● ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ
● పలు కేసుల్లో అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ
దుబ్బాక: భూంపల్లి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వి.రవికాంత్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం మల్టీజోన్ –1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మెదక్ జిల్లాలోని శివ్వంపేట ఎస్ఐగా పనిచేసిన రవికాంత్ సిగిల్లాపూర్ మామిడి తోటలో జరిగిన దొంగతనం కేసులో, అలాగే పలు భూతగాదా కేసుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు మెదక్ జిల్లా ఎస్పీ విచారణ చేయగా నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేస్తూ ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా 4 నెలల క్రితమే శివ్వంపేట నుంచి బదిలీపై భూంపల్లి ఎస్ఐగా వచ్చారు. ఇక్కడా ఆయన పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.