క్లబ్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్లు అధికార పార్టీలకు ఏజెంట్లుగా మారి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. పార్టీలు ఫిరాయించే వారిపై తదుపరి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేకుండా అనర్హత వేటు వేయాలని కోరారు. బలమైన పౌర సమాజం ద్వారా ప్రజలను జాగృతులను చేస్తేనే ఫిరాయింపులను నిరోధించవచ్చని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారిని తక్షణమే అనర్హులను చేసే అధికారం ఎన్నికల కమిషన్కు ఇచ్చే విధంగా రాజ్యాంగ సవరణ చేపట్టాలని సూచించారు. -
సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ: మోదీ
న్యూఢిల్లీ: పన్ను చెల్లించకుండా దాచిన డబ్బు, ఆదాయ వివరాలను ప్రతి ఒక్కరూ తెలియజేయాలని, ఇందుకు సెప్టెంబరు 30 ఆఖరు తేదీ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పన్ను ఎగవేతదారులకు ఇదే ఆఖరి అవకాశమని, వివరాలు తెలియజేయకుంటే చర్యలు తప్పవని మోదీ హెచ్చరించారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు సైతం స్వచ్ఛ భారత్కు విరాళాలు ఇస్తున్నారని, అలాంటిది పన్నులు ఎగవేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ప్రజాస్వామ్యమే మన బలమని, ఇది ప్రతి పౌరుణ్ని శక్తిమంతుణ్ని చేస్తుందని మోదీ అన్నారు. దేశాభివృద్ధి కోసం మన శాస్త్రవేత్తలు, రైతులు నిరంతరం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాల్సిన అవసరముందని సూచించారు. యోగా డే సందర్భంగా దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది పాల్గొన్నారని మోదీ చెప్పారు. -
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రమాదం
జాతిహితం పిరికితనంతో డేవిడ్ కామెరాన్... ఈయూలో ఉండాలా, వైదొలగాలా? అనే చర్చపై తన సొంత పార్టీనే చీలిపోయేలా చేసే ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టారు. తన దేశాన్ని, యూరప్ను విఫలం చేశారు, మొత్తం ప్రపంచమే కదలిపోయేలా చేశారు. ఆ అంశంపై తన పార్టీలోనే ఓటింగును చేపట్టి, మెజారిటీ ‘‘వదిలిపెట్టాలి’’ అంటే... ఆ అంశంతో కొత్త ప్రణాళికను రూపొందించి తాజాగా ఎన్నికలను నిర్వహించడం మెరుగైనదై ఉండేది. ఇప్పుడాయన ఆపరేషన్ థియేటర్లో పేషంట్ను నిలువునా కోసేసి పారిపోయారు. బ్రెగ్జిట్ పర్యవసానాలు ద్రవ్య మార్కెట్లపై చూపే ప్రభావం పట్ల ఆందో ళనకు పరిమితమై మనం ఆ పరిణామాన్ని సంకుచితమైన, ఏక ముఖ దృష్టితో చూస్తూ తప్పు చేస్తున్నాం. లేదా, ప్రపంచీకరణను తిరగదోడి, తిరిగి పాత జాతీయవాదానికి తిరిగి పోవడంగా మాత్రమే దీన్ని చూస్తున్నాం. కానీ బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం) రాజకీయ పర్యవసానాలు అంతకంటే చాలా ప్రబలమైనవి, తీవ్రమైనవి. ఆగ్రహభరితమైన నేటి కాలంలో ఈ పరిణామం... శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన ఆధునిక, ప్రజాస్వామ్య రాజ్యపు అసలు పునాదినే సవాలు చేస్తుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కావాలని గావుకేకలుపెట్టే కొత్త ధోరణి ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉంది. కీలక నిర్ణయా లపై, సమస్యలపై తరచుగా ప్రజాభిప్రాయ సేకరణలను చేపట్టడం, ప్రజా ప్రతినిధులను తిరిగి పిలిచే హక్కు, దామాషా పద్ధతి ప్రాతినిధ్యం, వ్యవస్థ సాధికారతను బలహీనపరచడం వంటివి ఇందులో ఉన్నాయి. ఇది అరాచ కానికి మాత్రమే దారి తీస్తుంది. ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తిపై ప్రజాభిప్రాయ సేక రణ జరపాలని అరవింద్ కేజ్రీవాల్ కోరడం గురించి కాదు నా ప్రధానమైన ఆందోళన. అదృష్టవశాత్తూ మన రాజ్యాంగం అందుకు అవకాశం కల్పించ లేదు లేదా మనం మొట్టమొదటిసారిగా ఆ భావనను కశ్మీర్లో పరీక్షించాలనీ అనుకోలేదు. ఆధునిక రాజ్యం విశ్వసనీయతను దెబ్బతీసే అంతకంటే పెద్ద ముప్పే ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణల వల్ల ఉంది. ప్రజాస్వామ్యం పునాదికే చేటు ప్రజాభిప్రాయసేకరణ ద్వారా ప్రత్యక్ష ఓటింగును నిర్వహించడం ప్రధానంగా యూరోపియన్ వ్యామోహం. అయితే అత్యంత కీలకమైన ఒక అంశాన్ని నిర్ణయించడానికే కాదు, సర్వసత్తాకశక్తిగా దేశం కట్టుబడి ఉండాల్సిన అంశా లను నిర్ణయించడానికి కూడా దాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి. పాఠశాల బోధనాంశాలకు, కొన్ని వివాదాస్పదమైన జాతీయ స్థాయి పన్ను లకు పరిమితమైతే ప్రజాభిప్రాయ సేకరణలు గమ్మత్తుగానూ, ముద్దుగానూ ఉంటాయి. ఇటీవల స్విట్జర్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మినార్ల వంటి నిర్మాణాలను నిషేధించడం పూర్తి అధికసంఖ్యాకవాదం, జాత్యహం కార పూరితం కాకున్నా మొరటుదనం. స్విట్జర్లాండ్ పలు రంగాలలో ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పి ఉండవచ్చు. కానీ అక్కడి ప్రజాస్వామ్యం స్త్రీలకు 1971లోగానీ ఓటు హక్కును ఇవ్వలేక పోయింది. అది కూడా పార్లమెంటు అలా నిర్ణయించాక 12 ఏళ్లకు గానీ అది జరగలేదు. బహుశా అంతా పురుషులతోనే జరిపే ప్రజాభిప్రాయ సేకరణ దాన్ని అడ్డు కుంటుందని భయపడటమే అందుకు కారణం కావచ్చు. అతి భయంకరమైన వైరస్ల కంటే ఎక్కువ త్వరగా సోకే అంటు వ్యాధులు చెడు భావాలు. ఇప్పటికే నెదర్లాండ్లో ఈయూపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనే డిమాండు ఊపందుకుంటోంది. క్యుబెక్, స్కాట్లండ్ల వేర్పాటువాద ఒత్తిడులను కెనడా, బ్రిటన్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి అపకేంద్రక ధోరణులు మరింత సంక్లిష్టమైన, వైవిధ్యభరితమైన ఇతర దేశాలకు కూడా విస్తరించగలుగుతాయి. సుస్థిరత, నమ్మకం ఉన్న ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్ణీత కాలంపాటూ అధికారంలో ఉండటం అనే పునాదిపై ఆధునిక ప్రజాస్వామ్యం నిర్మితమైంది. తరచుగా ప్రజాభి ప్రాయ సేకరణల పేరిట జరిగే ఓటింగులు, అనూహ్యమైన అంతరాయాలు ఆ పునాదిని పూర్తిగా ధ్వంసం చేస్తాయి. ఏ ప్రభుత్వమైనాగానీ విశాల దేశ లేదా ప్రజా ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలను తీసుకోవడాన్ని అసాధ్యం అయ్యేలా చేస్తాయి. తమను ఎవరు పరిపాలించాలనే విషయంలో ఓటర్లకు అత్యున్నత నిర్ణయాధికారం ఉండగా... రాజ్యాంగం, చట్టాలు, ప్రాథమిక సూత్రాలకు ఒక మేరకు స్థిరత్వం, ఉల్లంఘనీయత ఉండటమే ఆధునిక ప్రజాస్వామ్యం గొప్పదనం. కాబట్టి ఆధిక్యతావాద అతిక్రమణలకు ప్రత్యక్ష ఓటు సాకుగా మార రాదు. మన దేశానికి అన్వయిస్తే... అతిగా సరళీకరించిన ఉదాహరణలతో దీన్ని మరింత వివ్లవకరంగా భారత దేశానికి అన్వయిద్దాం. ఢిల్లీ పూర్తి రాష్ట్ర స్థాయి అధికారాల కోసం ఓటిం గ్ను నిర్వహిస్తుంది. తమిళనాడు తనను ఆర్టికల్ 370 జాబితా కిందకు తేవాలని లేదా 2010 నాటి రాళ్లు రువ్విన కాలపు ఆగ్రహావేశపూరిత క్షణాల్లో జమ్మూ కశ్మీర్ తనకు సర్వసత్తాకత కావాలని, పాకిస్తాన్లో భాగం కావాలని ‘ఎంచు కుంటే’నో? విదర్భ, బుందేల్ఖండ్ వాటికవే రాష్ట్రాలుగా ప్రకటించుకో వచ్చు. ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి, యావద్భారతం దానికి ఒకప్పటి పూర్తి కేంద్రపాలిత రాష్ట్ర స్థాయిని పునరుద్ధరించాలని కచ్చితంగా ఓటు చేస్తుంది. ప్రజల మానసిక స్థితులలోని ఊగిసలాటల వల్ల కలిగే అస్థిరత్వాన్ని నివా రించడం కోసమే రాజ్యం అధికారాన్ని కచ్చితంగా నిర్వచించారు, సువ్యవ స్థితం చేశారు. వాటికి పరిమితులున్నాయి. పక్షపాతరహిత సంస్థలైన కోర్టులు, ఎన్నికల కమిషన్, కాగ్, సీఐసీ, తదితరాల ద్వారా ప్రధానంగా అవి అమలవుతుంటాయి. ప్రభుత్వం తమకు ఓటు చేయని, లేదా లెక్కలోకి రాని ఓట్లున్న వారిపట్ల వివక్ష చూపకుండా నివారించడం వాటి లక్ష్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం నేడు ఉదారవాద ఉద్యమపు ప్రధాన నినా దంగా అవతరించింది. కాబట్టి ఇదీ ప్రశ్న: మీరు కోర్టు తీర్పును ఎంచు కుంటారా? అది జరగకపోతే భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 377లోని కాల దోషంపట్టిన అంశాలకు పార్లమెంటరీ సవరణ కావాలా? లేక అయోధ్యలో ఆలయ నిర్మాణ ం కోసమూ, 370 అధికరణాన్ని, సింధు లోయ ఒప్పందా లను, సిమ్లా ఒప్పందాన్ని, తాష్కెంట్ ప్రకటనను రద్దుచేస్తూ ఓటింగ్ను నిర్వహించడం కావాలా? ఇవన్నీ ఒక పక్షానికి మొగ్గుచూపేలా ప్రేరేపించేవే. ఓటింగుకు పెడితే, రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితి అండతో అగ్రకుల ఉన్నత వర్గాలు తమకు కల్పించుకున్న విశేషహక్కులను కోల్పోవాల్సి వస్తుంది. మొత్తం జనాభాలో 20 నుంచి 25 శాతంగా ఉన్న అగ్రకులాలకు తమకు తాముగా శాశ్వత ‘ప్రతిభ’ను అంటగట్టేసుకుని అను భవిస్తున్న అవకాశాలలో సగం మాత్రమే వారికి మిగులుతాయి. అవునూ, మీరు... 2001 డిసెంబర్లో పార్లమెంటుపై దాడి తర్వాత లేదా 26/11 ముంబై దాడుల తర్వాత వారంలోగా పాకిస్తాన్పై యుద్ధానికి పోవాలా, లేదా? అని జాతీయ స్థాయి ఓటింగ్ను నిర్వహించేవారా? ఆ రెండు సంద ర్భాల్లోనూ నాటి ప్రభుత్వాలు ప్రజాగ్రహాన్ని విస్మరించి వివేకవంతమైన మార్గాన్ని అనుసరించాయి. నిర్ణీత పదవీ కాలంపాటూ మనల్ని పరిపాలిం చాలని ప్రభుత్వంపై మనం విశ్వాసం ఉంచడమే సరిగ్గా అందుకు కారణం. ఈ అసంబద్ధత ఇలాగే సాగిపోతూ ఉండగలదు. ఓ సీనియర్ బీజేపీ ఎంపీ ట్విటర్లో రఘురామ్ రాజన్కు రెండో దఫా పదవి ఇవ్వాలా, వద్దా? అని ఓటింగ్ నిర్వహించారు. ‘‘ఓటర్లు’’ అంతా ఆయన అనుచరులే. ‘‘వద్దు’’ అంటూ అత్యధిక ఆధిక్యతతో వారంతా ఓటింగ్ చేశారు. మరొక బీజేపీ రాష్ట్ర మంత్రి కూడా అలాగే పులికి బదులుగా ఆవును మన జాతీయ జంతువుగా గుర్తించాలంటూ ట్విటర్/సోషల్ మీడియాలో ఓటింగ్ చేపట్టారు. భారీ ఆధిక్యతతో ‘‘ప్రజాభిప్రాయం’’ ఆవును ఎన్నుకుంది. వెర్రిబాగుల పులికి తాను తన స్థానాన్ని కోల్పోయానని తెలియనైనా తెలియదు. అరాచకం పరిష్కారం కాదు ప్రపంచ అర్థిక వ్యవస్థలు ప్రతిష్టంభలో పడి, నిరుద్యోగం పెరుగు తుండగా పాత వ్యవస్థ పట్ల కొత్త అసంతృప్తి పెల్లుబుకుతోంది. కానీ పరిష్కారం అరాచకం కాదు. గతం పట్ల, ప్రత్యేకించి ‘‘ప్రాచీనులు’’ చేసిన గొప్ప పనుల పట్ల కొత్త ఆకర్షణ పెరుగుతోంది. రోమన్ చక్రవర్తులు తమ నిర్ణయాలకు సమంజసత్వాన్ని కల్పించడం కోసం అలాంటి సర్కస్లను మహా సొగసుగా నిర్వహించగలిగినా కొంతవరకు ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేశారు. అయితే అంతకంటే ప్రాచీన కాలంనాటి వాటి గురించి కూడా చాలానే చెప్పారు. ప్రత్యేకించి మన వైశాలి అలాంటిదే. బిహార్లోని ముజ ఫర్పూర్కు కార్లో పయనిస్తుంటే ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజా స్వామ్యమైన వైశాలి ఆహ్వానం పలుకుతున్న బోర్డులు కనిపి స్తాయి. మగధ సైన్యాలు దండెత్తగా వైశాలి వారితో యుద్ధం చేయాలా, చేస్తే ఎప్పుడు, ఎక్కడ చేయాలని చర్చిస్తూ ఉండగానే... మగధ సేనలు వైశాలిని ధ్వంసం చేసి ప్రజలను ఊచకోత కోశాయని చరిత్రకారులు చెబుతారు. క్రీడలలో తరచుగా మనం విజయం చేతికి అందిందనగా కూడా ఓటమిని వరిస్తుండవచ్చు. భారతీయులకు ఇతరుల చర్చను లాగేసుకోవడం అనే ప్రత్యేకమైన, దీర్ఘకాలిక బలహీనత ఉంది. కష్టాలను ఎదుర్కొనే ధైర్యంలేని పిరికితనంతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్... ఈయూలో ఉండాలా, వైదొలగాలా? అనే చర్చపై తన సొంత పార్టీనే చీలిపోయేలా చేసే ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టారు. తన దేశాన్ని, యూరప్ను విఫలం చేశారు, మొత్తం ప్రపంచమే కదలిపోయేలా చేశారు. ఆయన ఆ అంశంపై తన పార్టీలోనే ఓటింగ్ను చేపట్టి, మెజారిటీ ‘‘వదిలిపెట్టాలి’’ అంటే... ఆ అంశంతో కొత్త ప్రణాళికను రూపొందించి తాజాగా ఎన్నికలను నిర్వ హించడం మెరుగైనదై ఉండేది. ఇప్పుడాయన ఆపరేషన్ థియేటర్లో పేషం ట్ను పడుకోబెట్టి నిలువునా కోసేసి పారిపోయారు. ఇది ఏవిధంగానూ అనుసరించకూడని ఉదాహరణ. తాజా కలం: 1974 పోఖ్రాన్-1 అణు పరీక్షకు ‘‘బుద్ధుడు నవ్వు తున్నాడు’’ అనే పేరు ఎందుకు పెట్టారు? చూడబోతే ఇందిరా గాంధీకి, ఆమె సలహాదారులకు కూడా మగధ, వైశాలిని ధ్వంసం చేసిన చరిత్ర తెలిసే ఉండాలి. బుద్ధుడు దాని పట్ల చాలా కలత చెందాడని, ఎవరూ కఠిన నిర్ణయాలను తీసుకోలేని ప్రత్యక్ష ప్రజాస్వామానికి బదులు వైశాలికి కూడా ప్రతినిరోధకంగా పనిచేయగల సైనిక శక్తి ఉండివుంటే అది ఈ విధ్వంసాన్ని నివారించగలిగేదని ఆయన భావించారనే గాథ ప్రచారంలో ఉంది. సైనిక శక్తిలోని అసమతూకం వల్ల కలిగే ప్రమాదాల గురించి బుద్ధుడు కలత చెందారు. భారత్ ఎట్టకేలకు సైనికపరమైన ప్రతినిరోధక శక్తిని సాధించిదని విన్నప్పుడు ఆయన నవ్వకపోతే ఏంచేస్తాడు? శేఖర్ గుప్తా twitter@shekargupta -
పార్టీ ఫిరాయింపులపై 26న చర్చా గోష్టి
సీతంపేట: ‘పార్టీ ఫిరాయింపులు, ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఈనెల 26వ తేదీన ద్వారకానగర్లోని విశాఖ పౌరగ్రంథాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు చర్చాగోష్టి జరుగుతుందని జనచైతన్య వేదిక రాష్ర్ట అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈ చర్చా గోష్టిలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ, ప్రొఫెసర్లు వి. బాలమోహన్దాస్, కె.ఎస్.చలం, ప్రసన్నకుమార్, కె.తిమ్మారెడ్డి, జి.హరగోపాల్, బాబీవర్ధన్, సీనియర్ పాత్రికేయుడు వి.వి..రమణమూర్తి, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు శివశంకర్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆశించే అభ్యదయకాముకులు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు చర్చా గోష్టిలో పాల్గొనవలసిందిగా కోరారు. -
పార్టీ మారితే అదే రోజు పదవి పోవాలి
అలా చట్టం తేవాలి: వెంకయ్య అప్పుడే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుంది ఫిరాయింపులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే గాక దేశమంతటా విలువలు పడిపోతున్నాయి ఆ చట్టాన్ని పునఃసమీక్షించాలి: కేంద్ర మంత్రి ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికలన్నింటికీ తానిక దూరమని ప్రకటన సాక్షి, హైదరాబాద్ ప్రజాప్రతినిధులు పార్టీ మారితే అదే రోజు తమ పదవి కోల్పోయేలా చట్టం తీసుకొస్తేనే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుల కారణంగా ఏపీ, తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ విలువలు పడిపోతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వెంకయ్య రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్లోని ఇమేజ్ గార్డెన్లో ఆయనకు ఆత్మీయ అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రస్తుతం సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘నేడు రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టాయి. ఒక్కొక్కరుగా పార్టీ మారితేనే ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది తప్ప గంపగుత్తగా మారితే వర్తించదనే ఆలోచనతో పార్టీ ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి ఒక గుర్తుపై గెలిచిన వారు పార్టీ మారితే అదే రోజు పదవి కోల్పోయేట్టు చట్టం తీసుకొస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. రాజకీయ పదవుల కోసం కులం, మతం, ధనం అడ్డుపెట్టుకుంటున్నారన్నారు. సిద్ధాంతాలు నచ్చకపోతే పార్టీలు మారే స్వేచ్చ అందరికీ ఉంటుందన్నారు. ఇప్పుడైతే కాలో, చేయో విరగ్గొట్టేవాళ్లు! చట్టసభల్లో పరిస్థితులు చాలా మారాయని, ప్రస్తుత రాజకీయాల్లో ఓపిక పూర్తిగా నశించిపోయిందని వెంకయ్య ఆవేదన వెలిబుచ్చారు. సభలు జరుగుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. ‘‘మేం అసెంబ్లీలో ఉన్నప్పుడు అధికార పక్షంపై కఠిన విమర్శలు చేసేవాళ్లం. మర్రి చెన్నారెడ్డి హయాంలో నేను, జైపాల్రెడ్డి సీఎంపై వాడీవేడగా మాట్లాడేవాళ్లం. అప్పుడు గనుక సరిపోయింది. ఇప్పుడైతే కాలో, చెయ్యో విరగొట్టేవాళ్లు’ అని అన్నారు! ‘‘రాజకీయ పార్టీలు పరస్పరం శత్రువులుగా చూసుకునే పరిస్థితి వచ్చింది. ఇది సమాజానికి శ్రేయస్కరం కాదు. చైనాతో స్నేహం చేస్తున్నాం. ఆఖరికి మన దేశంలోకి నిత్యం ఉగ్రవాదులను పంపేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్తో కూడా స్నేహానికి చర్చలు జరుపుతున్నాం. కానీ మన ఊరిలో మనపై పోటీ చేసిన వారిని మాత్రం సహించలేకపోతున్నాం. రాజకీయాల్లో ఓపిక, సిద్ధాంతం, గౌరవించడం వంటివి చాలా అవసరం’’ అని సూచించారు. రాజకీయం మిషన్లా ఉండాలే తప్ప కమీషన్గా కాదన్నారు. సభలో రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, సుజానచౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్రెడ్డి, ఎంపీ ముర ళీమోహన్, లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ కేంద్రమంత్రి సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసే ప్రసక్తే లేదని వెంకయ్య ప్రకటించారు. ‘‘ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికలు వేటిలోనూ పోటీ చేయబోను. 65 ఏళ్లు నిండాక రాజకీయాల నుంచి విరమించుకొని సేవా కార్యక్రమాలు చేయాలని భావించాను. కానీ ప్రస్తుతం దేశ అవసరం, ‘అభివృద్ధిలో భాగస్వాములు కండి’ అన్న ప్రధాని నరేంద్రమోదీ ఆలోచనతో ఈ ఒక్కసారి రాజ్యసభకు పోటీ చేశాను’’ అని చెప్పుకొచ్చారు. కేంద్ర నిధులపై టీఆర్ఎస్ దాపరికం వెంకయ్య విమర్శ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం లేదని వెంకయ్య ఆరోపించారు. ‘‘బీపీఎల్ కుటుంబాలకు రాష్ట్రం సబ్సిడీపై అందిస్తున్న రూపాయికి కిలో బియ్యం పథకానికి కేంద్రం కిలోకు 29 రూపాయలిస్తోంది. కానీ ఈ విషయం ఎవరికి తెలుస్తుంది?’’ అని ప్రశ్నించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన తన అభినందన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఇస్తున్న నిధులు, సాయాన్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దాచిపెడుతోందన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. వచ్చే మూడేళ్లలో పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని త్వరలోనే ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని చెప్పారు. దత్తాత్రేయ, కిషన్రెడ్డిలతో పాటు నేతలు నల్లు ఇంద్రసేనా రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, ప్రొఫెసర్ శేషగిరిరావు, రాజాసింగ్, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రమాదం అంచున ప్రజాస్వామ్యం
సందర్భం ఉస్మానియా యూనివర్సిటీలో ఈ గురువారం నాటి ‘‘జనజాతర’’ బహిరంగ సభను ముఖ్యమంత్రి ఏ విధంగా అణచివేశారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఉద్యమాల కేసీఆర్ అణచివేత కేసీఆర్గా ఎంత త్వరగా మారిపోయారో చూస్తుంటే నమ్మశక్యం కావడం లేదు. ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరం. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల పురిటి గడ్డ. 1969 నాటి తెలంగాణ ఉద్యమం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకు పుట్టినిల్లు. సంక్షేమ హాస్టళ్ల ఉద్యమం, నిరుద్యోగుల ఉద్యమం, క్యాపిటేషన్ ఫీజులు, ఇంజనీరింగ్ కాలేజీల డొనేషన్ల వ్యతిరేకత ఉద్యమం, బీసీ విద్యార్థుల ఉద్యమం, స్కాలర్ షిప్ల పెంపు ఉద్యమం – ఇలా ఏ ఉద్యమం జరిగినా ఉస్మా నియా యూనివర్సిటీ కేంద్రం. అనేకమంది నాయకులను తయారు చేసింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. కానీ నిన్నటి ‘‘జనజాతర’’ బహిరంగ సభను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా అణ చివేశారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. బయటనుంచి చీమ కూడా వర్సిటీలోకి దూరకుండా జల్లెడపట్టారు. నాయకు లను కూడా అడ్డుకున్నారు. పోలీసు నిర్భంధంలో, ఉక్కు పిడికిలిలో యూని వర్సిటీని బంధించారు. అసలు విద్యార్థులు జన జాతర ఎందుకు పెట్టారు? 