తండాల స్థాయి నుంచి కార్యాచరణ | Deepadas Munshi honored at Adivasi Congress meeting: Telangana | Sakshi
Sakshi News home page

తండాల స్థాయి నుంచి కార్యాచరణ

Mar 24 2024 2:44 AM | Updated on Mar 24 2024 2:44 AM

Deepadas Munshi honored at Adivasi Congress meeting: Telangana - Sakshi

ఆదివాసీ కాంగ్రెస్‌ సమావేశంలో మున్షీని సన్మానిస్తున్న  బెల్లయ్యనాయక్‌ తదితరులు  

పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించండి 

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయం కోసం గిరిజన నేతలు కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ కోరారు. తండాల స్థాయి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. గాందీభవన్‌లో శనివారం జరిగిన ఆదివాసీ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

లోక్‌సభ అభ్యర్థులతో గిరిజన విభాగం సమ న్వయం చేసుకోవాలని, ప్రతి అసెంబ్లీ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, పార్ల మెంట్‌ నియోజక వర్గాల వారీగా భారీ సభలను గిరిజనులతో ఏర్పాటు చేయాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీని ప్రధాని చేయడంలో గిరిజనులు ప్రధాన భూమిక పోషించాలన్నారు. ఆదివాసీ కాంగ్రెస్‌ రాష్ట్ర చైర్మన్‌ బెల్ల య్యనాయక్‌ మాట్లాడుతూ...అసెంబ్లీ ఎన్నికల్లో  పనిచేసిన విధంగానే రాష్ట్రంలో 13–14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ రఘు నాయక్, కోఆర్డినేటర్లు గణేశ్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement