
విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన జీవీఎంసీ స్వతంత్ర కార్పొరేటర్లు
ఇటీవల జరిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో స్వతంత్రులుగా గెలుపొందిన ముగ్గురు కార్పొరేటర్లు శుక్రవారం తిమ్మాపురంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : ఇటీవల జరిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో స్వతంత్రులుగా గెలుపొందిన ముగ్గురు కార్పొరేటర్లు శుక్రవారం తిమ్మాపురంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 32,35,39 వ వార్డు కార్పొరేటర్లు కందుల నాగరాజు, విల్లూరి భాస్కరరావు, మహ్మద్ సాదిక్తో పాటు మాజీ కార్పొరేటర్, జనసేన నాయకుడు మువ్వల పోలారావు, టీడీపీ నేత సూరిశెట్టి లక్ష్మణ్ చేరారు.
చదవండి: కోవిడ్ నియంత్రణకు ఎన్ఆర్ఐ డాక్టర్ భారీ విరాళం
వందశాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస