వడ్ల కొనుగోళ్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం | Sakshi
Sakshi News home page

వడ్ల కొనుగోళ్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం

Published Sat, May 25 2024 5:40 PM

వడ్ల

నారాయణఖేడ్‌: వడ్ల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయడంపై ఖేడ్‌ ఆర్డీఓ అశోక చక్రవర్తి ఐకేపీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ దినపత్రికలో ఈనెల 24న ‘పక్షం రోజులుగా పడిగాపులు’ శీర్షిక ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. మండలంలోని తుర్కాపల్లి, ర్యాకల్‌, నిజాంపేట్‌ మండలంలోని రాంరెడ్డిపేట్‌లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. తుర్కాపల్లిలో 5 లారీల వరకు లోడ్‌ అయ్యే ధాన్యం పక్షం రోజులుగా ఎందుకు నిల్వ ఉందని ప్రశ్నించారు. తూకం వేయడంలో జాప్యమెందుకు జరుగుతుందని నిలదీశారు. లారీలు తెప్పించి రెండు రోజుల్లో ధాన్యం మిల్లుకు తరలించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద టెంటు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంపై మండి పడ్డారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ తహపీల్దార్‌ అనుదీప్‌, ఐకేపీ ఏపీఎం టీక్యానాయక్‌, డీటీసీఎస్‌ మహేష్‌, సీసీ అశోక్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

‘సాక్షి’ కథనానికి స్పందన

ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాలు

తనిఖీ చేసిన ఆర్డీఓ

వడ్ల కొనుగోళ్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం
1/1

వడ్ల కొనుగోళ్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం

Advertisement
 
Advertisement
 
Advertisement