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, టీఆర్ఎస్ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయ మని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే దీని లక్ష్యం. కానీ కేసీఆర్కి ఇది నచ్చడం లేదు. ఏ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించామో! ఏ ఉద్యమం ద్వారా తాను సీఎం అయ్యారో అది మరిచిపోయారు. ప్రజా స్వామ్య విలువలను వదిలేశారు. తెలంగాణ ప్రభుత్వ పాలన గాడి తప్పు తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ ధోరణి, ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ఆశ్రితపక్ష పాతం, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం హద్దులు దాటింది. ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా నడిపించడం లేదు. అసెంబ్లీ ఆమో దించిన విధంగా బడ్జెట్ ఖర్చు పెట్టాలి. కానీ తనకు తోచినట్లుగా ఎప్పుడు ఏ ఆలోచన వస్తే ఆ విధంగా స్కీములు ప్రకటించి బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ ఏర్పడింది. కానీ అడ్డగోలుగా.. అప్పులు తెచ్చి అప్పుల తెలంగాణగా మార్చారు. మొదటి ఏడాది 10 వేలకోట్లు, రెండవ సంవత్సరం 15 వేలు, ఈ సంవత్సరం 25 వేలకు అప్పులు తెస్తున్నారు. ప్రాధాన్యత లేని వాటర్ గ్రిడ్ కోసం ఆక్సిస్ బ్యాంకు, హడ్కో, నాబార్డ్ ఇతర బ్యాంకుల నుంచి 40 వేల కోట్ల అప్పులు తెచ్చారు. ‘‘తాగునీరు కాదు సాగునీరు’’ కావాలని రైతులు అడుగు తుంటే ముగ్గురు బడా కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చే విధంగా అవినీతి వాటర్ గ్రిడ్ పథకానికి వేల కోట్లు కేటాయిస్తున్నారు. ‘‘నాలుగు బిందెల నీళ్లు తెచ్చుకొని తాగుతాం కానీ మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి’’ అని తల్లిదండ్రులు అడుగుతుంటే దానిని పట్టించుకోకుండా ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకపోతే మరలా వచ్చే ఎన్నికలలో ‘‘ఓట్లు అడగమని’’ గోబె ల్స్ను తలదన్నేలా ఎదురు ప్రచారం చేస్తున్నారు. ఇంకొకవైపు ప్రభుత్వ ఆస్తులు – భూములు వేలం వేస్తూ రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నారు. డబుల్ బెడ్రూంలతో ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేస్తూ ప్రభుత్వ భూములను వేల కోట్లకు అమ్మడంలో ఏమైనా ఔచిత్యం ఉందా! ముందుచూపు లేకుండా ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్తు తరాలకు ఏం మిగులుతుంది? ప్రభుత్వ భవనాలు, పాఠశా లలు, హాస్పిటల్స్, హాస్టళ్లు ఎలా నిర్మిస్తారు? కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు అమ్మడాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఇప్పుడు తాను చేస్తున్నదేమిటి? పోలీసుల్ని ఉసిగొల్పి ప్రజా ఉద్యమాలను తీవ్రంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన నిరుద్యోగుల ఉద్యమ సంద ర్భంగా ఉద్యమాన్ని అణచివేయడానికి ఏసీపీ, సీఐ స్థాయి పోలీస్ అధికారులు కోచింగ్ సెంటర్లకు, లైబ్రరీలకు, హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమంలో పాల్గొనరాదని, పాల్గొంటే కేసులు అవు తాయి, ఉద్యోగాలు రావని బెదిరించారంటే ఎంతగా దిగజారారో అర్థమ వుతుంది. ఏ ఉద్యమాల ద్వారా తెలంగాణ వచ్చిందో మరిచిపోయారు. పోలీసులు ఇప్పుడు ఉద్యమాలకు, బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. నక్సల్స్పై ఎదురుకాల్పులు ఉండవన్నారు. కానీ ఎదురు కాల్పులు కాదు కదా, పట్టుకు పోయి దొంగ కాల్పులతో చంపుతున్నారు. పత్రికలను, టీవీ చానల్స్ను భయపెట్టడం, ప్రలోభ పెట్టడం ద్వారా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఉద్యమ వార్తలు రాకుండా చేస్తున్నారు. ముఖ్య మంత్రి కార్యాలయంలో నలుగురు అధికారులతో ఒక ‘‘మానిటరింగ్ కమిటీ’’ ఏర్పాటు చేసి, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, ఉద్యమ వార్తలు రాకుండా పత్రికలపై, టీవీ చానల్స్పై ఒత్తిడి చేస్తున్నారు. వినక పోతే అడ్వర్టైజ్మెంట్స్ జారీ చేయకుండా ఆపుతామని బెదిరిస్తున్నారు. పత్రికలను, టీవీ చానల్స్ను బెదిరించి వాటిని లొంగ దీసుకుంటున్నారు. ప్రజాసమస్యలు, ఉద్యమ వార్తలు రాయొద్దని బెదిరి స్తున్నారు. ఈ వార్తలపై ప్రచ్ఛన్న నిషేధం విధించారు. తెలంగాణ ఉద్య మంలో సాంస్కృతిక విప్లవం సృష్టించిన కళాకారులను నోరు మూయించ డానికి 550 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నోటికి సంకెళ్లు వేశారు. ప్రజల గొంతుకై నిలిచే కళాకారులు ప్రభుత్వ నిర్బంధంలో చిక్కుకుపోయారు. కళాకారులు బయట ఉంటే ప్రజలను చైతన్యం చేస్తారనే కుట్రతో వారిని కాంట్రాక్టు ఉద్యోగాలలో బంధించారు. అధికారం చేపట్టిన తర్వాత అడ్డగోలుగా ప్రవర్తిస్తూ పాలిస్తున్నారు. ప్రజలను, ప్రజా సంఘాలను, నాయకులను చివరకు శాసనసభ్యులను కూడా కలవడం లేదు. ఇంటర్వూ్యలు లేవు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా నిరంకుశంగా ప్రవర్తించలేదు. ప్రతిరోజూ ఒక గంట ప్రజ లకు ధర్మదర్శనం ఇచ్చేవారు. కానీ కేసీఆర్ అధికారం చేపట్టిన ఈ రెండేళ్ల కాలంలో ఇంటర్వూ్యలు లేవు. సెక్రటేరియట్కు రారు. రాష్ట్ర సీఎం ప్రజ లను కలవకుండా వ్యవసాయ క్షేత్రంలో ఉండటం దేనికి చిహ్నం? తెలంగాణ కోసం ప్రజలు పోరాడింది ముఖ్యంగా నిధులు, నియా మకాలు, నీళ్ల కోసమే.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఏ మాత్రం శ్రద్ధ వహించడం లేదు. ఎంత సేపూ వేల కోట్ల కమీషన్లు వచ్చే మిషన్ భగీరథ, ఇరిగేషన్ కాంట్రాక్టుల మీద ధ్యాసే తప్ప మరేమీ లేదు. ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరు ద్యోగులు గత ఒక సంవత్సర కాలంగా ఉద్యమాలు చేయగా, రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉంటే కేవలం 15 వేల ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేశారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. ఇప్పటికే మూడవ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యింది. ఒక్క పాఠశాల కూడా ప్రారంభం కాలేదు. ఇంకెప్పుడు ప్రారంభిస్తారు? ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే టీచర్లను నియమించలేదు. ఇక కేజీ నుండి పీజీ గగన కుసుమమేనా! ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలి. ఏ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా తాను తెలంగాణా ముఖ్యమంత్రి అయ్యారో ఆ ప్రక్రియను గౌరవించి, కొనసా గించాలి. ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని కాపాడాలి. కేసీఆర్ ఆ దిశగా మారతారని, సుపరిపాలన అందిస్తారని ఆశిద్దాం. వ్యాసకర్,త జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు :ఆర్. కృష్ణయ్య మొబైల్ : 90000 09164 -
కలాల బలం ఇక కలేనా!
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు మీడియా స్వేచ్ఛ పట్ల ఉండాల్సిన వైఖరి ఇదేనా అని ప్రశ్నించే వాళ్లు కరువయిపోతున్నారు. మీడియాను కట్టడి చేస్తే, దాని నోరు నొక్కితే నష్టపోయేది ప్రజలూ, ప్రజాస్వామ్యం. ఇదేదో ప్రైవేటు వ్యవహారం అనుకుంటే పొరపాటు. ఒక న్యూస్ చానల్లో ప్రసారం అయ్యే కార్యక్రమం తమ అడుగులకు మడుగులొత్తే విధంగా లేనందుకు ఆపించే ప్రయత్నం ప్రభుత్వం చేసినా ఆ చానల్ యాజమాన్యం అందుకు గంగిరెద్దులా తలూపి కూర్చోవడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. ఎమర్జెన్సీ (1975-1977) చీకటి రోజుల గురించి తెలియని వారుండరు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చను మిగిల్చిన రోజులు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి నలభై ఒక్క ఏళ్ళు పూర్తి కాబోతున్నాయి (జూన్ 25, 1975). దేశ ప్రజలందరూ ఎమర్జెన్సీ దుర్మార్గాన్ని అనుభవించారు. కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా. 41 ఏళ్ల క్రితం నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి పౌర, ప్రజాస్వామిక హక్కులన్నింటినీ కాలరాశారు. ఆ కాలంలో పత్రికా స్వేచ్ఛకు ఎంత తీవ్రమైన విఘాతం ఏర్పడిందో ఆ తరం వారందరికీ అనుభవమే. తరువాత తరం వారు చరిత్ర చదివి తెలుసుకునే ఉంటారు. నాడు సెన్సార్షిప్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన పత్రికలు ఉన్నాయి. వాటి అధిపతులు ఉన్నారు. జైలుకు వెళ్లిన పాత్రికేయులూ ఉన్నారు. వారిలో ఇద్దరిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు- ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ పత్రికల యజమాని రామ్నాథ్ గోయెంకా, ప్రముఖ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్. వ్యాపారంలో సంపాదించినదంతా కోల్పోయి ఇత్తడి చెంబుతో గుజరాత్కు తిరిగి అయినా వెళతాను కానీ ఇందిరాగాంధీకీ, ఆమె విధించిన ఎమర్జెన్సీకీ లొంగేది లేదని స్పష్టం చేసిన పత్రికా యజమాని గోయెంకా. ఎమర్జెన్సీని ఎదిరించి జైలుకు వెళ్లిన పాత్రికేయ దిగ్గజం కులదీప్ నయ్యర్. గుజరాత్ రాష్ట్రానికి చెందిన గోయెంకా కట్టుబట్టలు, ఒక ఇత్తడి చెంబుతో వ్యాపారం చేయడానికి బయలుదేరి అంత ఉన్నతి సాధించారని చెపుతుంటారు. ఎమర్జెన్సీ దురాగతాలు ఎలాంటివో చెప్పడానికి గోయెంకా, కులదీప్ నయ్యర్ల ఉదంతాలు ప్రత్యేకంగా చెప్పుకోదగిన రెండు ఉదాహరణలు మాత్రమే. వాళ్ల మాదిరిగానే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఎదిరించి నిలిచిన మరికొన్ని పత్రికలూ లేకపోలేదు. ఒదిగి ఉండమంటే..... అయితే చాలామంది పత్రికా యజమానులు, సంపాదకులు, పాత్రికేయులు బీజేపీ నాయకుడు ఎల్కె అడ్వానీ ఒక సందర్భంలో చెప్పినట్టు, ఎమర్జెన్సీ కాలంలో వాళ్లను ఇందిరాగాంధీ ఒదిగి ఉండమంటే సాష్టాంగ పడ్డారు(they were asked to bend but they crawled). ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు భారతదేశంలో మళ్లీ రాకూడదనే కోరుకోవాలి. 1970ల తరువాత పరిస్థితులు బాగా మారిపోయాయి. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు మళ్లీ ఎమర్జెన్సీ విధింపు వంటి ప్రయోగాలు చేసే ధైర్యం ఇప్పుడు లేదు. ఈ నలభై ఏళ్ల కాలంలో దేశంలో ప్రజాస్వామ్యం ఎన్నో ఉద్యమాల కారణంగా పరిపక్వమైంది. కాబట్టి మళ్లీ అటువంటి సాహసం ఇంకొకరు చేస్తారనుకోడానికి ఆస్కారం కూడా తక్కువే. పత్రికారంగం కూడా ఎంతో పరిణతి చెందింది. ఎన్నో విప్లవాత్మక మార్పులొచ్చాయి. టెక్నాలజీ పుణ్యమా అని ఎలక్ట్రానిక్ మీడియా ప్రవేశం తరువాత గత దశాబ్దకాలంలో మన దేశంలో కూడా మీడియాలో ఒక విస్ఫోటనం చూశాం. వ్యాపార అవసరాలూ, ప్రయోజనాలూ చేరిన తరువాత దేశంలో మీడియా స్వరూపం మారిపోయింది. రాజకీయ ప్రయోజనాలూ ఇందుకు తోడయ్యాయి. కొన్ని పెడ ధోరణులు ఉన్నా మీడియా ఇప్పటికీ సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రజలకు ఉన్న హక్కును తన బాధ్యతగా నిర్వర్తిస్తూనే ఉంది. ఎమర్జెన్సీ కాలం నాటి నిర్బంధాన్ని అమలు చేసే పరిస్థితి, అవకాశం లేకపోయినా మీడియా మీద భౌతికదాడులు సహా అన్ని రకాల దాడులూ జరుగుతూనే ఉన్నాయి. ఎమర్జెన్సీ తరువాత గడచిన ఈ నలభై ఏళ్ల కాలంలో ఈ దేశంలో అటువంటి సంఘటనలు ఎన్నో చూశాం. ఎమర్జెన్సీ కాలం మాదిరిగానే మీడియాను అదుపు చెయ్యాలనీ, తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనీ ఇప్పటికీ రాజకీయ నాయకత్వం, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్లు ఆశపడుతూనే ఉన్నారు. అడ్వానీ వ్యాఖ్యానించినట్టు ఒదిగి ఉండమంటే సాష్టాంగ పడే జాతి కూడా అక్కడక్కడా మనకు మీడియాలో తారసిల్లుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన మేరకు ప్రతి ఏటా మే నెల మూడవ తేదీ ప్రపంచమంతటా పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుపుకుంటాం. ఆ వేడుక నిన్ననే జరుపుకున్నాం ప్రపంచ దేశాలన్నిట్లో. మన దేశంలో కూడా పత్రికా స్వేచ్ఛ ప్రాశస్త్యాన్ని, అవసరాన్ని గురించి సభలూ సమావేశాలు నిర్వహించి మాట్లాడుకున్నాం. నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలు కూడా అక్కడక్కడా వినిపించాయి. అదే రోజున, నిన్న రాజకీయ నాయకత్వం యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి తన గొంతు ఎట్లా నులిమేసిందో ఆవేదనతో చెప్పుకున్నాడు తెలుగు పాఠక ప్రపంచానికి ఒక సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు. కొద్ది సంవత్సరాలుగా ఒక టీవీ చానల్లో దినపత్రికల వార్తా విశ్లేషణ కార్యక్రమం కొన్నేళ్ల పాటు ఆయన నిర్వహించారు. అది కొన్ని మాసాలుగా ఆగిపోవడానికి దారితీసిన పరిస్థితులను, కారణాలను కొంత విరామం తరువాత సొంత బ్లాగ్లో రాసుకున్న వివరాలను ‘సాక్షి’ దినపత్రిక మే రెండో తేదీన ప్రచురించింది. సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాసరావుకు ఎదురయిన ఈ అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా పరిస్థితి ఏమిటో, పాలకులు మీడియా పట్ల ఎటువంటి వైఖరితో ఉన్నారో మనకు స్పష్టం చేస్తుంది. మీడియా మీద దాడి చెయ్యడానికి, ప్రతిబంధకాలు సృష్టించడానికి ఎమర్జెన్సీయే కానక్కర లేదు ఎపుడయినా అణచి పారేయ్యొచ్చు. భావ ప్రకటనా స్వేచ్ఛను ఎప్పుడయినా తమ అధికార బలంతో అడ్డుకోవచ్చు అని ఈ రెండేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నోసార్లు రుజువు చేశారు. ప్రశ్నించేవాళ్లంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి గిట్టదు. విలేకరుల గోష్టిలో ఆయన చెప్పింది రాసుకుని రిపోర్ట్ చెయ్యాలే తప్ప వివరణ కోరుతూ ప్రశ్నలు వెయ్యకూడదు. అట్లా ప్రశ్నించే వారి మైండ్సెట్ మారాలంటారాయన. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం, పత్రికా ప్రపంచం రెండూ ఉండకూడదన్నది ఆయన మనోగతం. పొగడ్తలే రాయాలా? అమరావతి రాజధాని నిర్మాణం గురించి గొప్పగా రాయాలి తప్ప, గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఎలుకలు కరిచి శిశువు చనిపోయిందనీ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చీమలు పసిగుడ్డును పొట్టన పెట్టుకున్నాయనీ చిన్న చిన్న విషయాలు రాయకూడదంటారు ఆయన. అసలు అటువంటి సంఘటనల ప్రస్తావనే ఆయనకు ఇష్టం ఉండదు. చంద్రబాబు చేస్తున్న అమరావతి మహాయజ్ఞంలో ఇట్లాంటి సమిధలు ఎన్నో ఆహుతి కావాలన్నది ఆయన అభిప్రాయం. వేసవి ఎండలకు తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతుంటే మంచి నీళ్లేం ఖర్మ, మజ్జిగే సరఫరా చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రిని ఒక విలేకరి, ‘అయ్యా మజ్జిగ అందడం లేదు జనానికి!’ అంటే నువ్వేం చేస్తున్నావు, నీకు సామాజిక బాధ్యత లేదా, నీ సంఘం తరఫున నువ్వెందుకు మజ్జిగ సరఫరా చెయ్యవు? అని గద్దించి కూర్చోబెట్టేస్తారు. ప్రజలు ఎన్నుకున్నది తమనే కానీ మీడియా వారిని కాదని ఆయనకు జ్ఞాపకం ఉండదు. ప్రశ్నించేవారేరి? మీడియా పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీడియా నోరు నొక్కెయ్యడానికి వారు ఎంత దూరమైనా వెళ్ళగలరు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక వ్యవస్థలతో పదే పదే అక్షింతలు వేయించుకున్నా వారి వైఖరి మారదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేసే కొన్ని చానళ్ల ప్రసారాలు నెలల తరబడి ఆగిపోతాయి. అనుకూల మీడియాకు అంతా హాయిగా గడిచిపోతుంది. దారికి రాని మీడియానూ, అందులో పనిచేసే వారినీ కట్టడి చెయ్యడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గం ఏమిటంటే, అది కొమ్మినేని శ్రీనివాసరావు వంటి పాత్రికేయులకు ఎదురయిన అనుభవమే. అప్పుడు యాజమాన్యాలు దారికొస్తాయి. అయినా దారికి రాని మీడియా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అనే ఒక బెదిరింపు అస్త్రం ఉండనే ఉంది. అదెలా సాధ్యం అని ప్రశ్నించే వాళ్లుండరు. ప్రశ్నిస్తే ప్రభువులకు కోపం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు మీడియా స్వేచ్ఛ పట్ల ఉండాల్సిన వైఖరి ఇదేనా అని ప్రశ్నించే వాళ్లు కరువయిపోతున్నారు. మీడియాను కట్టడి చేస్తే, దాని నోరు నొక్కితే నష్టపోయేది ప్రజలూ, ప్రజాస్వామ్యం. ఇదేదో ప్రైవేటు వ్యవహారం అనుకుంటే పొరపాటు. ఒక న్యూస్ చానల్లో ప్రసారం అయ్యే కార్యక్రమం తమ అడుగులకు మడుగులొత్తే విధంగా లేనందుకు ఆపించే ప్రయత్నం ప్రభుత్వం చేసినా ఆ చానల్ యాజమాన్యం అందుకు గంగిరెద్దులా తలూపి కూర్చోవడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. ఇందిరాగాంధీ వంటి ప్రసిద్ధ నాయకురాలిని ఎదిరించి నిలిచిన రామ్నాథ్ గోయెంకాను ఇటువంటి యాజమాన్యాలు ఆదర్శంగా తీసుకోలేక పోవచ్చు. కానీ, మరీ అడ్వానీ చెిఓప్పన నేల మీద పాకే జాతిలో చేరిపోవడం మాత్రం శోచనీయం. ప్రభుత్వాల ఈ మీడియా వ్యతిరేక వైఖరిని ఎదిరించి యాజమాన్యాలు నిటారుగా నిలబడనంత కాలం శ్రీనివాసరావు వంటి పాత్రికేయులు బలికాక తప్పదు. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ప్రజాస్వామ్యం ఎటుపోతోంది?
ఆంధప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ ధోరణులు సాగుతున్నాయా? అన్న ప్రశ్న ఇక్కడి వాతావరణాన్ని గమనించేవారి కందరికీ తలెత్తుతుంది. రాష్ట్రపతులు, గవర్నర్లు, స్పీకర్లు మొదలైనవారు పార్టీలకు అతీతంగా హుందాగా రాజ్యాంగ తదితర సంక్షోభాలు తలెత్తినప్పుడు తండ్రిలా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ, ఈ మధ్య కాలంలో పరిస్థితులు-రాజకీయాల్లో హుందాతనం కొరవడినట్లు సూచిస్తున్నాయి. స్పీకర్ నిష్పాక్షికంగా గాక, అధికార పక్షం ప్రతినిధిగా వ్యవహరిస్తుండటం దురదృష్టకరం. మన రాష్ట్ర విభజన విషయంలో కూడా అప్పటి లోక్సభ స్పీకర్ మీరాకుమార్ నిష్పాక్షికంగా కాక అప్పటి అధికార పక్షానికి దన్నుగా నిలబడి అపఖ్యాతి పాలయ్యారు. మరి లోక్సభలో ఆమెక్కూడా పెప్పర్ స్ప్రే ఘాటు తగిలింది. ఆంధ్రప్రదేశ్ స్పీకర్కి- రోజాకు మధ్య వివాదం దానితో పోలిస్తే తక్కువే గదా! మరి అలాంటప్పుడు ఇంత రాజీలేని ధోరణి, న్యాయస్థానాల ఉత్తర్వులను కూడా బేఖాతరు చేసే పరిస్థితి చూస్తుంటే న్యాయమూర్తులు అన్నట్లు ‘‘ఏపీలో అసలేం జరుగు తుంది? - సంథింగ్ రాంగ్, సంథింగ్ రాంగ్!!’’ ఎమ్మెల్యే రోజా ‘సారీ’ చెప్పాలని పట్టుబట్టే వారికి ఒక మౌలి కమైన విషయం అర్థం అవ్వాలి, కోర్టు మధ్యంతర ఉత్తర్వుల దృష్ట్యా ఆమెను సభలోకి అనుమతించి ఉన్నట్లయితే, ఆమె జరిగిన దానికి మర్యాద పూర్వకంగా ‘సారీ’ చెప్పి వుండేవారు కదా! మరికొందరు విపక్ష సభ్యులు వాడిన అన్ పార్లమెంటరీ భాష, హావభావాలను గురించి కూడా ఆమె మాట్లాడేవారు, మరి ప్రతిపక్ష నేతనుద్దేశించి ముఖ్యమంత్రి, అధికార పక్షం మంత్రులు, సభ్యులు ఉపయోగించిన పదజాలం కూడా అన్పార్లమెంటరీనే గదా! అంటే ఒకరికొకరు ‘సారీ’ చెప్పుకోవడం కంటే వీరంతా ప్రజలకు ‘సారీ’ చెప్పాల్సి ఉంటుంది. కొత్త చీర, ఓ పెద్ద కరెన్సీ నోటు కోసం రాత్రంతా ఎదురుచూసి ఓటును అమ్ముకునేవారున్నంత కాలం చట్టసభలు కూడా ఇలాంటి వారికి దర్పణంగా మాత్రమే ఉంటాయనటానికి మన ప్రస్తుత రాజకీయాలు నిదర్శనం. ‘వోట్ ఫర్ నోట్’తోపాటు, రాజకీయ బేరసారాల గురించి మనం ఎన్నికలు అయిపోయాక కూడా వింటున్నాం కదా. రాష్ట్రంలో ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుల్లాగా కొనేసుకుంటున్న వైనం చూసి జాతీయ నేతలు విస్తుపోతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని ఘోర పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నడుస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తరచుగా మన మెక్కడికి పోతున్నాం అంటుంటారు. ఆయన ఇదే ప్రశ్నను తనపై తాను వేసుకుంటే అందరికీ మంచిది. - డాక్టర్ టి. రామదాసు, సీనియర్ వైద్యులు మొబైల్: 7675958696 నీటి దిగుమతి తప్పదా? నేడు దేశంలో ఎటు చూసినా దాహపు కేకలే, కరవు నీడల్లో, అడుగంటిన నీటి జాడల్తో దేశంలో సింహభాగం అల్లాడుతోంది. అధికార గణాంకాల మేరకు తొమ్మిది రాష్ట్రాలు కరువుబారిన పడ్డాయి. తొంబై ఒక్క పెద్ద జలాశయాలలో నీరు అడుగంటింది. తొమ్మిది జీవనదులు ఒట్టిపోయాయి. లాతూర్ ప్రాంతానికి తాగునీటిని ప్రభుత్వం రైళ్ల ద్వారా పంపిణీ చేయాల్సిన దుర్గతి దాపురించింది. శక్తివంతమైన క్రికెట్ పోటీలు కూడా నీటి ఎద్దడి మేరకు వేరే ప్రాంతాలకు వలసపోవడం తప్పనిసరైంది. వీటన్నింటిని మించి భారతదేశంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో అడుగంటుతున్నాయి. తలసరి నీటి లభ్యత 1950లలో మనిషికి ఐదువేల క్యూబిక్ మీటర్లుండగా నేడది పదిహేను వందల క్యూబిక్ మీటర్లు. కనీస స్థాయి పదిహేడు వందల మేరకు లేకపోతే ఆ దేశాన్ని నీటి ఎద్దడి దేశంగా గుర్తిస్తారు. అధికారికంగా ఇక మన దేశం ప్రమాదంలో ఉన్నట్టే కనుక భారత సమాజం కళ్లు తెరవాల్సిన సమయం. వాస్తవాన్ని గుర్తెరిగి నష్ట నివారణకు నడుం బిగించాల్సిన సందర్భం. ఇప్పుడు దేశంలో ‘సుజల భారత్’ ఉద్యమం అవసరం. అందుకు ప్రధానమంత్రి నడుం బిగించి దేశ ప్రజలను నడిపిం చాల్సి ఉంది. విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడివెయ్యడం, ఉపరితల జలాలను వృథాపర్చడం నియంత్రించాలి. నీటి పొదుపు, నీటి నిల్వ నిర్వహణ శాస్త్రీయంగా, సమర్థవంతంగా జరగాలి. ఈ అల వాట్లను వ్యక్తి స్థాయి నుండి వ్యవస్థ స్థాయి వరకూ పాదుకొల్పాలి. ప్రభుత్వం, పౌర సమాజం, మీడియా, యంత్రాంగం, ప్రజానీకం చిత్తశుద్ధితో కదలాల్సిన అత్యవసర పరిస్థితి, ఉదాసీనత వహిస్తే నీరు కూడా దిగుమతి చేసుకోవాల్సిన దినుసుల లిస్టులో చేరడం ఖాయం. - డాక్టర్ డీవీజీ శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం అంబేడ్కరీయం భారతీయుల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, విశ్వ మేధావి డాక్టర్ బి.ఆర్ . అంబే డ్కర్ 125వ జయంత్యుత్సవం సందర్భంగా తెలుగు రక్షణ వేదిక కవితాంజలి సమర్పి స్తోంది. పొట్ల్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో ‘అంబేద్కరీయం’ పేరుతో ఆ మహనీ యుడిపై కవితా సంకలనం తీసుకురాదలి చాము. అంబేద్కర్ భావజాలం, ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలను ఆవిష్కరిస్తూ కవిత లను పంపవలసిందిగా కవులను ఆహ్వా నిస్తున్నాము. మీ కవితలు 12 నుంచి 27 పంక్తులకు మించరాదు. కవిత స్వంతమేనని హామీపత్రం జతచేసి పంపాలి. కవితలను telugupaluku@yahoo.com కి 1-5-2016 లోగా పంపగలరు. అందరికీ ఆహ్వానం. సంపాదకవర్గం: డాక్టర్ కత్తిమండ ప్రతాప్ (90003 43095), జాబిలి జయచంద్ర, అనిల్ డ్యాని, బొడ్డు మహేందర్ పొట్లూరి హరికృష్ణ జాతీయ అధ్యక్షులు, తెలుగు రక్షణ వేదిక -
ప్రజాస్వామ్య పరిరక్షణకు.. పోరుబాట
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగింది. ‘సేవ్ డెమోక్రసీ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి)’ అంటూ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులన్నీ శనివారం కాకినాడకు కదిలిరానున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును పరిహసించేలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఫిరాయింపునకు ప్రోత్సహిస్తున్న చంద్రబాబు తీరును ఎండగట్టనున్నాయి. చట్టాలు చేయాల్సిన ప్రభుత్వాధినేతే ఉన్న చట్టాలకు స్వయంగా తూట్లు పొడవడాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వెల్లడించారు. తొలుత కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్కు సమీపంలోని కోకిల సెంటర్లోనున్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నాయకులు నివాళి అర్పించనున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ కోకిల సెంటర్ నుంచి భానుగుడి జంక్షన్ వరకూ కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తామన్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా కమిటీల నాయకులు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు కూడా భారీ ఎత్తున పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. టీడీపీ నాయకులది భ్రమే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటపటిమలను మెచ్చే ప్రజలు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని కన్నబాబు అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. పది మంది ఎమ్మెల్యేలను లాక్కొన్నంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనమవుతుందని టీడీపీ నాయకులు భావిస్తున్నారని, వారిది కేవలం భ్రమ మాత్రమేనని అన్నారు. కానీ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ పొరుగు రాష్ట్రాల దృష్టిలో రాష్ట్రాన్ని చులకన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రకరకాలుగా ప్రలోభపెట్టి లాక్కొని తన బలంగా చూపించుకోవడానికి చంద్రబాబు పడుతున్న పాట్లు చూసి ఇతర రాష్ట్రాల నాయకులంతా నవ్వుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా నియోజకవర్గ అభివృద్ధి ముసుగులో పార్టీ ఫిరాయిస్తున్న నాయకులు కూడా ప్రజల్లో చులకనైపోయారని వ్యాఖ్యానించారు. ప్రజలంతా ప్రజాస్వామ్య పరిరక్షణకు సమష్టిగా పోరాడాలని కన్నబాబు పిలుపునిచ్చారు. -
మోదీజీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి: కేజ్రీవాల్
న్యూఢిల్లి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్రమోదీని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర హైకోర్టు రాష్ట్రపతి పాలనను కొట్టివేసిన విషయంలో కేజ్రీవాల్ స్పందించారు. ఎన్నికైన ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఇది మోదీ సర్కారుకు గుణపాఠంగా మారాలన్నారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కాగ్రెస్ నాయకుడు హరీష్ రావత్ ను ఈ నెల 26న మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా న్యాయస్థానం సూచించింది. ఉత్తరాఖండ్ లో మార్చి 27 ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనను విధించిన విషయం తెలిసిందే. -
సమతా విప్లవ దార్శనికుడు
కొత్త కోణం దేశ వనరులపై సమాజానికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వానికే హక్కులుండాలన్న అంబేడ్కర్కు పెట్టుబడిదారీ విధానంపై సైద్ధాంతిక స్పష్టత ఉన్నది. ప్రజలకు బ్రాహ్మణవాదం, పెట్టుబడిదారీ విధానం ఉమ్మడి శత్రువులనీ, రెండూ అసమానతలను పెంచి, పరిర క్షించేవేనని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడిదారీ విధానాన్ని కుల వ్యవస్థ మరింత క్రూరంగా అమలు చేస్తుందన్నారు. అదే నేడు రుజువైంది. నేటి బ్రాహ్మణవాదం కుల వ్యవస్థ, పెట్టుబడిదారీ విధానం కలగలిసిన ఆర్థిక ఆధిపత్య భావజాలం. ‘‘ప్రజాస్వామ్యం ఒక మనిషి-ఒక విలువ అన్న సూత్రానికి అనుగుణంగా నిలవాలంటే ఆర్థిక రంగాన్ని కూడా అలాగే నిర్వచించుకోవాలి. అనువైన వ్యవస్థను నిర్మించుకోవాలి. ప్రజాస్వామ్యం నిజమవ్వాలంటే ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని రాజ్యాంగంలో చేర్చుకోవాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కొనసాగించడం, నియంతృత్వాన్ని తిరస్కరించడం, సామ్యవాదాన్ని స్థాపిం చడం దీనికి పరిష్కారం’’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ తన ఆర్థిక విధా నాన్ని ప్రకటించారు. రాజకీయ ప్రజాస్వామ్యంతోనే సమానత్వం సాధ్యం కాదని, ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను తొలగించాలని అంబేడ్కర్ చాలా సార్లు వివరించారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే ‘రాష్ట్రాలు-మైనారిటీలు’ (స్టేట్స్ అండ్ మైనారిటీస్) అనే డాక్యుమెంట్లో కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే ఇందులో ఉన్న చాలా అంశాలు భారత రాజ్యాంగంలో పొందుపరచడానికి వీలుకానివి. అటువంటి అంశాల్లో ముఖ్యమైనవి స్టేట్ సోషలిజం. పరిశ్ర మలు, సేవారంగం, ఆర్థిక సంస్కరణలు. భూమితో పాటూ ఇతర వనరుల న్నిటినీ ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించి, అదే వాటిని నిర్వహించాలనీ అప్పుడే ప్రజల మధ్య అంతరాల తొలగింపు సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనినే ‘అంబేడ్కర్ స్టేట్ సోషలిజం’గా పిలుస్తారు. అంబేడ్కర్ స్టేట్ సోషలిజం ఈ డాక్యుమెంటులోని నాలుగవ భాగంలో ఆర్థిక దోపిడీ నుంచి రక్షణలకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. అవి: 1. ప్రధాన పరిశ్రమలను నిర్వచించి, వాటినన్నిటినీ ప్రభుత్వ యాజమాన్యంలోనే నడపాలి. 2. మౌలిక పరిశ్రమలను ప్రభుత్వాలు లేదా అవి ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు మాత్రమే నిర్వహించాలి. 3. బీమారంగాన్ని ప్రభుత్వాల ఆధీనంలోనే ఉంచి, వయోజనులంతా వారి సంపాదనకు సరిపోయేంతటి బీమా చేసేలా చట్టా లను రూపొందించాలి. 4. వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చాలి. అది ప్రభుత్వ హయాంలోనే కొనసాగాలి. అందుకుగాను భూమిని జాతీయం చేయాలి. ఇంతవరకు యజమానులుగా, కౌలుదార్లుగా, తన భూమిపైన హక్కులు అనుభవిస్తున్న ప్రైవేటు వ్యక్తులకు డిబెంచర్ల రూపంలో వారి హక్కులకు సరిపడా నష్టపరిహారం చెల్లించాలి. సమాజంలోని వనరులపైన సమాజానికి ప్రాతినిధ్యం వహించే ప్రభు త్వాలే హక్కులను కలిగి ఉండాలని అంబేడ్కర్ ప్రతిపాదించారు. వీటిని రాజ్యాంగంలో చేర్చడానికి నాటి రాజ్యాంగ సభ నాయకత్వం అంగీకరించ లేదు. అంబేడ్కర్ చెప్పినట్టుగా పరిశ్రమలు, బ్యాంకులు, బీమా సంస్థలను కొంతకాలం ప్రభుత్వాలు నడిపాయి. కాలక్రమేణా అవి కూడా ప్రైవేటుపరం అవుతున్నాయి. భూమికి సంబంధించిన ఆయన ఆలోచనలు ఏ ప్రభుత్వా లకూ పట్టలేదు. భూసంస్కరణల కోసం దున్నేవానికే భూమి నినాదాన్ని ఇచ్చిన కమ్యూనిస్టులు భూమి జాతీయీకరణను పట్టించుకోలేదు. పైగా దున్నేవానికే భూమి విధానం వల్ల అప్పటి వరకు జాగీర్దారులు, జమీందా రులు, భూస్వాముల చేతుల్లో ఉన్న భూమి కౌలుదారులుగా, వ్యవసాయదా రులుగా ఉన్న ఆధిపత్య కులాల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. అంబేడ్కర్ కోరినట్లు భూమిని జాతీయం చేసి సమష్టి వ్యవసాయ విధానాన్ని కొనసాగించి ఉంటే... ప్రజల మధ్య అంతరాలు ఇంతగా పెరిగి ఉండేవి కాదనేది వాస్తవం. జాగీర్దారీ, జమీందారీ భూములపై యాజమాన్యం సాధించిన పై కులాలకు నీటి పారు దల సౌకర్యాలు, సబ్సిడీ ఎరువులు, పురుగు మందులు, బ్యాంకు రుణాలు అందుబాటులోకి రావడంతో సస్యవిప్లవం ద్వారా వారు సంపన్నులయ్యారు. ఆ సంపన్నులే క్రమంగా వ్యాపారాలు, సినిమాలు, కాంట్రాక్టులు తదితర రంగాల్లోకి విస్తరించి, రాజకీయ రంగాన్ని స్వాధీనం చేసుకొన్నారు. సామా జిక వ్యవస్థలో ఆధిపత్యంలో ఉన్న కులాలే ఆర్థిక రంగాన్ని సైతం ఆక్రమించి, రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయా రాష్ట్రాల్లోని ఆధిపత్య కులాలే అధికారాన్ని చలాయిస్తున్నాయి. జాతీయీకరణే ఆర్థిక ప్రజాస్వామ్యానికి మార్గం ఈ పరిణామాలను ఊహించే అంబేడ్కర్ మౌలిక పరిశ్రమలు, కీలక ఆర్థిక సంస్థలతో పాటు భూమిని జాతీయం చేయాలన్నారు. దానికి అనుగుణంగానే ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించారు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ - 38ని ఆదేశిక సూత్రాలలో చేర్చడాన్ని ఆర్థిక ప్రజాస్వామ్య సాధనా కృషిలో భాగంగానే చూడాలి. 38వ ఆర్టికల్ క్లాజు-2లో పేర్కొన్నట్టు, ప్రజల ఆదా యాలలో ఉన్న అసమానతలను తొలగించానికీ, హోదాలు, సౌకర్యాలు, అవకాశాలలో ఉన్న అంతరాలను నిర్మూలించడానికీ రాజ్యం కృషి చేయా లనేది అంబేడ్కర్ లక్ష్యం. ‘‘మన లక్ష్యమైన ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తిగా కలిగిన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు చాలా విలువైనవని నా అభిప్రా యం. ఎందుకంటే, కేవలం పార్లమెంటరీ తరహా పాలన వల్ల మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేం. ఆర్థిక రంగంలో సమానత్వం కోసమే రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచాం’’ అన్న మాటలు అంబేడ్కర్ ఆర్థిక విధానానికి అద్దం పడతాయి. ‘‘స్టేట్ సోషలిజం భారత దేశపు సత్వర పారిశ్రామిక అభివృద్ధికి అత్య వసరం. ప్రైవేట్ వ్యాపార వర్గానికి అంతటి సామర్థ్యం లేదు. ఒకవేళ ప్రైవేట్ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చినా దానివల్ల సంపదలో అసమానతలు పెరిగిపో తాయి. యూరప్లో ప్రైవేట్ పెట్టుబడులు సృష్టించిన అసమానతలు భారతీ యులకు గుణపాఠం కావాలి’’ అంటూ ఆనాడే అంబేడ్కర్ హెచ్చరించారు. ప్రైవేట్ రంగం ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమలను, భూములను తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయో ఆనాడే సోదాహరణంగా వివరించారు. అవి ఈ రోజు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ’’ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనే ఆరాటం, సరిపడని జీతం, పరిమితిలేని పని గంటలు, కార్మిక సంఘాల్లో చేరే హక్కు మీద ఆంక్షలూ, కార్మిక కూలీ వర్గం భావప్రకటనా స్వేచ్ఛ, సంఘాన్ని ఏర్పర్చుకునే హక్కు, మత స్వేచ్ఛ వంటి వాటిపై దాడులూ జరుగుతుంటే మనుషులు ఏమైపోతారు’’ అన్న మాటలు నేటి ఉదారవాద ఆర్థిక విధానాలకు సరిగ్గా సరిపోతాయి. ప్రైవేటైజేషన్పై నాటి అంబేడ్కర్ అభిప్రాయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నేడు దేశంలో అమలులో ఉన్న పారిశ్రామిక విధానం, ప్రత్యేకించి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు తర్వాత కార్మికవర్గంలో అభద్రత నెలకొంది. స్టేట్ సోషలిజం వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేది కాదని, నిజానికి అది వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తుందనీ, ఇతరుల చేతుల్లో దోపిడీకి గురికావడం నుంచి కాపాడుతుందనీ ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారీ దోపిడీని బలోపేతం చేసే కులం పెట్టుబడిదారీ విధానంపై అంబేడ్కర్కు సైద్ధాంతిక స్పష్టత ఉన్నది. భారత ప్రజలకు బ్రాహ్మణవాదం, పెట్టుబడిదారీ విధానం రెండూ ఉమ్మడి శత్రువులనీ, రెండింటిలో ఉన్న సామ్యం అసమానతలను పెంచి, పరిర క్షించడమని ఆయన స్పష్టం చేశారు. కుల వ్యవస్థ పెట్టుబడిదారీ విధానాన్ని మరింత క్రూరంగా, అవమానంగా అమలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. అదే నేడు రుజువైంది. నేటి బ్రాహ్మణవాదం కుల వ్యవస్థ, పెట్టుబడిదారీ విధానం కలగ లిసిన ఆర్థిక ఆధిపత్య భావజాలం. ఇటీవల కొందరు దళిత పెట్టుబడి దారులనే వాదనను ముందుకు తెస్తూ, దాన్ని అంబేడ్కర్ సిద్ధాంతంగా ప్రచారం చేసుకుంటున్నారు. దళితుల ఆర్థిక సాధికారత అంటే గుప్పెడు మంది పురోగతి కాదు. ఇక ప్రపంచీకరణ వల్ల దళితులు అభివృద్ధి చెందు తారనే మాయావాదం పూర్తి సైద్ధాంతిక దౌర్భాగ్యం. ఒకరో, ఇద్దరో దళితులు పారిశ్రామికవేత్తలు కావచ్చునేమో... అంతమాత్రాన దానినే సార్వత్రిక సత్యంగా ప్రచారం చేయడం అంబేడ్కర్ పేరును తమ స్వార్థానికి వాడు కోవడం మాత్రమే. దేశంలోని కొన్ని కులాలు మాత్రమే పెట్టుబడిదారీ రంగం లోకి, పారిశ్రామిక వాణిజ్య వ్యవస్థలలోకి ప్రవేశిస్తున్నాయి. అసమానతకు పునాదిగా ఉన్న కుల వ్యవస్థకు పరిష్కారంగా అంబేడ్కర్ స్వేచ్ఛ, సమా నత్వం, సోదరత్వం లక్ష్యాలను ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వం లాంటి విషయాలపట్ల అంతర్జాతీయంగా ఒకే రకమైన భావన ఉంటుంది. అయితే మన దేశంలో సోదరత్వంతో పాటూ ఈ రెండూ ప్రత్యేక స్వభావంగలవే. అంబేడ్కర్ మాటల్లో చెప్పాలంటే, సోదరత్వానికి మరోపేరు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యమంటే కేవలం ఒక పరిపాలనా విధానం, రాజకీయ వ్యవస్థ మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం ప్రజల జీవితంలో భాగంగా ఉండాలి. అంతా సమానులేననే భావన అందరికీ ఉండాలి. అందుకే అంబేడ్కర్ సోదరత్వ సాధనకు కుల నిర్మూలనను ప్రతిపాదించారు. సోషలిజాన్ని, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సవివరంగా విశ్లేషించి, సకల రంగాల్లో ప్రజాస్వామ్యం నెలకొనాలని ఆశించిన అంబేడ్కర్ని సంఘసంస్కర్తగానో, పెట్టీ బూర్జువా గానో భావించడంలో అర్థం లేదు. ఆయన సమసమాజాన్ని స్వప్నించిన నిజమైన విప్లవకారుడు. నేడు బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213