![చట్టాలపై అవగాహన అవసరం](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/25/24jgp01-350127_mr.jpg.webp?itok=QdtfCrXS)
జోగిపేట(అందోల్): మహిళలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా సమన్వయకర్త పల్లవి సూచించారు. శుక్రవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అందోల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పల్లవి పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల అనేక రకాలుగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మెప్మా అధికారి బిక్షపతి, టీఎంసీ అండ్ జెండర్ స్పెషలిస్ట్ విశాల, డీఎల్ఎఫ్ సభ్యులు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.