మహిళా ఉద్యోగిపై ఏపీఎం వేధింపులు | - | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగిపై ఏపీఎం వేధింపులు

Published Tue, Mar 4 2025 12:41 AM | Last Updated on Tue, Mar 4 2025 12:41 AM

-

● పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు

పెద్దదోర్నాల: మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడిన ఏపీఎంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాల ప్రకారం.. మండలంలోని వెలుగు కార్యాలయంలో రైతు ఉత్పత్తిదారుల సంఘంలోని విభాగంలో అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళ పట్ల ఏపీఎం దర్శనం పోలయ్య అసభ్యంగా ప్రవర్తించాడు. కొద్ది రోజుల నుంచి వేధింపులకు గురిచేస్తున్నాడు. దానికితోడు జీతం ఇవ్వాలంటే రూ.5 వేలు లంచం కావాలని కూడా డిమాండ్‌ చేశాడు. దీంతో బాధిత మహిళ స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై మహేష్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement