తల్లి మందలించిందని.. విద్యార్థిని తీవ్ర నిర్ణయం! | - | Sakshi
Sakshi News home page

తల్లి మందలించిందని.. విద్యార్థిని తీవ్ర నిర్ణయం!

Published Mon, Oct 9 2023 4:56 AM | Last Updated on Mon, Oct 9 2023 11:14 AM

- - Sakshi

సంగారెడ్డి: తల్లి మందలించిందని బీ పారసీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మండల పరిధిలోని రామునిపట్లలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కల్లెం సుజాత రెండో కుమార్తె అమల (18) కొండపాక మండలం దుద్దెడలోని కళాశాలలో బీ పార్మసీ చదువుతోంది. గత 5న ఆమె హాస్పిటల్‌కు వెళుతున్నానని చెప్పి తిరిగి ఆలస్యంగా ఇంటికి రావడంతో తల్లి మందలించింది.

దీంతో మనస్తాపం చెందిన అమల తల్లి పనిచేసే హోటల్‌ వద్దకు వెళ్లి సమీపంలోని పొలం వద్ద ఉన్న పురుగుల మందు తాగింది. వాంతులు చేసుకోవడంతో గమనించిన తల్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో అమలను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆమె మేనమామ రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినకట్టు ఎస్‌ఐ సుభాష్‌ గౌడ్‌ తెలిపారు.

ముఖ్య గమనిక:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement