IPL 2024 GT VS RCB: విజృంభించిన సాయి సుదర్శన్‌, షారుక్‌ ఖాన్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024 GT VS RCB: విజృంభించిన సాయి సుదర్శన్‌, షారుక్‌ ఖాన్‌

Published Sun, Apr 28 2024 5:32 PM

​​​ IPL 2024: Gujarat Titans Set 201 Runs Target For RCB

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్‌ 28) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌.. సాయి సుదర్శన్‌ (49 బంతుల్లో 84 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్‌ ఖాన్‌ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 

గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో వృద్దిమాన్‌ సాహా (5), శుభ్‌మన్‌ గిల్‌ (16) నిరాశపర్చగా.. డేవిడ్‌ మిల్లర్‌ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌, స్వప్నిల్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

గుజరాత్‌ ఇన్నింగ్స్‌ విశేషాలు..

  • 7.4 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసిన గుజరాత్‌ చివరి 12.2 ఓవర్లలో ఏకంగా 151 పరుగులు చేసింది.

  • ఈ సీజన్‌లో సాయి సుదర్శన్‌ 400 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

  • షారుక్‌ ఖాన్‌ తన తొలి ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈ మైలురాయిని షారుక్‌ కేవలం 24 బంతుల్లోనే సాధించాడు.
     

Advertisement
Advertisement