మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్‌ | Gummanur Jayaram Birthruff From The Cabinet | Sakshi
Sakshi News home page

మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్‌

Published Tue, Mar 5 2024 7:30 PM | Last Updated on Wed, Mar 6 2024 8:00 AM

Gummanur Jayaram Birthruff From The Cabinet - Sakshi

పార్టీ ఫిరాయించిన మంత్రి గుమ్మనూరి జయరాంను రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ బర్తరఫ్‌ చేశారు.

సాక్షి, తాడేపల్లి: పార్టీ ఫిరాయించిన మంత్రి గుమ్మనూరి జయరాంను రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ బర్తరఫ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారాయన. ఇదిలా ఉంటే.. తన మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే  గుమ్మనూరు తాజాగా టీడీపీలో చేరడం గమనార్హం. 

మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం చేరికపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. గుంతకల్లు టీడీపీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.గుమ్మనూరు జయరాం అవినీతి పరుడంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  ముఖ్యంగా గుమ్మనూరు చేరికను మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

జయరాం ఇచ్చే డబ్బు కు ఆశ పడి చంద్రబాబు ఆయన్ని టీడీపీలో చేర్చుకోవడం దౌర్భాగ్యమని, రాబోయే ఎన్నికల్లో గుమ్మనూరుకు సహకరించేది లేదంటూ గుంతకల్లు టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ప్చ్‌.. ఊరేదైనా మారని తీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement