Shah Rukh Khan
-
ఐపీఎల్ ప్రారంభ వేడుక.. కింగ్ ఖాన్తో స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ
వేసవి క్రీడా సంబురం ఐపీఎస్ సందడి అట్టహాసంగా ప్రారంభమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ ఏడాది మెగా సీజన్ మొదలైంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ప్రారంభ వేడుకల్లో పలువురు సినీతారలు కూడా సందడి చేశారు. ముఖ్యంగా కేకేఆర్ యజమాని షారూఖ్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఈవెంట్లో బాలీవుడ్ భామ దిశాపటానీ తన డ్యాన్స్తో అభిమానులను మెప్పించింది.అయితే ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్ క్రికెటర్లను కాసేపు నటులుగా మార్చేశారు. తనతో పాటు విరాట్ కోహ్లీ, రింకూ సింగ్ను డ్యాన్స్ చేయించారు. పఠాన్ మూవీలోని ఓ సాంగ్కు కింగ్ కోహ్లీ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఐపీఎల్ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అంతేకాకుండా ఈ వేడుకలో ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ తన పాటలతో అభిమానులను అలరించారు. పుష్ప-2 సాంగ్ పాడి ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం షారూక్ ఖాన్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్లో నటించడం లేదు. చివరిసారిగా జవాన్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. King Khan 🤝 King Kohli When two kings meet, the stage is bound to be set on fire 😍#TATAIPL 2025 opening ceremony graced with Bollywood and Cricket Royalty 🔥#KKRvRCB | @iamsrk | @imVkohli pic.twitter.com/9rQqWhlrmM— IndianPremierLeague (@IPL) March 22, 2025 -
IPL 2025: తారలు దిగొచ్చిన వేళ.. అంగరంగ వైభవంగా.. అట్టహాసంగా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 ఆరంభ వేడుకలు అట్టహాసంగా సాగాయి. కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఆట, పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.Photo Courtesy: BCCI/IPLడిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) జట్టు సహ యజమాని, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మైదానంలో సందడి చేశౠడు. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సారథి రజత్ పాటిదార్లతో కాసేపు ముచ్చటించాడు.Photo Courtesy: BCCI/IPLఅనంతరం వేదికపైకి వచ్చి తనదైన శైలిలో ప్రసంగించాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన క్రికెట్ లీగ్గా వెలుగొందుతున్న ఐపీఎల్లో భాగం కావడం సంతోషంగా ఉందని షారుఖ్ హర్షం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ తన గాత్రంతో ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. హిందీ పాటలతో పాటు పుష్ప-2 సినిమాలోని పాపులర్ సాంగ్ ..‘‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’’.. తెలుగులో పాడటం విశేషం.ఆ తర్వాత స్టార్ హీరోయిన్ దిశా పటానీ హుషారైన స్టెప్పులతో అభిమానులను ఉర్రూతలూగించింది.ఆ తర్వాత టీమిండియా, ఆర్సీబీ సూపర్స్టార్ విరాట్ కోహ్లిని షారుఖ్ స్టేజీ మీదకు ఆహ్వానించాడు. కోహ్లితో ముచ్చటించిన అనంతరం.. కేకేఆర్ యువ తార రింకూ సింగ్ను కూడా వేదిక మీదకు పిలిచాడు. ముగ్గురూ కలిసి కాసేపు స్టెప్పులు వేశారు. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీతో పాటు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్లను వేదిక మీదకు ఆహ్వానించగా... ఐపీఎల్-18 కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.Photo Courtesy: BCCI/IPL -
సగం బాలీవుడ్ 'ఐపీఎల్' కోసం.. ఒక్క రాత్రి ఖర్చు ఎంతంటే?
మన దేశంలో జనాలు ఏది ఎక్కువ ఇష్టపడతారో అంటే టక్కున చెప్పే మాట సినిమాలు, క్రికెట్. మరీ ముఖ్యంగా ఐపీఎల్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ సెలబ్రిటీల ఆటపాట ఉండాల్సిందే. స్టార్ హీరోహీరోయిన్లు వస్తారు, తమదైన డ్యాన్సులతో ఫుల్లుగా ఎంటర్ టైన్ చేస్తారు. మిగతా సీజన్ల మాటేమో గానీ ఈ సీజన్ (IPL 2025) ప్రారంభోత్సవానికి సగం బాలీవుడ్ వచ్చే ప్లాన్ చేశారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)ప్రతి సీజన్ లోనూ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో 2-3 గంటల ప్రోగ్రామ్ ఉంటుంది. ఈసారి తొలి మ్యాచ్ కోల్ కతా vs బెంగళూరు (KKR vs RCB) మధ్య జరగనుంది. కోల్ కతా జట్టు ఓనర్ షారుక్ ఎలానూ ఉంటాడు. మరోవైపు సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, సంజయ్ దత్, వరుణ్ ధావన్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.హీరోయిన్లలో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, 'యానిమల్' తృప్తి, శ్రద్దా కపూర్, తమన్నా, ఊర్వశి రౌతేలా, కరీనా కపూర్, పూజా హెగ్డే.. ఇలా లిస్ట్ చాలా పెద్దగానే ఉన్నట్లు సమాచారం. వీళ్లతో పాటు స్టార్ సింగర్స్ అర్జిత్ సింగ్, శ్రేయా ఘెషల్, అమెరికన్ పాప్ బ్యాండ్ వన్ రిపబ్లిక్ కూడా ఫెర్ఫార్మ్ చేయనుంది.అయితే వీళ్లేం ఊరికే రారుగా. ఐపీఎల్ మేనేజ్ మెంట్ లేదా ఆయా ఫ్రాంఛెజీలు కోట్ల రూపాయల పారితోషికం చెల్లిస్తాయట. మొత్తంగా రెండు మూడు గంటల పాటు జరిగే ప్రోగ్రామ్ కోసం రూ.40-50 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారని టాక్. వీటిలో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?) -
బిగ్ డీల్ ప్లాన్తో సుకుమార్.. విలన్గా షారుక్ఖాన్
అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదుచేసింది. ఈ మూవీ తర్వాత సుకుమార్కు బాలీవుడ్లో క్రేజ్ పెరిగింది. దీంతో ఆయన తర్వాత డైరెక్ట్ చేయబోయే సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో సుకుమార్ గురించి బాలీవుడ్ నుంచి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. పుష్ప2 విజయం తర్వాత రామ్చరణ్తో (Ram Charan) చేయనున్న సినిమా కోసం స్క్రిప్ట్ పనిలో సుకుమార్ బిజీగా ఉన్నారనే విషయం తెలిసిందే.. అయితే, సుకుమార్- షారుక్ఖాన్(Shah Rukh Khan) కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఈమేరకు షారుక్ టీమ్తో చర్చలు కూడా జరిగిపోయాయని తెలుస్తోంది. రాజకీయం నేపథ్యం ఉన్న ఒక గ్రామీణ కథను షారుక్ఖాన్కు సుక్కు వినిపించారట.. అది ఆయనకు కూడా బాగా నచ్చేసిందని టాక్. కానీ, ఈ కథలో షారుక్ వ్యతిరేక (విలన్) పాత్రలో కనిపిస్తారని బాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి.'పుష్ప 1, 2'లకు సీక్వెల్గా పార్ట్ -3 ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆపై చరణ్ ప్రాజెక్ట్ కూడా సుకుమార్ చేతిలో ఉంది. మరి షారుక్ఖాన్ కూడా రీసెంట్గా తన సొంత బ్యానర్ నుంచి ఒక సినిమాను ప్రకటించారు. ఇలా ఇద్దరూ ఫుల్ బిజీగా తమ వర్క్లో ఉన్నారు. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే, వారిద్దరి నుంచి కూడా ఈ వార్త గురించి ఎలాంటి రియాక్షన్ రాలేదు. -
పఠాన్ కాంబినేషన్ రిపీట్..! షారుఖ్ వర్సెస్ అభిషేక్
-
KKR SWOT: అతడిపై భారం!.. బలాలు, బలహీనతలు ఇవే
గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) విజేతగా నిలిచింది కోల్కతా నైట్ రైడర్స్(KKR). తద్వారా మూడోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఇక ఈసారి లీగ్ ఆరంభ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర(RCB)తో కేకేఆర్ తలపడనుంది. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో మార్చి 22న ఈ మ్యాచ్ జరుగనుంది.అయితే, గత సంవత్సరం జట్టుని ముందుండి నడిపించిన శ్రేయస్ అయ్యర్ ఈసారి తప్పుకోవడంతో అతని స్థానంలో అనుభవజ్ఞుడైన అజింక్య రహానే బాధ్యతలు స్వీకరించాడు. దీనితో నైట్ రైడర్స్ కొత్త తరహా జట్టుతో ఈ సారి రంగ ప్రవేశం చేయబోతోంది. నైట్ రైడర్స్పై ఒత్తిడి ఈ నేపథ్యంలో మళ్ళీ టైటిల్ నిలబెట్టుకోవాలన్న ఆశాభావంతో ఉన్న నైట్ రైడర్స్పై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. మూడుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు బ్యాటింగ్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ను రూ.23.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీ అతనికి వైస్ కెప్టెన్గా అదనపు బాధ్యతను కూడా అప్పగించింది.ఇక బంగ్లాదేశ్లో ఫాస్ట్ బౌలింగ్ విప్లవానికి బీజాలు నాటడంలో విజయం సాధించిన వెస్టిండీస్ మాజీ పేసర్ ఒట్టిస్ గిబ్సన్ను నైట్ రైడర్స్ ఇటీవల తమ బౌలింగ్ కోచ్గా నియమించింది. అతడు రావడం ప్లస్ పాయింట్తాజాగా దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ అన్రిచ్ నోర్జే జట్టులో చేరుతున్నట్టు జట్టు అధినేత, నటుడు షారుఖ్ ఖాన్ రెండ్రోజుల క్రితం ప్రకటించాడు. 2025 వేలంలో నైట్ రైడర్స్ రూ. 6.50 కోట్లకు నోర్జేను తిరిగి కొనుగోలు చేసింది.ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్రాంచైజీలోకి వచ్చిన నోర్జే అనుభవం, అపార వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉంది. ఇంకా జట్టులో సునీల్ నరైన్, ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ విజయంలో కీలక భూమిక వహించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వంటి సీనియర్లు ఉన్నారు. వీరితో పాటు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, ఉమ్రాన్ మాలిక్ వంటి వర్ధమాన బౌలర్లతో బలీయంగానే కనిపిస్తోంది. రహానేకు కెప్టెన్గా బాధ్యతలు.. గొ ప్ప రికార్డు లేదుఐపీఎల్లో కెప్టెన్గా అత్యుత్తమ రికార్డులు లేనందున రహానేపై పెద్ద భారమే కనిపిస్తోంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కు 24 మ్యాచ్లలో నాయకత్వం వహించిన రహానే వాటిలో తొమ్మిది మ్యాచ్లలో మాత్రమే విజయాన్ని రుచిచూశాడు. 15 మ్యాచ్లలో ఓడిపోయాడు. ఐపీఎల్లో కెప్టెన్గా రహానే రికార్డు ఏ విధంగానూ ఆశాజనకంగా లేదు.ఇక వ్యక్తిగతంగా చూస్తే రహానే 25 మ్యాచ్ల్లో ఆడి 25.34 సగటుతో 583 పరుగులు మాత్రమే చేశాడు. అతను హైదరాబాద్ వేదికపై 2019లో సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో తన అత్యధిక స్కోరు 70 ని నమోదు చేసుకున్నాడు. కానీ రహానెకి నైట్ రైడర్స్ కొత్త ఫ్రాంచైజీ ఏమీ కాదు. 2022లో నైట్ రైడర్స్ కి ప్రాతినిధ్యం వహించిన రహానే ఏడు మ్యాచ్ల్లో 103.90 స్ట్రైక్ రేట్తో 133 పరుగులు చేశాడు. కాబట్టి గొప్ప రికార్డులేమీ లేని కెప్టెన్ ఉండటం ఒక బలహీనతగా పరిణమించింది అనడంలో సందేహం లేదు.వేలంలో నైట్ రైడర్స్ ఎలా రాణించింది?వేలానికి ముందు వెంకటేష్ అయ్యర్ను విడుదల చేసిన తర్వాత, నైట్ రైడర్స్ అతన్ని అధిక ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్లో అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకరైన ఇంగ్లాండ్కు చెందిన ఫిల్ సాల్ట్ను తిరిగి కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నించింది. సాల్ట్ లేకపోయినా, నైట్ రైడర్స్ వద్ద క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్ల రూపంలో ఇద్దరు మంచి వికెట్టుకీపర్లు ఉన్నారు. సన్రైజర్స్ జట్టు నుంచి తప్పుకున్న తర్వాత తన కెరీర్ను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఉమ్రాన్ మాలిక్ను కూడా నైట్ రైడర్స్ కనుగోలుచేసింది.ఐపీఎల్ 2025 వేలంలో కొన్న ఆటగాళ్లు:వెంకటేష్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 2 కోట్లు), క్వింటన్ డి కాక్ (రూ. 3.60 కోట్లు), ఆంగ్క్రిష్ రఘువంశీ (రూ. 3 కోట్లు), అన్రిచ్ నార్ట్జే (రూ. 6.50 కోట్లు), వైబ్హవ్ 8 కోట్లు. మయాంక్ మార్కండే (రూ. 30 లక్షలు), రోవ్మన్ పావెల్ (రూ. 1.50 కోట్లు), మనీష్ పాండే (రూ. 75 లక్షలు), స్పెన్సర్ జాన్సన్ (రూ. 2.80 కోట్లు), లువ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు), అజింక్యా రహానె (రూ. 30 లక్షలు), అనీక్లీ ఎ. 4 లక్షలు (రూ. 1.50 లక్షలు), అనూక్లీ రోయ్ లక్షలు (రూ. 1.50 లక్షలు), 2 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 75 లక్షలు).ప్రధాన ఆటగాళ్లు:వరుణ్ చక్రవర్తి: ఛాంపియన్స్ ట్రోఫీలో తొమ్మిది వికెట్లతో రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. నైట్ రైడర్స్ తరఫున 82 వికెట్లు తీసిన వరుణ్ ఈ సీజన్లో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.సునీల్ నరైన్: వెస్టిండీస్ ఆల్ రౌండర్ గత సీజన్లో అత్యంత విలువైన ఆటగాడిగా అవార్డు గెలుచుకున్న నరైన్ 17 వికెట్లు పడగొట్టడమే కాకుండా, 34.85 సగటుతో 488 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.ఆండ్రీ రస్సెల్: ఆండ్రీ రస్సెల్ దశాబ్ద కాలంగా నైట్స్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్నాడు. అందువల్ల యాజమాన్యం అతనిపై విశ్వాసం చూపించింది. గత సంవత్సరం రస్సెల్ 222 పరుగులు చేసి 19 వికెట్లు పడగొట్టి, నైట్ రైడర్స్ టైటిల్ సాధనలో కీలక పాత్ర పోషించాడు.అజింక్య రహానే: అజింక్య రహానేకు చాలా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ లో అపార అనుభవం ఉంది.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? -
ముగ్గురికి ఖరీదైన బహుమతులిచ్చా.. కానీ షారూఖ్ మాత్రం: సింగర్ మికా సింగ్
ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్ బీటౌన్లో దాదాపు పరిచయం చేయాల్సిన పనిలేదు. అంతేకాదు మన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్కు వీరాభిమానిని కూడా. బాలీవుడ్లో ఫేమస్ సింగర్గా పేరు తెచ్చుకున్న మికా సింగ్ ఇటీవల ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన అభిమాన హీరో షారూఖ్ ఖాన్కు రూ. 50 లక్షల విలువైన డైమండ్ రింగ్ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే ఆ రింగ్ను షారూఖ్ నాకు తిరిగి ఇచ్చారని వెల్లడించారు. అంతే కాదు షారూఖ్ తన లగ్జరీ కారును మూడు నెలల పాటు వాడుకున్నారని మికా సింగ్ తెలిపారు.ఇంటర్వ్యూలో మికా మాట్లాడుతూ.. ' బాలీవుడ్ ఉత్తమ నటులలో షారూఖ్ ఒకరు. అంతేకాదు పెద్ద మనిషి కూడా. ఆయన నాకు తిరిగిచ్చిన ఉంగరాన్ని ఎల్లప్పుడూ ధరిస్తా. ఎందుకంటే దీని విలువ దాదాపు రూ.50 లక్షలు. ఇలాంటి రింగ్స్ నేను అమితాబ్ బచ్చన్, గురుదాస్ మాన్లకు కూడా బహుమతిగా ఇచ్చాను. అయితే దీన్ని మొదటిసారి బహుమతిగా షారూఖ్ ఖాన్కే ఇచ్చా. ఎందుకంటే ఈ ముగ్గురి కోసం నేను ఏదైనా చేయాలని అనుకున్నా. అయితే మరుసటి రోజు షారూఖ్ కాల్ చేసి.. దయచేసి ఈ ఉంగరాన్ని వెనక్కి తీసుకోండి.. ఎందుకంటే ఇది చాలా ఖరీదైనది అని నాతో అన్నారు. అయితే ఒకసారి ఆయన కారు ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. అదే సమయంలో నా కారు ఇచ్చి ఆయనను ఇంటికి పంపించా. ఆ తర్వాత నా కారు షారూఖ్కు నచ్చడంతో దాదాపు మూడు నెలలపాటు తన వద్దే ఉంచుకుని వాడుకున్నారని' మికా పంచుకున్నారు.ఇటీవల హృతిక్ రోషన్ బర్త్ డే పార్టీలో తాను షారుఖ్ ఖాన్తో సరదాగా గడిపామని మికా సింగ్ వెల్లడించారు. ఈ పార్టీకి హీరో రణ్వీర్ సింగ్ కూడా హాజరయ్యాడని చెప్పాడు. పార్టీ అయిపోయిన తర్వాత అంతా కలిసి ఓకే కారులో వెళ్లామని వివరించారు. షారూఖ్ వినియాగించిన కారు తన వద్దే ఉంచుకున్నానని మికా తెలిపారు. -
సొంతిల్లు ఖాళీ చేయనున్న హీరో.. కుటుంబంతో అద్దె ఇంట్లోకి!
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తన సొంతిల్లు మన్నత్ను వీడనున్నాడు. మన్నత్ (Mannat)ను వదిలేసి అద్దె ఇంట్లోకి షిఫ్ట్ కానున్నాడు. 25 ఏళ్లుగా కుటుంబంతో కలిసి నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. మన్నత్ బంగ్లాను రెనోవేషన్ చేయనున్నారట. ఆ పనులు పూర్తయ్యేవరకు షారూఖ్ అద్దె అపార్ట్మెంట్లో ఉండనున్నారట!అద్దెకు నాలుగంతస్తులుతన కుటుంబంతోపాటు సిబ్బంది, సెక్యురిటీ.. ఇలా అందరికోసం బాంద్రాకు సమీపంలోని పూజా కాసా అపార్ట్మెంట్లో నాలుగంతస్తులను రెంట్కు మాట్లాడుకున్నారట! దీనికిగానూ నెలకు రూ.24లక్షలు అద్దె చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మన్నత్ బంగ్లా పునరుద్ధరణ పనులు మే నెలలో ప్రారంభం కానున్నాయి. ఆ బంగ్లా మళ్లీ కొత్తగా తయారవ్వడానికి దాదాపు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది.మూడేళ్లపాటు లీజుకుఇక షారూఖ్కు అపార్ట్మెంట్ అద్దెకిస్తోంది మరెవరో కాదు నిర్మాత వాసు భగ్నానీ. వాసు తనయుడు జాకీ భగ్నానీ (రకుల్ ప్రీత్ సింగ్ భర్త), కూతురు దీప్శిక దేశ్ముఖ్లు.. నాలుగు అంతస్తులను షారూఖ్కు మూడేళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేయించుకున్నారట! అయితే అంతకాలంపాటు షారూఖ్ అక్కడే ఉంటారా? అన్నది ప్రశ్నార్థకమే! షారూఖ్ చివరగా 2023లో 'పఠాన్', 'జవాన్', 'డంకీ' సినిమాలతో వరుస బ్లాక్బస్టర్స్ అందుకున్నాడు. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో అతిథి పాత్రలో మెరిశాడు.చదవండి: తొమ్మిదేళ్ల బంధం.. విడాకులు కావాలన్న నటి! -
'సల్మాన్, షారూఖ్ నన్ను చూసి నవ్వారు'.. హీరోయిన్ కామెంట్స్
మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించిన హీరోయిన్ మమతా కులకర్ణి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. సడన్గా సన్యాసం స్వీకరించడం హాట్ టాపిక్గా మారింది. గ్లామర్ ఇండస్ట్రీని వదిలేసిన మమతా ఇండియాను వదిలేసి రెండు దశాబ్దాలయింది. సుదీర్ఘ విరామం తర్వాత మహాకుంభ్ మేళా కోసం భారత్కు తిరిగొచ్చింది. దాదాపు 23 ఏళ్లుగా ఈ అవకాశం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. కాగా మమతా కులకర్ణి.. హిందీలో కరణ్ అర్జున్, సబ్సే బడా ఖిలాడీ వంటి పలు సినిమాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ చిత్రాలతో మెప్పించింది.తాజాగా మమతా బాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో తాను కరణ్ అర్జున్ మూవీ గురించి మాట్లాడింది. ఆ మూవీ షూటింగ్ సమయంలో తనను చూసి సల్మాన్, షారుక్ ఖాన్ నవ్వుకున్నారని తెలిపింది. సల్మాన్ ఖాన్ ఏకంగా తనను చూసి తలుపులు వేసుకున్నాడని పేర్కొంది.మమతా కులకర్ణి మాట్లాడుతూ.. "కరణ్ అర్జున్ మూవీ షూట్ షారుఖ్, సల్మాన్తో కలిసి చేశాను. అక్కడే ఓ సాంగ్ షూట్లో కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్ను సింగిల్ టేక్లో చేశా. కానీ వాళ్లిద్దరూ రీటేక్స్ ఎక్కువగా తీసుకున్నారు. దాంతో కొరియోగ్రాఫర్కు కోపం వచ్చి ప్యాకప్ చెప్పేశాడు. ఆ తర్వాత సల్మాన్ అసహనానికి గురయ్యాడు. నేను గదిలోకి వెళ్తుంటే నా ముఖంపై తలుపు వేశాడు. కానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. సల్మాన్ ఎప్పుడూ నన్ను ఆటపట్టించేవాడు. నేను సెట్లో సమయపాలన పాటిస్తాను.' అని తెలిపింది.(ఇది చదవండి: 23 ఏళ్లుగా దీనికోసమే.. ఒలంపిక్ గెల్చినంత సంతోషంగా ఉంది: మమతా)కాగా.. మమతా కులకర్ణి 2000 సంవత్సరం ప్రారంభంలో బాలీవుడ్కు గుడ్బై చెప్పేసింది. ఆమె చివరిసారిగా 2002లో విడుదలైన కభీ తుమ్ కభీ హమ్లో కనిపించింది. అంతకుముందు మేరా దిల్ తేరే లియే, తిరంగా, దొంగ పోలీస్, కిస్మత్ లాంటి చిత్రాల్లో నటించింది. -
షారుక్ మరోసారి తీన్మార్ ?
-
షారుఖ్ ఖాన్ సినిమా రీమేక్ లో ప్రభాస్
-
'ఈ వయసులో మీలా చేయలేను'.. సౌత్ హీరోలపై షారూఖ్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఆసక్తికర కామెంట్స్ చేశారు. దక్షిణాది హీరోలను ఉద్దేశించిన ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. గణతంత్ర దినోత్సవం రోజున దుబాయ్ గ్లోబల్ విలేజ్ వేదికగా జరిగిన ఈవెంట్లో షారూఖ్ మాట్లాడారు. సినీరంగంలో తన కెరీర్ గురించి అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, ప్రభాస్, యష్, తలపతి విజయ్. రజనీకాంత్ లాంటి స్టార్స్ తనకు మంచి స్నేహితులని అన్నారు. అంతే కాదు సౌత్ హీరోల డ్యాన్స్ గురించి కూడా షారూఖ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.షారూఖ్ మాట్లాడుతూ.. 'దక్షిణ భారత్ నుంచి కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి నాకు లక్షలాది అభిమానులు, చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, యష్, మహేష్ బాబు, తలపతి విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్ కూడా ఉన్నారు. అయితే వారికి నాది ఒకటే విజ్ఞప్తి. పాటలకు వేగంగా డ్యాన్స్ చేయడం ఆపేయండి. డ్యాన్స్ విషయంలో వారిని ఫాలో కావడం చాలా కష్టమైన పని. ఈ వయసులో నేను మీలా డ్యాన్స్ చేయలేను.' అంటూ సరదాగా మాట్లాడారు.అంతేకాకుండా షారూఖ్ ఖాన్ తన నటుడు తన రాబోయే చిత్రం కింగ్ గురించి మాట్లాడారు. గతంలో బ్లాక్ బస్టర్ పఠాన్ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో తన కుమార్తె సుహానా ఖాన్తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. షారూఖ్ ఖాన్ చివరిసారిగా రాజ్కుమార్ హిరానీ తెరకెక్కించిన డుంకీలో కనిపించాడు.కింగ్ మూవీ గురించి షారూఖ్ ఖాన్ చెబుతూ..'ఈ చిత్రం గురించి నేను మీకు పెద్దగా చెప్పలేను. అయితే ఇది వినోదాత్మకంగా ఉంటుందని హామీ ఇస్తున్నా. నేను ఇంతకు ముందు చాలా టైటిల్స్ వాడాను. ఇప్పుడు మన దగ్గర మంచి టైటిల్స్ అన్నీ అయిపోయాయి. అందుకే కింగ్ అనే టైటిల్ పెట్టాం. రాజు ఎప్పటికీ రాజే' అని వేదికపై నవ్వులు పూయించారు. .@Actorvijay , @urstrulyMahesh , #Prabhas , @AlwaysRamCharan , @alluarjun are my Close friends ~ @iamsrk 🔥pic.twitter.com/xCWBaLJuBS— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 28, 2025 -
సఖి.. ఫస్ట్ ఆ హీరోహీరోయిన్లతో తీద్దామనుకున్నా: మణిరత్నం
సఖి సినిమా (Sakhi Movie) అప్పట్లో సెన్సేషనల్ హిట్. పేరుకే డబ్బింగ్ మూవీ కానీ తెలుగులోనూ ఈ సినిమాను తెగ ఆరాధించారు. ఇంతకీ ఈ చిత్రం ఒరిజినల్ వర్షన్ ఏదో తెలుసా..? అలై పాయుతే (Alai Payuthey Movie). అలై పాయుతే అనే తమిళ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించాడు. ఆర్ మాధవన్, శాలిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. థియేటర్లలో వంద రోజులకు పైనే ఆడిన ఈ మూవీని తర్వాత హిందీలో సాతియా పేరిట రీమేక్ చేశారు. ఇంకేముంది అక్కడ కూడా బ్లాక్బస్టర్ అయింది.మాధవన్కు బదులుగా..తాజాగా మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. సఖి సినిమా కోసం మొదట బాలీవుడ్ హీరోహీరోయిన్లను అనుకున్నట్లు తెలిపాడు. మణిరత్నం మాట్లాడుతూ.. నేను ఫస్ట్ షారూఖ్, కాజోల్తో ఈ సినిమా తీయాలనుకున్నాను. షారూఖ్ దగ్గరకు వెళ్లి కథ కూడా చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. కానీ అప్పటికి క్లైమాక్స్ సరిగ్గా కుదర్లేదు. అందుకని దాన్ని పక్కనపెట్టేసి షారూఖ్తో దిల్సే సినిమా చేశాను. ఆ మూవీ అయిపోయేసమయానికి సఖి క్లైమాక్స్ను ఎలా తీర్చిదిద్దాలన్న ఆలోచన తట్టింది అని చెప్పుకొచ్చాడు. మణిరత్నం చివరగా పొన్నియన్ సెల్వన్ 2 తెరకెక్కించాడు.చదవండి: సెట్లో ఫోన్లు నిషిద్ధం.. మహేశ్బాబు సహా అందరితో అగ్రిమెంట్! -
షారూఖ్ ఖాన్ చేతికి అరుదైన గోల్డ్ వాచ్.. ధర ఎంతో తెలుసా?
బాలీవుడ్ సూపర్ స్టార్ 'షారుఖ్ ఖాన్' ముంబైలో జరిగిన ఐఐఎఫ్ఏ (IIFA) అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కనిపించారు. ఆ సమయంలో ఆయన చేతికున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్శించింది. ఇంతకీ అది ఏ బ్రాండ్ వాచ్ అని చాలామంది సెర్చ్ చేయడం కూడా మొదలెట్టేసారు.షారుఖ్ ఖాన్ చేతికున్న వాచ్.. ఆడేమర్స్ పిగుఎంట్ (Audemars Piguet) బ్రాండ్ అని తెలుస్తోంది. ఇది లిమిటెడ్ ఎడిషన్. ఎందుకంటే ఇలాంటి వాచీలు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 250 మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ. 76 లక్షల వరకు ఉంటుందని సమాచారం.ఐఐఎఫ్ఏ అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కనిపించిన షారుఖ్ ఖాన్.. నలుపు రెండు డ్రెస్సులో ఆకర్షణీయంగా కనిపించారు. ఈయన చేతికి ఖరీదైన వాచ్.. చెవికి ఇయర్ కఫ్ కూడా ధరించి ఉండటం చూడవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాచ్ ప్రత్యేకతలుషారుఖ్ ఖాన్ చేతికున్న ఆడేమర్స్ పిగుఎంట్ వాచ్ చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది 18 క్యారెట్ల సాండ్ గోల్డ్తో తయారైనట్లు తెలుస్తోంది. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి ధర కూడా కొంత ఎక్కువగా ఉంది. View this post on Instagram A post shared by SHAH RUKH KHAN (@shahrukh__khan__fanclub)షారుఖ్ ఖాన్ వాచ్ కలెక్షన్నటుడు షారుఖ్ ఖాన్ వద్ద ఆడేమర్స్ పిగుఎంట్ బ్రాండ్ వాచ్ మాత్రమే కాకుండా.. పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ క్రోనోగ్రాఫ్ 5968ఏ, పాటెక్ ఫిలిప్పే నాటిలస్ 58811/1జీ, ఆడేమర్స్ పిగుయేట్ రాయల్ ఓక్ ఆఫ్షోర్ 2640ఐపీఓ, ఆడేమర్స్ పిగుయేట్ రాయల్ ఓక్ పర్ఫెటుల్ క్యాలెండర్, బెల్గరి ఆక్టో రోమా టూర్బిల్లాన్ సఫైర్ 103154, ట్యాగ్ హ్యూయర్ క్యాలిబర్ 1887 స్పేస్ఎక్స్, ట్యాగ్ మొనాకో సిక్స్టీ నైన్ సీడబ్ల్యు911 వంటి ఖరీదైన వాచీలు చాలానే ఉన్నాయి.ఇదీ చదవండి: 80వేల కియా కార్లకు రీకాల్: కారణం ఇదే.. -
షారుఖ్ ఖాన్కి రూ.9 కోట్లు వెనక్కి..
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్కి (Sharukh Khan) మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి ఇస్తోంది. సముద్రానికి ఎదురుగా ఉన్న తన బంగ్లా 'మన్నత్' (Mannat) లీజును యాజమాన్యంగా మార్చుకునేందుకు అధికంగా చెల్లించిన రూ.9 కోట్లను మహారాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వనుంది.2019లో షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ బాంద్రాలోని పురాతన ఆస్తిని 'క్లాస్ 1 పూర్తి యాజమాన్యం'గా మార్చారని, దాని కోసం కొంత ప్రీమియం ప్రభుత్వానికి చెల్లించారని రెసిడెంట్ సబర్బన్ కలెక్టర్ సతీష్ బాగల్ తెలిపారు. ప్రీమియం లెక్కింపులో ట్యాబులేషన్ లోపాన్ని గుర్తించిన తర్వాత, షారుఖ్ ఖాన్ దంపతులు ఇటీవల మంజూరైన రీఫండ్ కోసం రెవెన్యూ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు.మన్నత్ భవనం లీజ్ కన్వర్షన్ కోసం షారుఖ్ ఖాన్ దంపతులు మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అయితే ఇది ఎంత వరకూ వాస్తవం అన్నది అధికారులు ధ్రువీకరించలేదు.ఇంద్ర భవనమే!బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నివసించే రూ. 200 కోట్ల విలువైన బంగ్లా మన్నత్ ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది. ఈ భవనాన్ని చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ అంతా గౌరీ ఖాన్ (Gouri Khan) స్వయంగా చేయించారు.ఈ బంగ్లాను షారుఖ్ ఖాన్ 2001లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత దానికి మన్నత్ అని పేరు పెట్టారు. గౌరీ ఖాన్ తన భర్త షారుఖ్ కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఓ కార్నర్ ని తయారు చేయించారు. అక్కడ షారుఖ్ ఖాన్ కి వచ్చిన అవార్డులన్నింటినీ ప్రత్యేకంగా అలంకరించారు. మన్నత్ చాలా విశాలంగా ఉంటుంది. ఇంట్లో భారీ లగ్జరీ హోమ్ థియేటర్ ఉంది. ఆరు అంతస్తుల ఈ ఇంట్లో లిఫ్ట్ వ్యవస్థ కూడా ఉంది. అంతేకాదు, ఇంటి మెట్లను చెక్కతో తయారు చేయగా, ఇంటి అలంకరణ కోసం చెక్కతో పాటు వివిధ దేశాల నుంచి ప్రత్యేకమైన ఇంటీరియర్ ని ఉపయోగించారు.మన్నత్ గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ బంగ్లాను మొదట సల్మాన్ ఖాన్ కొనాలనుకున్నారట. కానీ సల్మాన్ తండ్రి సలీం ఇంత పెద్ద బంగ్లా మనకు అవసరం లేదని చెప్పడంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు. -
IIFA అవార్డ్స్ విలేకరుల సమావేశంలో షారుఖ్ ఖాన్,నోరా ఫతేహి సందడి (ఫొటోలు)
-
ఆ స్టార్ హీరో ఇంట్లో చోరీకి ప్లాన్.. వర్కవుట్ కాకపోవడంతో సైఫ్ ఫ్లాట్లో!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) దాడి ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు తొలుత.. స్టార్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్లాన్ వేసుకున్నాడట! షారూఖ్ నివాసమైన మన్నత్లో జనవరి 14న చోరీకి పథకం రచించాడట! కానీ అక్కడ భద్రత ఎక్కువగా ఉండటంతో ఇంట్లోకి ప్రవేశించలేకపోయాడని తెలుస్తోంది. దీంతో అతడు పటిష్ట భద్రత లేని సైఫ్ అలీఖాన్ ఇంటిని ఎంచుకున్నాడు.ఏం జరిగిందంటే?బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి ఘటనతో చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎక్కువగా సంపన్నులు నివాసముండే బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి జనవరి 16న గుర్తు తెలియని దుండగుడు దూరాడు. సైఫ్ చిన్న కుమారుడు జెహ్ (Jehangir Ali Khan) గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను గమనించిన పనిమనిషి బిగ్గరగా కేకలు వేసింది. ఆ శబ్దాలు వినిపించి నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్ పరుగెత్తుకుంటూ ఆ గదిలోకి వచ్చాడు. దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో దుండగుడు సైఫ్ను విచక్షణారహితంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఆరు కత్తిపోట్లతో రక్తమోడుతున్న సైఫ్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కారు కూడా సిద్ధంగా లేకపోవడం శోచనీయం. దీంతో నటుడి పెద్ద కుమారుడు ఇబ్రహీం ఆటోలో తండ్రిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. వెన్నెముకలో 2.5 అంగుళాల కత్తి మొన విరగ్గా ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.చదవండి: సైఫ్ అలీ ఖాన్పై దాడి.. దుండగుడి డిమాండ్ ఏంటంటే.? -
హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ
హీరోలు కోట్లు సంపాదిస్తారు.. వారి కింద పనిచేసే బాడీగార్డులు కూడా లక్షలు వెనకేస్తుంటారు! స్టార్ హీరోల బాడీగార్డుల సంపాదన గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదికి కోట్లల్లో ఆదాయం ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. షేరా అలియాస్ గుర్మీత్ సింగ్.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు రెండు దశాబ్దాలుగా బాడీగార్డుగా పని చేస్తున్నాడు. ఇతడికికి టైగర్ అని ఓ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ కూడా ఉంది. బాడీగార్డు ఉంటేనే అడుగు బయటకురవి సింగ్ విషయానికి వస్తే.. ఇతడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు వ్యక్తిగత అంగరక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. యూసుఫ్ ఇబ్రహీం.. ఆలియా భట్, వరుణ్ ధావన్ వంటి పలువురు హీరోహీరోయిన్లకు బాడీగార్డుగా సేవలందిస్తున్నాడు. వీరు సెలబ్రిటీలు ఇల్లు దాటి బయటకు వెళ్లినప్పుడు వారికి రక్షణగా నిలుస్తారు. ఈవెంట్లకు వెళ్లినా, ఎక్కడికైనా ప్రయాణించినా సదరు నటీనటులను జాగ్రత్తగా చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.బాడీగార్డులకు కోట్లల్లో ఆదాయం?సెలబ్రిటీటల పట్ల అంకితభావంతో పనిచేసే వీరు బాగానే డబ్బు కూడబెడతారని ఫిల్మీదునియాలో ఓ టాక్ ఉంది. దీనిపై హీరోయిన్ ఆలియా భట్ బాడీగార్డ్ యూసఫ్ ఇబ్రహీం(Bollywood bodyguard Yusuf Ibrahim) క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ముందుగా షారూఖ్ బాడీగార్డ్ రవి సింగ్ ఏడాదికి రూ.2.7 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడా? అన్న ప్రశ్నకు ఇలా స్పందించాడు. చూడండి.. ఎవరెంత సంపాదిస్తున్నారనేది మాకు తెలియదు. ఒకరి ఆదాయం మరొకరికి తెలియదు. తెలిసే అవకాశమే లేదు అన్నాడు. మీకు తెలియకుండా ఉంటుందా? అని యాంకర్ అడిగినప్పటికీ అతడు తెలీదనే అడ్డంగా తలూపాడు. మరి సల్మాన్ బాడీగార్డ్ షేరా రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడంటున్నారు.. ఇది నిజమేనా? అన్న రెండో ప్రశ్న ఎదురైంది.(చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు, ఎందుకంటే?)నెలకు రూ.10 లక్షలు ఈజీగా..దీనికి ఇబ్రహీం స్పందిస్తూ.. షేరాకు సొంత బిజినెస్ ఉంది. అతడికంటూ ప్రత్యేకంగా సెక్యురిటీ కంపెనీ ఉంది. ఇంకా వేరే వ్యాపారాలు కూడా ఉండొచ్చు. కాబట్టి రెండు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది అని సమాధానమిచ్చాడు. అక్షయ్ కుమార్ అంగరక్షకుడు శ్రేసయ్ తేలే ఏడాదికి రూ.1.2 కోట్లు ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటన్న ప్రశ్నకు.. అతడి వ్యక్తిగత సమాచారం నా దగ్గర లేదు. అయినా నెలకు రూ.10-12 లక్షల ఆదాయం వేసుకున్నా ఏడాదికి రూ.1 కోటి ఈజీగా దాటుతుంది.కొన్నిసార్లు లెక్క మారుతుందికానీ కొన్నిసార్లు అంత డబ్బు రాకపోవచ్చు. ఎందుకంటే కొందరు షూటింగ్కు, ఈవెంట్స్కు, ప్రమోషన్స్కు వేర్వేరుగా డబ్బు లెక్కగడుతుంటారు. దాన్ని బట్టి సెలబ్రిటీలు ఎలాంటి కార్యక్రమాలకు ఎక్కువగా వెళ్తున్నారో దాని ఆధారంగానే డబ్బిస్తారు. పైగా ఆయా సెలబ్రిటీ నెలలో ఎన్ని రోజులు పని చేస్తున్నాడనేదానిపై కూడా మా జీతం ఆధారపడి ఉంటుంది. కానీ అందరూ ఎవరికి నచ్చినట్లు వారు లెక్కలు వేసుకుని ప్రచారం చేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నామని ఫిక్సయిపోయారు. కానీ సాధారణ బాడీగార్డులైతే నెలకు రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది అని ఇబ్రహీం చెప్పుకొచ్చాడు.చదవండి: చికెన్గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..! -
స్కూలు యాన్యువల్ డే : ఆరాధ్య సందడి, ముద్దుల్లో ముంచెత్తిన ఐశ్వర్య
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవం వేడుకల్లో స్టార్ కిడ్స్ సందడి చేశారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య, బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్కాన్ చిన్న కుమారుడు అబ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గురువారం (డిసెంబరు 19) జరిగిన ఈ ఈవెంట్లో ఆరాధ్య బచ్చన్ తన షోను అందర్ని కట్టి పడేసింది. ఆమె నటనకు ఐశ్వర్య, అభిషేక్తోపాటు, తాత అమితాబ్ బచ్చన్ కూడా గర్వంతో ఉప్పొంగి పోయారు. ముఖ్యంగా మాజీ ప్రపంచ సుందరి ఐశర్య తన కుమార్తె నటనకు ఫిదా అయిపోయింది. ఈమెమరబుల్ మూమెంట్స్ను కెమెరాలో బంధిస్తూ కనిపించింది. ఆ తరువాత ఆరాధ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దులతో ముంచెత్తింది.And Aaradhya’s final bow - trust her parents to cheer the loudest as always pic.twitter.com/phf29fiGG3— Bewitching Bachchans (@TasnimaKTastic) December 19, 2024మరోవైపు భార్యబిడ్డలను ఇలా చూసిన అభిషేక్ మురిసిపోయారు. ఇక మనవరాలు క్రిస్మస్ ప్రదర్శనకు గర్వంతో చిరునవ్వులు చిందించారు అమితాబ్. షో ముగియగానే ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అలాగే తన కుమారుడు అబ్రామ్ ప్రదర్శనకు షారూఖ్ఖాన్ కూడా ఉత్సాహంగా క్లాప్స్ కొట్టారు. మురిపెంగా వీడియోలు తీసుకుంటూ కనిపించారు. కరీనా సైఫ్ అలీఖాన్, దంపతుల కుమారుడు కూడా తైమూరు కూడా అద్భుత ప్రదర్శనతో అలరించాడు. ఈ వార్షికోత్సవ వేడుకులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.మరోవైపు ఆరాధ్య పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఐశ్వర్య, అభిషేక్ జంటగా కనిపించడం, ఇద్దరూ అమితాబ్ను వేదికపైకి జాగ్రత్తగా తీసుకెళ్లిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లకు పూర్తిగా చెక్ పడినట్టైంది. < View this post on Instagram A post shared by mamaraazzi (@mamaraazzi) -
పెళ్లిలో డ్యాన్స్.. షారూఖ్ ఎంత తీసుకున్నాడేంటి?
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ఇటీవల ఢిల్లీలో ఓ పెళ్లికి హాజరయ్యాడు. వధూవరులతో ముచ్చటించడంతో పాటు స్టేజీపై డ్యాన్స్ కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పెళ్లికూతురి మేకప్ ఆర్టిస్ట్ అమృత కౌర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కాగా పెళ్లికూతురు ఎంతో అదృష్టవంతురాలని పలువురూ కామెంట్లు చేస్తున్నారు.అతిథిగానా? లేదా..ఓ వ్యక్తి.. వివాహ వేడుకకు వచ్చేందుకు షారూఖ్ ఎంత తీసుకున్నాడు? అని అడగ్గా అతడు ఫ్యామిలీ ఫ్రెండ్ అని అమృత బదులిచ్చింది. అతడు అతిథిగా వచ్చాడా? లేదా స్టేజీపై పర్ఫామ్ చేయడానికి వచ్చాడా? అని మరొకరు ప్రశ్నించగా అఫ్కోర్స్.. స్టేజీపై సందడి చేసేందుకే వచ్చాడని అమృత రిప్లై ఇచ్చింది.సినిమాసినిమాల విషయానికి వస్తే షారూఖ్ ప్రస్తుతం కింగ్ అనే మూవీలో నటిస్తున్నాడు. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారూఖ్ కూతురు సుహానా కూడా భాగం కానుంది. అలాగే ముఫాసా: ద లయన్ కింగ్ అనే యానిమేటెడ్ సినిమాలో ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Amrit kaur (@amritkaur_artistry) చదవండి: వీడియో లీక్పై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్ -
పుష్ప-2 అడ్వాన్స్ బుకింగ్స్.. 12 గంటల్లోనే షారూఖ్ సినిమాను దాటేసింది!
మరో మూడు రోజుల్లో థియేటర్స్ షేక్ కానున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మూడేళ్ల కష్టం ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్పై కనిపించనుంది. 2021లో సృష్టించిన రికార్డులన్నీ మొదటి రోజే బద్దలయ్యేలా కనిపిస్తోంది. పుష్పకు సీక్వెల్గా తెరకెక్కించిన పుష్ప-2 ఈనెల 5న థియేటర్లలో సందడి చేయనుంది.ఇప్పటికే ఓవర్సీస్ టికెట్స్ బుకింగ్స్ పూర్తి కాగా.. ఇప్పుడు తెలంగాణలోనూ మొదలయ్యాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా టికెట్ బుకింగ్స్ ఓపెనవ్వగా ఒక రోజు గడవకముందే రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. టికెట్స్ విడుదలైన కేవలం 12 గంటల్లోనే పఠాన్, గదర్ 2, కేజీఎఫ్- 2 లాంటి ఆల్ టైమ్ బ్లాక్బస్టర్ చిత్రాలను అధిగమించింది.పుష్ప 2 ది రూల్ అడ్వాన్స్ బుకింగ్ కొన్ని గంటల్లో రూ.10 కోట్లను దాటేసింది. పుష్ప 2 బుకింగ్ మొదలైన 12 గంటల్లోనే 3 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. గతేడాది షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రానికి 2 లక్షల టిక్కెట్లు మాత్రమే బుకింగ్స్ అయ్యాయి. పుష్ప- 2 కన్నడ బ్లాక్బస్టర్ కేజీఎఫ్-2ను సైతం మించిపోయింది. 2022లో ఈ మూవీ టికెట్స్ 12 గంటల్లో 1.25 లక్షలు మాత్రమే సేల్స్ సాధించింది. యష్ నటించిన ఈ చిత్రం అన్ని భాషల్లో మొదటి రోజు ప్రీ-సేల్స్లో రూ.80 కోట్లు వసూలు చేసింది.రాజమౌళి బాహుబలి-2 తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్లో రూ.90 కోట్ల వసూళ్ల మేర టికెట్స్ విక్రయించారు. తొలి 12 గంటల అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూస్తే పుష్ప- 2 హిందీలో రూ.5.5 కోట్లు, తెలుగులో రూ.3 కోట్లు వసూళ్లు సాధించింది. ఇదే జోరు కొనసాగితే తొలి రోజు ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 రికార్డులను అధిగమించే ఛాన్స్ ఉంది. -
పుష్పకు ఆదరణ కరువు.. రూ.1 కోటి కూడా రాలే!
క్లాసిక్, బ్లాక్బస్టర్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేయడం ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ మూవీ పుష్పను ఇటీవలే మళ్లీ విడుదల చేశాడు. నవంబర్ 22 నుంచి ఈ మూవీ హిందీ వర్షన్ థియేటర్లలో ఆడుతోంది. దీనితో పాటు హిందీ కల్ట్ క్లాసిక్ కరణ్ అర్జున్ కూడా ఒకేరోజు రిలీజైంది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వారం రోజుల్లో రూ.1 కోటి వసూలు చేసింది.ఏ సినిమా కలెక్షన్స్ ఎంతంటే?పుష్ప కేవలం రూ.70 లక్షలు మాత్రమే రాబట్టింది. రీరిలీజ్ ట్రెండ్లో కరణ్ అర్జున్, పుష్ప రెండూ నిరాశపర్చాయి. ఇకపోతే షారూఖ్ ఖాన్ 'కల్ హో నా హో' సినిమా కూడా నవంబర్ 15న రీరిలీజ్ అవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.3.70 కోట్లు వసూలు చేసింది.పుష్ప 2ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. -
తండ్రికున్న చరిష్మా ఈమెకెక్కడిది?.. షారూఖ్ కూతురిపై ట్రోలింగ్
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈజీగా రాణించొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ అది పొరపాటు! ఎంతటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే టాలెంట్ ఉంటేనే జనాలు ఆదరిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా చెడుగుడు ఆడేసుకుంటారు. పైగా వారి అంచనాలు కూడా ఆకాశాన్నంటేలా ఉంటాయి. వాటిని అందుకోవడానికి సెలబ్రిటీ కిడ్స్ మరింత కష్టపడాల్సి ఉంటుంది.ఆదిలోనే ట్రోలింగ్ఇప్పుడదే జరిగింది. బాలీవుడ్ స్టార్ షారూఖ్ కాన్ కూతురు సుహానా గతేడాది 'ద ఆర్చీస్' అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తను పోషించిన వెరోనికా పాత్రకు గానూ విపరీతంగా ట్రోల్ అయింది. తాజాగా సుహానా ఓ సెల్ఫోన్ యాడ్లో నటించింది. ఇందులో ఆమె ఓ డైలాగ్ చెప్పి తర్వాత వచ్చే మ్యూజిక్కు స్టెప్పులేస్తుంటుంది. ఇప్పుడు మరోసారిఈ యాడ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవగానే నెటిజన్లు ఆమెను మళ్లీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తండ్రికున్న చరిష్మా కూతురికి లేదని విమర్శిస్తున్నారు. 'తన స్క్రీన్ ప్రెసెన్సే నెగెటివ్గా అనిపిస్తోంది, 10 సెకన్ల కంటే ఎక్కువసేపు ఆ యాడ్ చూడలేకపోతున్నా..', 'తను సైడ్ క్యారెక్టర్లకే పనికొస్తుంది తప్ప ప్రధాన పాత్రలకు కాదు' అని హేళన చేస్తున్నారు. అందరి నోళ్లు మూయిస్తుంది!కొందరు మాత్రం తన హెయిర్ స్టైల్ బాగోలేదని, డైరెక్షన్ కూడా సెట్టవలేదని.. అందుకు పూర్తిగా సుహానాదే తప్పని నిందించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే సుహానా ప్రస్తుతం తన తండ్రితో కలిసి కింగ్ అనే సినిమా చేస్తోంది. ఈ మూవీతో అయినా తనను విమర్శించేవారి నోళ్లు మూయిస్తుందేమో చూడాలి!చదవండి: క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి -
పదేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయా..: షారూఖ్
చిన్న వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకోవడాన్ని మించిన బాధ మరొకటి లేదంటున్నాడు హీరో షారూఖ్ ఖాన్. ద గ్లోబల్ ఫ్రెయిట్ సమ్మిట్ వేదికలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. నా చిన్నతనంలోనే అమ్మానాన్న మరణించారు. నాన్న 14 ఏళ్ల వయసులో, అమ్మ 24 ఏళ్ల వయసులో చనిపోయారు. పదేళ్ల వ్యవధిలోనే ఇద్దర్నీ కోల్పోయాను. ఎక్కడికెళ్లాలో తెలియలేదు. పేరెంట్స్ కోసం కష్టపడ్డా..నాతో పాటు అక్క కూడా ఉంది. మా ఇద్దరినీ ఈ ప్రపంచంలో వదిలేసి పోయారు. ఆకాశంలోని నక్షత్రాల్లో కలిసిపోయారు. ఎప్పటికైనా ఆ నక్షత్రాల్ని అందుకోవాలనుకునేవాడిని. బహుశా అక్కడ కూడా వాళ్లు మా గురించి కంగారుపడేవారేమో! అందుకనే జీవితంలో సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడ్డాను. ఎక్కడున్నా నా పేరెంట్స్ బాధపడకూడదని ప్రయత్నించాను. చివరకు అనుకున్నది సాధించాను. గిల్టీగా ఫీల్ అయ్యేవాడినివాళ్లకన్నా ముందు నేను చనిపోయుంటే చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే నేను తిరిగి రాలేనన్న బాధలో నుంచి వారు బయటపడేవారు కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా షారూఖ్ చివరగా డంకీ సినిమాలో నటించాడు. ప్రస్తుతం కింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి షారూఖ్ కూతురు సుహానా ఖాన్తో పాటు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు.చదవండి: విష్ణుతో యష్మి గొడవ.. చివరిసారి చీఫ్ అయిందెవరంటే? -
ఇదేం పిచ్చి సామీ.. హీరో కోసం 95 రోజులుగా!
సినీ ఇండస్ట్రీలో హీరోలకు క్రేజే వేరు. హీరోయిన్ల కంటే ఎక్కువ ఫాలోయింగ్ వీరికే ఉంటుంది. పాన్ ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా ఒకరు. ఆయనకు వరల్డ్ వైడ్గా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.తాజాగా ఓ వీరాభిమాని తన ఫేవరేట్ హీరోను కలవడం కోసం చేసిన సాహసం చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. అతను షారూఖ్ ఖాన్ను కలిసేందుకు దాదాపు 95 రోజుల పాటు ఆయన నివాసమైన మన్నత్ బయటే ఉన్నాడట. జార్ఖండ్కు చెందిన వీరాభిమాని షారూఖ్ను కలవాలన్న ఆశతో ఇంటి బయటే వేచి చూశాడు. చివరికీ షారూఖ్ను కలిసి తన కోరిక నెరవేర్చుకున్నాడు. అభిమాన హీరోతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. నవంబర్ 2న షారూక్ ఖాన్ తన 59వ బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నారు.గతేడాది బ్యాక్-టు-బ్యాక్ పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం షారూఖ్ కింగ్ అనే చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆయన కుమార్తె సుహానా ఖాన్ నటించనున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
హీరోయిన్ ఎవరనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు: తాప్సీ
సినిమాలో ఏ హీరోయిన్ను సెలక్ట్ చేసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారంటోంది తాప్సీ పన్ను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. వరుణ్ ధావన్ 'జుడ్వా', షారూఖ్ ఖాన్ 'డుంకీ' సినిమాలు డబ్బు కోసం చేశానని అందరూ అనుకుంటారు. ఈ చిత్రాల వల్ల నేను ఎంతో సంపాదించానని ఫీలవుతుంటారు. కానీ అది నిజం కాదు. వాస్తవం.. మీ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది.పెద్ద సినిమాల్లో ఎక్కువ పారితోషికం?నా చుట్టూ కథ తిరిగే సినిమాల్లోనే నాకు ఎక్కువ పారితోషికం లభిస్తుంది. ఉదాహరణకు హసీన్ దిల్రుబా వంటివి. మిగతా చిత్రాల్లో అంత డబ్బేమీ ఇవ్వరు. పైగా నన్ను పెద్ద సినిమాలో సెలక్ట్ చేసుకుని నాకే ఏదో ఉపకారం చేసినట్లు ఫీలవుతారు.హీరోలే డిసైడ్ చేస్తున్నారుఒక సినిమాలో ఆల్రెడీ పెద్ద హీరో ఉన్నాడు అంటే ఎక్కువ డబ్బు పెట్టి హీరోయిన్ను తీసుకోవాలనుకోరు. అంతేకాదు, ఎవర్ని హీరోయిన్గా తీసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు. ఎవరో కొందరు సక్సెస్ఫుల్ దర్శకులు మాత్రమే హీరో మాటను కాదని కథకు తగ్గట్లు హీరోయిన్ను తీసుకుంటారు.ట్రెండింగ్లో ఉన్నవారే కావాలి!ఎక్కువగా హీరోలు ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్లతో కలిసి యాక్ట్ చేయాలనుకుంటారు. లేదా తమను డామినేట్ చేయని నటీమణులు పక్కన ఉండాలని ఫీలవుతారు అని చెప్పుకొచ్చింది. కాగా తాప్సీ పన్ను చివరగా ఖేల్ ఖేల్ మే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె వో లడ్కీ హై కహా సినిమా చేస్తోంది.చదవండి: ఓటీటీలో 'దేవర' ఎంట్రీ సమయం వచ్చేసిందా..? -
ఇండియన్ రిచ్చెస్ట్ హీరో 'షారుఖ్ ఖాన్' ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఇండియన్ రిచ్చెస్ట్ సినీ నటుడు ఎవరని అడిగితే వెంటనే షారుఖ్ పేరే చెబుతారు. 1965లో ఢిల్లీలో తాజ్ మొహమ్మద్ ఖాన్, లతీఫ్ ఫాతిమా దంపతులకు ఆయన జన్మించారు. మొదట ఆయన సిరీయల్స్తోనే కెరియర్ ప్రారంభించి ఆపై వెండితెరపైన తన సత్తా ఏంటో చూపించాడు. ఒక సాదారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన షారుక్ బాలీవుడ్ బాద్షా అవడమే కాకుండా కోట్ల రూపాయలు సంపాదించారు. ఇండియాలోమ రిచ్చెస్ట్ హీరోగా షారుఖ్ ఉన్నారు.ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోషారుఖ్ ఖాన్ ఆస్తులు విలువ సుమారు రూ. 7300 కోట్లకు పైమాటే అని చెప్పవచ్చు. సినిమా,వ్యాపార ప్రకటనలు,ఐపీఎల్ వంటి వాటిపై ఆయన భారీగానే సంపాదిస్తున్నారు. అలా ఏడాదికి రూ 300 కోట్ల వరకు షారుఖ్ అర్జిస్తున్నట్లు సమాచారం. ఒక్కో సినిమా కోసం రూ 120 నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ ఉంది. తన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండటంతో ఆయన అడిగినంత డబ్బు ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉంటారు. కానీ ఆయన ఈ మధ్య ఎక్కువ సినిమాలు తన రెడ్ చిల్లీస్ సంస్థ ద్వారా తన భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుండటం విశేషం. తన సంపాదనలో ఎక్కువగా పేద పిల్లలకు విద్యను అందించడానికి అతని స్వచ్ఛంద సంస్థ ద్వారా సాయం అందిస్తున్నాడు.18 ఏళ్ల వయసులోనే ప్రేమ.. హిందూ సాంప్రదాయంలో పెళ్లిషారుక్ సినిమాల్లోకి రాకముందే గౌరీ ఖాన్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పంజాబీ హిందువు అయిన గౌరీ చిబ్బర్ను 1991లో సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో ఆయన పెళ్లి చేసుకున్నారు. పలు సందర్భాల్లో షారుక్ తమ ప్రేమకథను పంచుకున్నారు. షారుక్ 18 ఏళ్ల వయసులో ఓ పార్టీలో గౌరీని చూశారు. తొలిచూపులోనే ఆమెను ప్రేమించారు. అప్పుడు గౌరీ వయసు 14 ఏళ్లట. ఆపై షారుక్ గౌరీ ఫోన్ నెంబర్ తెలుసుకుని.. ఫోన్లు చేసేవారట. అలా వారి మనసులు కలిసి, ఆ పరిచయం ప్రేమగా మారింది. అలా 1991 అక్టోబరు 25న వీరు వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఆర్యన్ (జననం 1997), ఒక కుమార్తె సుహానా (జననం 2000) 2013లో వారు మూడవ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు, అబ్రామ్ అనే కుమారుడు అద్దె తల్లి ద్వారా జన్మించాడు. -
పడిలేచిన కెరటం.. చిల్లిగవ్వ లేకుండా ముంబైకి.. ఇప్పుడేమో వేలకోట్లు ఆస్తి! (ఫొటోలు)
-
సినిమాలు మానేద్దామని అనుకున్నా.. అంతా షారూఖ్ వల్లే: కాజోల్
బాలీవుడ్ నటి కాజోల్ ప్రస్తుతం దో పట్టి మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజైంది. ఈ చిత్రంలో కాజోల్ తొలిసారిగా పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆదిపురుష్ భామ కృతి సనన్ కూడా నటిస్తోంది. తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న కాజోల్ అలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా షారూఖ్ ఖాన్తో తనతో చెప్పిన అనుభవాన్ని వివరించింది.సినీ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే నటనను విడిచి పెట్టాలనుకున్నట్లు కాజోల్ తెలిపింది. నా మూడో సినిమాకే చాలా అలసిపోయినట్లు అనిపించింది.. దీంతో నటనకు గుడ్ బై చెప్పాలనుకున్నా అని వెల్లడించింది. కానీ షారూఖ్ ఖాన్ మాటల వల్లే ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతున్నానని పేర్కొంది.కాజోల్ మాట్లాడుతూ..' చాలా ఏళ్ల క్రితం ఉధార్ కి జిందగీ అనే సినిమా చేశా. అదే నా మూడో సినిమా. ఆ సమయంలో ఇండస్ట్రీ చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు నా వయసు దాదాపు 18 ఏళ్లు ఉంటుంది. నేను ఆ సినిమాను పూర్తి చేశా. ఇప్పటికీ నాకు గుర్తుంది. నీకు నటన తెలుసు.. కానీ మీరు ఇంకా నేర్చుకోవాలి' అని సలహా ఇచ్చారని తెలిపింది.కాగా.. కాజోల్ 1992లో బేఖుడి మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బాజీగర్ , కరణ్ అర్జున్ , దిల్వాలే దుల్హనియా లే జాయేంగే , గుప్త్ , ఇష్క్ , కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి హిందీ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం దోపట్టి మూవీతో కనిపించనుంది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 25న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
పెళ్లి కోసం షారుఖ్ ఖాన్ పేరునే మార్చుకున్నాడా?
బాలీవుడ్ లో అందమైన జంటలలో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ ఒకరు. విరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 1991లో షారుఖ్-గౌరిల పెళ్లి జరిగింది. ఓ పార్టీలో గౌరిని చూసిన షారుఖ్.. తొలి చూపుతోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడట. తన భార్యగా గౌరీనే ఉండాలని ఫిక్స్ అయిపోయాడట. అప్పటికి షారుఖ్ వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. చాలా కాలం తర్వాత షారుఖ్ ప్రేమను గౌరి అంగీకరించింది. అయితే వీరి వివాహానికి గౌరి ఫ్యామిలీ వాళ్లు ఒప్పుకోలేదట. దీంతో షారుఖ్ పేరుని అభినవ్గా మార్చి ఫ్యామిలీ వాళ్లకి పరిచయం చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని గౌరీ గతంలో ఓ ఇంటర్యూలో చెప్పింది.‘ఇద్దరి మతం వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదట. దీంతో రిజిస్ట్రైషన్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆ తర్వాత షారుఖ్కి అభినవ్ అని పేరు మార్చి ఇంట్లో వాళ్లకి పరిచయం చేశాను. అలా పరిచయం చేస్తే షారుఖ్ హిందువు అని భావించి.. పెళ్లికి ఒప్పుకుంటారనుకున్నాను. అది చాలా సిల్లీ, చైల్డీష్ ఆలోచన’ అని గౌరి ఓ ఇంటర్యూలో చెప్పింది.చాలా గొడవల షారుఖ్-గౌరిల పెళ్లి జరిగింది. 1991 అక్టోబర్ 25న కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రేమ జంట పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత గౌరి మతం మార్చుకుంటుందని అంతా భావించారు. కానీ ఆమె మారలేదు. షారుఖ్ కూడా ఈ విషయంలో గౌరిని బలవంతం పెట్టలేదు. ‘నాలాగే షారుఖ్ కూడా అన్ని మతాలకు గౌరవం ఇస్తాడు. తన మతంలోని మారమని ఎప్పుడూ నన్ను అడగలేదు’అని ఓ ఇంటర్వ్యూలో గౌరీ ఖాన్ చెప్పొచ్చింది. ఈ ప్రేమ జంటకు ముగ్గురు సంతానం. ఆర్యన్ ఖాన్ , సుహానా, అబ్రం ఖాన్. పెళ్లి తర్వాత గౌరీ ఇంటీరియర్ డిజైనర్ గా కెరీర్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇండియాలోని టాప్ ఇంటీరియర్ డిజైనర్లలో గౌరీ ఖాన్ ఒకరు. -
‘వాచ్’ దిస్ ట్రెండ్ : కాలం కలిసొస్తోంది
బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ చేతికి ఒకసారి సుమారు 4.75 కోట్ల విలువ చేసే నీలంరంగు ఆడెమర్స్ పిగ్యూట్ వాచ్తో మెరిపించాడు. కోట్ల నుంచి ఐదు లక్షల విలువ చేసే టగ్ హెయర్ వరకు ఏడెనిమిది వాచ్లతో కనిపిస్తాడు ఎస్ఆర్కే. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అయితే నాలుగు కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె ఎఫ్ 1లో టైమ్ చూసుకుంటాడు. రామ్చరణ్ దగ్గర మూడు కోట్ల విలువ చేసే రిచర్డ్ మిల్లె నుంచి ఆరు లక్షల విలువ చేసే రోలెక్స్ యాచ్ మాస్టర్ వరకు అరడజనుకు పైగా వాచ్లున్నట్లు సమాచారం. ఇక నటీమణుల విషయానికి వస్తే నయనతార కోటికి పైగా ధర పలికే రిచర్డ్ మిల్లె ఆర్ ఎమ్ 11 వాచ్తో కాలాన్ని వాచ్ చేస్తుంది.స్మార్ట్ ఫోన్ వచ్చినా రిస్ట్ వాచ్లకు ‘కాలం’ చెల్లలేదు. నిజమే, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత రిస్ట్ వాచ్లకు కాలం చెల్లిందనిపించింది. ఓ దశాబ్దం పాటు వాచీల మార్కెట్ డీలా పడిన మాట కూడా నిజమే. అయితే ఆ రోజుల్లో కూడా సెలబ్రిటీలు, సంపన్నులు, తరచూ విదేశీ టూర్లు చేసే వాళ్లు లక్షల ఖరీదు చేసి వాచ్లు పెట్టుకోవడం మాత్రం కొనసాగింది. మన సినీ సెలబ్రిటీలైతే రిచర్డ్ మిల్లె, టగ్ హెయర్, హబ్లాట్, ఫ్రాంక్ ముల్లర్, ఆడెమర్స్ పిగ్యూట్, రాడో, పటేక్ ఫిలిప్పె, ఓమెగా, రోలెక్స్ నుంచి ఐడబ్ల్యూసీ వరకు ఐదు కోట్ల విలువ చేసే వాచ్ల నుంచి ఐదు లక్షల రూ΄ాయల వాచ్లు వాడుతున్నారు. ఈ ట్రెండ్ సెలబ్రిటీల దగ్గరే ఆగి΄ోకుండా గడచిన రెండేళ్లుగా కామన్ మ్యాన్ వరకు విస్తరించింది. ఎగువ మధ్యతరగతి, మధ్య తరగతి కూడా యాభై వేల నుంచి లక్షల రూ΄ాయల రిస్ట్ వాచ్లు కొనుగోలు చేస్తోంది. ప్రపంచ గడియారాల తయారీ కేంద్రం స్విట్జర్లాండ్ నుంచి మనదేశానికి దిగుమతి అవుతోన్న వాచ్ల సంఖ్య ఏడాదకేడాదికీ పెరుగుతోంది. 2026 నాటికి స్విస్ నుంచి వాచ్లు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ టాప్టెన్లో ఉంటుందని చెబుతున్నారు ఆ దేశ మార్కెట్ నిపుణులు. ఉంగరంలా మనదేశంలో 40 ఏళ్లుగా వేళ్లూనుకుని ఉన్న టైటాన్తో΄ాటు దాదాపు 30 కంపెనీలున్నాయి. వీటి మార్కెట్ వీటికి ఉంది. మనదేశీయ కంపెనీలు వందల నుంచి లక్షల విలువ చేసే గోల్డ్ వాచ్లు కూడా తయారు చేస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందట సంపన్న మహిళలు బంగారు వాచ్ ధరించి మురిసి΄ోయేవాళ్లు. ఇప్పుడు రోలెక్స్, రాడో కపుల్ వాచ్లు, రోజ్గోల్డ్ మీద మనసు పడుతున్నారు. యూఎస్కి చెందిన ఫాజిల్ కంపెనీ మహిళల కోసం తయారు చేస్తున్న రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వాచ్ల మీద మనసు పారేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఇండియా నుంచి యూఎస్కి మైగ్రేషన్ ఎక్కువ కావడమే. యూఎస్లో సెటిలైన యువత వాళ్ల తల్లులకు ఈ వాచ్లను బహుమతిగా ఇస్తున్నారు. దాంతో వేడుకల్లో మహిళల మణికట్టుకు రోజ్గోల్డ్ వాచ్ మెరుస్తోంది. మొత్తానికి మనదేశంలో వాచ్ల ప్రేమికులు ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ వాచ్లు కొంటున్నారు. యువతులు మాత్రం వాచ్ అంటే మణికట్టుకే ఎందుకు పెట్టుకోవాలంటూ వేలికి ఉంగరంలా ధరించే వాచ్లకు మొగ్గుచూపుతున్నారు.– వి.ఎమ్.ఆర్. -
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిన్న సినిమా.. ఏకంగా షారూక్ మూవీ రికార్డ్ బ్రేక్!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్కుమార్ రావు నటించిన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2 తాజాగా మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్లోనే దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటిస్థానంలో ఉన్న షారూఖ్ ఖాన్ జవాన్ మూవీని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం జీవితకాల కలెక్షన్లను స్త్రీ-2 అధిగమించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి జవాన్ రూ.640.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. హిందీలో మాత్రమే రూ.582.31 కోట్లు రాబట్టింది. ఈ ఏడాదిలో స్త్రీ-2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం హిందీలోనే రూ.586 కోట్ల వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని స్ట్రీ 2 నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ భారతదేశంలోనే 'ఆల్ టైమ్ నంబర్ వన్ హిందీ చిత్రం' అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది.కాగా.. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ 2లో వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ కూడా అతిథి పాత్రలు పోషించారు. గతంలో స్త్రీ (2018) చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా.. గతేడాది షారూక్- అట్లీ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ జవాన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. -
‘ధూమ్ 4’లో విలన్గా సూర్య.!
-
IIFA అవార్డ్స్ 24వ ఎడిషన్ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
షారూఖ్.. లుంగీ డ్యాన్స్ సాంగ్ తనకు నచ్చలేదన్నాడు
చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలోని పాటలన్నీ హిట్టే! అందులోని లుంగి డ్యాన్స్ సాంగ్ అయితే మరింత స్పెషల్.. అయితే ఈ పాట చేయడానికి షారూఖ్ ఖాన్ నిరాకరించాడంటున్నాడు సింగర్ హనీ సింగ్. తాజా ఇంటర్వ్యూలో మరెన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. హనీ సింగ్ మాట్లాడుతూ.. నేను, గిప్పీ కలిసి ఆంగ్రేజీ బీట్ అనే మ్యూజిక్ వీడియోను థాయ్లాండ్లో షూట్ చేశాం. ఈ సాంగ్లో దాదాపు 400 మంది అమ్మాయిలు బికినీలో కనిపిస్తారు. రేపు నా ఇంటిమీదకొస్తే..అయితే అప్పటికే పంజాబ్లో(అసభ్యకరమైన లిరిక్స్ వాడుతున్నానంటూ) నామీద కోపంతో నా దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. దీంతో గిప్పి ఈ ఆంగ్రేజీ బీట్ను పక్కన పడేద్దామన్నాడు. నువ్వు ఢిల్లీలో ఉంటావు, కాబట్టి నీ దిష్టిబొమ్మలు తగలబెట్టినా బేఖాతరు చేస్తున్నావు. కానీ నేను పంజాబ్లోనే ఉంటాను. వాళ్లు మా ఇంటికి వచ్చి గొడవ చేసినా చేస్తారని భయపడ్డాడు. ఈ వీడియోను రిలీజ్ చేయకుండా ఆపేద్దామన్నాడు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించా..దానికోసం అంత ఖర్చు పెట్టింది ఇలా ఆపేయడానికా? అని చాలాసేపు వాదించాను. పంజాబ్లో తిరస్కరిస్తారేమో కానీ బెంగళూరు, హైదరాబాద్, వారణాసి.. ఇలా ఇతర నగరాల్లో కచ్చితంగా ఆదరిస్తారని నచ్చజెప్పేందుకు ప్రయత్నించాను. కానీ అతడు మాత్రం ఆ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే నాతో మాట్లాడనని శపథం చేశాడు. దీంతో ఆ మ్యూజిక్ వీడియోను పక్కన పడేయక తప్పలేదు.రెండూ సూపర్ హిట్ఆంగ్రేజీ బీట్ లాంటిదే ఓ సాంగ్ కావాలని కాక్టైల్ సినిమాటీమ్ అడిగింది. అలాంటిది వద్దని పార్టీ ఆల్ నైట్ కంపోజ్ చేసిచ్చాను. కానీ వాళ్లు మాత్రం ఆంగ్రేజీ బీట్నే తీసుకున్నారు. పార్టీ ఆల్ నైట్ మరొకరు కొనుక్కున్నారు. రెండూ సూపర్ హిట్టయ్యాయి. దీంతో ఇలాంటిదే ఇంకోటి కావాలని చెన్నై ఎక్స్ప్రెస్ టీమ్ అడిగింది. సరేనని లుంగీ డ్యాన్స్ కంపోజ్ చేశాను.షారూఖ్కు నచ్చలేదుకానీ షారూఖ్ ఖాన్ అది తనకు నచ్చలేదని రిజెక్ట్ చేశాడు. నేను నిరాశతో నిర్మాత భూషణ్ కుమార్ దగ్గరకు వెళ్లి సాంగ్ వినిపించాను. అప్పుడతడు ఇది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందన్నాడు. నిజానికి ఈ పాటను ప్రైవేట్గా రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ దర్శకుడు రోహిత్ శెట్టి సినిమా కోసం తీసుకున్నారు అని చెప్పాడు. బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఐఎండీబీలో...రెండో స్థానంలో శోభిత... మూడో స్థానంలో షారుక్
ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ (2013) విజేతగా, మోడల్గా ‘గూఢచారి, మేజర్’ వంటి తెలుగు చిత్రాలతో, హిందీ ‘రామన్ రాఘవ్ 2.ఓ’ చిత్రంతో, ‘మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్’ వంటి సిరీస్లతో... ఇలా శోభితా ధూళిపాళ్ల చాలా పాపులార్టీ సంపాదించుకున్నారు. అయితే హీరో నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత ఒక్కసారిగా వార్తల్లో ట్రెండింగ్గా నిలిచారామె.అందుకు నిదర్శనం ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ‘ఐఎండీబీ’ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) తాజాగా రిలీజ్ చేసిన భారతీయ సెలబ్రిటీల జాబితా. ఈ జాబితాలో శోభిత రెండో స్థానంలో నిలిచారు. గత వారానికి సంబంధించిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్ను ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ (‘ముంజ్యా’ మూవీ ఫేమ్) తొలి స్థానంలో నిలవగా, శోభిత ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్కి మూడో స్థానం దక్కింది. నాగచైతన్య–శోభితల నిశ్చితార్థం ఈ నెల 8న హైదరాబాద్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు ఆమె గురించి గూగుల్లో సెర్చ్ చేశారు. ఈ కారణంగా గత వారం ఇండియన్ పాపులర్ సెలబ్రిటీగా నిలిచారు శోభిత. ఇక ‘ఐఎండీబీ’ జాబితాలో కాజోల్ నాలుగో స్థానం, జాన్వీ కపూర్ ఐదో స్థానం, బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఆరు, దీపికా పదుకోన్ ఏడు, విజయ్ సేతుపతి ఎనిమిది, మృణాల్ ఠాకూర్ తొమ్మిది, ఐశ్వర్యా రాయ్ పదో స్థానాల్లో నిలిచారు. -
ఫిల్మ్ ఫెస్టివల్లో షారూఖ్ సందడి.. హీరో తీరుపై నెటిజన్స్ ఫైర్!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్లో ఆయన సందడి చేశారు. ఈ సందర్భంగా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. పార్డో అల్లా కారియేరా అస్కోనా-లోకార్నో టూరిజం అవార్డును అందుకున్నారు. ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి భారతీయ నటుడిగా బాలీవుడ్ బాద్షా నిలిచారు. అయితే ఈవెంట్ పాల్గొన్న తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహిళలను డీగ్రేడ్ చేసి చూపించే చిత్రాల్లో నటించడం తనకు ఇష్టముండదని చెప్పారు.అయితే ఈవెంట్లో బాలీవుడ్ బాద్షా చేసిన పనికి విమర్శలు ఎదుర్కొంటున్నారు. వేదికపై ఉన్న ఓ పెద్దాయనను పక్కకు తోసివేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ షారూఖ్ తీరును తప్పుబడుతున్నారు. ఇలాంటి ప్రవర్తన సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీ అయి ఉండి ఓ పెద్దాయనతో ఇలా ప్రవర్తించడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే షారూక్ కావాలని అలా చేయలేదని.. ఏదో సరదాగా అలా చేశారని కింగ్ ఖాన్కు మద్దతుగా నిలుస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే బాలీవుడ్ బాద్షా చివరిసారిగా డుంకీ చిత్రంలో కనిపించారు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో తాప్సీ, విక్కీ కౌశల్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. . #ShahRukhKhan he pushed that old man!!! Shame on you @iamsrk pic.twitter.com/eA1g3G66xb— Azzmin✨ SIKANDAR🗿 (@being_azmin) August 10, 2024 -
బాలీవుడ్ బాద్షాకు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్ సొంతం! (ఫొటోలు)
-
అలా చేస్తే డైరెక్ట్గా చావును అమ్మినట్లే: జాన్ అబ్రహం కామెంట్స్!
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం యాక్షన్-థ్రిల్లర్ వేదా సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాలో తమన్నా, శార్వరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిఖిల్ అద్వానీ డైరెక్షన్లో.. జీ స్టూడియోస్, ఎమ్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 15న థియేటర్లలో వచ్చేందుకు సిద్ధమైంది. దీంతో చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది.ఈ సందర్భంగా హీరో జాన్ అబ్రహం ఆసక్తికర కామెంట్స్ చేశారు. పాన్ మసాలా యాడ్స్లో నటిస్తున్న హీరోలపై విమర్శలు చేశారు. ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టే ఉత్పత్తులను ప్రచారం చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. అభిమానులకు తాను రోల్ మోడల్గా ఉండాలని కోరుకుంటానని తెలిపారు.జాన్ అబ్రహం మాట్లాడుతూ.. 'నేను నిజాయితీగా జీవిస్తేనే రోల్ మోడల్గా ఉంటా. ఒకవేళ ఫేక్ ప్రచారాలు చేస్తే తొందరగా దాన్ని గుర్తిస్తారు. ఇక్కడ కొందరు ఫిట్నెస్ గురించి మాట్లాడతారు. కానీ అదే వ్యక్తులు పాన్ మసాలా గురించి ప్రచారం చేస్తారు. నేను నా సహ నటులందరినీ గౌరవిస్తా. ఇక్కడ కేవలం నా గురించే మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను మరణాన్ని అమ్మాలనుకోవడం లేదు. మనదేశంలో పాన్ మసాలా వార్షిక టర్నోవర్ రూ.45 వేల కోట్లు అని మీకు తెలుసా? అంటే ప్రభుత్వం కూడా దీనికి మద్దతిస్తోంది. అందుకే ఇక్కడ చట్టవిరుద్ధం కాదు. వీటి గురించి ప్రచారం చేసే సెలబ్రిటీలు ఇన్డైరెక్ట్గా చావును ప్రజలకు అమ్మినట్లే. అలా వచ్చిన డబ్బులతో మీరెలా బతుకుతున్నారు' అని విమర్శించారు. కాగా.. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ పాన్ మసాలా ప్రకటనలు నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఇలాంటి యాడ్స్లో పాల్గొనబోనని అక్షయ్ ప్రకటించాడు. కాగా.. జిస్మ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన జాన్ అబ్రహం.. ఆ తర్వాత ధూమ్, గరం మసాలా, టాక్సీ నెం 9211, దోస్తానా, ఫోర్స్, దేశీ బాయ్జ్, రేస్ 2, పఠాన్ వంటి చిత్రాల్లో నటించారు. -
పంజాబ్ కింగ్స్ ఓనర్తో షారుక్ ఖాన్ తీవ్ర వాగ్వాదం.. కారణమిదే?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్లు చర్చనీయాంశంగా మారాయి. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని రూ.120 కోట్లకు పెంచాలని, కనీసం ఆరుగురిని రిటైన్ చేసుకొనే వెసులుబాటు కల్పించాలని ప్రాంఛైలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని బుధవారం( జులై 31) జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్లో ఆయా ప్రాంఛైజీల ఓనర్లు ప్రస్తావించారు. కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం అందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. అందుకు బదులుగా ముగ్గురు ఆన్ క్యాప్డడ్ ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని ఒకట్రెండు ఫ్రాంచైజీల ఓనర్ల మినహా దాదాపు అందరూ అంగీకరించినట్లు వినికిడి. అయితే ఇదే విషయంపై కోల్కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, పంజాబ్ కింగ్స్ సహ-యజమాని నెస్ వాడియా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం.. షారుక్ ఖాన్ కచ్చితంగా రిటైన్ చేసే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని పట్టు పట్టినట్లు సమాచారం. కానీ నెస్ వాడియా మాత్రం ఎక్కువ మందిని రిటైన్ చేసుకునే వీలు కల్పించవద్దని, మెగా వేలం వైపు మెగ్గు చూపినట్లు క్రిక్ బజ్ పేర్కొంది. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్- నెస్ వాడియా మాటల యుద్దం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రూల్ ప్రకారం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను మాత్రం రిటైన్ చేసుకునే అవకాశముంది. -
విలన్గా అభిషేక్ బచ్చన్.. షారుఖ్తో ఢీ!
షారుక్ ఖాన్ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో అభిషేక్ బచ్చన్ విలన్గా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. షారుక్ ఖాన్ , ఆయన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్స్లో సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో ‘కింగ్’ తెరకెక్కనుంది. (చదవండి: ఇండస్ట్రీ అంతా ఒకే వెబ్ సిరీస్లో నటిస్తే.. ఇది అదే)ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ మూవీలో విలన్ రోల్ కొత్తగా ఉంటుందట. ఈ రోల్కు అభిషేక్ బచ్చన్ను సంప్రదించారట సుజోయ్ ఘోష్. నెగటివ్ రోల్ కావడంతో మొదట కాస్త విముఖతను వ్యక్తం చేసిన అభిషేక్.. పాత్రలోని డెప్త్, ప్రత్యేకత నచ్చడంతో ఫైనల్గా ఓకే చె΄్పారని బాలీవుడ్ సమాచారం. -
బాలీవుడ్ బాద్షాకు ప్రతిష్టాత్మక అవార్డ్!
బాలీవుడ్ బాద్షా గతేడాది జవాన్, పఠాన్, డుంకీ చిత్రాలతో అభిమానులను అలరించాడు. జవాన్, పఠాన్ బ్లాక్బస్టర్ హిట్ కాదగా.. డిసెంబర్లో రిలీజైన రాజ్ కుమార్ హిరానీ చిత్రం డుంకీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే ప్రస్తుతం షారుక్ ఎలాంటి ప్రాజెక్ట్లోను నటించడం లేదు. తాజాగా మన బాలీవుడ్ హీరో అరుదైన ఘనత దక్కించుకున్నారు. లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ కెరీర్ అచీవ్మెంట్ అవార్డ్కు ఎంపికయ్యారు.ఈ విషయాన్ని ఫెస్టివల్ సైట్ అధికారికంగా ప్రకటించింది. భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసినందుకు అవార్డ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన జరగనున్న లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ అవార్డ్ను అందుకోనున్నారు. అంతేకాకుండా ఈ వేడుకలో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన దేవదాస్ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. గతంలో సాయ్ మింగ్-లియాంగ్, క్లాడియా కార్డినాలే, జానీ టో, ఫ్రాన్సిస్కో రోసీ, హ్యారీ బెలాఫోంటే, జేన్ బిర్కిన్ వంటి హాలీవుడ్ ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. -
ఈఎమ్ఐ కట్టకపోవడంతో షారూఖ్ కారు తీసుకెళ్లారు: హీరోయిన్
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ షారూఖ్ ఖాన్. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చి ఎన్నో కష్టాలు పడుతూ, పంటి కింద బాధల్ని భరిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్లో సూపర్ స్టార్గా ఎదిగాడు. సినిమాల్లోకి రావాలనుకునే చాలామందికి ఆయనొక ఇన్స్పిరేషన్. ఈ సక్సెస్ అంత ఈజీగా రాలేదని, తొలినాళ్లలో చాలా కష్టాలు పడ్డాడంటోంది హీరోయిన్ జుహీ చావ్లా.నాకు ఇప్పటికీ గుర్తు..ఇటీవల ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. షారూఖ్ ఇబ్బంది పడ్డ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. తనకు ముంబైలో ఇల్లు లేదు. ఢిల్లీ నుంచి వచ్చేవాడు. తనకు వంట చేసేవారు లేరు. ఎక్కడ ఉండేవాడో తెలీదు. సెట్లో అందరి కోసం చేసిన వంటను ఆరగించేవాడు. సెట్లోని వారితో కలివిడిగా ఉండేవాడు. ఎల్లప్పుడూ నవ్వుతూ, నవ్విస్తుండేవాడు.గడియారంతో పోటీపడుతూ..అప్పట్లో తనకు జిప్సీ కారుండేది. అందులోనే వచ్చేవాడు. మూడు షిఫ్టుల్లోనూ పని చేసేవాడు. మేమిద్దరం రాజు బన్గయా జెంటిల్మెన్, దిల్ ఆష్నా హై సినిమాల్లో కలిసి పని చేశాం. అప్పుడే దివ్య భారతితో మరో మూవీ చేశాడు. గడియారంతో పోటీపడి వర్క్ చేసేవాడు. ఏదో కారణాల వల్ల తన కారు ఈఎమ్ఐ కట్టలేకపోయాడు. ఇప్పుడీ స్థాయిలో..దీంతో అతడి కారును తీసుకెళ్లిపోయారు. అప్పుడు దిగాలుగా సెట్కు వచ్చాడు. నువ్వేం బాధపడకు.. భవిష్యత్తులో ఎన్నో కార్లు కొనే స్థాయికి ఎదుగుతావు.. చూస్తూ ఉండు అని చెప్పాను. ఇప్పుడు ఆయన ఏ రేంజ్లో ఉన్నాడో మీరూ చూస్తున్నారు అని చెప్పుకొచ్చింది. కాగా షారూఖ్ కారును తీసుకెళ్లిన సమయంలో జుహీ చావ్లా తన కారును వాడుకోమని ఇచ్చింది.చదవండి: అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్ -
లండన్లో బాలీవుడ్ బాద్షా ఇల్లు.. వీడియో వైరల్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అత్యధిక పారితోషకాలు తీసుకునే హీరోల్లో ముందు వరుసలో ఉంటారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. షారుఖ్కు లండన్లో ఉన్న ఇంటికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్లో బయటకు వచ్చింది.షారుఖ్ ఖాన్ లండన్ ఇల్లు ఇదేనంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ యూజర్ వీడియోను పోస్ట్ చేశారు. 'ఇది లండన్ లోని షారుఖ్ ఖాన్ ఇల్లు' అని లండన్ లోని పార్క్ లేన్ లోని 117లో ఉన్న ఈ ఇంటి వీడియోను షేర్ చేస్తూ ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ రాసుకొచ్చాడు. 'ఇల్లు మొత్తం తనది కాదు.. అతని ఫ్లాట్ కింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది' అని కామెంట్స్ సెక్షన్ లో ఓ యూజర్ పేర్కొన్నారు. లండన్ లోని విలాసవంతమైన మేఫేర్ పరిసరాల్లో షారుఖ్కు అనేక ఆస్తులు ఉన్నాయని మరొకరు కామెంట్ చేశారు.ఎంతకు కొన్నాడంటే..మాంచెస్టర్ ఈవెనింగ్ న్యూస్లో 2009లో వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. షారుఖ్ ఖాన్ పార్క్ లేన్ లోని ఈ అపార్ట్ మెంట్ను 20 మిలియన్ పౌండ్లు పెట్టి కొన్నారు. భారత్ బయట ఒక ప్రాపర్టీ కోసం ఏ బాలీవుడ్ స్టార్ ఇంత అధిక మొత్తం వెచ్చించలేదని నివేదిక పేర్కొంది. View this post on Instagram A post shared by Asif Iqbal (Ovee) | London & Travel 🛫 (@beingovee) -
స్టార్ హీరో సరసన సమంత.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎలాంటి సినిమాలో నటించడం లేదు. అందుకే ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉంది. ఇటీవలే ఇషా ఫౌండేషన్లో సామ్ మెరిసింది. అక్కడ ధ్యానం చేస్తూ ఉన్న ఫోటోలను తన ఇన్స్టా ద్వారా పంచుకున్నారు. గతేడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న భామ.. పూర్తిగా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.అయితే తాజాగా సమంత ఓ క్రేజీ కాంబోలో పని చేయనున్నట్లు వార్త తెగ వైరలవుతోంది. ఏకంగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సరసన నటించనుందని బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. రాజ్కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలొచ్చాయి. కాగా.. గతేడాది ఆయన డైరెక్షన్లో వచ్చిన డుంకీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.అయితే షారూఖ్ సరసన సమంత నటిస్తోందన్న వార్తలను రాజ్ కుమార్ హిరానీ సన్నిహితులు కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్ రాసే దశలోనే ఉన్నారని తెలిపారు. ఈ సినిమాకు నటీనటులను ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. ఈ వార్తలన్నీ ఫేక్ అని డైరెక్టర్ సన్నిహితులు వెల్లడించారు. ఏ ప్రాజెక్ట్కి సంబంధించి షారుఖ్, సమంతతో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు.కాగా.. 2022 ఇంటర్వ్యూలో సమంత ఒకసారి షారుఖ్పై తన అభిమానాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన డ్రీమ్ కో-స్టార్స్ ఎవరని అడిగినప్పుడు.. మహేష్ బాబు, సూర్య, షారూఖ్ పేర్లను సామ్ చెప్పింది. నేను ఇప్పటికీ షారుఖ్ ఖాన్తో కలిసి పని చేయలేదు.. నా కల ఇప్పటికీ నిజం కాలేదు సమంత వ్యాఖ్యానించింది.మరోవైపు షారూక్ తదుపరి చిత్రం ది కింగ్లో తన కుమార్తె సుహానా ఖాన్తో కలిసి నటించనున్నాడు. దీనికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను రూ. 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
ఎస్ఆర్కె సినిమాకి ఎస్?
షారుక్ ఖాన్ని బాలీవుడ్లో ఎస్ఆర్కె అని పిలుస్తాంటారని అందరికీ తెలిసిన విషయమే. ఎస్ఆర్కే సరసన సమంత హీరోయిన్గా నటించనున్నారన్నది తాజా టాక్. ఈ చిత్రంలో నటించడానికి సమంత దాదాపు ‘ఎస్’ చెప్పారట. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ సినిమా పోందనుందని టాక్.దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ అడ్వంచరస్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ఆగస్ట్ 15న ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉందని భోగట్టా. కాగా... ఇప్పటికే సమంత ఫలానా హిందీ చిత్రంలో నటించనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అవేవీ నిజం కాలేదు. కానీ ఎస్ఆర్కె–సమంత కాంబినేషన్ సినిమా నిజం అవుతుందని హిందీ చిత్రసీమ అంటోంది. -
రూ. 6300 కోట్లతో రిచెస్ట్ హీరోగా షారూఖ్ : మరి ఐకాన్ స్టార్ సంపద ఎంత?
బాలీవుడ్ సూపర్ స్టార్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ దేశంలోనే అత్యంత సంపన్న నటుడిగా నిలిచాడు. దశాబ్దాల కరియర్లో అనేక బ్లాక్ బ్లస్టర్లు, సూపర్హిట్ మూవీలతో బాక్సాఫీసు కలెక్షన్లలో దుమ్ము రేపి రారాజుగా నిలిచాడు. ఇటీవలి కాలంలో కొన్ని ఫ్లాప్ మూవీలు, సౌత్ సినిమా హవా ఉన్నప్పటికీ, 'జవాన్' ,పఠాన్' సినిమాల విజయవంతంతో షారుఖ్ ఖాన్ నికర విలువ గణనీయంగా పెరిగింది. అందుకే సంపాదనలో టాప్లో నిలిచాడు.ఇటీవల, IMDb డేటా సహాయంతో, ఫోర్బ్స్ భారతదేశంలోని టాప్ టెన్ ధనవంతుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉత్తర ,దక్షిణ భారత నటీనటులు ఉన్నారు. ఈ జాబితాలో ఏకంగా 6300 కోట్ల నికర విలువో షారూఖ్ ఖాన్ టాప్లో నిలిచాడు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, రజనీకాంత్ వంటి ఇతర నటీనటులు ఈ జాబితాలో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. షారూఖ్ కరియర్లో జవాన్, పఠాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.20000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ‘డుంకీ’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించింది..ఇక ఈ లిస్ట్లో రూ. 2900 కోట్ల నికర సంపదతో స్టార్హీరో సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. సల్మాన్ చిత్రం ‘టైగర్ 3’ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 466.63 కోట్లను వసూలు చేసింది.అక్షయ్ కుమార్ నికర విలువ దాదాపు 2500 కోట్లు ఉంటుందని అంచనా. 'OMG 2' కుమార్ అతిథి పాత్రను చూసింది , ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 221 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ నటుడు తరువాత చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్.'ఇక బాలీవుడ్ మరో సూపర్ స్టార్ అమీర్ ఖాన్1862 కోట్ల నికర సంపదతో నాలుగో స్థానంలో నిలిచాడు. విజయ్ నికర విలువ దాదాపు రూ. 474 కోట్లుగా లెక్కించారు. రజనీకాంత్ నికర విలువ దాదాపు 430 కోట్లు. టాలీవుడ్కి సంబంధించి పుష్ప సినిమాతో కలెక్షన్ల సునామీ రేపిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నికర విలువ 350 కోట్లుగా ఉండగా, ప్రభాస్ నికర విలువ 241 కోట్ల రూపాయలు. అజిత్ కుమార్ నికర విలువ రూ.196 కోట్లు. కమల్ హాసన్ 150 కోట్ల రూపాయలతో 10వ స్థానంలో నిలిచారు. -
షారూఖ్ ఖాన్కు యాటిట్యూడ్? బిగ్బీని తక్కువ చేసి..
ఫలానా హీరోకు టెక్కు ఎక్కువ.. ఆ దర్శకుడికి ముక్కు మీద కోపం.. ఈ మ్యూజిక్ డైరెక్టర్కైతే పొగరు.. ఇలా ఇండస్ట్రీలోని తారల గురించి నెగెటివ్గా చాలామంది మాట్లాడుకుంటారు. అందులో ఎంత నిజం? ఎంత అబద్ధమనేది ఎవరికీ తెలియదు. అలా షారూఖ్ ఖాన్కు యాటిట్యూడ్ అని తానూ విన్నానంటున్నాడు బాలీవుడ్ నటుడు దేవన్ భోజని.యాటిట్యూడ్..తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'జో జీతా వోహి సికిందర్ సినిమా తర్వాత ఓ మూవీలో షారూఖ్ ఫ్రెండ్గా నాకు ఛాన్స్ వచ్చింది. అప్పటికే తనకు యాటిట్యూడ్ ఉందని విన్నాను. దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ గురించి కూడా చెడుగా మాట్లాడతాడని ఎక్కడో చూశాను. ఫస్ట్ డే సెట్కు వెళ్లగానే నన్ను నేను అందరికీ పరిచయం చేసుకున్నాను. అయితే షారూఖ్ దగ్గరకు వెళ్లాలనేసరికి మాత్రం అవసరమా? అనిపించింది. నేనెవరనేది తెలుసునా పేరు దేవన్ అని పరిచయం చేసినప్పుడు అయితే ఏంటి? అని వెటకారంగా మాట్లాడతాడేమోనని ఏదేదో ఊహించుకున్నాను. ఇంతలో వెనక్కు తిరిగేసరికి తనే నిలబడ్డాడు. హాయ్, నేను షారూఖ్.. జో జీతా వోహి సికిందర్ సినిమాలో మీరు చాలా బాగా యాక్ట్ చేశారు అని మెచ్చుకున్నాడు. నేనెవరనేది తనకు తెలుసా? అని ఆశ్చర్యపోయాను.ప్రశంసలునా సినిమా చాలా నచ్చిందన్నాడు. తన గురించి విన్నదంతా పచ్చి అబద్ధమేనని అప్పుడర్థమైంది. తను చాలా బాగా కలిసిపోతాడు' అని చెప్పుకొచ్చాడు. కాగా దేవన్, షారూఖ్ 1994లో యే లంహే జుడాయికె సినిమాలో కలిసి నటించారు. కానీ ఈ చిత్రం చాలా ఆలస్యంగా 2004లో విడుదలైంది.చదవండి: అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేశ్ బాబు -
అత్యంత విలువైన సెలబ్రిటీగా విరాట్ కోహ్లి.. రణ్వీర్, షారుఖ్లకు వెనక్కు నెట్టి..!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భారత దేశపు అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. సెలబ్రిటి బ్రాండ్ వాల్యుయేషన్ నివేదిక (KROLL) ప్రకారం కోహ్లి బ్రాండ్ వాల్యూ 2023 సంవత్సరంలో రూ. 1901 కోట్లకు చేరింది. 2022తో పోలిస్తే గతేడాది కోహ్లి ఓవరాల్ బ్రాండ్ వాల్యూ 29 శాతం మేర పెరిగింది. 2022లో రెండో స్థానంలో నిలిచిన కోహ్లి.. గతేడాది బాలీవుడ్ స్టార్లు రణ్వీర్ సింగ్ (రూ. 1693 కోట్లు), షారుఖ్ ఖాన్లను (రూ. 1001 కోట్లు) అధిగమించి భారత దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా అవతరించాడు. కోహ్లి 2017 నుంచి వరుసగా (మధ్యలో 2022లో రెండో స్థానం) ఆరు సార్లు భారత దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.క్రికెట్కు సంబంధించి భారత దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో కోహ్లి తర్వాతి స్థానంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు.ప్రస్తుతం టీ20 వరల్డ్కప్ 2024తో బిజీగా ఉన్న కోహ్లి గతేడాది వన్డే ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలువడంతో పాటు ఆ ఏడాదంతా పలు బ్యాటింగ్ రికార్డులు కొల్లగొట్టాడు. 35 ఏళ్ల కోహ్లి ఈ ఏడాది ఐపీఎల్లోనూ అదరగొట్టాడు. ఈ పరుగుల యంత్రం 2024 ఐపీఎల్ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. కోహ్లి 2023 ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో విరాట్ ఆశించిన మేర రాణించనప్పటికీ టీమిండియా సూపర్-8కు చేరింది. సూపర్-8లో భారత్.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్లతో తలపడనుంది. -
చివరిసారిగా అడుగుతున్నా.. ఒక్కసారి వచ్చిపో షారూఖ్..
పాఠాలు నేర్పిన గురువు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. కానీ అభిమాని పేరు చెప్పగానే కదల్లేని స్థితిలో ఉన్న ఆయన కళ్లలో ఒక మెరుపు. అది చూసిన కాంగ్రెస్ లీడర్ సజరిత లైఫ్లాంగ్.. ఎలాగే ఆ శిష్యుడిని గురువు ముందు హాజరుపర్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం అలాగైనా ఆయన ఆరోగ్య పరిస్థితిలో కాస్త మార్పు వస్తుందని భావిస్తున్నారు.క్షీణిస్తున్న ఆరోగ్యంఆ శిష్యుడు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్. షారూఖ్ గురువు ఎరిక్ డిసౌజ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ విషయాన్ని డిసౌజ సోదరి సజరిత లైఫ్లాంగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'నా సోదరుడు ఎరిక్ డిసౌజ హెల్త్ కండీషన్ దిగజారుతోంది. సరిగా మాట్లాడలేకపోతున్నాడు. ప్లీజ్ షారూఖ్.. ఒక్కసారి ఆయనను చూడటానికి రా.. క్షణాలు గడిచేకొద్దీ తనకేం జరుగుతుందోనని భయంగా ఉంది. ముంబై నుంచి గోవా రావడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. కొన్ని నిమిషాలు చాలుఒక అరగంటలో వచ్చేయొచ్చు. కేవలం కొన్ని నిమిషాల సమయం తన కోసం కేటాయించు. ఇప్పుడాయనకు మీరే ప్రపంచం. మీ రాక వల్ల తను కోలుకునే అవకాశం ఉంది. లేదంటే తన కళ్లముందు కమ్ముకున్న చీకటి నుంచి విముక్తి లభించి శాంతి చేకూరవచ్చు. చివరిసారిగా అడుగుతున్నాను.. మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నాను' అని అభ్యర్థించారు. షారూఖ్కు, ఎరిక్ డిసౌజకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఓ పాత వీడియోను సైతం షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు షారూఖ్.. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న తన గురువును చూసేందుకు వెళ్లాలని కోరుతున్నారు. This feels like my final plea, my last attempt to reach out to @iamsrk to humbly request his presence by the side of Brother Eric S D'Souza. Each day, Brother 's health weakens, his condition worsening with every passing moment. Mumbai, just an hour away by flight, holds the… pic.twitter.com/9HaCjp5gLv— Szarita Laitphlang,ज़रिता लैतफलांग (@szarita) June 14, 2024 https://t.co/6QcjlFVvLj— Szarita Laitphlang,ज़रिता लैतफलांग (@szarita) June 15, 2024చదవండి: 'మహారాజ'.. విజయ్ సేతుపతి నన్ను తీసుకోవద్దన్నారు: నటి -
షారూఖ్ ఖాన్ కంటే నేనే ఎక్కువ సంపాదించా..
షారూఖ్ ఖాన్ కంటే తానే ఎక్కువ సంపాదించానంటోంది కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదివేయండి.. ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే షారూఖ్ ఖాన్ తొలిసారి వెండితెరపై కనిపించింది దీవానా చిత్రంలో! ఈ మూవీతోనే అతడి కెరీర్ ఆరంభమైంది. నిజానికి అతడు ఫస్ట్ సంతకం చేసింది కబీ హా కబీ నా సినిమాకు.. తొలిసారి కెమెరా ముందుకు వచ్చిందీ ఈ సినిమాకే! ఈ సినిమాకు ఫరా ఖాన్ కొరియోగ్రాఫర్గా వ్యవహరించింది.నాకే ఎక్కువ..తాజాగా ఫరా ఖాన్ ఆ సినిమా విశేషాలను చెప్పుకొచ్చింది. కబీ హా కబీ నా తక్కువ బడ్జెట్లోనే పూర్తి చేశారు. ఈ సినిమాకుగానూ షారూఖ్ ఖాన్కు రూ.25,000 ఇచ్చారు. అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ నాకే ఇచ్చారు. అదెలాగంటే.. ఒక్క పాటకు రూ.5,000 చొప్పున ఆరు పాటలకుగానూ రూ.30,000 ఇచ్చారు. అప్పట్లో అసిస్టెంట్ను పెట్టుకునేంత సీన్ కూడా లేదు.ఫ్రెండ్షిప్కాబట్టి ఆ జీతం అంతా నేను మాత్రమే తీసుకున్నాను. పైగా ఆనా మేరే ప్యార్ కో పాట కోసం బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్లకు బదులుగా గోవాలో ఉన్న జనంతోనే షూటింగ్ కానిచ్చేశాం అని తెలిపింది. ఈ సినిమా నుంచే షారూఖ్- ఫరా ఖాన్ మధ్య స్నేహ బంధం బలపడింది. ఫరా ఖాన్ దర్శకత్వంలో షారూఖ్.. మై హూనా, ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ వంటి చిత్రాల్లో నటించాడు.చదవండి: రాజకీయాల కంటే సినిమాలే నయం: కంగనా రనౌత్ -
మోదీ ప్రమాణస్వీకారం.. అంబానీ, షారుక్ ఫోటో వైరల్
భారత ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన మోదీ ప్రమాణ స్వీకారోత్సవం కన్నులపండువగా జరిగింది. రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు.. ఇలా ఎందరో ఈ వేడుకలో తళుక్కుమని మెరిశారు. వారిలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్.. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఉన్నారు. ఓఆర్ఎస్ తాగుతూ..పక్కపక్కనే కూర్చున్న వీళ్లిద్దరూ ఓఆర్ఎస్ డ్రింక్తో దర్శనమిచ్చారు. ఇంకేముంది.. వారిని క్లిక్మనిపించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో ధనవంతులైన వీరు ఖరీదైన డ్రింక్స్కు బదులుగా దాదాపు రూ.30 ఉంటే ఓఆర్ఎస్ డ్రింక్ తాగుతున్నారని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇదే బెటర్'సోడా సహా ఇతర డ్రింక్స్ కంటే ఇదే నయం.. ఇప్పుడున్న వాతావరణానికి ఓఆర్ఎస్ తాగితేనే బెటర్. పైగా ఈ మధ్యే షారూఖ్కు వడదెబ్బ తగిలింది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే', 'హే.. ఈరోజు నేను కూడా ఇదే ఓఆర్ఎస్ తాగాను' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా గత నెల షారూఖ్ వడదెబ్బ కారణంగా అహ్మదాబాద్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే! ORS 👍 pic.twitter.com/C24eNG6UYx— sonal. (@sonaluwu) June 9, 2024 HQ pictures of Shah Rukh Khan & Mukesh Ambani at Rashtrapati Bhavan earlier today for PM Narendra Modi's Oath Ceremony ♥️#ShahRukhKhan pic.twitter.com/HlUE9lV7PU— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) June 9, 2024చదవండి: నిర్మాతగా బాలకృష్ణ కూతురు.. సినిమా ప్రకటించిన బోయపాటి -
నా బయోపిక్లో ఈ హీరోల్లో ఎవరు నటించినా ఓకే.. నేను కూడా..
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తాజాగా ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరైంది. బాక్సర్ మేరీ కోమ్, బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్, షార్ప్ షూటర్ సిఫ్త్ కౌర్తో కలిసి ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా కపిల్ శర్మ సానియాను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ప్రియాంక చోప్రా మేరీ కోమ్ బయోపిక్లో నటించింది. ప్రియాంక కజిన్ పరిణతి చోప్రా.. సైనా నెహ్వాల్ బయోపిక్లో మెరిసింది. మంచి నటీనటులు ఎందరో..మరి మీ జీవిత చరిత్ర కథ సంగతేంటి? అని ఆరా తీశాడు. అందుకు సైనా నవ్వుతూ.. మన దేశంలో చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నారు. ఎవరు నటించినా నాకు ఓకే.. లేదంటే నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే కపిల్ శర్మ.. నువ్వు ప్రేమించే వ్యక్తి పాత్రలో నటించాలనుందని గతంలో షారుక్ ఖాన్ చెప్పాడని గుర్తు చేశాడు. అందుకు సానియా.. అలాగైతే ముందు నేనెవర్నైనా ప్రేమించాలి కదా! అని బదులిచ్చింది.ఆ హీరోలైతేనే..షారుక్ ఖాన్ లేదా అక్షయ్ కుమార్ నా బయోపిక్లో నటిస్తానంటే కచ్చితంగా నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. కాగా సానియా మీర్జా- షోయబ్ మాలిక్ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే! సానియాకు విడాకులిచ్చిన వెంటనే షోయబ్ పాకిస్తాన్ నటి సనా జావెద్ను మూడో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు! -
ప్రేమించే వ్యక్తి కావాలి కదా: సానియా మీర్జా వ్యాఖ్యలు వైరల్
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం ప్రేమించే వ్యక్తిని వెతుక్కోవాల్సిన స్థితిలో ఉన్నానని పేర్కొన్నారు. కాగా సానియా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైన విషయం తెలిసిందే.ఎంతగానో ప్రేమించి.. ఆటంకాలను ఎదురించి పెళ్లాడిన పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆమెను మోసం చేశాడనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య పొరపొచ్చాలు తలెత్తాయని విడాకులు తీసుకుంటారనే ప్రచారం జరిగింది.అయితే, వీరిద్దరూ ఈ విషయంపై నేరుగా నోరు విప్పలేదు. కానీ.. షోయబ్ మాలిక్ ఏకంగా నటి సనా జావెద్ను పెళ్లాడి.. ఫొటోలతో షాకిచ్చాడు. దీంతో సానియా- షోయబ్ల బంధం ముక్కలైందని అందరికీ తెలిసిపోయింది.ఈ క్రమంలో సానియా మీర్జా కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. సానియా తనంతట తానుగా షోయబ్ నుంచి విడాకులు తీసుకుందని స్పష్టం చేసింది. ఏదేమైనా అతడి జీవితం బాగుండాలని సానియా ఆశిస్తున్నట్లు తెలిపింది.ఇదిలా ఉంటే.. విడాకుల తర్వాత సానియా మీర్జా తన కుమారుడు ఇజహాన్తో కలిసి దుబాయ్లో ఎక్కువగా గడుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సానియా మీర్జా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.కాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గతంలో ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘సానియా బయోపిక్ తీసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అన్నీ కుదిరితే నేనే ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తాను. ఒకవేళ ఆమె ఒప్పుకుంటే తనకు జంట(ప్రియుడి)గా కూడా నటిస్తాను’’ అని పేర్కొన్నాడు.ఈ క్రమంలో వ్యాఖ్యాత కపిల్ తాజాగా షారుక్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఇందుకు బదులుగా.. ‘‘ముందుగా నేను నా ప్రేమను కనుగొనాలి(ప్రేమించే వ్యక్తి) కదా’’ అని సానియా మీర్జా సమాధానమిచ్చారు.ఈ నేపథ్యంలో సానియా జీవితంతో రెండో అవకాశం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని.. అదే నిజమైతే అంతకంటే ఆనందం మరొకటి ఉండదని ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రతి ఒక్క స్త్రీకి తన జీవితాన్ని అందంగా మలచుకునే అవకాశం ఉందని.. మోసగాళ్ల కోసం తమ లైఫ్ను పణంగా పెట్టాల్సిన పనిలేదని కామెంట్లు చేస్తున్నారు. -
KKR Wins IPL ‘హ్యాపీ నా పప్పా’: అటు పెద్దోడు, ఇటు చిన్నోడు : తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ వీడియో
ఐపీఎల్-2024 టైటిల్ను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చేజిక్కించుకుంది. 10 ఏళ్ల తర్వాత ట్రోఫీని గెల్చుకోడంతో కేకేఆర్ కో-ఫౌండర్ షారుఖ్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా మైదానంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.An emotional moment between #ShahRukhKhan and #SuhanaKhan after marvelous victory of #KKRpic.twitter.com/yO6nBBgvo1— Suhana Khan (@SuhanaKhanClub) May 26, 2024ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించిన షారుఖ్ ప్యామిలీ, పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్ను అందుకున్న ఆనంద క్షణాల్లో మునిగి తేలాయి. ఈ సందర్భంగా షారుఖ్ ముద్దుల తనయ సుహానా ఖాన్ పరుగున వచ్చి ‘‘మీరు సంతోషంగా ఉన్నారా’’అడిగింది. దీంతో సూపర్ స్టార్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ తండ్రీ- కూతుళ్ల ఆనంద క్షణాలు అటు ఫ్యాన్స్ను, ఇటు నెటిజనులు సంతోషంలో ముంచేశాయి.Suhana asking Shah “Are you happy” and the way AbRam and Aryan came to hug their papa @iamsrk … I can’t help my tears 😭💜pic.twitter.com/VjCxU5Nwsz— Samina ✨ (@SRKsSamina_) May 26, 2024ఆ తరువాత కాసేపటికే షారుఖ్ చిన్న కుమారుడు అబ్రామ్, తండ్రీ-కూతురు ద్వయం పరస్వరం గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతలోనే పెద్ద కుమారుడు ఆర్యన్, హగ్గింగ్ ఫెస్ట్లో చేరి పోవడం విశేషం. అంతేకాదు చివరి పరుగుతో వెంకేటేష్ అయ్యర్ విజయాన్ని అందించడంతో బాలీవుడ్ రొమాన్స్ కింగ్ తన భార్య గౌరీ నుదిటిపై ముద్దు పెట్టుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ,ఇద్దరూ ఆనంద క్షణాల్లో మునిగి తేలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కేకేఆర్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్కతా ఈ టార్గెట్ను కేవలం 10.3 ఓవర్లలోనే ముగించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. వెంకటేష్ అయ్యర్ విన్నింగ్ షాట్తో 2012, 2014 తర్వాత ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కోల్కతా నిలిచింది. దీంతో షారుఖ్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. -
IPL 2024: కేకేఆర్ వెనుక 'గంభీరం'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఈ సీజన్లో ఆధ్యాంతం అద్భుత విజయాలు సాధించిన కేకేఆర్ ఫైనల్ మ్యాచ్లోనూ అన్ని రంగాల్లో సత్తా చాటి పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.Shreyas Iyer handed the Trophy to Rinku Singh for celebration.- The Leader. 👌 pic.twitter.com/V8Pb55ZPQX— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆటగాళ్లతో సమానమైపాత్ర..ఈ సీజన్లో కేకేఆర్ విజయాల్లో ఆటగాళ్ల పాత్ర ఎంత ఉందో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా అంతే ఉంది. ఈ సీజన్తోనే కేకేఆర్ మెంటార్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. ఆ జట్టు సాధించిన ప్రతి విజయంలోనూ తనదైన ముద్ర వేశాడు.Third most successful IPL franchise in league history - KKR. pic.twitter.com/bYnKkbujXi— Johns. (@CricCrazyJohns) May 26, 2024పేరుకు తగ్గట్టుగానే గంభీరంగా..ఆన్ ఫీల్డ్ అయినా.. ఆఫ్ ద ఫీల్డ్ అయినా గంభీరంగా కనిపించే గంభీర్ పేరుకు తగ్గట్టుగానే కేకేఆర్ విజయాల్లో గంభీరమైన పాత్ర పోషించాడు. గంభీర్ తనకు మాత్రమే సాధ్యమైన సాహసోపేతమైన నిర్ణయాలతో కేకేఆర్ను గెలుపుబాట పట్టించాడు. గంభీర్ ఆధ్వర్యంలో కేకేఆర్ ఈ సీజన్లో కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే ఓడింది. Gautam Gambhir with IPL Trophy. ❤️ pic.twitter.com/LI2HLwEpiH— Johns. (@CricCrazyJohns) May 26, 2024నరైన్ సక్సెస్ వెనుక కూడా గంభీరుడే..సునీల్ నరైన్కు ఓపెనర్గా ప్రమోషన్ ఇచ్చి సత్ఫలితాలు రాబట్టిన ఘనత గంభీర్దే. అలాగే ఫైనల్స్ హీరో మిచెల్ స్టార్క్ను దక్కించుకోవడంలోనూ గంభీరే ప్రధానపాత్ర పోషించాడని అంతా అంటారు. యువ పేసర్లు హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలను ప్రోత్సాహించడంలోనూ.. వెటరన్ ఆండ్రీ రసెల్ను వెనకేసుకురావడంలోనూ గంభీర్దే ప్రధానమైన పాత్ర. SUNIL NARINE - The MVP of IPL 2024. Greatest of KKR...!!!!! pic.twitter.com/1IBdxl1qRk— Johns. (@CricCrazyJohns) May 26, 2024శ్రేయస్ను వెన్నుతట్టి.. వెంకటేశ్పై విశ్వాసముంచి..శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్లపై విశ్వాసముంచి వారి నుంచి సత్ఫలితాలు రాబట్టిన ఘనత కూడా గంభీర్కే దక్కుతుంది. రింకూ సింగ్, రమన్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి లాంటి లోకల్ టాలెంట్లకు కూడా గంభీర్ అండగా నిలిచాడు. ఇలా ఏరకంగా చూసుకున్నా కేకేఆర్కు పూర్వవైభవం దక్కడంలో గంభీర్ పాత్ర ప్రధానమైందనడంలో ఎలాంటి సందేహాం లేదు.KKR players taking Gautam Gambhir in their shoulders. 👌 pic.twitter.com/XspysKKbiM— Johns. (@CricCrazyJohns) May 26, 2024సొంత అభిమానులచే ఛీత్కారాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి..గడిచిన ఆరు సీజన్లలో పేలవ ప్రదర్శనతో సొంత అభిమానల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న కేకేఆర్.. గంభీర్ రాకతో ఒక్కసారిగా నూతనోత్సాహాన్ని అందుకుని టైటిల్ ఎగరేసుకుపోయింది.షారుఖ్ పట్టుబట్టి మరీ..కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ఈ సీజన్ కోసం గంభీర్ను పట్టుబట్టి మరీ ఒప్పించి లక్నో సూపర్ జెయింట్స్ నుంచి పిలిపించుకున్నాడు. మెంటార్గా గంభీర్కు కేకేఆర్ కొత్తేమో కానీ ఆటగాడిగా, కెప్టెన్గా గంభీర్ కేకేఆర్ అభిమానులకు సుపరిచితుడు. ఈ సీజన్లో మెంటార్గా కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపిన గంభీర్.. 2012, 2014 సీజన్లలో కెప్టెన్గా కేకేఆర్కు టైటిల్స్ అందించాడు. Gautam Gambhir & King of Indian Cinema Shah Rukh Khan with IPL Trophy 💜- The Frame for KKR legacy. pic.twitter.com/pfrFw9prKe— Johns. (@CricCrazyJohns) May 27, 2024కేకేఆర్ కెప్టెన్గా గంభీర్ ప్రస్తానం దీనితోనే ఆగిపోలేదు. గంభీర్ నేతృత్వంలో కేకేఆర్ 2016, 2017 సీజన్లలోనే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. దీనికి ముందు 2011 సీజన్లోనూ గంభీర్ సారథ్యంలో కేకేఆర్ ప్లే ఆఫ్స్కు చేరింది. కేకేఆర్ కెప్టెన్గా ఏడు సీజన్ల పాటు కొనసాగిన గంభీర్ ఈ జట్టును రెండుసార్లు ఛాంపియన్గా.. మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్కు.. రెండు సీజన్లలో (2013, 2015) లీగ్ దశ వరకు విజయవంతంగా నడిపించాడు. తాజాగా మెంటార్గా బాధ్యతలు చేపట్టి తన ఆధ్వర్యంలో మూడోసారి కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపాడు. Shah Rukh Khan kissing Gautam Gambhir 💜- SRK brings back Gambhir again and he has written a great comeback story. pic.twitter.com/gcAjm1S2Bh— Johns. (@CricCrazyJohns) May 26, 2024షారుఖ్ విశ్వాసాన్ని నిలుపుకున్నాడు..కేకేఆర్ బాస్ షారుఖ్కు తనపై అపార విశ్వాసమున్నట్లు గంభీరే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ నమ్మకాన్ని నిలుపుకుంటూ గంభీర్ పదేళ్ల తర్వాత తిరిగొచ్చి కేకేఆర్కు టైటిల్ను అందించాడు. తాజాగా కేకేఆర్ టైటిల్ గెలిచిన అనంతరం షారుఖ్ ఖాన్ గంభీర్ నుదిటిపై ముద్దు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన చిత్రాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
షారూఖ్ ఖాన్ ఆరోగ్యంపై మేనేజర్ దద్లానీ చేసిన పోస్ట్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఐపీఎల్ ప్లే ఆఫ్కు మ్యాచ్కు హాజరైన షారుక్ డీహైడ్రేషన్కు (వడదెబ్బ) గురైనట్లు సమాచారం. దీంతో ఆయన అహ్మదాబాద్లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స అందుకున్నారు. ఆ తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.తాజాగా షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పలు విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆమె తెలిపింది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆమె చెప్పింది. షారుఖ్పై ఫ్యాన్స్ చూపించే ప్రేమ, ప్రార్ధనలు ఆయనకు మరింత బలాన్ని చేకూర్చాయి. అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు అని ఆమె తన పోస్ట్ ద్వారా తెలిపింది. కేకేఆర్ ఫైనల్స్ ఆడేటప్పుడు స్టాండ్స్లో నుంచి జట్టును ఉత్సాహపరుస్తాడని జట్టు సహ-యజమాని జుహీ చావ్లా తెలిపింది. -
ఆస్పత్రికి షారూఖ్ ఖాన్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఐపీఎల్ ప్లే ఆఫ్కు మ్యాచ్కు హాజరైన షారుక్ డీహైడ్రేషన్కు (వడదెబ్బ) గురైనట్లు సమాచారం. దీంతో ఆయన అహ్మదాబాద్లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స అందుకున్నారు. ఆ తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు.కాగా.. మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు షారూఖ్ ఖాన్ హాజరయ్యారు. కోల్కతా జట్టుకు యజమానిగా ఉన్న షారూఖ్ ఖాన్ టీమ్కు మద్దతుగా స్డేడియంలో సందడి చేశారు. దీంతో అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బకు గురయ్యారు. ఆస్పత్రికి వెళ్లిన బాద్షా చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో షారుక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. Due to heat stroke dehydration, but sir is fine now and he’s been discharged, nothing to worry.Love You @iamsrk ❤️#ShahRukhKhan https://t.co/5k5S5z1ixD— Sudhir Kothari (@sudhirkothari03) May 22, 2024 -
కేకేఆర్ గెలుపు.. గాల్లో తేలిపోయిన షారూఖ్.. చూసుకోకుండా..!
ఐపీఎల్ టోర్నీలో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) నేరుగా ఫైనల్కు అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్లో సన్రైజర్స్ను చిత్తుగా ఓడించింది. కేకేఆర్ విజయంతో ఆ టీమ్సభ్యులు, అభిమానులు విజయానందంలో మునిగిపోయారు. తన టీమ్ సక్సెస్ను కళ్లారా చూసిన బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి. వెంటనే అలర్ట్ అయి..మ్యాచ్ అనంతరం వెంటనే మైదానంలోకి వెళ్లి అభిమానులందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు నడిచాడు. అయితే అక్కడ మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, పార్థీవ్ పటేల్, సురేశ్ రైనా జరిగిన మ్యాచ్ గురించి లైవ్లో మాట్లాడుతూ ఉన్నారు. వారిని చూసుకోకుండా తన భార్య, కుమారుడితో ఎంతో హుషారుగా ముందుకు నడిచాడు షారూఖ్. వెంటనే అక్కడ లైవ్ ఎపిసోడ్ జరుగుతుందని గమనించి వాళ్లకు రెండు చేతులు జోడించి సారీ చెప్పి హగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఇది చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరో అంత ఖుషీగా ఉండటం చూసి మురిసిపోతున్నారు.షారూఖ్ సినిమాల విషయానికి వస్తే.. కొన్నేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన షారూఖ్ గతేడాది ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో బాక్సాఫీస్పై కలెక్షన్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఐపీఎల్ మేనియాలో ఉన్న ఈ హీరో సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చాడు. తన టీమ్ కేకేఆర్ ఆడే అన్ని మ్యాచులకు హాజరవుతానని మాటిచ్చిన షారూఖ్ దాన్ని నిలబెట్టుకునే పనిలో ఉన్నాడు. జూలై లేదా ఆగస్టులో అతడి కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. King Is So Happy 💜#shahrukhkhan #srk #KKRvsSRH pic.twitter.com/fZiHHBoPcp— __𝕊𝕣𝕜𝕚𝕒𝕟__ (@Kashif_srk_fan_) May 22, 2024 చదవండి: తొలిసారి ఆ ఇండస్ట్రీలోకి కియారా.. స్టార్ హీరోతో కలిసి? -
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
నిమా హీరోలు ఒక్క హిట్టు కొడితేనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటిది బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఒకటీరెండు కాదు.. ఏకంగా మూడు చిత్రాలతో బ్లాక్బస్టర్ హిట్లు అందుకున్నాడు. పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాను సృష్టించాడు. రెస్ట్ కోసం..ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇస్తూ ఐపీఎల్ మ్యాచ్లతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షారుక్ మాట్లాడుతూ.. నాకు కాస్త విశ్రాంతి అవసరమనిపించింది. గతేడాది మూడు సినిమాల కోసం శారీరకంగా చాలా కష్టపడ్డాను. అందుకే కొంత బ్రేక్ తీసుకున్నాను. అలాగే నా ఐపీఎల్ టీమ్ కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు అన్ని మ్యాచులకు వస్తానని మాటిచ్చాను. ఆ మజానే వేరుఆ మాట మీద నిలబడాల్సిన బాధ్యత నాపై ఉంది. అయినా స్టేడియంలో ఉంటే ఆ మజానే వేరు! సినిమాలంటారా..? నా కొత్త ప్రాజెక్టులు జూలై, ఆగస్టులో ప్రారంభం కానున్నాయి. అప్పటివరకు క్రికెట్ మ్యాచ్లను ఎంజాయ్ చేస్తాను అని షారుక్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఆరుగురు హీరయిన్లతో ‘హీరామండి’..ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎంతంటే? -
షారుఖ్ ఖాన్ చర్యతో ఆశ్చర్యపోయిన గంగూలీ.. వెంటనే..
కోల్కతా నైట్ రైడర్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.అంతేకాదు.. ఆప్యాయంగా దాదాను ముద్దాడి అభిమానం చాటుకున్నాడు. షారుఖ్ చర్యతో తొలుత ఆశ్చర్యపోయిన గంగూలీ.. తర్వాత అతడిని హత్తుకుని హర్షం వ్యక్తం చేశాడు.ఐపీఎల్-2024లో భాగంగా సోమవారం నాటి మ్యాచ్లో కేకేఆర్- ఢిల్లీ తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కేకేఆర్ బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్కతా బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(3/16) అద్భుత బౌలింగ్తో ఆకట్టుకోగా.. పేసర్లలో మిచెల్ స్టార్క్(1/43), వైభవ్ అరోరా(2/29), హర్షిత్ రాణా(2/28), స్పిన్ ఆల్రౌండర్ సునిల్ నరైన్(1/24) రాణించారు.వీరిలో స్టార్క్ ఒక్కడు ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ధనాధన్ ఇన్నింగ్స్(33 బంతుల్లో 68) సొంతగడ్డపై ఢిల్లీ మీద ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ వెనుక నుంచి వెళ్లి ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీని హత్తుకున్నాడు. వెంటనే బుగ్గ మీద ముద్దు పెట్టి ఆప్యాయత ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. the way Shah Rukh Khan ran up to Sourav Ganguly to hug and kiss him, such a wholesome moment, KKR reunion 💜 pic.twitter.com/9I0yenj0V4— sohom (@AwaaraHoon) April 29, 2024 కాగా ఐపీఎల్-2024లో కేకేఆర్కు తొమ్మిదింట ఇది ఆరో విజయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ పదకొండింటికి ఐదు మాత్రమే గెలిచి ఆరో స్థానంలో ఉంది. A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
IPL 2024 GT VS RCB: విజృంభించిన సాయి సుదర్శన్, షారుక్ ఖాన్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 28) జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్.. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్లో వృద్దిమాన్ సాహా (5), శుభ్మన్ గిల్ (16) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్వెల్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.గుజరాత్ ఇన్నింగ్స్ విశేషాలు..7.4 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసిన గుజరాత్ చివరి 12.2 ఓవర్లలో ఏకంగా 151 పరుగులు చేసింది.ఈ సీజన్లో సాయి సుదర్శన్ 400 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.షారుక్ ఖాన్ తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మైలురాయిని షారుక్ కేవలం 24 బంతుల్లోనే సాధించాడు. -
డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం
డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు క్లీన్ చిట్ ఇచ్చిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్ ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. తాజాగా వెలువడిన ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2021 నుంచి ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న సంజయ్ సింగ్, ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించారు. ఒడిశా కేడర్కు చెందిన 1996 బ్యాచ్ IPS అధికారిగా ఆయన ప్రయాణం కొనసాగింది. 2008 నుంచి 2015 వరకు సీబీఐలో కూడా ఆయన పనిచేశారు. దేశంలోని అత్యంత క్లిష్టమైన కేసులలో ఆయన భాగమై పూర్తిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. తన స్వచ్ఛంద పదవీ విరమణపై సంజయ్ సింగ్ మీడియాతో స్పందిస్తూ.. 'ఫిబ్రవరి 29న స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవాలని అభ్యర్థించాను. నా అభ్యర్థనను ఆమోదించడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇదే విషయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా తెలిపింది. దాని ప్రకారం ఈరోజు నా అప్పీల్ ఆమోదించబడింది. ఏప్రిల్ 30 నా కెరీర్కి చివరి రోజు అని నాకు ఇప్పటికే సమాచారం వచ్చింది. గత మూడు నెలలుగా నోటీసు పరేడ్లో నేను రిలాక్స్గా ఉన్నాను. అని ఆయన చెప్పారు. రెండేళ్ల క్రితం ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్సీబీ బృందం దాడి చేసి ఆర్యన్తోపాటు సుమారు 20 మందిని అరెస్టు చేసింది. అతను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్సీబీ ముందుగా ప్రకటించింది. ఆ సమయంలో షారుఖ్తో పాటు ఆర్యన్ కూడా సోషల్మీడియా ద్వారా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆర్యన్ ఎలాంటి తప్పు చేయలేదని గుజరాత్లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్నుంచి దృష్టి మళ్లించడానికే ఆర్యన్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలూ వినిపించాయి. కానీ ముంబై జోన్లో అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఈ కేసును దర్యాప్తు చేశారు. కావాలనే కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు వాదనలు రావడంతో ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించారు. తర్వాత ఇదే కేసును డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్కు అప్పగించారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్ కేసును ఆయన ఛాలెంజ్గా తీసుకుని విచారణ కొనసాగించారు. మే 2022లో సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో, ఆర్యన్ ఖాన్తో సహా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరుగురికి ఎన్సిబి క్లీన్ చిట్ ఇచ్చింది. మిగిలిన 14 మందిని నిందితులుగా గుర్తించింది. అలా సంజయ్ సింగ్ నేతృత్వంలో ఆర్యన్కు క్లీన్ చిట్ దక్కింది. -
వీరోచిత శతకంతో రాజస్తాన్ను గెలిపించిన బట్లర్ (ఫొటోలు)
-
షారుఖ్ స్టైల్లో సీఎం కేజ్రీవాల్ డైలాగ్.. సెటైర్లు వేస్తున్న బీజేపీ నేతలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ సందేశం పంపారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్టైల్లో ‘మై నేమ్ ఈజ్ అరవింద్ కేజ్రీవాల్.. ఐయామ్ నాట్ టెర్రరిస్ట్’ అంటూ పంపిన ఆ మెజేస్ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. అయితే జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశంపై బీజేపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కేజ్రీవాల్ ఆరోపణలు, ఆయన పంపిన మెసేజ్పై ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ను తాము టెర్రరిస్టుగా పిలవడం లేదని అన్నారు. అతన్ని టెర్రరిస్టు అని ఎవరు పిలుస్తున్నారో? కేజ్రీవాల్, అతని సహచరులు అతన్ని ఉగ్రవాది అని ఎందుకు పిలుస్తున్నారో మాకు తెలియదు. మేము అతనిని అవినీతిపరుడనే అంటున్నాం. ఆయన ఢిల్లీకి శత్రువు అని వ్యాఖ్యానించారు. VIDEO | Here's what BJP leader Manoj Tiwari (@ManojTiwariMP) said reacting to Delhi CM Arvind Kejriwal sending a message to people that he's not a terrorist. "Nobody is calling him a terrorist. We're calling him corrupt. He has made senior citizens cry for pension, poor cry for… pic.twitter.com/fztGHhjCds — Press Trust of India (@PTI_News) April 16, 2024 ఈ సందర్భంగా కేజ్రీవాల్పై మనోజ్ తివారీ సెటైర్లు వేశారు. అతను వృద్ధుల పెన్షన్ కోసం పాటుపడ్డారు. పేదల కోసం పనిచేశారు. రేషన్ కార్డుల కోసం, స్వచ్ఛమైన నీరు, గాలి అందించేందుకు ప్రజల కోసం కృషి చేశారని ఎద్దేశా చేశారు. దోపిడీకి పాల్పడే ముందు జైలులో సౌకర్యాల గురించి ఆప్ అధినేత ఆలోచించి ఉంటారని తివారీ అన్నారు. జైలు మాన్యువల్ అందరికీ ఒకేలా ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటోంది అని ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడారు. देश के बेटे अरविंद केजरीवाल का जेल से देश की जनता को संदेश - मेरा नाम अरविंद केजरीवाल है और मैं आतंकवादी नहीं हूं। -@SanjayAzadSln pic.twitter.com/9VpPOpnLXa — AAP (@AamAadmiParty) April 16, 2024 -
IPL 2024 : విశాఖలో కోల్కతా బ్యాటర్ల విధ్వంసం (ఫొటోలు)
-
IPL 2024 : విశాఖలో కోల్కతా బ్యాటర్ల విధ్వంసం (ఫొటోలు)
-
షారుఖ్ రూ. 5 కోట్ల లగ్జరీ వాచ్ : నెటిజన్ల జోక్స్ వైరల్
గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల కొద్దీ అభిమానుల ఫాలోయింగ్, కోట్లాది రూపాయల సంపద, ఖరీదైన వస్తువులు, లగ్జరీ లైఫ్ ఆయన సొంతం. తాజాగా కింగ్ ఖాన్ లగ్జరీ వాచ్ వార్తల్లో నిలిచింది. నీలిరంగు Audemars Piguet చేతి గడియారం దాని ధర చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దీని ధర సుమారు . 5 కోట్లు. అయితే ఈ వాచ్ ధరపై నెటిజన్లు కమెంట్లు హాట్టాపిక్గా లిచాయి ఆడెమర్స్ పిగెట్ బ్రాండ్కు చెందిన రాయల్ ఓక్ వాచ్ను తన బ్లాక్బస్టర్ మూవీ పఠాన్ ప్రమోషన్ సమయంలో దీన్ని ధరించి అందర్నీ విస్మయ పర్చిన సంగతి తెలిసిందే. దీని డెలివరీ కోసం రూ. 8 వేలకు చెల్లించాడంటేనే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఆడెమర్స్ వెబ్సైట్ ప్రకారం ఇది బ్లూ-హ్యూడ్ స్టార్రి-నైట్ పీస్. ఇదిచాలా లిమిటెడ్ వెర్షన్ కూడా. ఈ వాచ్ డిజైన్, బిల్డ్ విషయాలను గమనిస్తే..ఇందులో నాలుగు డయల్స్ ఉంటాయి. ఇందులో సమయంతోపాటు, నెలలు, రోజులు తదితర వివరాలు కూడా ఉంటాయి. దుబాయ్లో జరిగిన ఇంటర్నేషనల్ T20 సందర్భంగా కూడా ఈ వాచ్తో దర్శమనిచ్చాడు షారుఖ్. అయితే దీన్ని కొంతమంది అభిమానులు వెరైటీగా స్పందించారు. రూ. 500 అయితే ఏంటి, 5 కోట్లు చూపించే టైం ఒకటేగాఅని ఒకరు, మీషో, షాప్సీ వంటి ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్లో 200 రూపాయలకే దీన్ని కొనుక్కోవవచ్చు. అంతేకాదు ఇంతకంటే మంచి వాచ్లు దొరుకుతాయంటూ వ్యాఖ్యానించడం విశేషం.షారుఖ్ ఖాన్ ఆడెమర్స్ పిగ్యెట్ రాయల్ ఓక్ వాచెస్ కలెక్షన్లో ఖరీదైనది మరొకటి కూడా ఉంది. నీతా అంబానీ నేతృత్వంలోని ఎన్ఎంఏసీసీ ఈవెంట్లో కింగ్ ఖాన్ దీన్ని ధరించాడు. దీని ధర రూ. 31.1 లక్షలు. -
ఏంటి హీరో.. నువ్వే ఇలా చేస్తే ఎలా? షారుక్పై సెటైర్లు
ఐపీఎల్కు ఉన్న క్రేజే వేరు. ఈ క్రేజ్ ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. రెండు రోజుల క్రితమే ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభమైంది. శనివారం సన్రైజర్స్ - కోల్కతా నైట్ రైజర్స్ మధ్య పోటీ జరిగింది. తన జట్టుకు మద్దతు తెలిపేందుకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. కోల్కతాలోని స్టేడియంలో అడుగుపెట్టాడు. ఇతడిని చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. తనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇదిలా ఉంటే మ్యాచ్ వీక్షించేటప్పుడు షారుక్ పొగ తాగాడంటూ చిన్న వీడియో క్లిప్పింగ్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ, స్టేడియంలో ఇలాంటి పాడుపనులేంటని విమర్శిస్తున్నారు. కనీసం అక్కడ ఉన్నంతసేపైనా దమ్ము కొట్టకుండా ఉండొచ్చుగా.. అంత బానిసైపోయాడా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. షారుక్ సినిమాల సంగతికొస్తే.. గతేడాది పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో వరుస బ్లాక్బస్టర్లు కొట్టాడు. టైగర్ 3 మూవీలో అతిథి పాత్రలో మెరిశాడు. మ్యాచ్ విషయానికి వస్తే ఉత్కంఠగా జరిగిన పోరులో సన్ రైజర్స్ను ఓడించి కేకేఆర్ విజయం సాధించింది. Cameraman ki timing 😂😭 What a timing Bakra 😂😂#ShahRukhKhan #IPL2024 #KKRvSRH https://t.co/JUYnHKIdwd — Our darling (@Our_darling___) March 24, 2024 చదవండి: విరూపాక్ష సినిమా హీరోగా నన్నే అనుకున్నారు.. కానీ! -
షారుక్ అలా ఫిక్సయిపోయాడు.. కానీ కమల్.. : దర్శకురాలు
ఫరాఖాన్.. బాలీవుడ్లో పేరు మోసిన కొరియోగ్రాఫర్. దర్శకరచయితగా, నిర్మాతగానూ పేరు తెచ్చుకుంది. ఈమె డైరెక్టర్గా వ్యవహరించిన తొలి చిత్రం మై హూనా. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించాడు. అయితే విలన్ పాత్ర కోసం తీవ్రంగా శ్రమించానంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ఫరా ఖాన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'మై హూనా మూవీలో విలన్ కోసం ఎంతోమందిని సంప్రదించాను. కమల్ ఒప్పుకుంటాడని షారుక్ ధీమా కానీ ఎవరూ చేయడానికి ముందుకు రాలేదు.. నసీరుద్దీన్ షాను అడిగితే చేయనన్నాడు. కమల్ హాసన్ దగ్గరకు వెళ్లాను.. ఆయన కచ్చితంగా చేస్తాడని, తానంటే కమల్ సర్కు ఎంతో ఇష్టమని, ఇద్దరం కలిసి ఇదివరకే హే రామ్ అనే సినిమా కూడా చేశామని షారుక్ ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పాడు. కానీ ఆయన కూడా తిరస్కరించాడు. నానా పటేకర్ను కలిశా.. వారం రోజులకు ఆయన కూడా చేయనని చేతులెత్తేశాడు. షారుక్ నిర్మాతగా తొలి మూవీ చివరకు సునీల్ శెట్టి ఆ పాత్ర చేశాడు' అని ఫరా ఖాన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా షారుక్ ఖాన్ సొంత బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్లో తెరకెక్కిన తొలి చిత్రం కావడం విశేషం. ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. తర్వాత ఫరా ఖాన్- షారుక్ ఖాన్ కాంబినేషన్లో ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలు రూపొందాయి. చదవండి: రెండో పెళ్లి చేసుకున్న నటి మాజీ భర్త.. ఆశీర్వదించండంటూ పోస్ట్.. -
అంబానీ ప్రీవెడ్డింగ్.. త్రీ ఖాన్స్కు భారీగా పారితోషికం?!
బాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఒక్కచోటకు చేర్చడం.. అది కూడా బస్సెక్కించి మరీ ఈవెంట్కు తీసుకురావడం ఒక్క అంబానీకే సాధ్యమైంది. తారలు సైతం తమ ఇంటి పెళ్లిలాగే భావించి అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్లో తెగ సందడి చేశారు. ఆటపాటలతో అలరించారు. అయితే అందరినీ కట్టిపడేసిన అంశం ఏదైనా ఉందా? అంటే త్రీఖాన్స్ డ్యాన్స్ చేయడమే! స్టేజీపై డ్యాన్స్.. ఎప్పుడూ బిజీగా ఉండే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్.. అన్నదమ్ముల్లాగా కలిసి డ్యాన్స్ చేయడంతో అభిమానులంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇందుకోసం డబ్బులు కూడా బాగానే తీసుకుని ఉండొచ్చంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరితో కలిసి స్టెప్పేసిన రామ్చరణ్కు కూడా ఎంతో కొంత ఇచ్చే ఉంటారని ఎవరికి వారు అభిప్రాయపడుతున్నారు. కానీ బీటౌన్లో మాత్రం ప్రచారం మరోలా ఉంది. చరణ్తో పాటు ఈ ఖాన్స్ త్రయానికి డబ్బులే ఇవ్వలేదట! సంతోషంతోనే.. 'వారిని ఒకే స్టేజీపైకి తీసుకురావాలని అప్పటికప్పుడు అనుకున్నారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంబానీ అంత గ్రాండ్గా ఆతిథ్యం ఇచ్చినప్పుడు అతిథులు డబ్బులు అడగ్గలరా? ఆ హీరోలు సంతోషంతో అలా డ్యాన్స్ చేశారంతే.. కానీ డబ్బులు మాత్రం తీసుకోలేదు' అని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంబానీ ఇచ్చిన ఆతిథ్యాన్ని మెచ్చిన హీరోలు ఫ్రీగా డ్యాన్స్ చేశారన్నమాట! అయినా ఇది ప్రీవెడ్డింగ్ కాబట్టి డిమాండ్ చేయలేదేమో.. పెళ్లికి అసలు, వడ్డీ.. అంతా కలిపి అడుగుతారని.. అప్పటిదాకా ఓపిక పట్టండని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #RamCharan kaha hai tu.. They are treating him like his own. How beautiful 😍. pic.twitter.com/s7hXwrBP6N — अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 3, 2024 చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో 'ఇడ్లీ లొల్లి'.. అసలు ఈ ఇడ్లీ కథేంటంటే..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్-రాధికాల ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. మూడు రోజులు జరిగిన ఈ వేడుకల్లో సిని ప్రముఖులంతా ఆడి పాడి సందడి చేశారు. అయితే ఈ వేడుకల్లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ని ఇడ్లీ అని సంబోధించడం చర్చనీయాంశంగా మారింది. షారుఖ్ ఫన్నీగా పిలిచారనుకుందామన్న అంత పెద్ద వేడుకలో పిలవడం చాలమందికి నచ్చలేదు. నార్త్ ఇండియన్ హీరోలకు దక్షిణాది హీరోలంటే చులకనే అంటూ రచ్చ మొదలయ్యింది. సరదా సంబోధన కాస్త సోషల్ మీడియాలో సీరియస్ ఇష్యూగా చర్చలకు తెరలేపింది. దక్షిణాది కాబట్టి ఇడ్డీ వడ అని షారుక్ హేళనగా సంబోధించినప్పటికీ..ఇడ్డీ భారతదేశ వంటకం మాత్రం కాదు. వివాదాస్పదంగా మారిన ఈ ఇడ్లీ వ్యాఖ్య నేపథ్యంలో అసలు ఇడ్లీ వంటకం మూలం ఏమిటీ? ఎక్కడ నుంచి ఈ అల్పహారం భారతదేశానికి వచ్చిందో చూద్దామా!. మన భారతీయులకు ముఖ్యంగా దక్షిణాది వాళ్లు వేడి వేడి ఇడ్లీ, అందులోకి మంచి కొబ్బరి చట్నీ, వేడి వేడి సాంబార్ ఉంటే ప్రాణం లేచొస్తుందన్నట్లు భావిస్తారు. ఇది వారికి ఎంతో ఇష్టమైన అల్పాహారం కూడా. అయితే ఈ ఇడ్డీ వంటకం భారతీయ వంటకం కాదు. దాని మూలం భారతదేశానికి చెందింది ఎంత మాత్రం కాదు. కాస్త శరీరంలో నలతగా ఉన్న ఇడ్డీ తింటే తేలిగ్గా అరుగుతుందంటారు. ముఖ్యంగా వైద్యులు కూడా రోగులకు ఈ అల్పాహారాన్ని ప్రివర్ చేస్తారు. అలాంటి ఇడ్డీ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం గురించి కర్ణాటకకు చెందని ప్రముఖ ఆహార శాస్త్రవేత్త, పోషకాహార నిపుణుడు, కెటీ ఆచార్య సవివరంగా వెల్లడించారు. ఇడ్లీ క్రీస్తూ పూర్వం 7 లేదా 12వ శతాబ్దంలో ఇండోనేషియాల్లో ఈ వంటకాన్ని చేసేవారట. వాళ్లు ఈ వంటాకాన్ని కెడ్లీ లేదా కేదారి అనిపిలిచేవారట. అయితే మన మన హిందూ రాజులు ఈ ఇండోనేషియాని పాలించడంతో సెలవుల్లో బంధువులను కలవడానికి భారత్కి వచ్చేవారట. అలా వస్తూ వస్తూ..తమ తోపాటు రాజ్యంలో ఉండే వంటవాళ్లను కూడా వెంటపెట్టుకుని తీసుకువెళ్లేవారట. అలా ఈ ఇండోనేషియ వంటకం భారత్లోకి వచ్చి ఇడ్లీగా స్థిరపడింది. చరిత్రను పరిశీలిస్తే.. చారిత్రాత్మకంగా అరబ్బులు కూడా ఇడ్లీ వంటకంతో సంబంధం ఉందని మరో కథ చెబుతోంది. 'ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫుడ్ హిస్టరీ అనే పుస్తకంలోనూ, 'సీడ్ టు సివిలైజేషన్ - ది స్టోరీ ఆఫ్ ఫుడ్' అనే మరో పుస్తకంలో భారతదేశంలో స్థిరపడ్డ అరబ్బులు హలాల్ ఆహారాల తోపాటు రైస్బాల్స్ తినేవారని, వాటిని కొబ్బరి గ్రేవీతో తినేవారని ఉంది. ఇక్కడ అరబ్బులు ఇడ్లీలను రైస్బాల్స్ అని పిలిచే వారని తెలుస్తోంది. అలా ఇడ్లీలు మన భారతీయ వంటకాల్లో భాగమయ్యాయి. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక ఏడోవ శతాబ్దాపు కన్నడ రచన "వద్దరాధనే" అనే గ్రంథంలో ఇడ్డీల గురించి ప్రస్తావించబడింది. వాటిని 'ఇద్దాలి'గా పిలిచినట్లు వాటి తయారీ గురించి సవివరంగా ఉంది. అలాగే పదవ శతాబ్దపు తమిళ వచనం పెరియ పురాణంలో కూడా ఈ వంటకం గురించి ప్రస్తావించబడి ఉంది. ఇది శైవ సాధువుల సముహం అయిన 63 నాయిర్ల జీవిత కథను వివరిస్తూ.. ఈ వంటకం వచ్చిన విధానం గురించి రాసి ఉంది. ఇక మరో చారిత్రక ఆధారం ప్రకారం..క్రీస్తూ శకం 10వ శతాబ్దంలో ఘజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయం దాడి తర్వాత సౌరాష్ట్ర వ్యాపారులు దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. అప్పుడే ఈ ఇడ్లీ వంటకాన్ని కనుగొనడం జరిగింది. దానికి ఈ పేరు పెట్టడం జరిగిందని ఉంది. వీటన్నింటి బట్టి చూస్తే ఇడ్డీ అనే వంటకం మూలం భారత్ కాదని పేర్లు మార్చుకుంటూ మన దేశానికి వచ్చిందని స్పష్టం అవుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ ఇడ్లీ వంటకం మన దేశంలోని భారతీయల మనసులను దోచుకుని ఇష్టమైన వంటకంగా స్థిరపడిపోయిందనే విషయం గ్రహిస్తే మంచిది. (చదవండి: నిమ్మచెక్కతో వంటింటి సమస్యలకు చెక్పెట్టండి) -
అంబానీ ప్రీ వెడ్డింగ్లో చరణ్ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్
జామ్ నగర్లో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా అయ్యాయి. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా టాప్ సెలబ్రిటీలు అందరూ పాల్గొన్నారు. బాలీవుడ్ మొత్తం అంబానీ ఈవెంట్లో కనిపించింది. టాలీవుడ్ నుంచి మాత్రం రామ్ చరణ్ దంపతులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఇదే వేడుకలో రామ్ చరణ్ని షారుక్ ఖాన్ అవమానించిన విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్టు బయటపెట్టింది. 'బాహుబలి' తర్వాత తెలుగు సినిమా రోజురోజుకీ పెరుగుతూ పోతోంది. ఎంతలా అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్లు. ఇప్పుడు మాత్రం టాలీవుడ్ అంటున్నారు. అలానే 'ఆర్ఆర్ఆర్' పాటకు ఆస్కార్ రావడంతో చరణ్.. నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ పాపులర్ అయిపోయాడు. అందులో భాగంగానే తాజాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆహ్వానం మేరకు పాల్గొన్నాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి హిట్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే రానుందా?) 'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'నాటు నాటు' పాటకు సల్మాన్-షారుక్-ఆమిర్ ఖాన్లతో స్టేజీపై రామ్ చరణ్ స్టెప్పులు కూడా వేశాడు. ఇది అందరికీ తెలుసు. అయితే స్టేజీపైకి పిలిచే క్రమంలోనే చరణ్ని 'ఇడ్లీ-వడ' అని సంభోదించి షారుక్ పిలిచారని, దీంతో కోపమొచ్చి స్టేజీ దిగిపోయానని ఉపాసన మేకప్ ఆర్టిస్టు జెబా హాసన్ చెప్పింది. ఇదే విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీలో పెట్టింది. దీంతో అందరూ షాకవుతున్నారు. అదే టైంలో బాలీవుడ్ హీరోల్ని 'వడాపావ్', 'భేల్ పూరి' అని పిలిస్తే ఊరుకుంటారా అని ఫ్యాన్స్ కౌంటర్స్ వేస్తున్నారు. ఏదేమైనా ఫన్నీగా అయినా సరే షారుక్.. చరణ్ని ఇలా పిలవడంపై మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అలానే బాలీవుడ్ హీరోలకు టాలీవుడ్ హీరోల రేంజ్ పెరిగిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇంకా లోపల మంట అలానే ఉన్నట్లుంది. అందుకే ఇలా పిలిచి ఉంటాడని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: డైరెక్ట్గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) -
సందడి సందడిగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహిళల ఐపీఎల్.. సందడి చేసిన షారుక్ ఖాన్
మహిళల ఐపీఎల్ (WPL) 2024 సీజన్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (ఫిబ్రవరి 23) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్కు ముందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ టాప్ స్టార్స్ షారుక్ ఖాన్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్ర, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్ సందడి చేశారు. SOUND ON 😍 𝙎𝙝𝙖𝙝 𝙍𝙪𝙠𝙝 𝙆𝙝𝙖𝙣 👑 showcases his aura at the #TATAWPL Opening Ceremony 🤩🤩@iamsrk pic.twitter.com/WLjSmCxVXL — Women's Premier League (WPL) (@wplt20) February 23, 2024 వీరిలో షారుక్ ఖాన్ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. షారుక్ ఐదు ఫ్రాంచైజీల కెప్టెన్లతో కలియదిరుగుతూ వారితో స్పెప్పులు వేయించి ఫోటోలకు పోజులిచ్చాడు. Bengaluru erupts with joy to welcome Shahid Kapoor to the #TATAWPL Opening Ceremony 😃🙌@shahidkapoor pic.twitter.com/C2LckHvV2D — Women's Premier League (WPL) (@wplt20) February 23, 2024 మిగతా హీరోలు ఒక్కో ఫ్రాంచైజీ తరఫున ఆడి, పాడారు. కార్తీక్ ఆర్యన్ గుజరాత్ జెయింట్స్ను, సిద్ధార్థ్ మల్హోత్రా ఢిల్లీ క్యాపిటల్స్ను, టైగర్ ష్రాఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును, వరుణ్ ధావన్ యూపీ వారియర్స్ను, షాహిద్ కపూర్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను రిప్రజెంట్ చేశాడు. ఇదిలా ఉంటే, ఇవాళ జరిగిన తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అలైస్ క్యాప్సీ (ఇంగ్లండ్) 75 పరుగులు చేసి క్యాపిటల్స్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో కెప్టెన్ మెగ్ లాన్నింగ్ 31, షఫాలీ వర్మ 1, జెమీమా రోడ్రిగెజ్ 42, మారిజన్ కప్ 16 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ర్, నాట్ సీవర్ బ్రంట్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. షబ్నిమ్ ఇస్మాయిల్ ఓ వికెట్ దక్కించుకుంది. -
'స్టార్డమ్ పక్కనపెట్టి నాకోసం ఫ్రీగా సినిమా చేశాడు'
స్నేహం కోసం కొందరు ఏదైనా చేస్తారు. ఫ్రెండ్షిప్ కంటే తమకు ఏదీ ఎక్కువ కాదంటారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. తన స్నేహితుడి కోసం స్టార్డమ్ పక్కనపెట్టి ఫ్రీగా సినిమా చేశాడు. అది కూడా స్క్రిప్ట్ వినకుండానే! ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఆ విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చాడు నిర్మాత వివేక్ వాస్వామి. ఈయన 2010లో దుల్హ మిల్ గయా అనే సినిమా నిర్మించాడు. ఇందులో ఫర్దీన్ ఖాన్, సుష్మితా సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. షారుక్ కీలక పాత్రలో నటించాడు. స్క్రిప్ట్ కూడా వినకుండానే.. ఆనాటి ముచ్చట్లను తాజా ఇంటర్వ్యూలో నెమరేసుకున్నాడు వివేక్ వాస్వామి. సినిమా చేయమని వివేక్ నా దగ్గరకు రావడం ఇదే తొలిసారి. ఇంకా ఆలోచించాల్సింది ఏముంది? ఈ సినిమా చేస్తున్నాను. అందుకోసం ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు అని షారుక్ అన్నాడు. కనీసం స్క్రిప్ట్ కూడా వినలేదు. అలా అని అతిథి పాత్రలో నటించలేదు. సినిమాలో 42 నిమిషాలు కనిపిస్తాడు. అందులో ఒక్క సన్నివేశం కూడా ఎడిట్ చేయడానికి నేను ఒప్పుకోలేదు. 42 నిమిషాలు అంటే చిన్న విషయం కాదు. ఐదు రోజుల్లో అతడి సీన్స్ షూట్ చేశాం. ఐదు రోజుల్లో షూట్ పూర్తి కథ వినలేదు. ఎక్కడా జోక్యం చేసుకోలేదు. ఇది సీన్.. అన్న వెంటనే అద్భుతంగా నటించేస్తాడు. అది అతడి గొప్పతనం. రాజు బన్గయా జెంటిల్మెన్ సినిమాకుగానూ అతడు రూ.50 వేలు తీసుకున్నాడు. తను రూ.10వేలకు సినిమా చేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పట్లో నా ఇంట్లోనే ఉండేవాడు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే కథానాయకులకు రూ.50 వేలు ఇస్తేనే గౌరవంగా ఉంటుంది. ఆ మాత్రం ఇవ్వాలి' అని చెప్పుకొచ్చాడు. కాగా రాజు బన్గయా జెంటిల్మెన్ సినిమాకు వివేక్ సహనిర్మాతగా వ్యవహరించాడు. చదవండి: ప్రేమ పేరుతో సోదరుడు మోసం.. గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్ -
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవం.. ఆ రెండు సినిమాలదే హవా
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవం.. మంగళవారం రాత్రి ముంబయిలో అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ సినీ ప్రముఖులు చాలామంది ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అయితే అవార్డ్స్ సొంతం చేసుకునే విషయంలో 'జవాన్', 'యానిమల్' చిత్రాలు పోటీ పడ్డాయి. పలు విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. ఇంతకీ ఎవరెవరికి ఏయే అవార్డులు వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) దాదా సాహెబ్ ఫాల్కే-2024 అవార్డ్స్ లిస్ట్ ఉత్తమ నటుడు - షారుక్ ఖాన్ (జవాన్) ఉత్తమ నటి- నయనతార (జవాన్) ఉత్తమ దర్శకుడు - సందీప్ రెడ్డి వంగా (యానిమల్) ఉత్తమ నటుడు (నెగిటివ్ రోల్) - బాబీ డియోల్ (యానిమల్) క్రిటిక్స్ ఉత్తమ నటుడు - విక్కీ కౌశల్ (సామ్ బహదూర్) ఉత్తమ సంగీత దర్శకుడు - అనిరుధ్ రవిచందర్ (జవాన్) ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (పురుషులు) - వరుణ్ జైన్ ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మహిళలు) - శిల్పా రావు ఉత్తమ గీత రచయిత - జావేద్ అక్తర్ (నిక్లే ది కభి హమ్ ఘర్సే దున్కీ) ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ - యేసుదాసు ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ - మౌషుమీ ఛటర్జీ టీవీ కేటగిరీ టీవీ సిరీస్ ఆఫ్ ది ఇయర్ - ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్ ఉత్తమ నటుడు - నీల్ భట్ (ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్) ఉత్తమ నటి - రూపా గంగూలీ (అనుపమ) ఓటీటీ క్రిటిక్స్ ఉత్తమ నటి - కరిష్మా తన్నా (స్కూప్ సిరీస్) (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'కల్కి' హీరోయిన్? పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!) Congratulations @iamsrk on winning the Best Actor Award for Jawan at the #DadasahebPhalkeAward pic.twitter.com/w1FVRL1UOt — Shah Rukh Khan Fc - Pune ( SRK Fc Pune ) (@SRKFC_PUNE) February 20, 2024 Nayanthara at Dadasaheb Phalke International Film Festival Awards 2024 💛🏆✨#Nayanthara #DadasahebPhalkeAward pic.twitter.com/xdKzunByQF — WV - Media (@wvmediaa) February 21, 2024 -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్బస్టర్ సినిమా
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డంకీ' సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాదిలో సలార్కు పోటీగా డిసెంబర్ 21న డంకీ విడుదలైంది. 2023లో పఠాన్,జవాన్ చిత్రాలతో షారుక్ ఖాన్ రెండు బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించినా ఆ రెండు చిత్రాల రేంజ్లో మెప్పించలేక పోయింది. దీంతో రూ. 470 కోట్ల కలెక్షన్స్ వద్ద డంకీ ఆగిపోయింది. తాజాగా డంకీ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. వాస్తవంగా ఈ సినిమా జనవరిలోనే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీలు కాలేదు. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండు షారుక్ డంకీ సినిమాను నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇప్పటికే నెట్ఫ్లిక్స్లో టాలీవుడ్ సినిమాలు అయిన సలార్,యానిమల్,గుంటూరు కారం, హాయ్నాన్న వంటి చిత్రాలు టాప్ టెన్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు డంకీ చిత్రం నెట్ఫ్లిక్స్లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. థియేటర్స్లో డంకీ చిత్రాన్ని చూడలేకపోయిన ప్రేక్షకులు ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
Shah Rukh Khan: హాలీవుడ్ హీరోలతో షారుఖ్ పోటీ!
గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. వాటిలో పఠాన్, జవాన్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సాధించి, రూ.1000 కోట్ల క్లబ్లో చేరాయి. ఇక డిసెంబర్లో వచ్చిన ‘డంకీ’కూడా మంచి వసూళ్లను సాధించి, షారుఖ్కి హ్యాట్రిక్ హిట్ని అందించింది. ఇలా ఒకే ఏడాదిలో మూడు సినిమాలను రిలీజ్ చేసి, వాటిలో రెండు చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఏకైక హీరోగా షారుఖ్ చరిత్ర సృష్టించాడు. (చదవండి: చాలా ఎళ్ల నుంచి అతనితో డేటింగ్లో ఉన్నాను: తాప్సీ) తాజాగా బాలీవుడ్ బాద్షా హాలీవుడ్ హీరోలతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాడు. యాక్షన్, ఫైట్స్, స్టంట్స్ విషయంలో హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడడానికి పఠాన్, జవాన్ సినిమాలు సిద్ధమయ్యాయి. ఇటీవల ప్రకటించిన వల్చర్ 2023 ఆన్యువల్ స్టంట్ అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్లో షారుఖ్ నటించిన ‘జవాన్, పఠాన్ చిత్రాలు ఉన్నాయి. కేను రీవ్స్ నటించిన ‘జాన్ విక్ 4’, టామ్ క్రూజ్ హీరోగా చేసిన ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ వన్’ లాంటి హాలీవుడ్ చిత్రాలతో ఇవి పోటీ పడనున్నాయి. (చదవండి: రొమాంటిక్ డ్రామాతో హాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ) బెస్ట్ వెహిక్యులర్ స్టంట్, బెస్ట్ స్టంట్ ఇన్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరీల్లో జవాన్, బెస్ట్ ఏరియల్ స్టంట్, బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరిల్లో ‘పఠాన్’ నామినేట్ అయింది. ఇక బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరిలో హాలీవుడ్కి చెందిన ‘బెలరినా’, ‘గై రిచీస్ ది కోవనెంట్, ఎక్స్ట్రాక్షన్ 2, ఫిస్ట్ ఆఫ్ ది కోండర్’, ‘జాన్ విక్ - చాప్టర్ 4’, ‘మిషన్ ఇంపాజిబుల - డెడ్ రెకనింగ్ పార్ట్ 1’, ‘సైలెంట్ నైట్’, ‘షిన్ కామెన్ రైడర్ చిత్రాలు ఉన్నాయి. -
షారుక్ ఖాన్ నిర్మాత.. డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ చిత్రం
తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని అభిమానులను సొంతం చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్. వరుస సినిమాలతో ఆమె కెరియర్ ఎంతో బిజీగా ఉంది. గతేడాదిలో ఆరు సినిమాలతో మెప్పించినా ఈ బ్యూటీ కొత్త ఏడాదిలో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. బదాయి దో, గోవింద నామ్ మేరాలో రెండు అద్భుతమైన ప్రదర్శనలతో భారతదేశంలోని అత్యుత్తమ నటీమణులలో తానూ ఒకరని మరోసారి నిరూపించుకుంది భూమి ఆమె కీలక పాత్రలో పులకిత్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘భక్షక్’ సినిమాతో ఆమె ఈ ఏడాది తొలిసారి కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుక్ఖాన్, గౌరీఖాన్లు నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ప్రముఖ ఓటీటీ వేదిక అయిన నెట్ఫ్లిక్స్లో భక్షక్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ చిత్రం హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. తాజాగా విడుదుల అయిన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిజాలు నిర్భయంగా బయట పెట్టే జర్నలిస్ట్ వైశాలీ సింగ్ పాత్రలో భూమి పెడ్నేకర్ కనిపించనుంది. వాస్తవ సంఘటనల ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని డైరెక్టర్ తెరకెక్కించాడు. ప్రస్తుత సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాలను జర్నలిస్ట్గా వైశాలి ఎలా గుర్తించింది..? అనేది చాలా ఆసక్తిగా ఉండనున్నట్లు టీజర్ను చూస్తే అర్థం అవుతుంది. ఈ సాహసవంతమైన కార్యచరణలో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేది తెలియాలంటే ఫిబ్రవరి 9వ తేదీన నెట్ఫ్లిక్స్లో చూడాల్సిందే.. -
సలార్ VS డంకీ.. మొదటిసారి రియాక్ట్ అయిన ప్రశాంత్ నీల్
'ఉగ్రం' సినిమాతో దర్శకుడిగా 2014లో కెరీర్ ప్రారంభించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నాడు. ‘ఉగ్రం’ తర్వాత మూడు సినిమాలే చేశాడు. కానీ ఆయన సినిమాలకు ఆదరణ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కేజీఎఫ్ 1, 2 సినిమాల ద్వారా ఇండియన్ సినిమా మార్కెట్లో ఫేమస్ డైరెక్టర్గా పాపులారిటీ పెంచుకున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యాక్షన్ ప్యాక్డ్ మూవీ సలార్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అదరగొట్టేస్తున్నాడు. 'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్తో సలార్ తెరకెక్కించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ తదితరులు నటించిన సలార్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ విజయం పట్ల దర్శకుడు ప్రశాంత్ నీల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు.. తన సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సలార్ వర్సెస్ డంకీ ఫైట్పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు ఇద్దరు టాప్ హీరోల సినిమాల మధ్య గొడవలు పడుతుంటారు. 'నేను అలాంటి వాటిని ప్రోత్సహించను. అలాంటివి వినడానికి కూడా ఇష్టపడను. ఇలాంటి ట్రెండ్ సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం మంచిది కాదు. కళాకారులు ఒకరితో ఒకరు పోటీపడరు. అందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ‘సలార్’, ‘డంకీ’ల మధ్య చాలా మంది అనుకుంటున్నట్లు ప్రతికూల వాతావరణం ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు. డంకీ నిర్మాతలు కూడా మనలాగే పాజిటివ్గా ఆలోచించాలి. మనమందరం ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నాం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ ఉండే క్రికెట్ మ్యాచ్ కాదు.' అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. బాలీవుడ్లో సలార్ చిత్రానికి థియేటర్లు లేకుండా చేసిన కొందరు రివ్యూలు కూడా నెగటివ్గానే చెప్పడం జరిగింది. సలార్ సినిమాను ఇంకా బాగా ప్రమోట్ చేస్తే బాగుంటుందని అలా చేసి ఉంటే మరింత వసూళ్లు వచ్చేవని కూడా వచ్చే ప్రశ్నలకు కూడా ఆయన ఇలా చెప్పారు. 'డంకీతో విడుదల కాకుండా మా సినిమా మాత్రమే విడుదలై ఉంటే ఇలాంటి వార్తలు వచ్చేవి కావు.' అని ప్రశాంత్ నీల్ అన్నారు. సలార్ చిత్రం డిసెంబర్ 22న తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలయింది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్ల మార్క్ను దాటింది. -
'డంకీ' ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత తక్కువా..? సలార్కు లైన్ క్లియర్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. పఠాన్, జవాన్ సినిమాలతో ఈ ఏడాది రెండు భారీ బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. తాజాగా డిసెంబర్ 21న 'డంకీ'తో వచ్చేశాడు. రాజ్కుమార్ హిరానీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ పట్ల పాజిటివ్ టాక్ ఉన్నా.. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే అలరిస్తుందని టాక్ వినిపిస్తుంది. భారీ అంచనాలతో విడుదలైన డంకీ చిత్రం మొదటిరోజు ఆశించిన కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ ఏడాదిలో వచ్చిన పఠాన్, జవాన్ చిత్రాల మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ను డంకీ దాటలేకపోయింది. సినిమా ట్రేడ్ వర్గాల ప్రకారం డంకీ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసులు చేసింది. నెట్ కలెక్షన్స్ ప్రకారం అయితే రూ. 30 కోట్లు అని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాదిలో వచ్చిన పఠాన్ మొదటిరోజు రూ. 106 కోట్లు కలెక్ట్ చేయగా జవాన్ రూ. 129 కోట్లు రాబట్టింది. రెండు వరుస భారీ హిట్లు కొట్టిన తర్వాత వచ్చిన చిత్రం డంకీ... దీంతో ఈ సినిమా రూ. 130 కోట్ల మార్క్ను దాటుతుందని అందరూ అంచనా వేశారు. డంకీ చిత్రం మేకర్స్ అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ప్రకటించలేదు. ప్రభాస్ ప్లాప్ సినిమాను దాటలేకపోయిన 'డంకీ' ప్రభాస్ ప్లాప్ సినిమా అయిన ఆదిపురుష్ చిత్రం కంటే డంకీ మూవీకి కలెక్షన్స్ తక్కువ వచ్చాయి. ఆదిపురుష్ సినిమా మొదటి రోజు 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెట్ కలెక్షన్స్ ప్రకారం అయితే రూ. 37 కోట్లు. బాలీవుడ్లో మొదటిరోజు వచ్చిన టాప్ కలెక్షన్స్ లిస్ట్లో డంకీ చిత్రం 7వ స్థానంలో ఉంది. ఈ లెక్కన చూస్తే ప్రభాస్ సలార్తో భారీ రికార్డ్స్ కొట్టడం ఖాయం అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు డంకీ మూవీకి చెప్పుకోతగిన టాక్ రాలేదు. రాజ్ కుమార్ హిరానీ కేరీర్లోనే వీకెస్ట్ సినిమాగా డంకి పేరు తెచ్చుకుంది. అసలే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా వెనుకబడింది. సలార్ మాత్రం 33 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడపోయాయని సమాచారం. సలార్తో ప్రభాస్ బిగ్గెస్ట్ ఓపెనర్గా రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం. -
ఆనంద్ పండిట్ 60వ పుట్టినరోజు వేడుకలో బాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
-
Dunki Movie Review: ‘డంకీ’ మూవీ రివ్యూ
టైటిల్: డంకీ నటీనటులు: షారుక్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, బొమాన్ ఇరానీ, అనీల్ గ్రోవర్ తదితరులు నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్కుమార్ హిరాణి ఫిల్మ్స్ నిర్మాతలు:గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్పాండే దర్శకత్వం: రాజ్ కుమార్ హిరాణీ సంగీతం: అమన్ పంత్, ప్రీతమ్(పాటలు) సినిమాటోగ్రఫీ: సీకే మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్ విడుదల తేది: డిసెంబర్ 21, 2023 ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సినిమాలను తెరకెక్కించే అతికొద్ది మంది దర్శకుల్లో రాజ్ కుమార్ హిరాణీ ఒకరు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది షారుక్ ఖాన్తో సినిమా అంటే.. ఆ అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. డంకీ విషయంలో అదే జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది. అందుకే డంకీపై మొదటి నుంచే ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 21)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పఠాన్, జవాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ల తర్వాత షారుక్ నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? షారుక్ ఖాతాలో హ్యాట్రిక్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం. డంకీ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1995లో సాగుతుంది. శత్రువుల దాడిలో గాయపడిన సైనికుడు హార్డీ(షారుఖ్)ని ఓ వ్యక్తి కాపాడుతాడు. కొన్నాళ్ల తర్వాత అతన్ని కలిసేందుకు హార్డీ పంజాబ్కి వస్తాడు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మరణిస్తాడు. అతని సోదరి మను రంధ్వా అలియాస్ మన్ను(తాప్సీ పన్ను) కుటుంబ బాధ్యతను తీసుకుంటుంది. అప్పులు కట్టలేక ఇంటిని కూడా ఆమ్మేస్తారు. లండన్ వెళ్లి బాగా డబ్బు సంపాదించి.. అమ్ముకున్న ఇంటిని మళ్లీ కొనాలనేది మను కల. అలాగే ఆమె స్నేహితులు బుగ్గు లక్నపాల్(విక్రమ్ కొచ్చర్), బల్లి(అనిల్ గ్రోవర్) కూడా డబ్బు సంపాదించడానికై లండన్ వెళ్లాలనుకుంటారు. వీసా కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. తన ప్రాణాలను కాపాడిన ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న హార్డీ.. మనుని లండన్ పంపించేందుకు సహాయం చేస్తాడు. ఈ నలుగురు వీసా కోసం ట్రై చేస్తారు. అందుకోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలని అష్టకష్టాలు పడతారు. ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లో ఈ నలుగురికి సుఖీ(విక్కీ కౌశల్) పరిచయం అవుతాడు. తన ప్రియురాలి జెస్సీని కలిసేందుకు అతను లండన్ వెళ్లాలనుకుంటాడు. వీళ్లంతా లీగల్గా ఇంగ్లండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. దీంతో దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించి లండన్ వెళ్లాలని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంగ్లండ్కు అక్రమంగా వెళ్లే క్రమంలో వీళ్లు పడిన కష్టాలేంటి? లండన్లో వీళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? ప్రియురాలి కోసం ఇంగ్లండ్ వెళ్లాలనుకున్న సుఖీ కల నెరవేరిందా లేదా? మన్నుతో ప్రేమలో పడిన హర్డీ.. తిరిగి ఇండియాకు ఎందుకు వచ్చాడు? పాతికేళ్ల తర్వాత.. మన్ను తిరిగి ఇండియాకు ఎందుకు రావాలనుకుంది? ఈ క్రమంలో హార్డీ మళ్లీ ఎలాంటి సహాయం అందించాడు? మను, హర్డీల ప్రేమ కథ సంగతేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మంచి కథ, భావోద్వేగాలతో పాటు చక్కటి సామాజిక సందేశం ఉన్న సినిమాలను తెరకెక్కించడం రాజ్ కుమార్ హిరాణి స్పెషాలిటీ. సామాజిక అంశాలకు వినోదాన్ని మేళవించి ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమాను తీర్చిదిద్దుతాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్, పీకే, సంజు..చిత్రాలే వీటికి నిదర్శనం. డంకీ చిత్రంలో కూడా మంచి సోషల్ మెసేజ్ఉంది. కానీ దాన్ని ప్రేక్షకులకు ఆకట్టుకునేదే తీర్చిదిద్దడంలో రాజ్ కుమార్ హిరాణీ పూర్తిగా సఫలం కాలేదు. భారత్ నుంచి అక్రమంగా యూకేలోకి ప్రవేశించాలనుకునే నలుగురు స్నేహితుల కథే డంకీ. దర్శకుడు రాజ్ కుమార్.. అక్రమ వలసదారుల కాన్సెప్ట్ని తీసుకొని దానికి దేశభక్తి, లవ్స్టోరీని టచ్ చేసి ఎమోషనల్ యాంగిల్లో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ పాత్రలదారుల భావోద్వేగాలను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేయలేకపోయాడు. ఎమోషనల్ సీన్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు. వినోదం పండించడంలో మాత్రం తన పట్టు నిలుపుకున్నాడు. ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగిపోతుంది. పాతికేళ్లుగా లండన్లో ఉన్న మన్ను తిరిగి ఇండియా రావాలనుకొని ఆస్పత్రి నుంచి బయటకు పారిపోయే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికే కథ 1995లోకి వెళ్తుంది. మన్ను.. ఆమె స్నేహితులు బల్లి,బుగ్గుల నేపథ్యం నవ్విస్తూనే.. ఎమోషనల్గా టచ్ అవుతుంది. ఇక హీరో ఎంట్రీ అయిన కాసేపటికే కథంతా కామెడీ మూడ్లోకి వెళ్తుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ మను గ్యాంగ్ పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే వీసా కోసం చేసే ప్రయత్నాలు కూడా నవ్విస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం ఎమోషనల్కు గురి చేస్తుంది. ఇక సెకండాఫ్ అంతా కాస్త సీరియస్గా సాగుతుంది. డంకీ రూటులో( దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబ్లో దాన్ని డంకీ అని పిలుస్తారు) ఇంగ్లండ్కి వెళ్లే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక లండన్ వెళ్లాక ఈ నలుగు పడే కష్టాలు నవ్విస్తూనే..కంటతడి పెట్టిస్తాయి. కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. తిరిగి ఇండియాకు రావాలనుకున్నా..మళ్లీ డాంకీ ట్రావెలే చేయాల్సి వస్తుంది. ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కన్నీళ్లను పెట్టిస్తుంది. కథ సాగదీసినట్లుగా అనిపించడం.. ప్రేక్షకుడి ఊహకు అందేలా కథనం సాగడం కూడా మైనస్. ఎవరెలా చేశారంటే.. పఠాన్, జవాన్ చిత్రాల్లో యాక్షన్తో ఇరగదీసిన షారుక్.. ఇందులో సాదాసీదా పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హార్డీసింగ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కామెడీ పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించాడు. అయితే ఓల్డ్ లుక్లో షారుఖ్ని చూడడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో తాప్సీకి మరో బలమైన పాత్ర లభించింది. మన్ను పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సినిమా మొత్తం ఆమె పాత్ర ఉంటుంది. కొన్ని చోట్ల అయితే తనదైన నటనతో కన్నీళ్లను తెప్పిస్తుంది. ఇక విక్కీ కౌశల్ ఈ చిత్రంలో కనిపించేది కొద్ది సేపే అయినా..గుర్తిండిపోయే పాత్రలో నటించాడు. విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్, బోమన్ ఇరాన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ప్రీతమ్ పాటలు పర్వలేదు.లుట్ ఫుట్ గయా సాంగ్ ఆకట్టకుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
PVR మల్టీప్లెక్స్లలో కనిపించని సలార్.. కారణం 'డంకీ' సినిమానే
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ప్రభాస్ 'సలార్' సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆఫ్లైన్, ఆన్లైన్లో టికెట్లను విడుదల చేశారు. భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కడంతో ఏపీలో 10 రోజులు పాటు రూ.40 పెంచుకునేందుకు, తెలంగాణలో మల్టీప్లెక్స్ల్లో రూ.100, సింగిల్ థియేటర్లలో రూ.65 పెంచుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో మల్టీఫ్లెక్స్లో సినిమా చూడాలంటే ఒక్కో టికెట్ రూ. 400 పైమాటే.. అయినా ఎక్కడా టికెట్లు దొరకడం లేదు. తాజాగా నార్త్ ఇండియా ప్రాంతాల్లో ఉన్న పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లల్లో 'సలార్' సినిమాను విడుదల చేయకూడదని మూవీ టీమ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం షారుక్ ఖాన్ 'డంకీ' సినిమాకు ఈ థియేటర్లు ఇచ్చిన ప్రాముఖ్యతే అని చెప్పవచ్చు. సలార్ సినిమా విడుదలకు ముందే ఈ రెండు మల్టీఫ్లెక్స్లతో హోంబలె ఫిల్మ్స్ అగ్రిమెంట్ ఉంది. దాని ప్రకారం నార్త్ ఇండియాలో 'డంకీ'తో పాటు 'సలార్'కు పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ చైన్ థియేటర్లలో సమానంగా స్క్రీన్లు కేటాయించాలి. కానీ డంకీ సినిమాకే ఎక్కువ స్క్రీన్స్ను ఈ రెండు మల్టీఫ్లెక్స్లు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లల్లో సలార్ను ఇవ్వకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారట. సలార్ నుంచి రెండో ట్రైలర్ విడుదల అయిన తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్ను మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. అప్పటికే డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ బుక్ మై షో యాప్ను ఓపెన్ చేసి టికెట్ల కోసం రెడీగా ఉన్నారు. లక్షలాది మంది ఒక్కసారిగా యాప్ను ఓపెన్ చేయడంతో యాప్ సర్వర్ డౌన్ అయింది. తర్వాత అది ఓపెన్ కాగానే చూస్తే.. సలార్ టికెట్లు దొరికే పరిస్థితి లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బ్లాక్లో టికెట్లు కొనేందుకు ప్రయత్నాలు చేస్తే.. ఒక్కో టికెట్ రూ. 2000 పై మాటే చెబుతున్నారని వారు వాపోతున్నారు. -
Dunki X Review: డంకీ ట్విటర్ రివ్యూ
బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరాణి కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘డంకీ’. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యానర్స్ సమర్పణలో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత షారుఖ్ నటించిన చిత్రం కావడంతో మొదటి నుంచే డంకీ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 21) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. డంకీ కథేంటి? ఎలా ఉంది? షారుఖ్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవోంటో చదివేయండి. ఇది కేలవం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. డంకీ చిత్రానికి ఎక్స్ లో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. షారుక్ ఖాన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని కొంతమంది కామెంట్ చేస్తే.. యావరేజ్మూవీ అని.. భరించడం కష్టమని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఎక్స్లో నెగెటివ్ కంటే ఎక్కువగా పాజిటివ్ పోస్టులే కనిపిస్తున్నాయి. కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయినట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ హిరాణి మరోసారి తనదైన స్క్రీన్ప్లేతో మాయ చేశాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #Dunkireview Masterpiece Rating ⭐️⭐️⭐️⭐️⭐️ 5/5 Its an absolute masterpiece! The storytelling is captivating, the cinematography is stunning, and the performances are top-notch. This movie had me on the edge of my seat from start to finish.#Dunkireviews #SRK #ShahRuhkKhan pic.twitter.com/NoBdMF7FRc — komal nehta (@komalnehta) December 20, 2023 డంకీ..ఓ మాస్టర్ పీస్. కథ చెప్పిన విధానం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ స్టన్నింగ్గా ఉంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు సీట్లకు త్తుకునపోయి చూస్తారు’అని కామెంట్ చేస్తూ ఓ నెటిజన్ 5/5 రేటింగ్ ఇచ్చాడు. #DunkiReview Raju sir + SRKs = Another 1000 cr Mark my work... What a movie man...Theater me bina rumaal aur tissue paper ke mat jana ⭐⭐⭐⭐⭐#Dunki #DunkiFirstDayFirstShow #RajkumarHirani #ShahRukhKhan pic.twitter.com/7TpZdfcsXB — AbRam Khan (@iAmDilshad07) December 21, 2023 షారుఖ్ ఖాన్ మరోసారి రూ.1000 కోట్ల క్లబ్లో చేరబోతున్నాడు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. It’s a boring fare all together. SRK acting is big let down dialogue delivery is hard to bear. Hirani has delivered it’s worst ever Wait for movie to release on OTT #Dunki #DunkiReview — Thagudam (@Neninthe___) December 21, 2023 బోరింగ్ మూవీ. షారుక్ యాక్టింగ్ బాగున్నా.. డైలాగ్ డెలివరీ భరించడం కష్టం. హిరాణీ రాజ్కుమార్ నుంచి వచ్చిన పేలవమైన చిత్రమిది. ఓటీటీలో రిలీజ్ అయ్యేంతవరకు ఎదురుచూడడం బెటర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #DunkiReview-⭐⭐⭐⭐⭐ It's not a Blockbuster, it's a Mega Blockbuster Movie, #ShahRukhKhan𓀠 Character is literally Blow your Mind, And Story is Top level, A Must watch 1000cr loading🔥#Dunki #DunkiStorm #stockmarketcrash#DunkiReviews #DunkiTomorrow pic.twitter.com/6SR6DhAlGb — Amit Rahangdale (@amitrahangdale4) December 21, 2023 డంకీ బ్లాక్ బస్టర్ కాదు.. మెగా బ్లాక్ బస్టర్ మూవీ. షారుక్ పాత్ర మీ మైండ్ని బ్లాంక్ చేస్తుంది. స్టోరీ అదిరిపోయింది. తప్పకుండా చూడండి. రూ. 1000 కోట్ల మూవీ అంటూ మరో నెటిజన్ 5/5 రేటింగ్ ఇచ్చాడు. This movie is for Indian Aunties and Uncles who are settled abroad and would wish to come back home - India. Youth won’t relate to it. Watching SRK romance at this age looks creepy. He should retire now. Comedy is outdated #Dunki #DunkiReview pic.twitter.com/h2GnzpscAD — hello (@walterwhitezzz) December 20, 2023 #Dunki 5/5 ⭐️⭐️⭐️⭐️⭐️ Dunki is a fantastic blend of comedy and emotions. Shah Rukh Khan's performance is top-notch, delivering both laughs and heartfelt moments. The movie keeps you entertained throughout with its witty dialogues and touching storyline.#DunkiReview #Dunki #SRK — Nesgane (@nesgane) December 21, 2023 #Dunki #DunkiReviews https://t.co/b176wzIX2t — Raju Soni (@RajuSoni1541477) December 21, 2023 #OneWordReview...#Dunki : UNBEARABLE. Rating: ⭐️ A colossal waste of talent, big money and opportunity by director #RajuHirani. Weak story and amateur direction. #DunkiReview #ShahRukhKhan #SRK #TapseePannu pic.twitter.com/FbdWJY7PUm — Taran Adarsh (@Taran_Adaresh) December 21, 2023 OneWordReview...#Dunki: DISAPPOINTING Rating: ⭐️½#Dunki is an EPIC DISAPPOINTMENT… Just doesn’t meet the mammoth expectations… Director #RajkumarHirani had a dream cast and a massive budget on hand, but creates a HUGE MESS.#DunkiReview #ShahRukhKhan pic.twitter.com/KSFcnV5Jd3 — SANATAN THE BULL 🚩 (@being_nkm) December 21, 2023 Just finished the show. #Dunki is a cinematic gem, seamlessly blending laughter and tears. Overflowing with innocence, joy, emotions, and love, it serves as a powerful eye-opener. Shah Rukh Khan's stellar performance. RKH showcases his genius. #DunkiReview ⭐⭐⭐⭐½ — yourweirdcrush X (@Yourweirdcrush1) December 21, 2023 #Dunki wish to be a Masterpiece 🔥 #RajkumarHirani is best in Story Telling so far and wish continue with #Dunki @iamsrk performance would be another memorable ☺️ for the #ShahRuhKhan lovers pic.twitter.com/6t6m93qHzg — Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) December 21, 2023 #Dunki first half is written Blockbuster all over 💥💥🔥🔥#DunkiReview pic.twitter.com/nu1se3yaH8 — Ahmed (FAN) (@AhmedKhanSrkMan) December 21, 2023 BLOCKBUSTER PUBLIC REVIEWS! Good WoM till now💥💥#DunkiReviewpic.twitter.com/QpOylBH1do — काली🚩 (@SRKsVampire_) December 21, 2023 #DunkiReview Plz Avoid Old hindi serial drama , Head ache comdey scenes 2 scenes well written remaining totally dispointed, weakest work from Hirani sir #Dunki ⭐⭐ / 5 👎👎 pic.twitter.com/1ZQHMqGEP6 — Vamsivardhan PKVK (@Vamsivardhan_2) December 20, 2023 -
‘డంకీ’ అంటే ఏంటి? ఎందుకంత స్పెషల్?
ఈ ఏడాది కింగ్ఖాన్ షారుక్ ఖాన్దే అని చెప్పాలి. ఆయన నటించిన రెండు చిత్రాలు(పఠాన్, జవాన్) సూపర్ హిట్గా నిలిచాయి. ఒక్కో సినిమా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే డంకీ. రాజ్కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ కామెడీ డ్రామా మరికొద్ది గంటల్లో(డిసెంబర్ 21) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం... ► రాజ్ కుమార్ హిరాణీ-షారుక్ ఖాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత షారుఖ్ నటించిన చిత్రమిది. ఆ రెండు చిత్రాలు యాక్షన్ జానర్లో తెరకెక్కాయి. డంకీ మాత్రం కామెడీ డ్రామా ఎంటర్టైనర్. అభిమానుల కోసం కాకుండా తనకోసం నటించిన చిత్రమిదని షారుఖ్ అన్నారు. దీన్ని బట్టి షారుక్కి ఈ కథ ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ► సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని, కామెడీ యాంగిల్లో దాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెరకెక్కించడం రాజ్ కుమార్ హిరాణీ ప్రత్యేకత. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్, పీకే, సంజు..చిత్రాలే వీటికి నిదర్శనం. ఆయన కెరీర్లో ఇంతవరకు ప్లాప్ చిత్రమే లేదు. అందుకే డంకీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ► భారత్ నుంచి అక్రమంగా ప్రయాణించి యూకేలోకి ప్రవేశించిన స్నేహితుల కథే ఇది. ఈ చిత్రానికి తొలుత ‘రిటర్న్ టికెట్’ లేదా ‘టాస్ ’అనే టైటిల్ పెట్టాలనుకున్నారట. కానీ చివరకు డంకీ అని ఖరారు చేశారు. ► దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబీ వాళ్లు దాన్ని డంకీ అంటారు. ఈ కథ నేపథ్యం కూడా అక్రమ చొరబాటుకు సంబంధించినదే కావడంతో డంకీ సరైన టైటిల్ అని మేకర్స్ భావించారట ► ఈ మూవీ షూటింగ్ 75 రోజుల్లో పూర్తయింది. దాదాపు 60 రోజుల పాటు షారుక్ షూటింగ్లో పాల్గొన్నారు. అయితే దాదాపు రెండున్నరేళ్ల క్రితమే ఈ చిత్రం పనులు ప్రారభం అయ్యాయి. ప్రీప్రొడక్షన్ వర్క్ పకడ్బందీగా పూర్తి చేయడంతో షూటింగ్ త్వరగా పూర్తయిందట. ముంబై, జైపూర్, కశ్మీర్, లండన్, బుడాపెస్ట్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ► ఈ చిత్రం నిడివి 2.41 గంటలు. బడ్జెట్ రూ.120 కోట్లు. షారుఖ్ గత ఆరేళ్లలో నటించిన చిత్రాల్లో అతి తక్కువ బడ్జెట్తో రూపొందిన సినిమా ఇదే. ► సినిమా ప్రమోషన్స్లో భాగంగా దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై డంకీ ట్రైలర్ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి లక్షకు పైగా అభిమానులు, వీక్షకులు రావటం విశేషం. షారూక్ సైతం లుట్ పుట్ గయా.., ఓ మాహి.. పాటలకు డాన్స్ చేసి అలరించాడు. ఈవెంట్లో భాగంగా అద్భుతమైన డ్రోడ్ షోను ఏర్పాటు చేశారు. ►హీరోయిన్ తాప్సికి షారుఖ్తో తొలి సినిమా ఇది. విక్కీ కౌశల్ అతిథి పాత్ర పోషించాడు. దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత సీనియర్ నటుడు సతీశ్ షా ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ►ఈ సినిమాను తొలుత డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే రోజు ప్రభాస్ సలార్ మూవీ విడుదల కానుండడంతో డంకీ ప్రీపోన్ అయింది. -
రజనీకాంత్ సినిమాకు నో చెప్పిన షారుక్ ఖాన్
-
కూతురుతో కలిసి షిర్డీ ఆలయంలో షారుక్ ఖాన్ పూజలు (ఫోటోలు)
-
కూతురుతో షిర్డీ ఆలయంలో షారుక్ ఖాన్ పూజలు
బాలీవుడ్ కింగ్ షారుక్ఖాన్ హీరోగా రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'డంకీ'. ఈ సినిమా డిసెంబర్ 21న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు నానుంది. ఈ ఏడాది రెండు సూపర్ హిట్లతో బాక్సాఫీస్ వద్ద షారుక్ ఖాన్ సంచలనం సృష్టించారు. తాజాగా 'డంకీ'తో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్తో పాటు షారుక్ కూడా ప్రమోషన్స్లలో బిజీగా ఉన్నారు. తాజాగా షారుక్ ఖాన్ తన కూతురు సుహానా ఖాన్తో కలిసి షిర్డీ సాయి బాబాను దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షారుక్ ఖాన్కు ఆలయ ట్రస్ట్ అధికారి శివ శంకర్ సన్మానం చేశారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో షిర్డీ ఎయిర్ఫోర్టుకు చేరుకున్న షారుక్.. అక్కడి నుంచి కారులో బయల్దేరి సాయి బాబా ఆలయానికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితమే జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి మాత ఆలయానికి వెళ్లిన షారుక్ అక్కడ అమ్మవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. గత రెండు సినిమాలు పఠాన్,జవాన్ విడుదలకు ముందు కూడా ఇలా పలు ఆలయాలను షారుక్ ఖాన్ దర్శించుకుని తన సనిమా మంచి విజయం సాధించాలని పూజలు జరిపారు. ఈ క్రమంలో డిసెంబర్ 21న విడుదల కానున్న తన చిత్రం డంకీ కూడా సూపర్ హిట్ కొట్టాలని ఆయన కోరుకుంటున్నారు. డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ కూడా విడుదల కానుంది. -
వైష్ణో దేవి అమ్మవారి సన్నిధిలో షారుక్ ఖాన్.. మరో హిట్ ఖాయం
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డంకీ' డిసెంబర్ 21న విడుదల కానుంది. ఇప్పటికే ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా సినిమా విడుదలకు ముందు హీరో షారుక్ ఖాన్ జమ్మూలోని వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం జమ్మూలోని కత్రా వద్దకు ఆయన చేరుకున్నారు. ఏడాది సమయంలో మూడవసారి ఈ పవిత్ర స్థలాన్ని షారుక్ సందర్శించారు. 2023లో షారుక్ ఖాన్ రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్ సినిమాతో రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిన షారుక్ ఆ తర్వాత జవాన్ సినిమాతో కూడా మరో సూపర్ హిట్ను అందుకున్నారు. ఈ రెండు సినిమా విడుదలకు ముందు కూడా ఆయన వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. 'పఠాన్' విడుదలకు ముందు 2022 డిసెంబర్ 12న వైష్ణోదేవి ఆలయంలో పూజలు నిర్వహించిన షారుక్.. మళ్లీ 'జవాన్' విడుదలకు ముందు ఆగస్టులో మరోసారి అక్కడికి వెళ్లారు. మళ్లీ ఇప్పుడు 'డంకీ' విడుదల సమయంలో అక్కడ పూజలు నిర్వహించారు. అలా వైష్ణోదేవి అమ్మవారి సెంటిమెంట్ను షారుక్ పాటిస్తున్నారు. అమ్మవారి ఆలయం చుట్టూ షారుక్ తిరుగుతుండగా పలువురు వీడియోలు తీశారు. ఆయనతో పాటు తన అంగరక్షకులు, మేనేజర్ పూజా దద్లానీ ఉన్నారు. తన సినిమాలు విజయం సాధించాలని విడుదలకు ముందే పలు దేవాలయాలను ఆయన సందర్శిస్తారు. జవాన్ సినిమా సమయంలో తిరుమల శ్రీవారిని కూడా ఆయన దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో రానున్న 'డంకీ'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో షారుఖ్తో పాటు బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్ తదితరులు నటించారు. 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ఈ మధ్యే విడుదలైంది. దానికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది. డిసెంబర్ 22న డంకీ చిత్రానికి పోటీగా ప్రభాస్ సలార్ వస్తున్న విషయం తెలిసిందే. #WATCH | J&K: Actor Shah Rukh Khan visited Mata Vaishno Devi shrine, earlier today. (Source: J&K Police) pic.twitter.com/hK3JHvaCG2 — ANI (@ANI) December 12, 2023 -
ఇన్స్టాగ్రామ్ పోస్టులతోనే... కోట్లు సంపాదించింది!
నటి, సింగర్, టిక్ టాక్ స్టార్, యాంకర్ అయిన 'జన్నత్ జుబేర్ రహ్మానీ' పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు అందరికీ పరిచయం లేకపోవచ్చు కానీ బాలీవుడ్లో మాత్రం ఈ పేరు తెలియని వారుండరు.. కేవలం ఏడేళ్ల వయసులో మొదట బుల్లితెరపై కనిపించిన జన్నత్ జుబేర్ రహ్మానీ కొద్దిరోజుల్లోనే సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2009లో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ... 2011లో కలర్స్ టీవీలో 'ఫుల్వా'తో బుల్లి తెరపై మెరిసింది. అప్పటి నుంచి పలు సీరియళ్లతో పాటు లైవ్ ప్రోగ్రామ్స్, రియాలిటీ షోస్, సాంగ్ ఆల్బమ్స్లో తనదైన మార్క్ చూపించి నెట్టింట ఒక ఊపు ఊపేసింది. 2018లో బాలీవుడ్లో అడుగుపెట్టి 'హిచ్కీ' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. రాణీ ముఖర్జీ స్టూడెంట్స్లో ఒకరిగా నటించి ఆపై.. నటిగా కొనసాగుతూనే సింగర్గా, వాయిస్ ఆర్టిస్ట్గా, టిక్ టాక్ స్టార్గా ఇలా ఇండస్ట్రీలో ఎన్ని ఉన్నాయో అన్నింటిలో తన సత్తా ఎంటో చూపింది ఈ ముంబై బ్యూటీ. ఇండియాలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్లను కూడా తన క్రేజ్తో వెనక్కి నెట్టేసింది. అంతలా బాలీవుడ్లో తన ప్రభావం చూపింది. ప్రస్తుతం 22 ఏళ్ల వయసున్న ఈ బ్యూటీకి కేవలం ఇన్స్టాలో పోస్టులు ద్వారానే దాదాపు రూ.25 కోట్లకు పైగానే సంపాదిస్తోంది. ముంబైలో విలాసవంతమైన ఇల్లు, సుమారు రూ. 3కోట్ల లగ్జరీ కారుతో పాటు తన చుట్టూ ఎప్పుడు సేవకులు.. ఇలా బాలీవుడ్లో ఒక సెన్సేషన్గా మారిపోయింది. బాలీవుడ్ నుంచి పంజాబి చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అక్కడ తన గాత్రంతో విపరీతంగా ఆటకట్టుకుంది. మరో వైపు వెండితెరపై ప్రత్యేకమైన పాత్రలలో కనిపిస్తూ అక్కడా దుమ్మురేపుతుంది. ఆమె టాలెంట్ అంతే అనుకుంటే పొరపాటే.. 'తు ఆషికి, ఖత్రోన్ కే ఖిలాడీ, బిగ్ బాస్' వంటి రియాలిటీ షో నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. అలా తన అందం, అభినయంతో అభిమానులను కట్టిపడేసింది. పాన్ ఇండియా రేంజ్ హీరోలను కూడా వెనక్కినెట్టి ఇన్స్టాగ్రామ్లో పాపులర్ ఫిగర్గా మారిపోయింది. అక్కడ ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య అక్షరాల 48 మిలియన్లు. దీంతో ఆమె చేస్తున్న పోస్ట్ల ద్వారా ఏడాదికి రూ. 25 కోట్లు అర్జిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో షారుక్ ఖాన్ ఫాలోవర్ల సంఖ్య 42 మిలియన్లు కాగా, అమితాబ్కు 38 మిలియన్లు ఉన్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న 41 మిలియన్లు, అల్లు అర్జున్ 24 మిలియన్లు, జాన్వీ కపూర్ 22 మిలియన్లు మాత్రమే ఉన్నారు. దీనిని బట్టి ఈ బ్యూటీ టాలెంట్ ఏంటో ఈ పాటికే అర్థమైంది కాదా..! సోషల్ మీడియాలో ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న జన్నత్.. మీడియా,ఎంటర్టైన్మెంట్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ కేటగిరీల్లో ఫోర్బ్ 30 జాబితాలో ఆమె చోటు దక్కించుకుంది. View this post on Instagram A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29) -
పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో పాల్గొంటున్నందుకు..
లక్నో: పొగాకు కంపెనీల తరఫున ప్రకటనల్లో కన్పిస్తున్న బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అక్షయ్కుమార్, అజయ్ దేవ్గణ్లకు కేంద్రం నోటీసులు పంపింది. ప్రజల ఆరోగ్యానికి చేటు తెస్తున్న పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో సెలబ్రిటీలు, ముఖ్యంగా పద్మ అవార్డు గ్రహీతలు నటిస్తుండటంపై మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. కేంద్రం స్పందించడం లేదని, ఇది ధిక్కరణేనని పిటిషనర్ మరోసారి కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. షారూక్, అక్షయ్, అజయ్లకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అక్టోబర్ 20వ తేదీనే నోటీసులిచ్చిందని కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే కోర్టుకు తెలిపారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున పిటిషన్ను కొట్టేయాలని కోరారు. విచారణ 2024 మే 9కి వాయిదా పడింది. -
ప్రభాస్ వర్సెస్ షారుఖ్ విన్నర్ ఎవరు...?
-
షారుక్ ఖాన్ డంకీ ట్రైలర్ వచ్చేసింది.. తక్కువ అంచనా వేయకండి
బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్, తాప్సీ పన్ను నటించిన డంకీ మూవీ ట్రైలర్ వచ్చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల నటించడం విశేషం. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తాజాగా మంగళవారం (డిసెంబర్ 5) రిలీజైన ఈ ట్రైలర్ ఫన్, ఎమోషన్ కలగలిపి ఎంతో ఆసక్తి రేపేలా ఉంది. ఈ ట్రైలర్ SRK వాయిస్తో ప్రారంభం అవుతుంది. ఇందులో స్నేహం, కామెడీ, విషాదం వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఇంగ్లిష్ నేర్చుకొని యూకే వెళ్లి సెటిలవ్వాలనుకునే ఓ గ్రామీణ యువకుడి పాత్రలో షారుక్ ఖాన్ అదరగొట్టేశాడు అనిపిస్తుంది. కానీ అతనికి ఎంత ప్రయత్నించినా ఇంగ్లిష్ రాకపోవడంతో అక్రమంగా చూకేలోకి చొరబడాలని ప్రయత్నించడం ఆపై అక్కడి వారికి దొరికిపోవడం వంటి అంశాలు ఈ కథలో కీలకంగా ఉండనున్నాయి. షారుక్ జర్నీలో స్నేహితులతో అతను పడే ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నాడో డంకీ ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. తాజాగా డంకీ ట్రైలర్ను షారుక్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఇలా చెప్పాడు. 'ఈ కథను నేను లాల్టూ నుంచి మొదలు పెట్టాను. నా ఫ్రెండ్స్ తో కలిసి రాజు సర్ విజన్ నుంచి మొదలైన ప్రయాణాన్ని డంకీ ట్రైలర్ చూపిస్తుంది. ఈ ట్రైలర్ స్నేహం, కామెడీ, విషాదంతో పాటు ఇల్లు, కుటుంబ జ్ఞాపకాలను అందరినీ తట్టిలేపేలా ఉంటుంది. నేను ఎంతో కాలంగా ఎదరు చూస్తున్న సమయం వచ్చేసింది. డంకీ డ్రాప్ వచ్చేసింది.' అనే క్యాప్షన్తో షారుక్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే లాంటి సినిమాలను తీసిన రాజు హిరానీ డైరెక్షన్లో డంకీ చిత్రం రావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
IPL 2024: సామ్ కర్రన్ కొనసాగింపు.. భారీ హిట్టర్కు షాకిచ్చిన పంజాబ్
ఐపీఎల్ 2024 సీజన్కు సంబంధించి కొనసాగించే ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్ (Release) చేసే ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు ఇవాళ (నవంబర్ 26) ప్రకటించాయి. పంజాబ్ కింగ్స్ మొత్తంగా 5 మంది ఆటగాళ్లను విడుదల చేసి, 19 మందిని కొనసాగించింది. పంజాబ్ కెప్టెన్గా శిఖర్ ధవన్ను కొనసాగించింది. పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో హార్డ్ హిట్టర్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. షారుఖ్ ఖాన్ భానుక రాజపక్స మోహిత్ రతీ బల్తేజ్ ధందా రాజ్ అంగద్ బవా పంజాబ్ కింగ్స్ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే.. శిఖర్ ధవన్ (కెప్టెన్) జానీ బెయిర్స్టో జితేశ్ శర్మ ప్రభ్సిమ్రన్ సింగ్ మాథ్యూ షార్ట్ హర్ప్రీత్ బ్రార్ అథర్వ తైడే రిషి ధవన్ సామ్ కర్రన్ సికంబర్ రజా లియామ్ లివింగ్స్టోన్ గుర్నూర్ సింగ్ బ్రార్ శివమ్ సింగ్ రాహుల్ చాహర్ అర్షదీప్ సింగ్ హర్ప్రీత్ బ్రార్ విధ్వత్ కావేరప్ప కగిసో రబాడ నాథన్ ఇల్లిస్ -
ఫ్లోర్లు ఊడ్చా..టాయ్లెట్లు క్లీన్ చేశా...కానీ: హీరోయిన్
జీవితంలో అనుకున్నది సాధించాలంటే..అనేక కష్టనష్టాల్ని భరించాలి. ఆటుపోట్లను తట్టుకుని రాటు దేలాలి. అపుడు మాత్రమే అందరికంటే మిన్నగా, ఉన్నతంగా నిలుస్తాం. అందులోనూ సినీ పరిశ్రమలో మహిళలు రాణించాలంటే మరింత కష్టపడాలి. దేశం ఏదేనా.. ప్రాంతం ఏదైనా సినీ హీరోయిన్లకు ఇదే పరిస్థితి...! మహీరా ఖాన్ పాకిస్తాన్లో పాపులర్ హీరోయిన్, అత్యధిక పారితోషికం తీసుకునే నటి.'ఖిరాద్'టీవీ సీరియల్తో పాటు, ఫవాద్ ఖాన్తో నటించిన హమ్ సఫర్తో మరింత పాపులరయ్యారు. 2017లో మహిరా షారుఖ్ ఖాన్ సరసన నటించిన రయీస్ అనే చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇటీవలే వ్యాపారవేత్త సలీం కరీమ్తో రెండో వాహం చేసుకుంది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతోపాటు మహిరా ఖాన్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, పైకి ఎదగడానికి పడిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్లో ఒకానొక సమయంలో ఫ్లోర్లు ఊడ్చి, టాయిలెట్లను శుభ్రం చేశానని గతంలో ఒక మ్యాగజైన్ ఇచ్చిన గుర్తు చేసుకున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, జీవనం సాగించానని చెప్పుకొచ్చారు. లాస్ ఏంజిల్స్లో ఉంటున్నప్పుడు టాయిలెట్లను శుభ్రం చేయడం, ఫ్లోర్లను శుభ్రం చేయడం లాంటివి చేశానన్నారు. నిజానికి చేతిలో ఒక్క డాలర్ కూడా లేని టైంలో ఉన్న కొద్ది పాటి భోజనాన్ని సోదరుడితో కలిసి సర్దుకున్న వైనాన్ని వివరించారు. బైపోలార్ డిజార్డర్తో బాధపడ్డా సెలబ్రిటీ జీవితంలో కఠినమైన విమర్శలు ఎంత అనివార్యమైన భాగమని పేర్కొన్నారు. తాను కూడా బైపోలార్ డిజార్డర్ అనే 'మానిక్ డిప్రెషన్'తో పోరాడినట్లు వెల్లడించారు. ముఖ్యంగా "రయీస్" చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా ఇటీవల వెల్లడించారు. దాదాపు ఆరేడు సంవత్సారలు యాంటి డిప్రెసెంట్స్తో మేనేజ్చేసినట్టు తెలిపారు. .తన ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు కానీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి రావడం తనకు చాలా గొప్ప విషయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. జీవితంలో చాలాసార్లు ఓడిపోతాం.. కానీ ఆశాభావంతో ముందుకు సాగాలి. తన జీవితంలో కూడా చాలా కష్టమైన పీరియడ్ ఒకటుందని అందరికీ తెలియాలనే తానే విషయాలన్నీ షేర్ చేస్తున్నాన్నారు సలీం కరీమ్తో మహిరా ఖాన్ రెండో వివాహం ఈ ఏడాదిల అక్టోబర్ 2 మహీరా ఖాన్ , తన చిరకాల మిత్రుడు సలీం కరీంని రెండో వివాహం చేసుకుంది. అయితే అంతకు ముందు 17 ఏళ్ల వయసులో అలీ అక్సారిని పెళ్లాడింది. అజ్లాన్ అనే కుమారుడున్నాడు. అయితే 2015లో కొన్ని అనివార్య కారణాలతో ఈ జంట విడిపోయింది. అటు అలీ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. -
'డంకీ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకండి'.. షారుక్కు నెటిజన్ రిక్వెస్ట్!
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన బాలీవుడ్ బాద్షా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఇటీవలే అట్లీ డైరెక్షన్లో వచ్చిన జవాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీతోనే లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓకే ఏడాదిలోనే మూడో చిత్రం క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి లుట్ పుట్ గయా అనే సాంగ్ను రిలీజ్ చేశారు. అయితే తాజాగా షారుక్ ప్రతి సినిమా రిలీజ్కు ముందు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఆస్క్ ఎస్ఆర్కే సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనదైన శైలిలో వారికి ప్రశ్నలకు బదులిచ్చారు. మొదటి డంకీ అనే పదానికి అర్థమేంటో వివరించారు. డంకీ అంటే దేశ సరిహద్దుల వెంట అక్రమ ప్రయాణం గురించి వివరించే మార్గమని షారుక్ వివరించారు. ఓ నెటిజన్ సినిమాను థియేటర్లలో చూడటానికి చట్టవిరుద్ధమైన మార్గం ఏదైనా ఉందా? అన షారుక్ను ప్రశ్నించాడు. దీనిపై స్పందిస్తూ.. నా చిన్నతనంలో సినిమాలు చూసేందుకు థియేటర్ ప్రొజెక్షనిస్ట్ను లైన్లో పెట్టేవాడిని.. మీరు ఒకసారి ఇలా ప్రయత్నించండి.. వర్కవుట్ అవుతుందేమో.. కానీ ఈ విషయం మీకు చెప్పినట్లు ఎవరికీ చెప్పకండి. ఇది చాలా రహస్యం" అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. మరో నెటిజన్ కూడా డంకీని థియేటర్లో కాకుండా స్టేడియంలో ప్రదర్శించమని ఎస్ఆర్కేను కోరారు. దీనికి బాద్షా బదులిస్తూ "అవును.. నేను కూడా మా టీమ్కి ఈ విషయం చెప్పాను.. కానీ ఎయిర్ కండిషనింగ్ సమస్య. మీరు సినిమా చూసేందుకు పిల్లలు, పెద్దలతో కలిసి వెళ్లాలి. చాలా అసౌకర్యంగా ఉంటుంది..." అంటూ ఫన్నీగా ఇచ్చిపడేశాడు. కాగా.. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన డంకీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. Dunki is a way of describing an illegal journey across borders. It is pronounced डंकी. It’s pronounced like Funky…Hunky….or yeah Monkey!!! https://t.co/t0Et738SEk — Shah Rukh Khan (@iamsrk) November 22, 2023 Yes I also told the team but the air conditioning is an issue. You have to go with kids and elders for the film…will be uncomfortable…so let’s keep this one in the theatres in the 21st December only. #Dunki https://t.co/vOkGZ2fJzD — Shah Rukh Khan (@iamsrk) November 22, 2023 -
నయన్, అలియా, కత్రినాలకు ఝలక్: అరంగేట్రంలోనే వందల కోట్లతో అదరగొడుతున్న అమ్మడు
2023లో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. అలా అడుగుపెట్టిందో లేదో ఇలా బాక్సాఫీసు వసూళ్లతో దూసుకు పోతోంది. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోయిన్లు కత్రినా కైఫ్, నయనతార, అలియా భట్లను వెనక్కి నెట్టేసింది. డెబ్యూలోనే షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో చాన్స్ దక్కించుకొని.. నెక్ట్స్ ఎవరితో అనే ఆసక్తికర చర్చకు తెర లేపింది. ఇంతకీ ఎవరా నటి? ఈ కథనంలో తెలుసుకుందాం! ఆమె ఎవ్వరో కాదు స్టార్ హీరో షారుఖ్ ఖాన్తో పెంపుడు తల్లిగా నటించి అందరి దృష్టినీ ఆకర్షించిన రిధి డోగ్రా. 2007 నుండి నటిస్తోంది. తొలుత టీవీ తెరపై వెలిగిపోయింది. ఇటీవల ఓటీటీ స్టార్గా రాణిస్తోంది. కానీ దాదాపు 16 సంవత్సరాల తర్వాత అట్లీ దర్శకత్వంతో వచ్చిన జవాన్ మూవీతో బాలీవుడ్ భారీ బేక్ బ్రేక్ వచ్చింది. ఈ సినిమా ఏకంగా రూ.1150 కోట్ల కలెక్షన్లతో సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. దీంతో షారూక్తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. దీనికి తోడు ఇటీవల విడుదలైన టైగర్-3 సక్సెస్ ఆమెకు మరింత స్టార్డమ్ తెచ్చిపెట్టింది. మనీష్ శర్మ దర్వకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ , ఇమ్రాన్ హష్మీ లాంటి టాప్ స్టార్ల సరసన స్పై థ్రిల్లర్ టైగర్ 3లో నటించింది. దీపావళి కానుకగా నవంబర్ 10న సినిమా థియేటర్లలో విడుదలై ఈ మూవీ తొలివారంలోప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకుపైగా వసూలు చేసిందని టాక్.దీంతో తొలి ఏడాదిలోను 1500 కోట్ల క్లబ్లో చేరిందీ అమ్మడు. మరో వెయ్యికోట్లపై కన్ను ఈ ఏడాదికి ఇంతకుముందెన్నడూ చేయలేదు అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని ట్విటర్లో షేర్ చేసింది రిధి. జవాన్ మూవీ కలెక్షన్లు వెయ్యి కోట్లను దాటి నందుకు కృతజ్ఞతగా, అలాగే టైగర్ -3 కూడా వెయ్యి కోట్ల మార్క్కు చేరాలని ప్రార్థిస్తూ ఈ దీపావళికి వెయ్యి దీపాలు వెలిగించింది. With a heart full of gratitude and joy this diwali I decided to do something I had never done before coz what’s happened has never happened before !! 🤩🤩🤩🤩 Lit a 1000 🪔 for 1000 crore on #jawan whilst praying for a 1000 crore for #tiger3 pic.twitter.com/8b3MP5wD7q — Ridhi Dogra (@iRidhiDogra) November 14, 2023 ఎవరీ రిధి డోగ్రా 1984 సెప్టెంబర్ 22న పుట్టింది. న్యూ ఢిల్లీలోని షేక్ సరాయ్లోని అపీజే స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి కమలా నెహ్రూ కాలేజీ నుండి సైకాలజీ పట్టా అందుకుంది. ఝూమ్ జియా రేతో తన టీవీ అరంగేట్రం. హిందీ హై హమ్ (2009), YRF టెలివిజన్ రిష్తా డాట్ కామ్,సెవెన్ (2010), లాగీ తుజ్సే లగన్ (2010), మర్యాద…లేకిన్ కబ్ తక్? (2010-12), సావిత్రి (2013), యే హై ఆషికీ (2014), దియా ఔర్ బాతీ హమ్ (2015), వో అప్నా సా (2017-18), ఖయామత్ కీ రాత్ (2018) లతో ఆకట్టుకుంది. 2013లొ డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే 6, ఖత్రోన్ కే ఖిలాడి 6 (2014) తో పాపులర్ అయింది. వెబ్లో సంచలనం సైకలాజికల్ థ్రిల్లర్ అసూర్తో రిధి ఓటీటీ అరంగేట్రం చేసింది. ఈ షో స్ట్రీమింగ్ ఇటీవలే దాని రెండవ సీజన్ కూడా సక్సెస్పుల్గా ముగిసింది. ముంబై డైరీస్, బద్దమీజ్ దిల్ , వెల్కమ్ టు యువర్ డార్క్ సైడ్ అండ్ ది మ్యారీడ్ వుమన్ అనే వెబ్ సిరీస్లలో అద్భుతమైన పాత్రలు పోషించింది. ఉత్తమనటిగా అవార్డు కొట్టేసింది. దీపికాకు దీటుగా 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్ దీపికా పదుకొనే. ఆమె నటించిన పఠాన్ , జవాన్ రెండు చిత్రాలు ఏకంగా రూ.2200 కోట్లు రాబట్టాయి. దీపికా తరువాత రిధి డోగ్రా నిలుస్తోంది. నయనతార (రూ. 1150 కోట్లు), త్రిష కృష్ణన్ (రూ. 962 కోట్లు), అమీషా పటేల్ (రూ. 691 కోట్లు), రమ్య కృష్ణన్ (రూ. 610 కోట్లు), అలియా భట్ , కత్రినా కైఫ్ (ఇద్దరూ రూ. 350 కోట్లు) స్టార్లను దాటి పైకి ఎగబాకింది రిధి. 2011లో నటుడు రాకేశ్ బాపట్ను పెళ్లాడింది. కానీ మనస్పర్థల కారణంగా 2019లో భర్త నుంచి విడిపోయింది. -
ఓటీటీలోనూ అదరగొడుతున్న జవాన్.. కేవలం 10 రోజుల్లోనే..
ఓటీటీలో కొత్త సినిమా రిలీజైందంటే చాలు ఎగబడి మరీ చూస్తారు. అందులోనూ స్టార్ హీరో సినిమా అంటే ఒకటికి రెండుసార్లు చూసి సంతృప్తి చెందుతారు. థియేటర్లో బ్లాక్బస్టర్గా నిలిచిన స్టార్ హీరో మూవీ ఓటీటీలో వస్తే ఇంకే రేంజ్లో ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడదే జరిగింది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జవాన్. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రెండు నెలలు ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చింది. నవంబర్ 2న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలైన చిత్రం డిజిటల్ ప్లాట్ఫామ్లోనూ సునామీ సృష్టిస్తోంది. ఓటీటీలో రిలీజై 14 రోజులు కావస్తున్నా ఇప్పటికీ నెట్ఫ్లిక్స్ టాప్ 10 చిత్రాల్లో తొలి స్థానంలో ఉంటూ సత్తా చాటుతోంది. ఇండియాలోనే కాకుండా, శ్రీలంక, మాల్దీవులు సహా మరో నాలుగు దేశాల్లోనూ జవాన్ను ఎగబడి మరీ చూస్తున్నారు. కేవలం పది రోజుల్లోనే ఈ చిత్రం 25 మిలియన్ వాచ్ హవర్స్ సాధించింది. తక్కువ సమయంలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా జవాన్ అరుదైన రికార్డు సృష్టించింది. దీంతో ఓటీటీలోనూ జవాన్ క్రేజ్ ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతంది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోన్న హీరోయిన్ -
కమల్ హాసన్ను కలిసిన అట్లీ.. భారీ ప్రాజెక్ట్పై రివీల్
నాలుగవ చిత్రంతోనే పాన్ ఇండియా దర్శకుడు అయిపోయారు అట్లీ. దర్శకుడు శంకర్ శిష్యుడైన ఈయన రాజారాణి చిత్రంతో దర్శకుడిగా అవతారం ఎత్తారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా మెర్సల్, బిగిల్ చిత్రాలు చేసి సూపర్ హిట్ కొట్టారు. ఇక నాలుగో చిత్రంతోనే బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి బాద్షా షారుక్ ఖాన్ కథానాయకుడిగా జవాన్ చిత్రాన్ని తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఐదవ చిత్రం ఏంటన్నదాని గురించే చర్చ జరుగుతోంది. ఈయనతో చిత్రాల చేయడానికి కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు క్యూలో ఉన్నారని చెప్పవచ్చు. జవాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత షారుక్ ఖాన్ మళ్లీ అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అన్నారు. నటుడు విజయ్ కూడా షారుక్ ఖాన్ తో కలిసి నటించడానికి రెడీ అన్నారు. దీంతో వీరిద్దరిని కలిపి చిత్రం చేయడానికి కథను రెడీ చేస్తున్నట్లు అట్లీ ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. అలాంటిది అనూహ్యంగా ఈయన లోకనాయకుడు కమలహాసన్ కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నటుడు కమలహాసన్కు అట్లీ కథ చెప్పినట్లు ఆయన చాలా ఇంప్రెస్స్ అయినట్లు సమాచారం. అంతేకాకుండా కమలహాసన్ పారితోషికం తదితర విషయాలు గురించి చర్చ జరిగినట్లు, త్వరలోనే అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. కాగా షారుక్ ఖాన్, విజయ్ కలిసి నటించిన చిత్రంలో కమలహాసన్ నటించనున్నారా? లేక అట్లీ దర్శకత్వంలో హాలీవుడ్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో కమలహాసన్ నటించనున్నారా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే కాగా కమలహాసన్ ప్రస్తుతం బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరోపక్క చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇండియన్ 2 చిత్రాన్ని కంప్లీట్ చేసిన కమల్ ఇండియన్ –3 చిత్రానికి సిద్ధమవుతున్నారు. తెలుగులో నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి 2898ఏడీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈయన ప్రతి నాయకుడిగా పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నట్లు టాక్ స్వెడ్ అయింది. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో అమితాబచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తన 233 చిత్రంలో, మణిరత్నం దర్శకత్వంలో తన 234వ చిత్రంలోనూ నటించడానికి సిద్ధమవుతున్నారు. కాగా అట్లీ దర్శకత్వంలో నటించే విషయం నిజమైతే అది కమలహాసన్ 235వ చిత్రం అవుతుంది. -
సలార్ Vs డంకీ.. వెనక్కి తగ్గుతున్న ప్రభాస్.. కారణం ఇదేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ మరోసారి వాయిదా పడనుందా..? బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ డంకీ చిత్రంతో పోటీ ఎందుకని డైనోసార్ వెనకడుగు వేస్తున్నాడా..? ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చిన 'సలార్' డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆ తేదీన కూడా సలార్ రావడం కష్టమేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. (ఇదీ చదవండి: అలాంటి వాళ్లు ‘ఆంటీ’ అంటే నాకు ఇష్టమే : అనసూయ) క్రిస్మస్ కానుకగా బాక్సాఫీస్ వద్దకు సలార్,డంకీ చిత్రాలు రానున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది పఠాన్,జవాన్ చిత్రాలతో భారీ హిట్స్ కొట్టి ఫుల్ జోష్లో ఉన్నాడ్ షారుక్.. దీంతో ఆయన నుంచి వస్తున్న డంకీ చిత్రంపై భారీ కలెక్షన్స్ రావడం పక్కా అని బాలీవుడ్ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఇదే సమయంలో రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్ల తర్వాత సలార్తో ప్రభాస్ వస్తున్నాడు. అయినా కూడా ప్రశాంత్ నీల్,ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో సలార్పై అంచనాలు ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. కానీ ఈ రెండు భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రాలే కావడంతో ఒకేసారి రిలీజ్ కావడం సరైంది కాదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తేడా వస్తే వసూళ్లపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉండవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ క్లాష్ నుంచి రెండు చిత్రాలు తప్పుకుంటే మంచిదని సినీ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. డిసెంబర్లో వస్తున్నట్లు షారుక్ డంకీ టీమ్ ముందుగానే ప్రకటించారు.. కానీ సలార్ మాత్రం సెప్టెంబర్లో రిలీజ్ అని ప్రకటించి ఆ తర్వాత డిసెంబర్కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.. దీంతో ఇప్పుడు 'సలార్' మరోసారి వాయిదాకు రెడీ అయిందని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజం అయితే సలార్ 2024 జనవరి లేదా మార్చి నెలలో విడదల కావడం గ్యారెంటీ.. ఈ విషయంపై అధికారకంగా సలార్ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. -
షారుఖ్ ఖాన్ తల్లిది హైదరాబాద్, తండ్రిది పెషావర్.. ఫీనిక్స్ పక్షిలా జీవితం
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. 1965లో ఢిల్లీలో తాజ్ మొహమ్మద్ ఖాన్, లతీఫ్ ఫాతిమా దంపతులకు జన్మించారు. మొదట ఆయన సిరీయల్స్తోనే కెరియర్ ప్రారంభించి ఆపై వెండితెరపైన తన సత్తా ఏంటో చూపించాడు. ఒక సాదారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన షారుక్ బాలీవుడ్ బాద్షా ఎలా అయ్యాడు..? ఒక నటుడిగా మూడు దశాబ్దాలుగా బాలీవుడ్ను కింగ్లా ఎలా ఏలుతున్నాడు..? తన తండ్రి ఎం చేసేవాడు..? వంటి విషయాలు నేడు నవంబర్ 2 ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుసుకుందాం. షారుఖ్ ఖాన్ 2 నవంబర్ 1965 న ఢిల్లీలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు . అతను తన జీవితంలో మొదటి ఐదు సంవత్సరాలు మంగళూరులో గడిపాడు , అక్కడ అతని తల్లితండ్రులు ఇఫ్తికార్ అహ్మద్ 1960లలో పోర్ట్ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. ఖాన్ ట్విట్టర్లో తనను తాను 'సగం హైదరాబాదీ (తల్లి), సగం పఠాన్ (తండ్రి), కొంత కాశ్మీరీ (అమ్మమ్మ)' గా అభివర్ణించుకున్నారు. ఆటలలో ఎంతో చురుగ్గా ఉన్న షారుఖ్ తన భుజానికి గాయం కావడంతో గేమ్స్ నుంచి వైదొలిగాడు. హాకీ,ఫుట్బాల్ ప్లేయర్గా ఆయన ఎన్నో అవార్డులను దక్కించుకున్నాడు. భుజానికి గాయం కారణంగా ఆటలకు ఫుల్ స్టాప్ పడింది. అంతటితో తన కలల ప్రపంచం ఆగినట్లు అయింది. కానీ అంతటితో తన టాలెంట్ ఆగిపోలేదు. ఆ తర్వాత మొదటిసారిగా సీరియల్ వైపు అడుగులు వేశాడు. 1989లో ఫౌజీ అనే టెలివిజన్ సిరీస్ ద్వారా షారుఖ్ ఎంట్రీ ఇచ్చాడు. అలా పలు సిరీస్లలో కనిపించిన షారుఖ్ తన అమ్మగారు 1991లో మరణించండంతో ఒక్కసారిగా ఒంటిరి అయిపోయిడు. కొంత కాలం తర్వాత సీరియల్స్కు గుడ్బై చెప్పి 1992లో దీవానాలో ఆయన కనిపించాడు. ఇందులో దివ్యభారతి హీరోయిన్గా నటించింది.. మొదటి సినిమాతోనే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షారుఖ్ షేక్ చేశాడు. అలా తన కెరియర్కు బలమైన పునాది మొదటి సినిమాతోనే పడిపోయింది. అలా పలు యాంటీ-హీరో చిత్రాల్లో కూడా ఆయన నటించాడు. కానీ 2002లో వచ్చిన ‘దేవదాస్’ సినిమా ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో షారుక్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం 10 ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను పొందింది. ఆ తర్వాత వరుస సినిమాలతో అగ్ర కథానాయకుడిగా ఎదిగారాయన. 1999–2003 సమయంలో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించి ఆర్థికంగా భారీగా నష్టపోయాడు. ఆ సమయంలో ఆయనకు సినిమా ఛాన్స్లు కూడా తగ్గాయి. 2004లో తన డ్రీమ్జ్ అన్లిమిటెడ్ను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్గా మార్చాడు షారుఖ్.. ఆ బ్యానర్లోనే మై హూ నా, వీర్-జారా వంటి చిత్రాలు తనే హీరోగా నిర్మించాడు. . భారతదేశం-పాకిస్తాన్ సంబంధాల యొక్క కల్పిత కథనంతో అవి తెరకెక్కాయి. అవి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపాయి. 2004లో ఆ రెండు చిత్రాల ద్వారా సుమారు రూ. 170 కోట్లు ఆయన ఆర్జించాడు. అలా కష్టాల నుంచి ఫీనిక్స్ పక్షిలా ఒక్కసారిగా ఎగిసిపడ్డాడు షారుఖ్.. బాద్షా సినీ కెరీర్ ఆరంభించడానికి ముందే ఆయన తల్లిదండ్రులు మరణించారు. ఈ విషయంలో ఆయన అనేక సందర్భాల్లో ఆవేదన చెందారు. తన సక్సెస్ను తల్లిదండ్రులు చూడలేదని, వారు ప్రాణాలతో ఉండుంటే చాలా సంతోషించే వారని అన్నారు. షారుఖ్ ఖాన్ ఆస్తులు విలువ షారుఖ్ ఖాన్ ఆస్తులు విలువ సుమారు రూ. 6500 కోట్లకు పైమాటే అని చెప్పవచ్చు. సినిమా,వ్యాపార ప్రకటనలు,ఐపీఎల్ వంటి వాటిపై ఆయన భారీగానే సంపాదిస్తున్నారు. అలా ఏడాదికి రూ 300 కోట్ల వరకు షారుఖ్ అర్జిస్తున్నట్లు సమాచారం. ఒక్కో సినిమా కోసం రూ 120 నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ ఉంది. తన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండటంతో ఆయన అడిగినంత డబ్బు ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉంటారు. కానీ ఆయన ఈ మధ్య ఎక్కువ సినిమాలు తన రెడ్ చిల్లీస్ సంస్థ ద్వారా తన భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుండటం విశేషం. తన సంపాదనలో ఎక్కువగా పేద పిల్లలకు విద్యను అందించడానికి అతని స్వచ్ఛంద సంస్థ ద్వారా సాయం అందిస్తున్నాడు. హిందూ సాంప్రదాయంలో ప్రేమ పెళ్లి షారుక్ సినిమాల్లోకి రాకముందే గౌరీ ఖాన్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పంజాబీ హిందువు అయిన గౌరీ చిబ్బర్ను 25 అక్టోబర్ 1991న సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో ఆయన పెళ్లి చేసుకున్నారు. పలు సందర్భాల్లో షారుక్ తమ ప్రేమకథను పంచుకున్నారు. ఢిల్లీకి చెందిన షారుక్ 18 ఏళ్ల వయసులో ఓ పార్టీలో గౌరీని చూశారు. తొలిచూపులోనే ఆమెను ప్రేమించారు. అప్పుడు గౌరీ వయసు 14 ఏళ్లట. ఆపై షారుక్ గౌరీ ఫోన్ నెంబర్ తెలుసుకుని.. ఫోన్లు చేసేవారట. అలా వారి మనసులు కలిసి, ఆ పరిచయం ప్రేమగా మారింది. వివాహానికి ముందు షారుక్, గౌరీల మధ్య చిన్న గొడవ రావడంతో.. షారుక్కు చెప్పకుండా గౌరీ డిల్లీ నుంచి ముంబయి బయలుదేరారు. అప్పుడు షారుక్ జేబులో రూ.10వేలు మాత్రమే ఉన్నాయట. ప్రియురాలు కోపంతో వెళ్లిపోవడంతో ఆమె వెంటే షారుక్ కూడా బయలుదేరారట. చివరికి ముంబయి బీచ్లో ఇద్దరు కలుసుకున్నారు. 1991 అక్టోబరు 25న వీరు వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఆర్యన్ (జననం 1997), ఒక కుమార్తె సుహానా (జననం 2000) 2013లో వారు మూడవ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు, అబ్రామ్ అనే కుమారుడు అద్దె తల్లి ద్వారా జన్మించాడు. షారుక్ ఖాన్ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం.. ► షారుఖ్ తల్లిది హైదరాబాద్(భారత్), తండ్రిది పెషావర్(పాకిస్తాన్), నానమ్మది కశ్మీర్ ► షారూఖ్ ఖాన్ తండ్రి, మీర్ తాజ్ మహమ్మద్ ఖాన్, పెషావర్ నుంచి వచ్చిన ఒక భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త , అతను అహింసా ప్రతిఘటన ఉద్యమంలో పాల్గొని స్వతంత్ర భారతదేశాన్ని కోరుకున్నాడు ► షారుఖ్ను సైన్యంలో చేర్పించాలనే ఉద్దేశ్యంతో కోల్కతాలోని సైనిక పాఠశాలలో ఆయన తండ్రి చేర్పించితే షారుఖ్ తల్లి వద్దని పట్టుబట్టడంతో తిరిగి వచ్చేశాడు ► చాలా రోజుల వరకు షారుఖ్ ఖాన్కు హిందీ భాషా రాదు ► ప్రపంచవ్యాప్తంగా యాభై మంది అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా ఖాన్ ఉన్నారు ► 2008లో, ఖాన్, జూహీ చావ్లా ఆమె భర్త జే మెహతా భాగస్వామ్యంతో , కోల్కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ (KKR) క్రికెట్ జట్టును కొనుగోలు చేశారు ► పల్స్ పోలియో, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సహా వివిధ ప్రభుత్వ ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఆయన ఉన్నారు ► కోవిడ్ సమయంలో తన 4-అంతస్తుల వ్యక్తిగత కార్యాలయ స్థలాన్ని కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు ఇచ్చేశారు ► 14 ఫిల్మ్ఫేర్ అవార్డులను షారుక్ ఖాన్ అందుకున్నాడు ► 2005లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది ► భారత్, ఇతర దేశాలకు చెందిన ప్రముఖ విశ్వ విద్యాలయాల నుంచి ఐదు గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు ► ఖాన్ ప్రకారం, అతను ఇస్లాంను బలంగా విశ్వసిస్తాడు కానీ తన భార్య మతానికి (హిందూ) కూడా విలువ ఇస్తాడు ► షారుఖ్ పిల్లలు రెండు మతాలను అనుసరిస్తారు. అతని ఇంటిలో ఖురాన్, హిందూ దేవతల ప్రతిమలు ఒకేచోట ఉంటాయి - బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్డెస్క్ -
అర్థరాత్రి షారుక్ ఖాన్ ఇంటవద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ అని పలు పేర్లతో తన అభిమానులతో పిలుపంచుకునే నటుడు షారుక్ ఖాన్ ఈరోజు తన 58వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న షారుక్ ఖాన్కు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఖాన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది అభిమానులు ఆయన ఇంటికి వస్తుంటారు. అర్ధరాత్రి 12 దాటగానే బాణసంచా పేలుస్తూ పండుగలా జరుపుకుంటారు. భారీగా తన అభిమానులు గుమిగూడినప్పటికీ వారిని ఆయన ఏ మాత్రం నిరాశపరచడు. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్ పెళ్లి.. మెగా ఫోటో షేర్ చేసిన చిరు.. ఎవరెవరు ఉన్నారంటే) ఇంటి బాల్కనీ వద్దకు చేరుకుని తన మార్క్ అభివాదంతో చేతులు ఊపుతూ కృతజ్ఞతలు తెలుపుతాడు. ఈసారి కూడా తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని వెస్ట్ బాంద్రాలోని తన నివాసం 'మన్నత్' సమీపంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాది మంది అభిమానులు అర్ధరాత్రి చేరుకున్నారు. షారుఖ్ ఖాన్ తన ఇంటి బాల్కనీలో కనిపించి అర్థరాత్రి తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా అభిమానులకు చేయి ఊపుతూ ధన్యవాదాలు తెలిపారు. తమ అభిమాన నటుడిని చూసిన అభిమానుల ఆనందం వెలకట్టలేనిదని చెప్పవచ్చు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో షారుఖ్ ఖాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించాడు. రొమాంటిక్ పాత్రలను సులువుగా పోషిస్తూ 'కింగ్ ఆఫ్ రొమాన్స్'గా పేరు తెచ్చుకున్నాడు షారుక్. యాక్షన్ సినిమాల్లో దుమ్మురేపుతున్న షారుఖ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. పఠాన్,జవాన్లతో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న కింగ్ డిసెంబర్లో తన డంకీ మూవీతో ప్రభాస్ సలార్ను ఢీ కొట్టనున్నాడు. View this post on Instagram A post shared by Voompla (@voompla) View this post on Instagram A post shared by Voompla (@voompla) -
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయ్
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి.. రామ్- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'స్కంద' హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్- ఆట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' నెట్ఫ్లిక్స్లో రన్ అవుతుంది. ఈ రెండు చిత్రాలను థియేటర్కు వెళ్లి చూడని వారు ఈ వీకెండ్లో ఇంట్లోనే కూర్చోని చూసి ఎంజాయ్ చేయవచ్చు. జవాన్- నెట్ఫ్లెక్స్ బాలీవుడ్ కలెక్షన్స్ కింగ్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా వచ్చేసింది. నేడు నవంబర్ 2 షారుక్ పుట్టినరోజు సందర్భంగా 'జవాన్'ని ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్లో అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. షారుక్ ఖాన్ తండ్రికొడుకుగా నటించిన 'జవాన్' సుమారు రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్,విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ఏ మాత్రం తగ్గకుండా మెప్పించారు. థియేటర్లో ఈ సినిమా చూడని వారు నెట్ఫ్లెక్స్లో చూడొచ్చు. స్కంద- హాట్స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. మొదటిరోజు నంచే ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు. తాజాగా హాట్స్టార్ ఓటీటీలో 'స్కంద' ఎంట్రీ ఇచ్చేసింది. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీ వర్సెన్ కూడా ఉంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే కలిగింది. థియేటర్లలో మెప్పించలేకపోయిన స్కంద.. ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఈసారి క్రిస్మస్ నిరుడు లెక్కుండదు.. బాక్సాఫీస్ షేకే!
సలార్ మూవీ సెప్టెంబర్ లోనే వచ్చి ఉంటే బాగుండేదేమో డిసెంబర్లో అంటే లేని పోని సమస్యలు వస్తున్నాయి.ఆల్రెడీ షారుఖ్ పోటీలో ఉన్నాడు.ఇప్పుడు కింగ్ ఖాన్ తో పాటు హాలీవుడ్ నుంచి ఒక మరో సూపర్ హీరో కూడా సలార్ తో ఫైట్కి రెడీ అంటున్నాడు.అయితే ఎంత మంది వచ్చినా, డైనోసార్ ముందు జుజూబీనే అంటున్నాడు రెబల్. వెయ్యి కోట్ల హీరోతో పోటీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం సలార్. కేజీయఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కావడంతో సలార్పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కావాల్సింది. కానీ అనూహ్యం వాయిదా పడింది. ఏవోవే కారణాలు చెప్పి డిసెంబర్ 22కు పోస్ట్పోన్ చేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఇప్పుడు సలార్పై అంతకంతకూ పోటీ పెరుగుతోంది. ఇప్పటికే జవాన్ తర్వాత షారుఖ్ నటిస్తున్న డంకీ ఇదే డేట్ కు రిలీజ్ అవుతోంది. అసలే షారుఖ్ వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్నాడు. వెయ్యి కోట్ల కలెక్షన్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ఆయన నటించిన గత రెండు చిత్రాలు పఠాన్, జవాన్..రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి.అలాంటి హీరోతో సలార్ పోటీకి సిద్ధమవుతున్నాడు.డిసెంబర్ 22న సలార్ వర్సెస్ డంకీ ఫైట్ గురించి ఇప్పటికే ఇండియా మొత్తం మాట్లాడుకుంటోంది. ఇప్పుడు ఇదే డేట్ గురించి వరల్డ్ మొత్తం మాట్లాడుకునేలా చేస్తున్నాడు ఆక్వామేన్. డంకీ, సలార్కి పోటీగా ఆక్వామేన్ ఆక్వామేన్ అండ్ ది లాస్ట్ కింగ్ డమ్ మూవీ డిసెంబర్ 25న విడుదల కావాల్సింది. అయితే ఇప్పుడు మూడు రోజుల ముందుగానే.. అంటే డిసెంబర్ 22నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే రోజు సలార్, డంకీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆక్వామేన్ హంగామా అంతా హాలీవుడ్ కే పరిమితం అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆక్వామ్యాన్ వల్ల ఓవర్సీస్ మార్కెట్ లో ఇటు సలార్, అటు డంకీకి స్క్రీన్స్ సమస్య వస్తుంది. స్క్రీన్స్ అడ్జెస్ట్ మెంట్ అంటే కలెక్షన్స్ కూడా పంచుకోవాల్సి వస్తుంది. కలెక్షన్స్ పంచుకోవడం అంటే డే వన్ రికార్డులు మిస్ అయినట్లే అవుతుంది.అందుకే సలార్ కూడా ముందుగా అనుకున్నట్లు సెప్టెంబర్ లోనే వచ్చి ఉంటే ఇటు డంకీతోనూ, అటూ అక్వామేన్ తోనూ పోటీ పడే ఇబ్బంది తప్పేది. అయితే ఎక్కువ స్క్రీన్స్ కోసం ఆల్రెడీ సలాన్ నిర్మాతలు రంగంలోకి దిగారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమాత్రం డిజప్పాయింట్ కాకుండా డిసెంబర్ 22న వరల్డ్ వైడ్గా సలార్ ను ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేసేందుకు చేయాల్సిదంతా చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి క్రిస్మస్ మాత్రం నిరుడు లెక్క ఉండదు. సలార్ ఇటు సౌత్ మార్కెట్ను, డంకీ అటు నార్త్ మార్కెట్ను, ఆక్వామేన్ ఓవర్సీస్ మార్కెట్ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. -
షారుక్ ఖాన్ లవ్ స్టోరీ.. ఇంటిపై రాళ్లదాడి.. పెళ్లికి నో చెప్పిన గౌరీ!
ప్రేమకు, అట్రాక్షన్కు తేడా తెలియని వయసులో ప్రేమించుకున్నారు. కానీ వారికి తెలియకుండానే పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. మరీ ముఖ్యంగా షారుక్ ఖాన్! ఇదంతా అయ్యే పని కాదనుకుందో.. మరేంటో కానీ గౌరీ సడన్గా అతడిని వదిలేసి వెళ్లిపోయింది. ఊపిరాడట్లనైంది షారుక్కు. తనకోసం ముంబై అంతా గాలించాడు. ప్రేయసి కళ్లముందుకు రాగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లైంది. తనను హత్తుకున్నాడు. జీవితంలో చేయి వదలనన్నాడు. అదే మాట మీద నిలబడ్డాడు కూడా! త్వరలో (అక్టోబర్ 25న) షారుక్- గౌరీల పెళ్లి రోజు రాబోతోంది. ఈ సందర్భంగా వారి ప్రేమకహానీని ఓసారి గుర్తు చేసుకుందాం.. 18 ఏళ్లకే లవ్.. అది 1984.. అక్కడ పార్టీ జరుగుతోంది. మేం వయసుకు వచ్చాం అంటూ కుర్రాళ్లు హంగామా చేస్తున్నారు. అందులో షారుక్ కూడా ఉన్నాడు. అప్పుడతడి వయసు 18 ఏళ్లు. ఆ పార్టీలో అతడి కళ్లంతా ఒక అమ్మాయి మీదే ఉన్నాయి. ఎవరా అమ్మాయి? అని తన స్నేహితుడిని అడిగాడు. అతడు కనుక్కుని వస్తానని చెప్పి ఏకంగా ఆ అమ్మాయితో డ్యాన్స్ కూడా చేసి వచ్చాడు. ఆమె తన బాయ్ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తోందని షారుక్ ఆశలపై నీళ్లు చల్లాడు. వేరే అబ్బాయిలతో మాట్లాడితే తట్టుకోలేని షారుక్ ఇంతకీ అక్కడున్న అమ్మాయి ఎవరో కాదు గౌరీ ఖాన్. తన వయసు 14 ఏళ్లు. తను ఎదురుచూస్తోంది బాయ్ఫ్రెండ్ కోసం కాదు, తన సోదరుడి కోసం.. కాకపోతే అప్పట్లో అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడేది. ఎవరు పలకరించినా నవ్వుతూనే మాట్లాడేది. తొలి చూపులోనే షారుక్కు తెగ నచ్చేసింది. అక్కడ మొదలైంది వారి పరిచయం. షారుక్ మాటతీరు, నడవడిక గౌరీకి కూడా నచ్చేసింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ షారుక్కు పొజెసివ్నెస్ ఎక్కువ. గౌరీ వేరే అబ్బాయిలతో చనువుగా మాట్లాడితే తట్టుకోలేకపోయేవాడు. వద్దని వారించేవాడు. పిచ్చోడిలా బీచ్ల వెంట తిరిగిన హీరో ఈ ప్రవర్తన తట్టుకోలేకపోయిన గౌరీ ఖాన్ ఈ రిలేషన్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంది. షారుక్కు చెప్పకుండా ముంబై వెళ్లిపోయింది. ప్రియురాలు కనిపించకపోయేసరికి పిచ్చోడయ్యాడు. తన కెమెరా అమ్మేసి ఆ డబ్బులతో ముంబై వెళ్లాడు. గౌరీకి బీచ్లంటే ఇష్టం కాబట్టి అక్కడే ఎక్కడో ఉండొచ్చని ఆలోచించాడు. ఆటో డ్రైవర్ చేతిలో రూ.400 పెట్టి ఈ డబ్బుతో ఎన్ని బీచ్లు తిరగొచ్చో అన్ని బీచ్ల దగ్గరకు తీసుకెళ్లమన్నాడు. అలా కొన్ని బీచ్లు తిరిగిన తర్వాత ఓ సముద్ర తీరంలో గౌరీ గౌంతు వినబడింది. తనలో తనకే తెలియని సంతోషం మొదలైంది. షారుక్ను చూడగానే షాకైన గౌరీ ఇక్కడేం చేస్తున్నావ్? అని అడిగింది. పెళ్లి చేసుకుంటే పనైపోతుంది.. తనకోసమే పిచ్చోడిలా తిరుగుతున్నాడని తెలిసిన గౌరీ మనసు కరిగిపోయింది. వారి ప్రేమ మరింత బలపడింది. అదే బీచ్లో పెళ్లి చేసుకుందాం అని అడిగాడు షారుక్. అయినా తను ఒప్పుకోలేదు. ఏడాది తర్వాత షారుక్ తల్లి మరణించింది. అప్పుడు ఎంతో బాధపడిన గౌరీ.. పెళ్లి చేసుకునే సమయం వచ్చిందని చెప్పింది. కానీ అప్పుడే హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు షారుక్. బ్యాచిలర్గా ఉంటేనే ఫాలోయింగ్ మెండుగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటే నీ పనైపోతుంది అని నిర్మాతలు హెచ్చరించారు. షారుక్ వాటిని లెక్క చేయలేదు. ఇద్దరిదీ ఒకే మతం కాకపోవడంతో గౌరీ తల్లిదండ్రులూ పెళ్లికి ఒప్పుకోలేదు. షారుక్ ఫ్రెండ్ ఇంటిపై రాళ్లు.. మనసు మారితే ఇక్కడికి రండంటూ ఓ అడ్రస్ ఇచ్చాడు. తనకంటూ ఓ ఇల్లు లేకపోవడంతో స్నేహితుడి ఇంటి అడ్రస్ ఇచ్చాడు. ఇంకేముంది, అప్పటికే కోపం మీదున్న గౌరీ తల్లిదండ్రులు ఆ ఇంటిపై రాళ్లదాడి చేయించారు. ఇలా ఎన్నో గొడవలు, వివాదాలు దాటుకుని 1991 అక్టోబర్ 25న హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఆర్యన్, సుహానా, అభ్రమ్ అని ముగ్గురు పిల్లలు సంతానం. షారుక్ ఇప్పటికీ స్టార్ హీరోగా తన చరిష్మాను ఏమాత్రం తగ్గకుండా అలాగే కాపాడుకుంటూ వస్తుండగా గౌరీ ఇంటీరియర్ డిజైనర్గా రాణిస్తోంది. వీరిద్దరూ చిత్రసీమలో ఆదర్శ దంపతులుగా రాణిస్తున్నారు. చదవండి: ఆరోజు నా భార్య నా మీదకు చెప్పు విసిరింది.. శిల్పా శెట్టి భర్త ఎమోషనల్ -
సలార్ VS డుంకి... వెనక్కు తగ్గేది ఎవరంటే?
డిసెంబర్ 22 కోసం ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అదే రోజు బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ 'డుంకి' సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ విడుదల అవుతున్నట్లు ఇప్పటికే ప్రకటనలు వచ్చేశాయి. ఇద్దరు బిగ్ స్టార్స్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో షారుక్ ఖాన్ కొంచెం వెనకడుగు వెసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పఠాన్,జవాన్ సినిమాలతో రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ప్రస్తుతం ఆయన కెరియర్లో మంచి స్వింగ్ మీద ఉన్నాడు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) అయినా డైనోసార్తో రిస్క్ చేయడం ఎందుకని షారుక్ ఒక అడుగు వెనక్కు వేశాడు. తన డుంకి సినిమాను డిసెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు సలార్ కంటే ముందే వారు ప్రకటించారు. కానీ పలు వాయిదాలతో దూసుకుపోతున్న సలార్ చివరకు డుంకి సినిమాకు పోటీగా దిగేందుకు రెడీ అయ్యాడు. దీంతో చేసేది ఏం లేక షారుక్నే తన డుంకి సినిమాను 2024 జనవరి 26న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా పఠాన్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ప్రశాంత్ నీల్, షారుఖ్ ఖాన్ పై పగబట్టినట్లు ఉన్నాడని కోందరు కామెంట్లు చేస్తున్నారు. 2018లో KGF ఛాప్టర్ 1 సినిమాని షారుఖ్ ఖాన్ జీరో మూవీకి పోటీగా రిలీజ్ చేసిన ప్రశాంత్ నీల్… ఆ బిగ్గెస్ట్ క్లాష్లో గెలిచి జెండా ఎగరేశాడు. ఈ దెబ్బకి షారుఖ్ ఖాన్ అయిదేళ్ల పాటు సినిమాలు చేయలేదు. అయిదేళ్ల బ్రేక్ తర్వాత పఠాన్, జవాన్ సినిమాలతో షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇచ్చాడు. తన కెరీర్ మొత్తంలో ప్రస్తుతం పీక్ ఫామ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ కి ఇప్పుడు మరోసారి రిష్క్ చేయకపోవడమే మంచిదని ఆయన నిర్ణయించుకున్నట్లు టాక్. KGF టైంలో యష్ ఎవరికీ తెలియదు, ప్రశాంత్ నీల్ కూడా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడలా కాదు... సలార్లో డైనోసార్ ఉన్నాడు... ప్రశాంత్ నీల్కు ప్రభాస్ కలిశాడు. ఇంకేముంది పోటీ భారీగానే ఉంటుంది. దీంతో ఓవర్సీస్ నుంచి ఇండియన్ బాక్సాఫీస్ వరకు డుంకి సినిమాకు కలెక్షన్స్ తగ్గే ప్రమాదం ఉందని ఆయన ముందే పసిగట్టాడు. కానీ ఇదోరకంగా సలార్కు మంచి అవకాశం. ఇదేరోజు డుంకి రిలీజ్ అయితే సలార్కు కూడా కొంత కలెక్షన్స్ తగ్గే ప్రమాదం ఉంది. ఎందుకంటే అక్కడ బరిలో ఉండేది బాలీవుడ్ కింగ్. ఏదేమైనా డిసెంబర్ 22న సలార్ మాత్రమే వస్తున్నాడు. డుంకి వాయిదా విషయంపై అధికారికంగా త్వరలో ప్రకటన రావడం ఖాయం. -
రూ.1100 కోట్ల క్లబ్లో ‘జవాన్’.. చరిత్ర సృష్టించిన షారుఖ్!
కింగ్ఖాన్ షారుఖ్ ఖాన్ మళ్లీ పుంజుకున్నాడు. వరుస ప్లాఫులు రావడంతో కొన్నాళ్లకు సినిమాకు గ్యాప్ ఇచ్చి.. పఠాన్తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. అదే జోష్లో ఈ ఏడాది ‘జవాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. షారుఖ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. బాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి రూ. 1100 కోట్ల రూపాయలు(29 రోజుల్లో) వసూళ్లు సాధించిన చిత్రంగా జావాన్ నిలిచింది. సినిమా విడుదలై నెల రోజులు అయినప్పటికీ..దేశ వ్యాప్తంగా రోజులు దాదపు రూ.కోటి వసూళ్లను రాబడుతోందంటే.. జవాన్ సృష్టించిన సునామీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమిర్ తర్వాతే షారుఖ్ జవాన్ ఎన్ని రికార్డులు సృష్టించిన.. కలెక్షన్ల పరంగా మాత్రం దంగల్ని అందుకోవడం కష్టమే. ప్రపంచ వ్యాప్తంగా జవాన్ కలెక్షన్స్ రూ. 1103 కోట్ల వద్ద ఉన్నాయి. కేజీయఫ్ 2 (రూ. 1215 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.1230 కోట్లు), బాహుబలి 2 (రూ. 1780 కోట్లు), దంగల్ (రూ. 2400 కోట్లు) సినిమాలతో పోలిస్తే.. జవాన్ ఇంకా వెనకబడే ఉంది. ఇంకా చైనాలో జవాన్ చిత్రాన్ని రిలీజ్ చేయలేదు కాబట్టి.. ఒక వేళ అక్కడ కూడా హిట్ అయితే మాత్రం కేజీయఫ్ 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలను ఈజీగా క్రాస్ చేస్తుంది. ఈ చిత్రంలో షారుఖ్కి జోడిగా నయనతార నటించగా.. దీపికా పదుకొణె కీలక పాత్ర పోషించారు. విజయ్ సేతుపతి విలన్గా నటించాడు. జవాన్ రికార్డులు విడుదలైన వారం రోజుల్లో రూ. 600 కోట్ల మార్క్ని దాటిన తొలి హిందీ చిత్రం అతి తక్కువ రోజుల్లో రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రం పఠాన్ తొలి రోజు రూ. 57 కోట్లు సాధిస్తే.. జవాన్ రూ. 75 కోట్లు వసూళ్లు రాబట్టింది ఒక హీరో నటించిన రెండు సినిమాలు.. తొలి రోజు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైన ఇండియన్ స్టార్గా షారుఖ్ చరిత్రకెక్కాడు. బాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి రూ. 1100 కోట్ల రూపాయలు(29 రోజుల్లో) వసూళ్లు సాధించిన చిత్రం Jawan 🤝 Making & breaking box office records every day! 🔥 Book your tickets now!https://t.co/B5xelUahHO Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/JCdsrHFp6r — Red Chillies Entertainment (@RedChilliesEnt) October 6, 2023 -
Dunki vs Salaar: షారుఖ్తో ప్రభాస్ ఢీ.. క్రిస్మస్ బరిలో సలార్, డుంకీ!
ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం సలార్ డిసెంబర్లో రిలీజ్ కాబోతుందనే చర్చ నెట్టింట వైరల్గా మారింది. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా హఠాత్తుగా వాయిదా పడింది. కొత్త డేట్ని ప్రకటించలేదు. వచ్చే ఏడాది వేసవి బరిలోకి దిగబోతున్నాడని తొలుత వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఈ ఏడాది డిసెంబర్లోనే సలార్ రాబోతుందనే చర్చ నెట్టింట బాగా జరుగుతోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న సలార్ విడుదల కాబోతుందని ఓ సినీ విశ్లేషకుడు పోస్ట్ పెట్టడమే ఈ చర్చకు కారణం. ఇక ఇదే తేదిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘డుంకీ’కూడా విడుదల కాబోతుంది. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మొదటిసారి షారుఖ్ తో తీస్తున్న సినిమా ఇది. షూటింగ్ మొదలైన రోజు విడుదల తేదిని ప్రకటించారు. ప్రభాస్ ఫ్యాన్స్ Vs షారుఖ్ ఫ్యాన్స్ ఇద్దరు బడా హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అయితే ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం సహజం. ఆ ఎఫెక్ట్ వసూళ్లపై కూడా పడుతుంది. అందుకే బరిలో ఒక్క పెద్ద సినిమా ఉంటే మిగతా సినిమాలన్ని విడుదలను పోస్ట్పోన్ చేసుకుంటాయి. లేదంటే ముందు, వెనక విడుదల చేస్తాయి. సలార్ సెప్టెంబర్ 28న విడుదలవుతుందని ప్రకటించడంతో స్కంద, చంద్రముఖి 2 లాంటి బడా సినిమాలు సెప్టెంబర్ 15నే రావడానికి సిద్ధమయ్యాయి. కానీ సలార్ విడుదల వాయిదా పడగానే.. ఆ డేట్లోకి మార్చుకున్నాయి. ఇక ఇప్పుడు డిసెంబర్ 22న విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే రోజు షారుఖ్ డుంకీ కూడా రీలీజ్ కానుంది. ఒకవేళ డుంకీ వాయిదా పడితే సలార్కి భయపడి వాయిదా వేశారనే కామెంట్స్ వస్తాయి. లేదని సలార్తో తలపడితే బాక్సాఫీస్ కలెక్షన్స్పై దెబ్బ పడుతుంది. నార్త్లో షారుఖ్ హవా కొనసాగితే.. సౌత్లో ప్రభాస్ హవా ఉంటుంది. పరస్పరం మాట్లాడుకొని ఒకరు తమ సినిమాను వాయిదా వేసుకుంటే బాగుంటుందని బయ్యర్లు కోరుకుంటున్నారు. మరోవైపు మాకు పోటీగా వస్తే నష్టపోతారని ప్రభాస్- షారుఖ్ ఫ్యాన్స్ పరస్పరం కవ్వించుకుంటున్నారు. ఒకవేళ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే మాత్రం ఆ ఎఫెక్ట్ కచ్చితంగా బాక్సాఫీస్ కలెక్షన్స్పై పడుతుంది. -
షారుఖ్ ఖాన్తో ఫొటో.. బాలీవుడ్ కింగ్ మాత్రమే కాదు..: గంభీర్ పోస్ట్ వైరల్
Gautam Gambhir shares a picture with Shah Rukh Khan: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఐసీసీ వన్డే వరల్డ్కప్-2011 ఫైనల్లో అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకుని భారత జట్టు 28 ఏళ్ల తర్వాత మళ్లీ టైటిల్ గెలవడంతో తన వంతు పాత్ర పోషించాడు. ఇక గంభీర్ ఖాతాలో మరో ఐసీసీ టైటిల్ కూడా ఉంది. ఐపీఎల్లో సత్తా చాటిన గంభీర్ 2007లో మొట్టమొదటి టీ20 ప్రపంచకప్ గెలిచిన ధోని సేనలో కూడా గౌతీ సభ్యుడు. పాకిస్తాన్తో ఫైనల్లో 54 బంతుల్లో 75 పరుగులతో అదరగొట్టాడు. ఇక టీమిండియాతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ గంభీర్ సత్తా చాటిన విషయం తెలిసిందే. కేకేఆర్ను రెండుసార్లు విజేతగా నిలిపి కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించిన ఈ ఢిల్లీ బ్యాటర్.. 2012, 2014 సీజన్లలో ట్రోఫీ అందించాడు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సహ యజమానిగా ఉన్న కేకేఆర్ను రెండుసార్లు విజేతగా నిలిపి సత్తా చాటాడు. ఆ తర్వాత కేకేఆర్ను వీడి ఢిల్లీ క్యాపిటల్స్కు మారిపోయిన గంభీర్.. 2018లో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. షారుఖ్ ఖాన్తో గంభీర్ ఫొటో ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా.. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా పనిచేస్తున్న గంభీర్.. ఢిల్లీ బీజేపీ ఎంపీ కూడా అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కేకేఆర్ను వీడినా షారుఖ్తో గంభీర్ అనుబంధం అలాగే కొనసాగుతోంది. తాజాగా ఈ మాజీ ఓపెనర్ షేర్ చేసిన ఫొటో ఇందుకు నిదర్శనం. బాలీవుడ్ కింగ్ మాత్రమే కాదు ‘‘ఇతడు కేవలం బాలీవుడ్ కింగ్ మాత్రమే కాదు.. హృదయాలు కొల్లగొట్టే రారాజు. మేము ఎప్పుడు కలిసినా సరే... నేనైతే అంతులేని ప్రేమ.. గౌరవం మూటగట్టుకుని వెళ్తాను. మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు బెస్ట్ అంతే’’ అంటూ రెడ్ హార్ట్ సింబల్స్తో షారుఖ్పై ప్రేమను చాటుకున్నాడు గంభీర్. ఈ పోస్టు నెట్టింట వైరల్గా మారింది. జవాన్ సక్సెస్ సంబరంలో షారుఖ్ కాగా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం జవాన్ సినిమా సక్సెన్ను ఆస్వాదిస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లేడీ సూపర్స్టార్ నయనతార కీలక పాత్రలో నటించారు. హిట్టాక్తో వందల కోట్ల కొద్దీ కలెక్షన్లతో బాక్సాఫీస్ను చేస్తోంది జవాన్. పఠాన్ తర్వాత మరో బిగ్గెస్ట్ హిట్ సంబరంలో మునిగిపోయిన కింగ్ ఖాన్ను గంభీర్ తాజాగా కలిశాడు. చదవండి: ఇదేమి జట్టురా బాబు.. మొన్న 15 పరుగులు! ఇప్పుడు 22 పరుగులకే ఆలౌట్ He’s not just the king of Bollywood but the king of hearts. Every time we meet I go back with endless love and respect . So much to learn from u . Simply the best ❤️❤️ SRK @iamsrk pic.twitter.com/VcMV1QahUq — Gautam Gambhir (@GautamGambhir) September 21, 2023 -
అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు... సందడి చేసిన బాలీవుడ్ తారలు
Ambani Ganesh Chaturthi celebrations: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఇంట గణేష్ చతుర్థి వేడుకలు జరిగాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు ముంబైలోని తమ నివాసం యాంటిలియాలో వైభవంగా నిర్వహించిన వేడుకలకు బాలీవుడ్ (Bollywood)లోని ప్రముఖ తారలు హాజరై సందడి చేశారు. (Richest Ganesh Idol In Mumbai: 69 కిలోల బంగారం.. 336 కిలోల వెండి.. చూస్తే రెండు కళ్లూ చాలవు!) బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కుటుంబంతో సహా సంప్రదాయ దుస్తుల్లో హాజరై వేడుకకు వన్నె తెచ్చారు. ఆయనతోపాటు భార్య గౌరీ ఖాన్, పిల్లలు సుహానా ఖాన్, అబ్రామ్ ఉన్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ (Salman Khan) కూడా తెల్లటి కుర్తాలో హుందాగా కనిపించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇక ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan)తన కుమార్తె ఆరాధ్య బచ్చన్తో కలిసి వేడుకకు వచ్చారు. రణవీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొణె (Deepika Padukone) దంపతులు సైతం సంప్రదాయ దుస్తులలో అబ్బురపరిచారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కలిసి రావడం కనిపించింది. అలియా భట్, ఓజీ ఫ్యాషన్స్టార్ రేఖ అందమైన చీరకట్టుతో ఆకట్టకున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) అంబానీ ఇంట గణేశుడి ఆశీర్వాదం కోసం వచ్చిన ఇతర బాలీవుడ్ ప్రముఖుల్లో విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా, అథియా శెట్టి, మనీష్ మల్హోత్రా, జూహీ చావ్లా తదితరులు ఉన్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
7 రోజులు.. రూ.600 కోట్లు.. ‘జవాన్’ సరికొత్త రికార్డు
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే రూ. 75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బాద్ షా స్టామినా ఏంటో నిరూపించింది. వీకెండ్తో పాటు వీక్ డేస్లో కూడా మంచి కలెక్షన్స్ని రాబట్టింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.570 కోట్ల వసూళ్లను సాధించి చరిత్రకెక్కింది. ఇక ఏడో రోజు కూడా జవాన్ మంచి వసూళ్లనే సాధించాడు. ఏడో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తంగా ఈ చిత్రం వారం రోజుల్లో రూ. 621 కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. జావాన్ ఖాతాలో అరుదైన రికార్డు విడుదలైన తొలి రోజు జవాన్ చిత్రానికి బ్లాక్బస్టర్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. ముఖ్యంగా హిందీలో రోజు రోజుకి కలెక్షన్స్ సంఖ్య పెరుగుతోంది. దక్షిణాదికి చెందిన నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించడంతో అక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. మొత్తంగా వారం రోజుల్లో రూ. 600 కోట్ల మార్క్ని దాటిన తొలి హిందీ చిత్రంగా జవాన్ అరుదైన రికార్డుని సాధించింది. (చదవండి: మాట నిలబెట్టుకున్న విజయ్.. రూ. కోటి పంపిణీకి లిస్ట్ రెడీ!) అలాగే ఈ ఏడాదిలో షారుఖ్ నటించిన రెండు చిత్రాలు (పఠాన్, జవాన్) కూడా 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం గమనార్హం. పఠాన్ తొలి రోజు రూ. 57 కోట్లు సాధిస్తే.. జవాన్ రూ. 75 కోట్లు వసూళ్లు రాబట్టింది. అలాగే ఒకే ఏడాదిలో ఒక హీరో నటించిన రెండు సినిమాలు.. తొలి రోజు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైన ఇండియన్ స్టార్గా షారుఖ్ చరిత్రకెక్కాడు. అంతేకాదు అతి తక్కువ రోజుల్లో రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రం కూడా ఇదే. అంతకు ముందు బాహుబలి 2 హిందీ వెర్షన్ 250 మార్కును స్కోర్ చేయడానికి 8 రోజులు పట్టింది. ఆ తర్వాత కేజీయఫ్ 2, పఠాన్ చిత్రాలు ఐదు రోజుల్లో ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకుంది. జవాన్ మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. -
ఒక్క సినిమాతో ఆ రేటింగ్స్నే మార్చేసిన నయనతార
సౌత్ ఇండియాలో తన అభినయం, అందంతో అభిమానులను సొంతం చేసుకున్న లేడీ సూపర్స్టార్ నయనతార బాలీవుడ్ మూవీ జవాన్లో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్తో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాకు డైరెక్షన్ చేశాడు. గతంలో సౌత్లో లేడీ సూపర్ స్టార్గా వెలుగొందిన నయనతార ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ను వెనక్కి నెట్టి సోషల్ మీడియా ఫేమ్లో అగ్రస్థానానికి ఎగబాకింది. IMDb నివేదిక ప్రకారం ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో నయనతార నం.1 స్థానంలో ఉంది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ సోషల్ మీడియాలో అత్యధికంగా శోధించిన, ట్రెండింగ్ సినిమాలను గుర్తించడం ద్వారా ఈ రేటింగ్ ఇస్తుంది. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' దెబ్బతో రూట్ మార్చిన మెహర్ రమేష్) ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాను ఈ ఏడాది ప్రారంభం నుంచి IMDb విడుదల చేస్తుంది. వారానికోసారి విడుదలయ్యే ఈ జాబితాను ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా అభిమానులు శోధించారు. గ్లోబల్ ఇండియన్ సెలబ్రిటీ అభిమానులు కింగ్ ఖాన్ కంటే నయనతారపై ఎక్కువ ఆసక్తి చూపారు. IMDb షేర్ చేసిన తాజా జాబితాలో, జవాన్ సూపర్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ కంటే నయనతార ముందుంది. గత వారం జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, నయనతార 3వ స్థానంలో నిలిచింది. తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార IMDb ప్రముఖ భారతీయ ప్రముఖుల జాబితాలో ఎక్కువ మంది సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. నయనతార అగ్రస్థానంలో ఉండగా, కింగ్ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. జవాన్ దర్శకుడు అట్లీ కుమార్ గత వారం పదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకాడు. విష్నేష్ శివన్ రియాక్షన్ IMDb యొక్క ప్రముఖ భారతీయ ప్రముఖుల జాబితాలో నయనతార అగ్రస్థానంలో ఉండటంపై విఘ్నేష్ శివన్ స్పందించారు. నయనతార భర్త, చిత్రనిర్మాత విఘ్నేష్ శివన్ తన భార్య సాధించిన విజయాల గురించి తరచుగా ప్రశంసిస్తుంటారు. తాజాగా విఘ్నేష్ తన 'తంగమాయె' అంటూ ఇన్స్టాగ్రామ్లో కొనియాడాడు. విఘ్నేష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'ప్రౌడ్ ఆఫ్ యు తంగమయ్య' అని రాసి తన భార్యను ట్యాగ్ చేశాడు. (ఇదీ చదవండి: సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మాతగా బిగ్బాస్ బ్యూటీ) -
ఆ విషయంలో అట్లీ నన్ను మోసం చేశాడు: ప్రియమణి
తమిళసినిమా: బహుభాషా నటిగా రాణిస్తున్న ప్రియమణి మొదట్లో హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తమిళంలో పరుత్తివీరన్ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. కాగా వివాహానంతరం తన వయసుకు తగిన పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జవాన్ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ చిత్రంలో నటించిన గురించి ప్రియమణి ఒక భేటీలో పేర్కొంటూ జవాన్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఏదో క్యామియో పాత్ర అయి ఉంటుందని భావించారన్నారు. అయితే షారుక్ ఖాన్ టీం లో ఒకరిగా ముఖ్యమైన పాత్ర అని తెలియగానే చాలా సంతోషించానన్నారు. అట్లీ దర్శకుడు అని చెప్పగానే నటిస్తానని చెప్పానన్నారు. అలా ఒకసారి జూమ్ కాల్లో దర్శకుడు అట్లీ, ఆర్య మాట్లాడారని చెప్పారు. అట్లీ తన మిత్రుడు అని పరిచయం చేసి ఆర్య వెళ్లిపోయారన్నారు. అలా ప్రియమణి జవాన్ చిత్రంలో నటిస్తుందన్న వార్త వెలువడగానే ఏదో ఐటమ్ సాంగ్ అయ్యింటుందనే ప్రచారం జరిగిందన్నారు. అలాంటి ప్రచారాన్ని తాను పట్టించుకోలేదన్నారు. అయితే దర్శకుడు అట్లీ తనను చాలా ఏమార్చారన్నారు.. జవాన్ చిత్రం తమిళ వర్షన్లో నటుడు విజయ్ గెస్ట్ రోల్ లో నటించనున్నారని, అదే విధంగా తెలుగు వెర్షన్ జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రను నటించనున్నారని ప్రచారం హోరెత్తిందన్నారు. విజయ్ ఇందులో నటిస్తున్నారా..? అని తాను అట్లీని అడగ్గా నటింపజేస్తే పోద్ది అన్నారన్నారు. అయితే విజయ్తో తనను ఒక్క సన్నివేశంలోనైనా నటింపజేయమని కోరగా అలాగే అన్నారని, అయితే చివరివరకూ దర్శకుడు అట్లీ తనను అలా ఏమార్చుతూనే వచ్చారని వెల్లడించారు. నిజానికి ఈ చిత్రంలో విజయ్ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ నటించలేదని ప్రియమణి పేర్కొన్నారు. -
జీ20 సమ్మిట్ విషయంలో మోదీపై షారుక్ ట్వీట్ వైరల్
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న జవాన్ సినిమా వజయంతో షారుక్ ఖాన్ ఫుల్ జోష్లో ఉన్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడంపై సోషల్ మీడియాలో ప్రధాని మోదీకి షారుక్ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సును విజయవంతం చేసినందుకు గౌరవప్రదమైన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అని సోషల్ మీడియా ద్వారా ఆయన తెలిపారు. 'ప్రపంచ ప్రజలకు మంచి భవిష్యత్తు కోసం అన్ని దేశాల మధ్య ఐక్యతను పెంపొందించినందుకు మోదీకి అభినందనలు అని షారుక్ కొనియాడారు. (ఇదీ చదవండి: లావణ్య తీసుకున్న నిర్ణయానికి ఫిదా అవుతున్న మెగా ఫ్యాన్స్) దేశ శ్రేయస్సు కోసం ప్రధాని మోదీ పనిచేస్తున్నారని SRK చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీలో చారిత్రాత్మక జీ20 సదస్సు ముగియడంతో షారుక్ ఖాన్ ప్రధాని గురించి ఇలా చెప్పారు. 'ఇది ప్రతి భారతీయుడి హృదయంలో గౌరవం, గర్వాన్ని సృష్టించింది. సార్, మీ నాయకత్వంలో మేము ఒంటరిగా కాకుండా ఐక్యంగా అభివృద్ధి చెందుతాము. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు' అని షారుక్ తన ట్వటర్ (ఎక్స్)లో రాశారు. పఠాన్ తర్వాత బాలీవుడ్ బాద్ షా మరో బ్లాక్ బస్టర్ని ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే సుమారు రూ. 500 కోట్ల మార్క్ను జవాన్ దాటింది. అట్లీ యాక్షన్ కట్తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఒకే సంవత్సరంలో రెండు విజయవంతమైన చిత్రాలను అందించిన ఘనత SRKకి ఉంది. SRK తో పాటు, నటుడు విజయ్ సేతుపతి, నటి నయనతార కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమతో కలిసి షారూక్ తీసిన మొదటి సినిమా ఇది. తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సు చాలా విజయవంతమైంది. పలు కీలక అంశాలపై ఆ సదస్సులో చర్చించారు. తదుపరి సమావేశానికి బ్రెజిల్ బాధ్యత వహిస్తుంది. డిసెంబర్ 1న సమాఖ్య అధ్యక్ష పదవిని బ్రెజిల్ అధికారికంగా చేపట్టనుంది. Congratulations to Hon. PM @narendramodi ji for the success of India’s G20 Presidency and for fostering unity between nations for a better future for the people of the world. It has brought in a sense of honour and pride into the hearts of every Indian. Sir, under your… https://t.co/x6q4IkNHBN — Shah Rukh Khan (@iamsrk) September 10, 2023 (ఇదీ చదవండి: కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్' రికార్డ్.. కోట్లు కొల్లగొట్టిన షారుక్) -
కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్' రికార్డ్.. కోట్లు కొల్లగొట్టిన షారుక్
• నాలుగు రోజుల్లో 'జవాన్'కు రూ. 500 కోట్లు • ఆదివారం ఒక్కరోజే 28 లక్షలకు పైగా టికెట్లు • షారుక్ తర్వాతి సినిమా ఇదే ఈ ఏడాదిలో పఠాన్', జవాన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ వరుస భారీ బ్లాక్ బస్టర్లను బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అందుకున్నాడు. కొంతకాలం క్రితం బాలీవుడ్లో సరైన భారీ హిట్ సినిమాలు లేవు.. ఏ సినిమా వచ్చినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ సతమతమవుతున్న సమయంలో సౌత్ ఇండస్ట్రీ మాత్రం వరసు పాన్ ఇండియా సక్సెస్లను అందుకుంటూ బాలీవుడ్లో వందల కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది. సరిగ్గా అలాంటి సమయంలో ఐదేళ్ల పాటు గ్యాప్ ఇచ్చి పఠాన్తో వచ్చిన షారుక్ అక్కడి బాక్సాఫీస్ను షేక్ చేశాడు. ఆ సినిమాతో ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లను సాధించి హిందీ పరిశ్రమకు పునఃవైభవాన్ని తీసుకొచ్చాడు. (ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి) దీంతో బాలీవుడ్ బాద్ షా తాను మాత్రమేనని నిరూపించాడు. ఇప్పుడు మళ్లీ ఏడు నెలల గ్యాప్లోనే సెప్టెంబర్ 7న జవాన్గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్ను ఖాతాలో వేసుకున్నాడు. కేవలం నాలుగు రోజుల్లోనే జవాన్ చిత్రం రూ. 500 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. కొంత సమయంలో అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రూ. 500 కోట్ల క్లబ్లో చేరడంతో షారుక్ రికార్డుకెక్కాడు. కేవలం ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగగా జవాన్ సినిమా టికెట్లు 28 లక్షలు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదీ ఎవరూ అందుకోలేని రికార్డు అంటూ పలువురు తెలుపుతున్నారు. దీంతో లాంగ్ రన్ టైమ్లో జవాన్ రూ.1000 కోట్ల మార్క్ను పక్కాగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక షారుక్ చేతిలో మరో సినిమా మాత్రమే మిగిలి ఉంది. అదే 'డంకీ'. ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తే. షారుక్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నట్టే. Jawan creates HISTORY. Sold a RECORD 2⃣8⃣7⃣5⃣9⃣6⃣1⃣ tickets from tracked shows alone in India on the 4th day. Biggest ever for a bollywood film. ||#ShahRukhKhan|#Nayanthara|#Jawan|| Worldwide hits ₹500 cr gross club, making Shah Rukh Khan the only actor to achieve this feat… pic.twitter.com/CHeMFO7wmS — Manobala Vijayabalan (@ManobalaV) September 11, 2023 -
'జవాన్'లో షారుక్కి డూప్.. ఎంత రెమ్యునరేషనో తెలుసా?
షారుక్ ఖాన్ 'జవాన్' మూవీ బాక్సాఫీస్ బాక్సులు బద్దలు కొడుతోంది. రెండు రోజుల్లో రూ.250 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ చేయడం గ్యారంటీ అనిపిస్తుంది. అయితే ఇందులో తండ్రి కొడుకుగా డబుల్ రోల్ లో షారుక్ మెప్పించాడని అందరికీ తెలుసు. కానీ చాలా సీన్స్ లో డూప్ యాక్ట్ చేశాడని మీకు తెలిసుండడదు. ఇంతకీ అతడెవరు? రెమ్యునరేషన్ ఎంతిచ్చారు? 15 ఏళ్లుగా డూప్గా 'జవాన్' మాత్రమే కాదు.. గత 15 ఏళ్ల నుంచి షారుక్ కి డూప్ గా నటిస్తున్న వ్యక్తి పేరు ప్రశాంత్ వాల్దె. ఇతడు షారుక్ కి డూప్ గా నటిస్తున్నప్పటికీ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గానూ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'జవాన్' విశేషాలు బయటపెట్టాడు. (ఇదీ చదవండి: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. ఆ రోజే రానా తమ్ముడి వివాహం!) ఒకేరోజు రెండు గెటప్స్ 'జవాన్ సినిమాలో ఓ సీన్ ఉంది. తండ్రిని కొడుకు హగ్ చేసుకునే సన్నివేశం అది. చేసేటప్పుడు షారుక్ కొడుకు గెటప్ వేస్తే... నేను తండ్రి గెటప్ వేశారు. నన్ను కౌగిలించుకునే టైంలో ఆయన క్లోజప్ షాట్స్ తీశారు. తర్వాత నేను కొడుకు గెటప్ వేస్తే... షారుక్ తండ్రి గెటప్ సీన్స్ తీశారు. అంటే ఒకేరోజు మేం ఇద్దరం రెండు వేర్వేరు గెటప్స్ వేయాల్సి వచ్చింది' అని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Prashant Walde (@prashantwalde) నెలకి అంత సంపాదన అయితే షారుక్ డూప్ గా నటిస్తున్న ప్రశాంత్.. రోజుకి రూ.30 వేల వరకు తీసుకుంటున్నాడట. అంటే నెలకు దాదాపు రూ.9 లక్షలు సంపాదిస్తున్నాడు. అంటే సినిమా మొత్తంలో ఇతడికి సంబంధించిన సీన్స్ అన్ని పూర్తి చేయడానికి కొన్ని నెలలు పట్టుంటుంది. దీంతో ఓ రూ.30-40 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుని ఉంటాడని అనిపిస్తుంది. ఏదేమైనా డూప్ గా నటిస్తూ కూడా ఇంత సంపాదించొచ్చనే విషయం ఇతడిని చూశాకే అర్థమైంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు టైం ట్రావెల్ మూవీ) View this post on Instagram A post shared by Prashant Walde (@prashantwalde) -
బాక్సాఫీస్ దగ్గర జవాన్ కలెక్షన్ల తుపాన్.. రెండో రోజు ఎన్ని కోట్లంటే?
జవాన్ సినిమాకు సినీప్రియులు జై కొడుతున్నారు. షారుక్ ఖాన్ యాక్టింగ్, యాక్షన్ ఇంకా కళ్లముందే కదలాడుతోందంటున్నారు. జవాన్ చిత్రాన్ని ఒక్కసారి చూస్తే తనివి తీరదని మరోసారి చూస్తే కానీ దిల్ ఖుష్ అయ్యేలా లేదని ఫీలవుతున్నారు. మొత్తానికి రికార్డులు సృష్టించాలన్నా నేనే, రికార్డులు తిరగరాయాలన్నా నేనే అన్నట్లుగా షారుక్ బాక్సాఫీస్ దగ్గర విజృంభిస్తున్నాడు. పఠాన్ మొదటి రోజు రూ.106 కోట్లు రాబడితే జవాన్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. తొలిరోజు ఈ సినిమా రూ.126 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. రెండో రోజు కూడా తగ్గేదేలే అన్న రీతిలో కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా రూ.113 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంటే రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్బులో చేరింది. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.500 కోట్ల క్లబ్బులో చేరే ఛాన్స్ ఉందంటున్నారు సినీప్రియులు. మరోపక్క బాక్సాఫీస్ దగ్గర తిరుగు లేకుండా దూసుకుపోతున్న గదర్ 2 చిత్రానికి జవాన్ బ్రేక్ వేసింది. ఈ మూవీ నిన్నటివరకు రూ.510 కోట్లు రాబట్టింది. తాజాగా రిలీజైన జవాన్ గట్టి పోటీ ఇస్తుండటంతో గదర్ 2 కలెక్షన్స్కు భారీ స్థాయిలో గండి పడనున్నట్లు కనిపిస్తోంది. చదవండి: అర్ధరాత్రి శివాజీ, షకీలా డ్రామా.. పిచ్చోళ్లను చేస్తున్నారా? -
అట్లీ, షారుఖ్పై నయనతార అసంతృప్తి.. నిజమెంత?
తమిళసినిమా: పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు అన్నది సామెత. అయితే ఇది కొందరి విషయంలో అక్షరసత్యంగా మారుతుంది. ముఖ్యంగా నటి నయనతార పరిస్థితి ఇదే. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. తాజాగా జవాన్ చిత్రంతో బాలీవుడ్లోనూ రంగప్రవేశం చేశారు. దీంతో ఇండియన్ సినిమా తారగా గుర్తింపుపొందారు. నయనతార నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటన కారణంగా ఈమైపె సంచలన నటిగా ముద్రవేశారు. నటిగా రెండు దశాబ్దాలకు దగ్గరలో ఉన్న నయనతార 75 చిత్రాల మైలురాయిని అవలీలగా అధిగమించి నాటౌట్గా వెలుగొందుతున్నారు. కాగా దీని గురించి ఇటీవల ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. జవాన్ చిత్రంలో తన పాత్రకు ప్రాముఖ్యత ఇవ్వలేదని దర్శకుడు అట్లీ, నటుడు షారుక్ఖాన్లపై అసంతృప్తిగా ఉన్నారన్నది ఆ వదంతి. అయితే జవాన్ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై అనూహ్యంగా వసూళ్లను కురిపిస్తోంది. ఇది ఇండియాలో ఒకరోజులో రూ.75 కోట్లు వసూళ్లు చేసిందని, ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు సాధించి గత రికార్డులను తిరగరాస్తున్నట్లు సమాచారం. ఇకపోతే జవాన్ చిత్రంలో నయనతారకు తగిన ప్రాధాన్యత ఉంది. ఆమెకు యాక్షన్ సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. మరో విషయం ఏమిటంటే నటుడు షారుక్ఖాన్ అంటే నయనతారకు పిచ్చి అభిమానం. ఇక అట్లి దర్శకత్వం వహించిన తొలి చిత్రంలో కథానాయకి నయనతారనే ఆ తర్వాత బిగిల్ చిత్రంలో విజయ్ సరసన నయనతారనే నటింపజేశారు. ఇకపోతే జవాన్ చిత్రం సక్సెస్ను సెలబ్రేట్ చేయడానికి నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్తో కలిసి ముంబై వెళ్లారు. ఈ జంటను ముంబై విమానాశ్రయంలో ఫొటో గ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాబట్టి జవాన్ చిత్ర దర్శక నిర్మాతలపై నయనతార అసంతృప్తిగా ఉన్నట్టు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేటతెల్లమవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సినిమాల్లో ‘గుండు’ కలిసొస్తుందా?, సక్సెస్ రేటెంత?
ఒకప్పుడు హీరో అంటే.. 6 అడుగల హైట్..మంచి హెయిర్ స్టయిల్, డ్రెసింగ్ కచ్చితంగా ఉండాలి. అభిమానులు కూడా తమ హీరోలో ఈ క్వాలిటీస్ కచ్చితంగా ఉండాలని కోరుకునే వారు. కానీ ఇప్పుడు అవేవి పట్టించుకోవడం లేదు. గుండుతో కనిపించినా సరే.. తమను అలరిస్తే బా‘గుండు’ను అంటున్నారు. అందుకే ఈ మధ్య స్టార్ హీరోలే గుండుతో బాక్సాఫీస్ డీ కొడుతున్నారు. సినిమా సక్సెస్లోనూ ‘గుండు’ కీలక పాత్ర పోషిస్తోంది. షారుఖ్ సాహసం షారుఖ్ హెయిర్ స్టైల్ అంటే అభిమానులకు పిచ్చి. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మొదలు మొన్నటి పఠాన్ వరకు ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన హెయిర్ స్టైల్తో అభిమానులను అలరించాడు. అలాంటి షారుఖ్.. ‘జవాన్’ కోసం పెద్ద సాహసమే చేశాడు. తొలిసారి గుండుతో కనిపించి షాకిచ్చాడు. జవాన్లో కీలకమైన మెట్రో ట్రైన్ హైజాక్ సీన్లో షారుఖ్ గుండుతో దర్శనమించాడు. తెరపై గుండుతో షారుఖ్ కనిపించగానే అభిమానులు ఈలలు వేశారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. గుండుతో ధనుష్ ఢీ ధనుష్ తన 50వ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో గుండుతో కనిపించబోతున్నాడు. ఇది గ్యాంగ్స్టర్ డ్రామా అట. ధనుష్, విష్ణు విశాల్, ఎస్జే సూర్య అన్నదమ్ములుగా కనిపిస్తారని టాక్. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంతో ధనుష్ గుండుతోనే విలన్లను ఢీకొడుతాడట. గుండు, గుబురు గడ్డంతో మోహన్లాల్ మోహన్లాల్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. వాస్కో డి గామా నిధిని రక్షించడానికి నియమించబడిన 400 ఏళ్ల నాటి ఆత్మ కథ బర్రోజ్. ఈ చిత్రానికి మోహన్లాలే దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడిగా ఇది ఆయనకు తొలి చిత్రం. ఇందులో గుండు, గుబురు గడ్డంతో మోహన్లాల్ కనిపించబోతున్నాడు. బాస్..గుండూ బాస్ మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై ఇప్పటి వరకు గుండుతో కనిపంచలేదు. అయితే భోళాశంకర్ కోసం గుండులో కనిపిస్తాడని అంతా భావించారు. ఎందుకంటే చిరంజీవియే స్వయంగా ఈ విషయాన్ని చెబుతూ..అప్పట్లో ఓ వీడియో వదిలాడు. అందులో చిరు..జుట్టు తీయించకుండా ప్రొస్టేటిక్ మేకప్తో గుండు లుక్ని మౌల్డ్ చేయించుకున్నాడు. అయితే సినిమాలో మాత్రం ఆ లుక్లో కనిపంచలేదు. కలిసొచ్చిన ‘గుండు’ చిత్ర పరిశ్రమలో ‘గుండు’ సక్సెస్ రేటు ఎక్కువనే చెప్పాలి. స్టార్ హీరోలు గుండుతో కనిపించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. శివాజీ చిత్రంలో రజనీకాంత్ గుండుతో సరికొత్త లుక్లో కనిపించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ‘గజనీ’ సినిమాలో సూర్య గుండుతో కనిపించారు. అదీ సూపర్ హిట్టే. ఇదే సినిమా హిందీ రీమేక్లో అమీర్ గుండుతో కనిపించాడు. అభయ్ చిత్రంలో కమల్ హాసన్ కూడా గుండుతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. మోహన్ బాబు శివశంకర్ చిత్రంతో గుండుతో కనిపించగా.. ఆ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. వర్సటైల్ యాక్టర్ విక్రమ్ 'సేతు' సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు గుండు చేయించుకున్నారు. -
షారుఖ్ ఖాన్ మేనేజర్ ఎవరో తెలుసా? జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే!
సినిమా ఇండస్ట్రీలో మేనేజర్లని కీలక పాత్ర. నటీనటులకు, నిర్మాతలకు వాళ్లు వారధుల్లా పని చేస్తుంటారు. హీరో హీరోయిన్ల డేట్స్ మొదలు.. పారితోషికం వరకు అన్ని వాళ్లే దగ్గర ఉండి చూసుకుంటారు. యాక్టర్స్ కూడా మేనేజర్లు ఏది చెబితే అది ఫాలో అవుతుంటారు. అందుకే దర్శక నిర్మాతలు మేనేజర్ల వెంబడి పడుతుంటాడు. మీ హీరోతో మా సినిమా సెట్ చేయడంటూ విజ్ఞప్తులు చేస్తుంటారు. అయితే ఇక్కడ ప్రతీది మేనేజర్లే చూసుకోవాలని కాబట్టి.. స్టార్ హీరోహీరోయిన్లు చాలా నమ్మకస్తులను మేనేజర్లుగా నియమించుకుంటారు. వారితో ఏళ్లతరబడి స్నేహబంధాన్ని కొనసాగిస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ ఒకరు. షారుఖ్ ఫ్యామిలీతో మంచి అనుబంధం 2012 నుంచి షారుఖ్కు మేనేజర్గా పూజా దద్లానీ పని చేస్తుంది. షారుఖ్ సినిమా వ్యవహారాలే కాకుండా పర్సనల్ విషయాలలో ఆమె సలహాలు ఇస్తుంటారట. దశాబ్ద కాలానికి పైగా షారుఖ్తో కలిసి పనిచేయడంతో వారి ఫ్యామిలీతో ఆమెకు మంచి అనుబంధం ఏర్పడింది. షారుఖ్ భార్య గౌరీఖాన్... పూజాను సొంత ఇంటి మనిషిలా చూసుకుంటుంది. పలువురి సెలబ్రిటీల పార్టీలకు పూజాతో కలిసి వెళ్లింది. పూజ కూడా ఆ ఫ్యామిలీ కష్ట, సుఖాల్లో మోరల్ సపోర్ట్ గా నిలుస్తూ ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘జవాన్’ చిత్ర ప్రమోషన్ల విషయంలో కూడా పూజా దద్లానీ కీలకంగా వ్యవహరించింది. భారీ వేతనం షారుఖ్ ఖాన్ సంపాదన గురించి అందరికి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో షారూఖ్ ఖాన్ ఒకరు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ని స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. ఆయన భార్య గౌరీ ఖాన్ కూడా సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్ గా భారీగానే ఆర్జిస్తోంది. షారుఖ్ ఫ్యామిలీ వార్షిక ఆదాయం దాదాపు 500 కోట్ల వరకు ఉంటుందట. తమ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునే పూజా దాద్లానీకి షారుఖ్ భారీ వేతనాన్ని అందిస్తున్నాడట. ఏడాదికి రూ.7 కోట్ల నుంచి 9 కోట్ల వరకు పూజా వేతనం ఉంటుందని బాలీవుడ్ టాక్. పూజ కేవలం మేనేజర్గానే కాకుండా ఇతర వ్యాపారాలు కూడా చేస్తుంటారట.ఆమె సంపాదన నికర విలువ దాదాపు రూ.50 కోట్ల వరకు ఉటుందని సమాచారం. ముంబైలోని లిస్టా జ్యువెల్స్ డైరెక్టర్ హితేష్ గుర్నానీని పూజా వివాహం చేసుకుంది. వీరికి రేనా దద్లానీ అనే కూతురు కూడా ఉంది. -
'జవాన్' సినిమాను నిలబెట్టిన ఈ ఆరుగురు.. ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఇవే
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయన్తార లీడ్ రోల్స్లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. మొదటిరోజే భారత్లో రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల మార్క్ను దాటింది. 'జైలర్' సినిమాకు అనిరుధ్ బీజీఎం ఎంతగానో తోడ్పడింది. అలాగే జవాన్ సినిమాకు భారీ యాక్షన్ సీన్స్ ఊపిరి పోశాయి. ఇవే ఈ చిత్రానికి ప్రధానమైన బలం అని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: మరొకరితో భారత క్రికెటర్ భార్య.. లిప్లాక్ వీడియో వైరల్) ఇందులో ప్రతి యాక్షన్ సీన్ కూడా ప్రేక్షకుల చేత విజిల్స్ వేపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. జవాన్లో చిత్రంలో ఆస్పత్రి వద్ద జరిగే యాక్షన్ సీన్తో పాటు డబ్బును కంటైనర్లో తరలించే సమయంలో వచ్చే ఫైట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో ఊపిరి బిగపట్టించే కారు ఛేజ్లు, గగుర్పొడిచే బైక్ స్టంట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటంన్నిటి వెనుక ఆరుగురి శ్రమ ఉంది. అంతర్జాతీయంగా పేరున్న స్పిరో రజాటోస్, క్రెయిగ్ మాక్రే, యానిక్ బెన్, కిచా కఫడ్గీ, సునీల్ రోడ్రిగ్స్, అనల్ అరసు.. అనే ఆరుగురు స్టంట్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఆయా సీన్లను షూట్ చేశారు. (ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్) మాములుగా ఇండియాన్ సినిమాలకు ఒకరిద్దరు మాత్రమే యాక్షన్ సీన్లు కొరియోగ్రఫి చేస్తుంటారు. కానీ తొలిసారి జవాన్ సినిమాకు ఏకంగా ఆరగురు యాక్షన్ కొరియోగ్రఫర్స్ పనిచేశారు. అందుకే ఆ సీన్లన్నీ ఆడియన్స్ను మెప్పిస్తాయి. ► ఫైట్ మాస్టర్ 'స్పిరో రజాటోస్' హాలీవుడ్ సినిమాల్లో ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస', కెప్టెన్ అమెరికా,' టీనేజ్ మ్యూటాంట్ నింజా తాబేళ్లు, మరియు మరిన్నింటికి ప్రసిద్ధి చెందాడు, ► యాక్షన్ సీన్స్లలో ఎంతో అనుభవజ్ఞుడైన పార్కర్ ట్యూటర్గా గుర్తింపు పొందిన 'యానిక్ బెన్' హాలీవుడ్ అంతటా పలు చిత్రాలతో పాటుగా తెలుగు, హిందీ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశాడు. షారుక్ రయీస్, టైగర్ జిందా హై, మహేశ్ బాబు నేనొక్కడినే, ట్రాన్స్పోర్టర్ 3, డన్కిర్క్ వంటి చిత్రాలకు ఫైట్ మాస్టర్గా పనిచేశాడు. ► 'క్రెయిగ్ మాక్రే' కూడా పలు హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశాడు. మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్, అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ సినిమాలకు మంచి గుర్తింపు దక్కింది. ► 'కిచా కఫడ్గీ' ఒక ఆంగ్ల స్టంట్ దర్శకుడు, అతను కన్నడ, మలయాళం, హిందీ, తమిళం, ఇంగ్లీష్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా సినిమాలకు పనిచేశాడు. తుపాకి, బాహుబలి 2: ది కన్క్లూజన్, బాఘీ 2' వంటి బ్లాక్బస్టర్లలో తన యాక్షన్కు పేరుగాంచాడు. ► 'సునీల్ రోడ్రిగ్స్' యాక్షన్ సన్నివేశాలలో ఆయన కొత్తగా సృష్టించగలడు. సాంకేతిక రూపకల్పనతో పాటుగా దర్శకత్వం, నిర్మాణంలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. అతను షేర్షా, సూర్యవంశీ, పఠాన్ వంటి సూపర్హిట్లలో కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించాడు. ► 'అనల్ అరసు' ఒక భారతీయ ఫైట్ మాస్టర్/యాక్షన్ కొరియోగ్రాఫర్, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమలలో పని చేస్తున్నారు. కొన్ని హాలీవుడ్ వెబ్సీరిస్లకు కూడా ఆయన పనిచేశాడు. అతను సుల్తాన్, కత్తి,కిక్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు ప్రసిద్ధి చెందాడు. -
జవాన్ స్టార్ 'షారుఖ్ ఖాన్' ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా?
బాలీవుడ్ బాద్షా 'షారుఖ్ ఖాన్' (Shahrukh Khan) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పఠాన్తో దుమ్మురేపిన కింగ్ ఖాన్.. తాజాగా 'జవాన్' చిత్రంతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. మన దేశంలో అన్ని భాషలలో కలిపి రూ. 75 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో కథానాయకుడైన షారుఖ్ నెట్వర్త్, లగ్జరీ కార్లు వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఐదు పదుల వయసు దాటినా ఎంతో హుందాగా బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న షారుఖ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ పాలోయింగ్ కలిగి ఉన్నారు. ఈయన ఒక సినిమాకు రూ.130 నుంచి రూ.150 కోట్లు తీసుకుంటారని సమాచారం. ఇది మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్, వివిధ వ్యాపార సంస్థల నుంచి రూ. 100 కోట్లు కంటే ఎక్కువ తీసుకుంటున్నట్లు.. వార్షిక ఆదాయం మొత్తం రూ. 280 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే సినీ నిర్మాణ సంస్థ ద్వారా వీరు సంవత్సరానికి రూ.500 కోట్లు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని ఆయన భార్య గౌరీ ఖాన్ చూసుకుంటున్నట్లు సమాచారం. ఇవి కాకుండా దుబాయ్లో రూ.200 కోట్లు విలువ చేసే విల్లా, అమెరికాలో ఒక ఖరీదైన విల్లా ఉన్నట్లు చెబుతారు. ఇదీ చదవండి: ఇంజినీర్ జాబ్ వదిలి వ్యవసాయం - సంపాదన తెలిస్తే షాకవుతారు! కార్ కలెక్షన్స్.. షారుఖ్ ఖాన్ వద్ద ఉన్న కార్ల విషయానికి వస్తే.. వీరి వద్ద సుమారు రూ. 7 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూప్, బెంట్లీ కాంటినెంటల్ జిటి, బిఎమ్డబ్ల్యూ 7-సిరీస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, ఆడి ఏ8 ఎల్, బిఎమ్డబ్ల్యూ ఐ8, బిఎమ్డబ్ల్యూ 6-సిరీస్ కన్వర్టిబల్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, మిత్సుబిషి పజెరో, హ్యుందాయ్ క్రెటా మొదలైన కార్లు ఉన్నాయి. మొత్తం మీద అయన ఆస్తుల విలువ ఏకంగా రూ. 6300 కోట్లు కంటే ఎక్కువని సమాచారం. -
బంగ్లాదేశ్లో 'జవాన్' నిషేధం.. ఎందుకో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా 10 వేలకు పైగా స్క్రీన్లలో విడుదలైన షారుక్ ఖాన్ చిత్రం 'జవాన్' మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. సౌత్ డైరెక్టర్ అట్లీతో కలిసి షారుఖ్ ఖాన్ భారతీయ సినిమా మార్కెట్లో వసూళ్ల రికార్డును సృష్టించాడు. అదే సమయంలో షారుక్ ఖాన్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన షారుఖ్ ఖాన్ సినిమా 'జవాన్' పొరుగు దేశం బంగ్లాదేశ్లో షెడ్యూల్ ప్రకారం విడుదల కాలేదు. గతంలో షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ కూడా అదే రోజు బంగ్లాదేశ్లో విడుదల కాలేదు. తాజాగా జవాన్ సినిమా కూడా బంగ్లాదేశ్లో విడుదల కాకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో జవాన్ను ఎందుకు విడుదల చేయలేదు.. విశేషమేమిటంటే, బంగ్లాదేశ్లో ప్రస్తుతం అంతర్యుద్ధం లాంటి పరిస్థితిలో నెలకొని ఉన్నాయి. వచ్చే ఏడాది 2024లో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి ప్రజలు పలు చోట్ల ప్రభుత్వం పట్ల నిరసనలు వంటివి చేస్తున్నారు. బంగ్లాదేశ్లో రాజకీయ, సామాజిక పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. కొన్ని చోట్ల కర్ఫ్యూ వాతావారణం నెలకొని ఉంది. దీంతో అక్కడ జవాన్ విడుదలను బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డ్ నిషేధించబడింది. దీంతో అక్కడ ఆయన ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఇప్పట్లో బంగ్లాదేశ్లో షారుఖ్ ఖాన్ సినిమా జవాన్కి థియేటర్లు ఎప్పుడు లభిస్తాయో చెప్పడం కష్టం. జవాన్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఓపెనింగ్ రోజున రచ్చ సృష్టించాడు. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే రూ. 125 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ముందు పఠాన్ రూ.55 కోట్లు, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ. 54 కోట్లు,బాహుబలి రూ. 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా జవాన్ ఏకంగా మొదటి రోజు రూ. 75 కోట్లు రాబట్టి ఇండియన్ కలెక్షన్ కింగ్ షారుక్ ఖాన్ అని నిరూపించాడు. (ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్) -
మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్
గత నాలుగేళ్లుగా ఫ్లాప్లతో సతమతమవుతున్న బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ 2023 సంవత్సరంలో తన సత్తా చాటుతున్నాడు. ఇదే ఏడాది ప్రారంభంలో విడుదలైన షారుఖ్ ఖాన్ చిత్రం 'పఠాన్' ఏకంగా రూ. 1000 కోట్లను కొల్లగొట్టింది. పఠాన్ తొలిరోజున భారత్లో రూ. 55 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు 'జవాన్'తో మరోసారి బాలీవుడ్ సింహాసనం తనదేనని 57 ఏళ్ల బాద్ షా నిరూపించాడు. సెప్టెంబర్ 7న విడుదలైన జవాన్ సినిమా తొలిరోజే సూపర్ హిట్ టాక్ రావడంతో షారుక్ తన విజయపతాకాన్ని ఎగురవేశాడు. ఈ సినిమా తొలిరోజే భారీ వసూళ్లను రాబడుతోంది. (ఇదీ చదవండి: Jawan Review: 'జవాన్' మూవీ రివ్యూ) జవాన్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఓపెనింగ్ రోజున రచ్చ సృష్టించాడు. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే రూ. 125 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ముందు పఠాన్ రూ.55 కోట్లు, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ. 54 కోట్లు,బాహుబలి రూ. 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా జవాన్ ఏకంగా మొదటి రోజు రూ. 75 కోట్లు రాబట్టి ఇండియన్ కలెక్షన్ కింగ్ షారుక్ ఖాన్ అని నిరూపించాడు. షారుక్ ఖాన్ గత 5 సినిమాల మొదటిరోజు కలెక్షన్స్ ► 2016లో విడుదలైన 'ఫ్యాన్' సినిమాతో షారుఖ్ ఖాన్ రికార్డు క్రియేట్ చేశాడు. అప్పటికి వరుస ఫ్లాప్లతో ఉన్న ఆయనకు ఈ సినిమా భారీ విజయాన్ని ఇచ్చింది. ఈ చిత్రం తొలిరోజు రూ.19.10 కోట్లు వసూలు చేసింది. ► ఆ తర్వాతి సంవత్సరం 2017లో షారుఖ్ ఖాన్, పాకిస్థానీ నటి మహిరా ఖాన్ జంటగా నటించిన చిత్రం రయీస్.. షారుఖ్ ఖాన్కు అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా కలెక్ట్ చేయలేదు. ఈ సినిమా తొలిరోజే 20.40 కోట్లు రాబట్టింది. ► 2017లో 'జబ్ హ్యారీ మెట్ సెజల్' సినిమాతో షారుక్ ఖాన్, ఇంతియాజ్ అలీతో పని చేయడం ఇదే మొదటిసారి. 2017లో విడుదలైన ఈ సినిమా షారుఖ్, అనుష్కల 'రబ్ నే బనాదీ'ల హిట్ పెయిరింగ్ ఈ చిత్రంలో కనిపించింది. అయితే ఈ సినిమా తొలిరోజు మొత్తం 15.25 కోట్లు మాత్రమే రాబట్టింది. ► 2018 సంవత్సరంలో విడుదలైన 'జీరో' చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత, బాలీవుడ్లో షారుక్ ఖాన్ కెరీర్ ముగిసిందని భావించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. దీంతో షారుక్ ఖాన్ ఇంటికే పరిమితం అయ్యాడు. జీరో సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కేవలం 19.35 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ► షారుఖ్ ఖాన్ తన 30 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్లో 'జీరో' చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత ఇండస్ట్రీలో ఇదే చివరి సినిమాగా అని అందరూ భావించారు. 2018 నుంచి సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో 'పఠాన్'ని అభిమానులకు అందించాడు. ఈ సినిమా భారత్లో మొదటిరోజు ఏకంగా రూ. 55 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. దీంతో షారుఖ్ ఖాన్ స్టార్డమ్ ఏంటో ఇండస్ట్రీకి తెలిసింది. బాలీవుడ్లో అతనికి ఇంకా స్థానం ఉందని షారుక్ అప్పుడే అనుకున్నాడు. షారుక్ ఖాన్ కెరీర్లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం పఠాన్. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం జవాన్ కూడా రూ. 1000 కోట్లను సులభంగా దాటడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
'జవాన్' మూవీ రివ్యూ
టైటిల్: జవాన్ నటీనటులు: షారుక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, మాన్య మల్హౌత్ర, దీపికా పదుకోన్, సంజయ్ దత్ నిర్మాణ సంస్థ: రెడ్ చిల్లీస్ నిర్మాతలు: గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ దర్శకత్వం: అట్లీ కుమార్ సంగీతం: అనిరుధ్ సినిమాటోగ్రఫీ: జీ.కే. విష్ణు విడుదల తేది: సెప్టెంబర్ 7, 2023 బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్- నయనతార నటించిన చిత్రం జవాన్. సౌత్ ఇండియా పాపులర్ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 7) విడుదల అయింది. బాలీవుడ్లో కొన్నేళ్లుగా బాద్ షాగా అలరిస్తున్నాడు కింగ్ ఖాన్ షారుక్ . తన డ్యాన్స్, యాక్టింగ్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించాడు. పఠాన్కు ముందు సుమారు రెండేళ్ల పాటు బాలీవుడ్లో సరైన హిట్ లేకపోవడంతో అక్కడ సౌత్ సినిమాల హవా కొనసాగింది. అలాంటి సమయంలో పఠాన్ విడుదల కావడం. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసి బాలీవుడ్ కింగ్ అనిపించుకున్నాడు. అలా పఠాన్ సినిమాతో బాలీవుడ్కు మళ్లీ పూర్వ వైభవం తెచ్చిన షారుక్.. తాజాగా 'జవాన్'తో మరోసారి తన సత్తా చాటేందకు రెడీ అయ్యాడు. నయనతార, డైరెక్టర్ అట్లీ ఈ సినిమాతో హిట్ కొట్టి బాలీవుడ్లో తమ సత్తా నిరూపించుకోవాలనే ప్లాన్లో ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్లో విడుదుల అయిన జవాన్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. ‘జవాన్’ కథేంటంటే.. కథ ప్రారంభంలో నీటి ప్రవాహంలో పూర్తి గాయాలతో షారుక్ ఖాన్ (విక్రమ్ రాథోడ్) కొట్టుకొని వస్తాడు. అటవీ ప్రాంతానికి చెందిన కొందరు ఆయన్ను గుర్తించి చికిత్స అందిస్తారు. కొద్దిరోజుల తర్వాత అదే గ్రామస్తులపై కొందరు దుండగులు దాడులు చేసేందుకు వస్తారు. నిస్సాహయ స్థితిలో ఉన్న వారిని షారుక్ రక్షిస్తాడు.. అలా కథ ముందుకు వెళ్తున్న సమయంలో ముంబై నగరంలో ఒక మెట్రోను షారుక్ ఖాన్ (విక్రమ్ రాథోడ్) అండ్ టీమ్ హైజాక్ చేస్తారు. ఆ టీమ్లో ప్రియమణి, మాన్య మల్హౌత్రతో పాటు మరో నలుగురు ఉంటారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఒక జవాన్ (షారుక్ ఖాన్) మెట్రోను ఎందుకు హైజాక్ చేశాడు. .? ఆ హైజాక్ సీన్లోకి ఐపీఎస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇచ్చిన నయనతారకు (నర్మద) ఎలాంటి సంఘటనలు ఎదురౌతాయి..? విక్రమ్ రాథోడ్ కోసం ఆ అమ్మాయిలు ఎందుకు పనిచేశారు..? వెపన్స్ డీలర్గా ఉన్న విజయ్ సేతుపతితో ఆర్మీలో పని చేస్తున్న విక్రమ్ రాథోడ్కు ఎక్కడ విరోదం మొదలౌతుంది..? ఒక జవాన్పై దేశ ద్రోహి అనే ముద్ర పడటం వెనుక జరిగిన కథ ఏంటి..? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. యాక్షన్ రివేంజ్ సినిమాలు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అనేకం వచ్చాయి. కానీ ఇందులో మెసేజ్ ఓరియేంటేడ్ రివేంజ్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కించాడు. అన్ని సినిమాల మాదిరే దేశం కోసం ప్రాణాలు ఆర్పించే సైనికుడికే నష్టం జరిగితే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ కథకు మూలం. డైరెక్టర్ అట్లీ తమిళ హీరో విజయ్తో తెరి, మెర్సిల్, బిగిల్ వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి బాలీవుడ్లో అవకాశం దక్కించుకున్నాడు. ఆ మూడు సినిమాల మాదిరే జవాన్లో కూడా మంచి మెసేజ్ను ఇచ్చాడు. ముఖ్యంగా ఇందులో సినిమా ప్రారంభంలో మెట్రో హైజాక్ సీన్ చాలా బాగుంటుంది. ఆ సీన్లో విక్రమ్ రాథోడ్తో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి మధ్య వచ్చే సీన్లు జవాన్కు ప్లస్ అవుతాయి. ఎందుకంటే కథలో మేజర్ సీన్లు ఇవే. ఫస్టాఫ్లో సినిమాకు ఇవే బలం. దేశంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు ఏంటో గుర్తు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఎలా ఉందో దర్శకుడు చెప్పిన విధానం ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుంది. ఇలాంటి పలు సోషియల్ ఇష్యూలతో జవాన్ మొదటి భాగం ఉంటుంది. అవన్నీ కూడా గతంలో పలు సినిమాల్లో చూసినట్లు అనిపిస్తున్నా... షారుక్ నటన, యాక్షన్స్ సీన్స్ ముందు అవన్నీ ఆడియన్స్ పెద్దగా పంటించుకోరు. మెట్రో హైజాక్ చేసింది విక్రమ్ రాథోడ్ అయితే.. ఈ విషయంలో జైలర్గా ఉన్న ఆజాద్ను నయనతార అరెస్ట్ చేయాలని భావిస్తుంది. ఆ సమయంలో విక్రమ్ రాథోడ్, ఆజాద్కు ఉన్న బంధాన్ని ప్రియమణి రివీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. ఇంటర్వెల్కు ముందు నుంచి జరిగే ఈ సీన్స్ సినిమాకే హైలెట్గా నిలుస్తాయి. కానీ సెకండాఫ్లో కూడా మంచి యాక్షన్ సీన్తో కథ ప్రారంభం అయినా తర్వాత కొంత నెమ్మదిస్తుంది. అక్కడక్కడా వచ్చే కొన్ని సీన్స్ అంతగా పండించవనే చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆజాద్ జైలర్ అయితే విక్రమ్ రాథోడ్ ఒక జవాన్ ఇద్దరూ కూడా దేశం కోసం పనిచేస్తున్నవారే.. కానీ ఒక 'జవాన్' తన ప్రాణాలకు తెగించి యుద్ద రంగంలో పాల్గొన్నప్పుడు.. శత్రువు కూడా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఎదురుదాడి చేస్తాడు. ఇలాంటి సమయంలో 'జవాన్' చేతిలో ఉన్న గన్ పనిచేయకపోతే ఏం జరుగుతుంది..? దేశం కోసం రణరంగంలోకి దిగిన 'జవాన్' ప్రాణాలు పోతాయి. సేమ్ 'జవాన్' సినిమాలో కూడా ఇదే జరుగుతుంది. ఈ సన్నివేశం తీసిన విధానం చాలా బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. విక్రమ్ రాథోడ్, ఆజాద్ పాత్రలో షారుక్ ఖాన్ దుమ్ములేపారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్క్రీన్ ప్రంజెంటేషన్కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. యాక్షన్ సీన్స్తో పాటు సెంటిమెంట్ సీన్స్ పండించడంలో షారుక్ ఎక్కడా తగ్గలేదు. జవాన్తో నయనతార బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆజాద్కు భార్యగా, మరో బిడ్డకు తల్లిగా, ఒక పోలీస్ ఆఫీసర్గా సూపర్బ్ అనిపించేలా తనదైన మార్క్ నటనతో మెప్పించింది. కానీ షారుక్ ఖాన్తో ఆమె జోడీ అంతగా హైలెట్ కాలేదు. విక్రమ్ రాథోడ్కు భార్యగా దీపికా పదుకోన్ కొంత సమయం పాటు కనిపించినా సినిమాకు ప్లస్ అయ్యేలా మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్లో కాళీ గైక్వాడ్గా విజయ్ సేతుపతి హవా ఎక్కువగా ఉంటుంది. జవాన్ అతనికి బాలీవుడ్లో రెండో సినిమా... ఈ సినిమాతో ఆయనకు అక్కడ మార్కెట్ పెరగడం ఖాయం. సినిమాలో విలన్ రోల్తో పాటు అక్కడక్కడ మంచి కామెడీ పంచ్లు కూడా ఆయన నుంచి ఉంటాయి. అవి ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాయి. చివర్లో సంజయ్ దత్ కామియో రోల్లో కనిపించి మెప్పిస్తాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం డైరెక్టర్ అట్లీ స్క్రీన్ప్లే అని చెప్పవచ్చు కథ పాతదే అయినా తను రాసుకున్న కథ తీరు ఆడియన్స్ను ఎక్కడా బోర్ కొట్టిన ఫీల్ ఉండదు. విజువల్స్తో పాటు భారీ యాక్షన్ సీన్స్ హై రేంజ్లో ఉంటాయి. ఇందులో అనిరుధ్ అందించిన మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్ వరకు బాగున్నా ... హీరో ఎలివేషన్తో పాటు పలు సీన్స్లలో ఆయన నుంచి ఆశించినంత స్థాయిలో మ్యూజిక్ ఉండదు. ప్రతి సన్నివేశం రిచ్గా ఉండేలా కెమెరామెన్ పనితనం కనిపిస్తుంది. ఎడిటర్ పనితీరు కొంతమేరకు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి. -బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్డెస్క్ -
విక్రమ్, జైలర్ సినిమాలను మించిపోయేలా పాన్ ఇండియా రేంజ్లో..
లోకనాయకుడు కమల్ హాసన్, ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం కాంబో అంటే మామూలుగా ఉండదు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన నాయకన్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. కాగా చాలా గ్యాప్ తరువాత మరోసారి ఈ కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు కూడా! కమల్ హాసన్ 234వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ, మణిరత్నం మద్రాస్ టాకీస్ కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. జైలర్ను మించిపోయేలా.. త్వరలో సెట్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్న ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్రం కమల్ హాసన్ నటించిన విక్రమ్, రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రాల తరహాలో.. అంతకు మించిన స్థాయిలో రూపొందించడానికి మణిరత్నం సిద్ధం అయినట్లు తెలిసింది. ఇందులో ప్రముఖ హీరోలు నటించనున్నట్లు టాక్. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి నటించనున్నట్లు సమాచారం. కమల్ సినిమాలో ఆ స్టార్ హీరోలు మరో ముఖ్య పాత్రలో హీరో శింబును నటింపజేయాలని ప్రయత్నించినా, కొన్ని కారణాల వల్ల ఆయన సెట్ కాకపోవడంతో తనను పక్కన పెట్టేశారు. ఆ పాత్రలో హీరో సూర్యను ఎంపిక చేసే ప్రయత్నాలు జరిగాయనీ, అయితే ఆయన నటించే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు హీరో విక్రమ్ను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే కాంబో సెట్ అయితే చిత్రం స్థాయి మరింత పెరిగిపోతుందని చెప్పనక్కర్లేదు. చదవండి: ముద్దు కావాలంటూ గోల చేసిన తేజ.. మొత్తానికి సాధించాడు -
క్రికెట్ మ్యాచ్లో 'జవాన్' ప్లాన్: అట్లీ
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం జవాన్. దీనికి కారణాలెన్నో. ముఖ్యంగా పఠాన్ వంటి సంచలన విజయం సాథించిన చిత్రం తరువాత తెరపైకి వస్తున్న చిత్రం ఇది కావడం. అదేవిధంగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ దీనికి దర్శకుడు కావడం. లేడీ సూపర్స్టార్ నయనతార జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వడం. క్రేజీ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం, తమిళ నటుడు విజయ్సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం, దీపికా పదుకునే గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నేడు (సెప్టెంబర్ 7) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మీడియాతో ముచ్చటిస్తూ తాను బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఊహించలేదన్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్నేనని పేర్కొన్నారు. ఆయన నమ్మకమే జవాన్ చిత్రం అని పేర్కొన్నారు. ఒకసారి క్రికెట్ మ్యాచ్ చూడడానికి చైన్నె వచ్చినప్పుడు షారూఖ్ఖాన్ తన కార్యాలయాలనికి వచ్చారన్నారు. తామిద్దరం సుమారు మూడున్నర గంటలు మాట్లాడుకున్నామని చెప్పారు. అప్పుడే జవాన్ చిత్రానికి బీజం పడిందని చెప్పారు. రూ.350 కోట్లు బడ్జెట్లో చిత్రం చేయడానికి సిద్ధమయ్యామన్నారు. కరోనా కాలంలో షారూఖ్ఖాన్ ధైర్యం చేసి ఈ చిత్రాన్ని నిర్మించారని చెప్పారు. అయితే తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. అలా నటి నయనతార, విజయ్సేతుపతి, యోగిబాబు, సంగీత దర్శకుడు అనిరుధ్, ఎడిటర్ రూపన్ ఇలా అందరినీ తానే ఈ చిత్రంలోని తీసుకున్నానని చెప్పారు. అయితే చిత్రం అన్ని వర్గాలను అలరించే విధంగా రూపొందించాలన్నదే లక్ష్యంగా భావించామన్నారు. జవాన్ చిత్రం అందరికీ సంతృప్తికరంగా వచ్చిందన్నారు. పఠాన్ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత వస్తున్న చిత్రం కాబట్టి ఆ చిత్రాన్ని రీచ్ అవుతుందా? అన్న విషయం గురించి ఆలోచించలేదన్నారు. ఒక మంచి చిత్రం చేయాలన్న ధ్యేయంతోనే జవాన్ చిత్రం చేశామని అట్లీ చెప్పారు. -
షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!
యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘జవాన్’. ‘పఠాన్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేడు(సెప్టెంబర్ 7) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా జవాన్ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. షారుఖ్ని డైరెక్ట్ చేసిన రెండో వ్యక్తి అట్లీ షారుఖ్ ఖాన్ సినీ కెరీర్ 1992లో ప్రారంభమైంది. బాలీవుడ్లోని బడా డైరెక్టర్స్ అందరితో షారుఖ్ కలిసి పని చేశాడు. కానీ సౌత్ వాళ్లతో కలిసి పని చేయడం చాలా తక్కువ. దాదాపు 23 ఏళ్ల తర్వాత తమిళ డైరెక్టర్తో కలిసి షారుఖ్ ఓ సినిమా చేస్తున్నాడు. అట్లీ కంటే ముందు 2000 సంవత్సరంలో కమల్ హాసన్ దర్శకత్వంలో ‘హే రామ్’ అనే సినిమా చేశాడు. నయనతార తొలి చిత్రం దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార నటించిన తొలి బాలీవుడ్ చిత్రం ‘జవాన్’. స్వతహా షారుఖ్ అభిమాని అయిన నయన్.. అతనితో కలిసి నటించే అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పిందట. అంతకు ముందు ‘చెన్నై ఎక్స్ప్రెస్’లో ‘వన్ టూ త్రీ ఫోర్’.. అనే పాటలో నటించే చాన్స్ ముందుగా నయన్కే వచ్చిందట. కారణం ఏంటో తెలియదు కానీ అప్పుడు ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించిందట. నయన్ వద్దనడంతో ఆ స్థానంలో ప్రియమణిని తీసుకున్నారట. షారుఖ్ ద్విపాత్రాభినయం ‘జవాన్’లో షారుఖ్ ద్విపాత్రాభినయం చేశాడు. అంతేకాదు పలు విభిన్న లుక్స్లో కనిపించబోతున్నాడు. ట్రైలర్లో గుండుతో కనిపించి షాకిచ్చాడు. అయితే షారుఖ్ గుండు కంటే.. ఆ గుండుపై ఉన్న టాటు బాగా వైరల్ అయింది. షారుక్ గుండుపై 'మా జగత్ జనని' అని రాసి ఉంది. అమ్మనే ప్రపంచం అని ఆ టాటు అర్థం. ఆ టాటుకి జవాన్ కథకు సంబంధం ఉందట. తన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తులపై పగ తీర్చుకునే ఓ కొడుకు కథే జవాన్ అనే చర్చ నెట్టింట జరుగుతోంది. అతిథి పాత్రలో దీపికా పదుకొణె చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రంలో షారుఖ్కు జోడిగా నటించిన దీపికా పదుకొణె.. ‘జవాన్’లో అతిథి పాత్రలో మెరవబోతుంది. గతంలో పలు సినిమాల్లో కలిసి నటించడంతో షారుఖ్, దీపికా పదుకొణెల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. షారుఖ్ కోసమే దీపికా అతిథి పాత్రను ఒప్పుకుందట విలన్గా విజయ్ సేతుపతి జవాన్లో విలన్గా విజయ్ సేతుపతి నటించడం మరో విశేషం. విజయ్కి రెండో బాలీవుడ్ చిత్రమిది. అంతకు ముందు ముంబైకర్ చిత్రంలో విజయ్ కీలక పాత్ర పోషించాడు. అయితే అది ఓటీటీలో విడుదల కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. ‘జవాన్’తో విజయ్ సేతుపతి బాలీవుడ్ భారీ విజయం అందుకోబోతున్నారని ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. షారుఖ్ రిస్కీ ఫైట్స్ ‘జవాన్’కోసం షారుఖ్ రిస్కీ ఫైట్స్ చేశారట. ఈ చిత్రం కోసం ఆరుగురు అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్స్ పని చేయడం గమనార్హం. స్పిరో రజటొస్, యనిక్ బెన్, ట్రెయిన్ మాక్రే, కెచ్చా కంపాక్డీ, అనల్ అరసు మొదలగు ఆరుగురు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన పోరాట దృశ్యాలు, బైక్, కారు ఛేజింగ్స్ జవాన్ చిత్రంలో హైలెట్ కానున్నాయని యూనిట్ సభ్యులు తెలిపాయి. రూ.300 కోట్ల బడ్జెట్ జవాన్ బడ్జెట్ దాదాపు రూ.300 కోట్లు. ఇందులో దాదాపు రూ. 100 కోట్లు షారుఖ్ రెమ్యునరేషనే కావడం గమనార్హం. ఇక నయనతార కూడా భారీగానే పుచ్చుకున్నారట. తొలి బాలీవుడ్ చిత్రానికిగాను రూ. 11 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఈ మూవీ షూటింగ్ ముంబై, పుణె, చెన్నై, రాజస్తాన్, హైదరాబాద్, ఔరంగాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగింది. రన్ టైం ఎంత? జవాన్ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. రన్టైం 2:49 గంటలు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. కొన్ని గంటల్లోనే తొలిరోజు షోకి సంబంధించి సుమారు 8 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. బాలీవుడ్ చరిత్రలో ఇదొక రికార్డు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. -
'జవాన్’పై మహేశ్ ట్వీట్.. షారుక్ క్రేజీ రిప్లై
పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. సెప్టెంబర్ 7న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రం కోసం షారుఖ్ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించడంతో ‘జవాన్’పై టాలీవుడ్లో కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. సూపర్ స్టార్ మహేశ్బాబు సైతం ‘జవాన్’ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారట. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూస్తానని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆయన కోరుకున్నాడు. మహేశ్.. నీతో కలిసి సినిమాకు వస్తా: షారుఖ్ తన సినిమా గురించి మహేశ్ బాబు ట్వీట్ చేయడం పట్ల షారుఖ్ స్పందించాడు. ఈ చిత్రం కచ్చితంగా మహేశ్కు నచ్చుతుందని, తాను కూడా మహేశ్తో కలిసి సినిమా చూడాలనుకుంటున్నానని చెప్పారు. ‘థ్యాంక్యూ సో మచ్ మై ఫ్రెండ్. ‘జవాన్’నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు ఈ సినిమాను చూడాలనుకుంటున్నావో చెబితే.. నేను కూడా నీతో కలిసి సినిమాకు వస్తా. మీకు, మీ కుటుంబానికి నా ప్రేమపూర్వక అభినందనలు’అని షారుఖ్ ట్వీట్ చేశాడు. కాగా, మహేశ్, షారుఖ్ మంచి స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే. గతంలో మహేశ్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా సెట్కి షారుఖ్ వెళ్లి సందడి చేశాడు. అప్పట్లో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. Thank u so much my friend. Hope you enjoy the film. Let me know when you are watching I will come over and watch it with you. Love to you and the family. Big hug. https://t.co/xW0ZD65uvk — Shah Rukh Khan (@iamsrk) September 6, 2023 -
తిరుమల ఆలయాన్ని సందర్శించిన షారూఖ్ & నయనతార
-
తిరుమలలో షారుక్, నయనతార- విఘ్నేష్ శివన్ జంట
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో నేడు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని షారుక్ ఖాన్తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ దర్శించుకున్నారు. వారితో పాటు హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షారుక్ ఖాన్కు స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయాన్ని కూడా ఈ మధ్యే షారుఖ్ దర్శించుకున్న విషయం తెలిసిందే.. తిరుమల ఆలయ సంప్రదాయ దుస్తుల్లో తెల్లటి పంచె, షర్ట్ను షారుఖ్ ధరించగా.. తన కూతురు సుహానా ఖాన్ కూడా తెల్లటి చుడీదార్లో మెరిశారు. అలాగే నటి నయనతార- విఘ్నేష్ శివన్ దంపతులు కూడా తెల్లటి దుస్తుల్లో ఉన్నారు. (ఇదీ చదవండి: బిగ్ బాస్లో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా..?) OTT విడుదల వివరాలు షారుక్ ఖాన్ నటించిన జవాన్ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా 7 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోవడంతో సినిమాపై క్రేజ్ పెరిగింది. జవాన్ విడుదలకు మరో రెండు రోజుల సమయం ఉంది. ఇలా చిత్ర బృందం భారీ ప్రచారం చేస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 7 నుంచి OTT ప్లాట్ఫారమ్ నెట్ఫ్లిక్స్లో ప్రసారం చేయనున్నట్లు సమాచారం. బాహుబలి, కేజీఎఫ్ రికార్డులు బద్దలే... జవాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రీ-టికెట్ బుకింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించారు. టిక్కెట్లు కూడా భారీగా అమ్ముడుపోయాయి. అలాగే 'జవాన్' విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేయనుంది. మొదటి రోజు రూ. 70 నుంచి 75 కోట్ల రూపాయల బిజినెస్ చేయనుందని టాక్. దీని ద్వారా బాహుబలి 2 (రూ. 58 కోట్లు), కేజీఎఫ్ 2 (రూ. 61 కోట్లు), పఠాన్ (రూ. 55 కోట్లు) రికార్డులను అధిగమిస్తారు. #ShahRukhKhan visited #Tirumala for blessing of lord venkateswara before #Jawan Release.#Jawan7thSeptember2023 pic.twitter.com/IiTjBy2MYU — Film Blocks (@FilmBlocks) September 5, 2023 #WATCH | Andhra Pradesh: Actor Shah Rukh Khan, his daughter Suhana Khan and actress Nayanthara offered prayers at Sri Venkateshwara Swamy in Tirupati pic.twitter.com/KuN34HPfiv — ANI (@ANI) September 5, 2023 SRK , offered prayers at Sri Venkateshwara Swamy in Tirupati 🙏🏻❤️ The most secular man on this planet 🇮🇳🙏🏻#ShahRukhKhan pic.twitter.com/J1c01of5Qu — 𝐁𝐚𝐛𝐚 𝐘𝐚𝐠𝐚 (@yagaa__) September 5, 2023 -
శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, హీరోయిన్ నయనతార
-
ఏది నిజం ఏది ఏఐ ఓ ట్విట్టరూ..!
‘ఎవరి చిన్నప్పటి ఫొటోలు వారికి ముద్దు’ అని లోకం అనుకున్నా సరే అవి అంటే మనకు ఎంతో ఇష్టం. ఇక సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు ఎప్పుడూ హాట్ ఫేవరెట్టే! ఒకప్పుడు ‘ ఇవిగో మీ అభిమాన హీరో చిన్నప్పటి ఫోటో’ అంటే ఆశ్చర్యానందాలతో చూసేవాళ్లం. ఇప్పుడు మాత్రం ఏఐ పుణ్యమా అని నమ్మడానికి లేదు. ఏది నిజం ఏది ఏఐ! ఏఐ టెక్నాలజీ హవా చూస్తుంటే ఇక ముందు హీరో, హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలు బాల నటులు వేయాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్న షారుఖ్ ఖాన్, రజనీకాంత్, నయన తార, మోహన్లాల్... చిన్ననాటి ఫొటోలే దీనికి నిదర్శనం. కాస్త సరదా అంశ కూడా వీటికి చేర్చడం వల్ల ఇవి ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ఇమేజ్లు అని తెలిసిపోతుందిగానీ...లేకపోతే శానా కష్టం సుమీ! -
గిఫ్ట్గా వంద కోట్ల లగ్జరీ విల్లా.. స్వర్గాన్ని తలపిస్తున్న షారుక్ సౌధం!
సినీ తారల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వారి ఆదాయం కోట్లలోనే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేస్తుంటారు. స్టార్ హీరోల విషయాకొనికొస్తే ఏకంగా వంద కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. అలాంటి వారి లైఫ్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ తారలకైతే ఇండియాతో పాటు విదేశాల్లోనూ లగ్జరీ ఫ్లాట్స్ ఉన్నాయి. ముఖ్యంగా దుబాయ్లో ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఆస్తులు కొనుగోలు చేశారు. అలా కోట్ల విలువైన అత్యంత లగ్జరీ విల్లా కలిగిన స్టార్ హీరో గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. (ఇది చదవండి: మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడు.. ఏడ్చేసిన బేబి హీరోయిన్! ) ప్రస్తుతం జవాన్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన హీరో షారుక్ ఖాన్. బాలీవుడ్ బాద్షాగా పేరుపొందిన ఆయనకు ఇప్పటికే ముంబయిలో ఉన్న హోమ్ మన్నత్ గురించి అందరికీ తెలిసిందే. అతన్ని చూసేందుకు అభిమానులు సైతం ఇంటి బయట కనిపిస్తుంటారు. ఆ ఇంటి విలువ దాదాపు రూ.200 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. దీంతో ఆయనకు చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుబాయ్ విల్లా 'జన్నత్' గురించి మీకు తెలుసా? 'స్వర్గానికి ఏ మాత్రం తీసిపోని దుబాయ్ ఇంటి గురించి తెలుసుకుందాం. షారూఖ్ ఖాన్ దుబాయ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అతనికి అక్కడ కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. రూ.100 కోట్ల విలువైన అందమైన పామ్ జుమేరాలో అతనికి లగ్జరీ విల్లా ఉంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం నఖీల్ 2007లో ఈ గ్రాండ్ విల్లాను షారూఖ్ ఖాన్కు బహుమతిగా ఇచ్చాడు. దీనికి ఇంటీరియర్ను షారుక్ భార్య గౌరీ ఖాన్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దుబాయ్లోని అతని ఇంటిని 'జన్నత్' అని పిలుస్తారు. అంటే స్వర్గం అని అర్థం. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? 63 ఏళ్లంటే నమ్ముతారా?) జన్నత్ ప్రత్యేకతలు.. షారూఖ్ ఖాన్ 'జన్నత్' విల్లా ప్రత్యేకతలు తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. ఇందులో ఒక ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. 'జన్నత్' విల్లా దాదాపు 14 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఇందులో 6 బెడ్రూమ్లు ఉన్నాయి. బీచ్-వ్యూగా ఉండే ఇందులో రెండు రిమోట్ కంట్రోల్ గ్యారేజీలు. ఒక ప్రైవేట్ పూల్ కూడా ఉన్నాయి. ఈ ఆస్తి గురించి గౌరీ ఖాన్ మాట్లాడుతూ.. ది దుబాయ్ స్కైలైన్ వ్యూ అని.. ఈ ప్లేస్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అంతే కాకుండా షారుక్ తరచుగా దుబాయ్కు వెళ్తాడు.. అందుకే నగరంలో ఇల్లు ఉండటం మంచిదని ఆమె అన్నారు. విల్లా గురించి గౌరీ ఖాన్ మాట్లాడుతూ..' ఫ్లోర్, వాల్ కవరింగ్లను ముందే డిజైన్ చేశారు. అయితే పిల్లల గదిని వారి అభిరుచుల ఆధారంగా డిజైన్ చేశాను. ఆర్యన్ ఖాన్, సుహానా, అబ్రామ్ ఖాన్ కూడా విల్లాలో వారి ఇష్టమైన ప్లేస్లు కూడా ఉన్నాయి. ఆర్యన్ ఖాన్ గదిలో పెద్ద టీవీ. అబ్రామ్ ఖాన్ ఎక్కువ సమయం బీచ్లో గడుపుతాడు. సుహానా ఖాన్ పూల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంది.' అని వెల్లడించింది. అలాగే ముంబయి, దుబాయ్తో పాటు లండన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, అలీబేగ్లలో కూడా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం ఆయన నటించిన జవాన్ వచ్చే నెల 7న రిలీజ్ కానుంది. -
నేనూ ఒకమ్మాయిని ప్రేమించాను.. ఇదే విషయం ఆమెకు చెప్తే..: విజయ్ సేతుపతి
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రం తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం జవాన్. ఆయన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ దర్శకుడు అట్లీ బాలీవుడ్కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయకిగా నటించగా విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు నటి దీపికా పడుకొనే అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న జవాన్ చిత్రం ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: kushi Twitter Review: ‘ఖుషి’ మూవీ ట్విటర్ రివ్యూ) ఈ సందర్భంగా జవాన్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రాన్ని ఎనిమిది నెలలు పూర్తి చేయాలని ప్రణాళికను సిద్ధం చేశామని అయితే కరోనా తదితర కారణాల వల్ల మూడేళ్లు పట్టిందని చెప్పారు. అదే సమయంలో చిత్రం మరింత బ్రహ్మాండంగా రూపొందిందని, ఖర్చు కూడా భారీగా పెరిగిందన్నారు. అందుకు షారుక్ ఖాన్ ఎంతగానో సహకరించారని అట్లీ చెప్పారు. షారుక్ ఖాన్తో కలిసి నటించడం మంచి అనుభవమని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. తాను పాఠశాలలో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించానని అయితే అది వన్ సైడ్ లవ్ అని చెప్పారు. ఆ అమ్మాయి మాత్రం తాను నటుడు షారుక్ ఖాన్ వీరాభిమానినని ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పిందన్నారు. అప్పటినుంచి తనకు షారుక్ ఖాన్పై పగ ఏర్పడిందన్నారు. ఆ పగను ఈ చిత్రంలో తీర్చుకున్నానని సరదాగా అన్నారు. (ఇదీ చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు రజనీకి మరో చెక్ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?) షారుక్ ఖాన్ మాట్లాడుతూ నటుడు విజయ్ సేతుపతి ఇంతకు ముందు చెప్పినట్లుగా తనపై ప్రతీకారం తీర్చుకోలేరని కారణం ఆయన తనకు అభిమాని అని పేర్కొన్నారు. జవాన్ చిత్రంలో నటించడంతో దక్షిణాది సినిమా గురించి చాలా నేర్చుకున్నానని షారుక్ ఖాన్ చెప్పారు. కాగా చైన్నెలో జవాన్ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పాల్గొనడానికి వచ్చిన షారుక్ ఖాన్కు నటుడు కమలహాసన్ వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. -
ఆస్పత్రిలో భార్య.. షూటింగ్ ఆపేయమన్న షారుక్: అట్లీ
ప్రపంచ వ్యాప్తంగా షారుక్ ఖాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం జవాన్. ఈ సినిమాను తమిళ హిట్ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కించాడు. దీంతో ఈ సినిమా కోసం బాలీవుడ్తో పాటు కోలీవుడ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. జవాన్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని లుక్లో ఈ సినిమాలో షారుక్ కనిపించనున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో కథానాయిక. విజయ్ సేతుపతి విలన్ రోల్ పోషిస్తుండగా, దీపికా పదుకొణె కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తోంది. (ఇదీ చదవండి: ఇన్స్టాగ్రామ్లో నయనతార ఎంట్రీ.. ఫాలో అయ్యేది ఆ ఐదుగురిని మాత్రమే) దర్శకుడు శంకర్తో కో-డైరెక్టర్గా సినీ రంగ ప్రవేశం చేసిన అట్లీకి జవాన్ ఐదవ చిత్రం కానున్నడం విశేషం. 'రాజా రాణి'తో అట్లీ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాక దళపతి విజయ్తో వరుసగా మూడు చిత్రాలు థెరి, మెర్సల్, బిగిల్ భారీ విజయాలు సాధించాయి. దీని తర్వాత అట్లీ జవాన్ను ప్రకటించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో వేదికపై అట్లీ ప్రసంగం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నటి ప్రియను వివాహం చేసుకున్న అట్లీ సుమారు ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. జవాన్ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న సమయంలో తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని షారుక్ ఖాన్కు తెలిపినప్పుడు ఆయన ఎలా స్పందించాడో తాజాగ అట్లీ గుర్తుచేసుకున్నాడు. 'జవాన్ షూటింగ్ కోసం నేను అమెరికాకు చేరుకున్నాను. ఈలోపు తాను గర్భం దాల్చినట్లు ప్రియా ఫోన్ చేసి తెలిపింది. ఎనిమిదేళ్ల తర్వాత గర్భం దాల్చినందున మూడు నెలల పాటు ప్రయాణం చేయవద్దని వైద్యులు సూచించారు. పూర్తిగా బెడ్ రెస్ట్ అన్నారు. అప్పటికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి మూడు రోజులే అయింది. దీంతో ప్రియాను అమెరికాకు రమ్మని చెప్పలేకపోయాను ఏం చేయ్యాలో తెలియక ఈ విషయాన్ని షారుఖ్ ఖాన్కి చెప్పగా, వెంటనే షూటింగ్ ఆపేయమని, కొద్దిరోజులు వెయిట్ చేస్తానని చెప్పాడు. షారుక్ చెప్పిన మాటను ప్రియతో తెలుపగా.. షూటింగ్ ఆపవద్దని చెప్పడమే కాకుండా తన పనులు తానే చూసుకుంటానని చెప్పింది. అలాంటి కష్ట సమయంలో కూడా సినిమా పనులపై దృష్టి పెట్టమని ఆమె నన్ను ప్రోత్సహించింది. ప్రియా అందించిన ఆ సహకారమే నా విజయ రహస్యం' అని వేదికపై అట్లీ అన్నారు. తన కష్ట సమయంలో షారుక్ ఏంతో ధైర్యాన్ని ఇచ్చాడని, తండ్రి స్థానంలో షారుక్ ఎప్పుడూ తనవెంటే ఉన్నారని ఆట్లీ ఎమోషనల్ అయ్యాడు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ఆందోళన చెందనని అట్లీ తెలిపాడు. కాగా, గత జనవరిలో వీరికి మగబిడ్డ జన్మించాడు. అట్లీ, ప్రియా నవంబర్ 2014 లో వివాహం చేసుకున్నారు. ఇక అట్లీ భార్య ప్రియా కొన్ని తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రియా నటించి తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. నా పేరు శివ, యముడు లాంటి సినిమాల్లో ప్రియా నటించింది. 10years back , we were shooting near #ShahRukhKhan sir home , I stood near his gate and clicked a pic. Now his home gate opened for me and Shah Rukh sir stood at the gate to welcome me ! You are more than my father , my everything sir . #Atlee pic.twitter.com/ulmjyaSOzN — iamsrksneha (@iamsrkian000) August 30, 2023 -
ఆ యాడ్తో బాద్షాకి చిక్కులు
ముంబై: బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చిక్కుల్లో ప డ్డారు. ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినందుకు ఆయన ఇల్లు ముట్టడికి కొందరు విఫలయత్నం చేశారు. ఆన్లైన్ జూదాన్ని ప్రోత్సహించేలా షారూక్ వ్యవహరించడం వారికి మింగుడు పడడం లేదు. అన్టచ్ ఇండియా ఫౌండేషన్కు చెందిన కొందరు బాంద్రాలోని షారూక్ ఇంటి బయట నిరసనలకు దిగడానికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. షారూక్ ఇంటికి గట్టి భద్రత ఏర్పాటు చేసి కొందరు యువకుల్ని అదుపులోనికి తీసుకున్నారు. ఏ23 అనే ఆన్లైన్ రమ్మీ పోర్టల్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న షారూక్ ఇటీవల దానికి సంబంధించిన ఒక వాణిజ్యప్రకటన(యాడ్)లో నటించారు. ఆ యాడ్లో ‘పదండి కలిసి ఆడదాం’ అని షారూక్ వ్యాఖ్యానిస్తారు. ఈ అడ్వర్టయిజ్మెంట్పై అన్టచ్ యూత్ పౌండేషన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. జంగ్లీ రమ్మీ, జూపీ వంటి ఆన్లైన్ గేమింగ్ యాప్స్ యువతని పక్కదారి పట్టిస్తున్నాయని అన్టచ్ ఇండియా ఫౌండేషన్ విమర్శించింది. -
మూన్పై ల్యాండ్ ఎలా కొనాలి? ధర తక్కువే! వేద్దామా పాగా!
చంద్రయాన్-3 సాప్ట్ ల్యాండ్ అయింది. దీంతో చందమామపై మనుషులు జీవించేందుకు ఆస్కారం కలుగుతుందా? అక్కడ ల్యాండ్ ఎంత ఉంటుంది. మూన్ ఎస్టేట్, చందమామ విల్లాస్, జాబిల్లి రిసార్ట్స్ అంటూ అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారం సోషల్మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్హీరో షారుఖ్ ఖాన్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చంద్రుడిపై సైట్ కొన్నారన్న వార్తల నేపథ్యంలో మరింత చర్చ జోరుగా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బిజినెస్కు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ధనిక వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు చంద్రునిపై ప్రాపర్టీ కొన్నారు. మరికొందరు అంతరిక్షంపై వారి ఆసక్తి, అభిరుచి కారణంగా కొందరు దీనిని భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తారు. చంద్రునిపై భూమిని కొనగలరా? చంద్రునిపై భూమిని సొంతం చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. భూమిని కొనుగోలు చేయవచ్చు,కానీ దాని యాజమాన్య హక్కులు పొంద లేరు. దానిని క్లెయిమ్ చేసుకోలేరు. దీనికి సంబంధించి 1967లో భారత్తో 104 దేశాలు ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడు పెద్ద దేశాలు, సోవియట్ యూనియన్, అమెరికా, యూఏ కలిసి బఔటర్ స్పేస్ ట్రీటీ అని పిలిచే అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించాయి. దీని ప్రకారం చందమామపై సైట్(Lunar Land Purchase)ని కొనుగోలు చేయడానికి ఒక మార్గం ఉంది. లూనార్ రిజిస్ట్రీ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించి, కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ వంటి అనేక ప్రాంతాలుంటాయి. ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ, ప్రైవేట్ యాజమాన్యం కోసం భూమిని కొనుగోలు చేయడం అసాధ్యం, చట్టవిరుద్ధం. కానీ, ది లూనార్ రిజిస్ట్రీ వంటి ఏజెన్సీలు ఇప్పటికీ ఖగోళ భూమిని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. చంద్రునిపై ల్యాండ్ కొన్న కొందరు ప్రముఖులు చంద్రునిలోని లాకస్ ఫెలిసిటాటిస్ (ఆనంద సరస్సు) ప్రాంతంలో చంద్రునిపై ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసినట్లు AIIMS జోధ్పూర్ నర్సింగ్ ఆఫీసర్ మీనా బిష్ణోయ్ (Meena Bishnoi) ఇద్దరు కుమార్తెల కోసం చంద్రునిపై భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. లూనా సొసైటీ జారీ చేసిన సర్టిఫికెట్ను కూడా ఆమె చూపించారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) 52వ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా వెల్లడించినట్టుగా ఆస్ట్రేలియాలోని ఓ అభిమాని చంద్రుడిపై ప్రాపర్టీని(Land On Moon) బహుమతిగా ఇచ్చాడట. అలాగే అంతరిక్షం, నక్షత్రాలు, సైన్స్ పట్ల ఎంతో ఆసక్తి ఉన్న యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్(Sushanth Singh Rajput). సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్న ప్రాంతాన్ని మేర్ ముస్కోవియన్స్ లేదా 'మస్కోవి సీ' అని పిలుస్తారు.మూన్ ల్యాండ్ను 2018, జూన్ 25న సుశాంత్ తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. అలాగే సూరత్కి చెందిన ఒక బిజినెస్ మేన్ తన రెండేళ్ల కూతురి కోసం చంద్రుడిపై కొంత భూమిని కొనుగోలు చేశాడు. అజ్మీర్కు చెందిన ధర్మేంద్ర అనిజా తన వివాహ వార్షికోత్సవం సందర్బంగా తన భార్య సప్నా అనిజాకు చంద్రునిపై మూడు ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు. 20 ఏళ్ల క్రితమే 5 ఎకరాలు రాజీవ్ వి బగ్ధి దాదాపు 20ఏళ్ల క్రితమే 5 ఎకరాల ప్లాట్ను కొనుగోలు చేయడం గమనార్హం.2003లో చంద్రునిపై ఒక ప్లాట్ను కేవలం 140 డాలర్లకు (సుమారు రూ. 9,500)కి కొనుగోలు చేశారు.లూనార్ రిపబ్లిక్ జారీ చేసిన అన్ని అధికారిక పత్రాలప్రకారం జూలై 27, 2003న న్యూయార్క్లోని లూనార్ రిజిస్ట్రీ ద్వారా 'రాజీవ్ బగ్దీ 32.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 15.6 డిగ్రీల పశ్చిమాన మారే ఇంబ్రియం (వర్షాల సముద్రం) వద్ద ఉన్న ఆస్తికి నిజమైన, చట్టపరమైన యజమాని. రేఖాంశ ట్రాక్ -30'. అంతేకాదు 2030 నాటికి మూన్ టూరిజం ప్రారంభమవుతుందని బగ్ది ఆశాభావం వ్యక్తం చేశారు. -
షారుక్ కోసం ఆ రూల్ బ్రేక్ చేయబోతున్న నయనతార!
కోలీవుడ్ స్టార్ అజిత్ రూటే సెపరేటు. తాను తన పని మినహా ఏ ఇతర విషయాలను పట్టించుకోరు. షూటింగ్ లేకపోతే తనకు ఇష్టమైన బైక్ రేసింగ్, రైఫిల్ షూటింగ్ వంటి విషయాలపై దృష్టి సారిస్తారు. ఈయన సినిమాకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనరు. తన చిత్రాల ప్రచార కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటారు. ఈ విషయం గురించి నిర్మాతలకు ముందుగానే చెబుతారు. అదీ అజిత్ పాలసీ. అందుకు సమ్మతించే ఆయనతో చిత్రాలు చేస్తుంటారు. ప్రమోషన్స్కు నయన్ దూరం హీరోయిన్ నయనతార రూటు కూడా దాదాపు ఇంతే. మొదట్లో చిత్ర ప్రచార వేడుకల్లో పాల్గొన్న ఈమె నటిగా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత వాటికి దూరంగా ఉంటోంది. తన భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించే చిత్రాలకు, తన సంస్థలో నిర్మించే చిత్రాలకు మాత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ విధానం నిర్మాతలకు నచ్చకపోయినా ఆమెకున్న క్రేజ్ కారణంగా మౌనంగా ఉంటున్నారు. ఇకపోతే నయనతార తన తాజా చిత్రం జవాన్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఈమె నటించిన తొలి హిందీ చిత్రం జవాన్. షారుక్ కోసం రూల్ బ్రేక్ ఇందులో కథానాయకుడిగా షారూక్ ఖాన్ నటించాడు. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా, యోగి బాబు కీలకపాత్రలో నటించారు. యువ సంగీత కెరటం అనిరుద్ సంగీతాన్ని అందించారు. భారీ అంచనాల మధ్య జవాన్ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో నయనతార పాల్గొననున్నట్లు సమాచారం. షారుక్ ఖాన్ తన అభిమాన నటుడు అని, అందుకే ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నయనతార సిద్ధమైనట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. మొత్తం మీద షారూక్ ఖాన్ కోసం నయనతార తన పాలసీని బ్రేక్ చేస్తుందన్న మాట! చదవండి: OMG 2: అక్షయ్ కుమార్ పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత -
నేడు యూట్యూబ్లోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ సినిమా
విలక్షణ నటుడు కమల్హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ డ్రామా చిత్రం 'హే రామ్'. ఇందులో షారుఖ్ఖాన్, రాణి ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో వివాదాల మధ్య 2000 సంవత్సరంలో విడుదలైంది ఈ చిత్రం. అప్పట్లో మంచి టాక్ను తెచ్చుకోవడంతో పాటు కమల్ కెరీర్లో విభిన్న చిత్రంగా నిలిచింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాజాగ ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్ ఛానెల్లో నేడు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ఈమేరకు కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. షారుఖ్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. అయితే, ఇందులో షారుఖ్చేసిన పాత్ర కోసం ఆయన రెమ్యునరేషన్గా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని కమల్హాసన్ గతంలో స్వయంగా చెప్పారు. ఇలాంటి కథను, చిత్రాన్ని భవిష్యత్లో మళ్లీ చేసే అవకాశం రాదని షారుఖ్ భావించారట. కానీ ఈ సినిమాకు గుర్తుగా తన చేతి గడియారాన్ని ఆయనకు కమల్ ఇచ్చారట. ఈ సినిమాలో భారత్- పాకిస్థాన్ విభజన, మహాత్మ గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేయడం వంటి అంశాలను చూపించారు. ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. మూడు జాతీయ అవార్డులు అప్పట్లో 'హే రామ్' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా అతుల్ కుల్కర్ణి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా సారిక, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో మంత్రకు అవార్డులు వచ్చాయి. అంతే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటింది. 25వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 2000 లోకార్నో ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ సినిమాతో నాటి అనుభూతి పొందాలంటే 'హే రామ్' చూడాల్సిందే. Experience the brilliance of #Ulaganayagan #KamalHaasan in the Cult Classic #HeyRam Streaming Tomorrow at 6 PM ➡️ https://t.co/n9afe1tmUq @ikamalhaasan @ilaiyaraaja @iamsrk pic.twitter.com/ZU3agwYqvA — Raaj Kamal Films International (@RKFI) August 14, 2023 -
షారుక్-నయన్.. కొత్త పాట
‘ఛలోనా..’ (పద) అంటూ షారుక్ ఖాన్, నయనతార ప్రేమ పాట పాడుకోనున్నారు. షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో నయనతార కథానాయికగా నటించిన చిత్రం ‘జవాన్’. ఇప్పటివరకూ ఈ చిత్రం నుంచి విడుదలైన షారుక్, నయనతార లుక్స్ యాక్షన్ సీన్స్కి సంబంధించినవి. అలాగే పాటల విషయానికి వస్తే.. షారుక్, ప్రియమణి, డ్యాన్సర్స్పై చిత్రీకరించిన మాస్ సాంగ్ ‘దుమ్మే దులిపేలా..’ ఇటీవల విడుదలైంది. సోమవారం షారుక్, నయనతారల రొమాంటిక్ సాంగ్ని, ΄పోస్టర్ని విడుదల చేయనున్నారు. ‘ఛలోనా..’ అంటూ సాగే ఈ పాట షారుక్ కెరీర్లోని బెస్ట్ రొమాంటిక్ సాంగ్స్లో ఒకటి అవుతుందని యూనిట్ పేర్కొంది. అనిరుధ్ రవిచందర్ స్వరపరచిన ఈ పాటను ఆదిత్య ఆర్.కె., ప్రియా మాలి పాడారు. ‘ఛలోనా..’ని హిందీ, తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మించిన ‘జవాన్’ సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. -
'జవాన్' మొదటి పాట రిలీజ్.. దీనికి పెట్టిన ఖర్చుతో సినిమానే తీయవచ్చు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న తాజా చిత్రం 'జవాన్'. దీనికి దర్శకత్వం అట్లీ. నయనతార, ప్రియమణి,దీపికా పదుకొణె ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ‘జవాన్’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ 'జిందా బందా' తెలుగులో 'దుమ్ము దులిపేలా'ను మేకర్స్ విడుదల చేశారు. ఆ పాటకోసం హైదరాబాద్,చెన్నై, బెంగళూరు, ముంబయి నుంచి వెయ్యికి మందికి పైగా మహిళ డ్యాన్సర్లన రప్పించి షూట్ చేశారు. వీరందరితో పాటు సన్యా మల్హోత్రా, ప్రియమణిలతో షారుఖ్ వేసిన స్టెప్పులకు ఎవరైనా ఫిదా అవుతారు. ఇందులో ఆయన చాలా యంగ్ లుక్లో కనిపించారు. (ఇదీ చదవండి: సుమన్ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?) ఈ పాటను ఐదు రోజుల పాటు చిత్రీకరించగా అందుకు అయిన ఖర్చు సుమారుగా రూ.15 కోట్లు అని సమాచారం. ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ పాడితే.. నృత్య దర్శకుడు శోభి వారందరితో అదిరిపోయే స్టెప్పులు వేయించారు. ఈ పాటకు అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఒక రేంజ్లో ఉంటుంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది. -
బాలీవుడ్ బార్బీ
ప్రపంచ వ్యాప్తంగా బార్బీయ మేనియా కమ్మేసింది. మన దేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. బాలీవుడ్ సినిమాల బార్బీఫైడ్ సీన్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా ‘ఓంశాంతి ఓం’ సినిమాలోని ‘ఫిర్ మిలేంగే ఛల్తే ఛల్తే’ పాటను బార్బీఫైడ్ చేశారు. పింక్ కోర్టులో షారుఖ్ఖాన్, దీపిక పదుకొణె బ్యాడ్మింటన్ ఆడుతూ పాడుతుంటారు. అయితే అది ‘ఫిర్ మిలేంగే...’ పాట కాదు. ఇంగ్లీష్ సాంగ్ రైటర్, సింగర్ దువ లిపా ‘బార్బీ’ సినిమా సౌండ్ ట్రాక్ కోసం రాసిన ‘బేబీ, యూ కెన్ ఫైండ్ మీ అండర్ ది లైట్స్/డైమండ్స్ అండర్ మై ఐస్’ పాట బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంటుంది. ఈ పాట నేపథ్యంలో షారుఖ్, దీపికాలను ‘బార్బీ’ సినిమాలో లీడ్ రోల్స్ పోషించిన మార్గోవ్ రాబీ(బార్బీ), రెయాన్ గాస్లింగ్ (కెన్)లుగా ఊహించుకోవాలి. -
తీరు మార్చుకోని నైట్రైడర్స్.. కొనసాగుతున్న పేలవ ప్రదర్శన.. ఐపీఎల్లో కాస్త నయం..!
ఫ్రాంచైజీ క్రికెట్లో కోల్కతా నైట్రైడర్స్ అనుబంధ జట్ల పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. గతేడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్లో (సీపీఎల్) మొదలైన నైట్రైడర్స్ వైఫల్యాల పరంపర.. అమెరికా వేదికగా ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లోనూ (ఎంఎల్సీ) కంటిన్యూ అవుతుంది. 2022 సీపీఎల్ను ఆఖరి స్థానంతో ముగించిన ట్రిన్బాగో నైట్రైడర్స్.. ఆతర్వాత జరిగిన ఇంటర్నేషనల్ టీ20 లీగ్లోనూ (ఐఎల్టీ20) చివరాఖరి స్థానంలోనే (అబుదాబీ నైట్రైడర్స్) నిలిచింది. అనంతరం జరిగిన ఐపీఎల్-2023లో కాస్త పర్వాలేదనిపించిన కోల్కతా నైట్రైడర్స్ (7వ స్థానం).. ప్రస్తుతం జరుగుతున్న ఎంఎల్సీలో మరోసారి తమకెంతో అచ్చొచ్చిన ఆఖరి స్థానంలో (లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్) నిలిచి, లీగ్ దశలోనే పోటీ నుంచి నిష్క్రమించింది. సునీల్ నరైన్ సారధ్యంలో ఎంఎల్సీలో మొత్తం 5 మ్యాచ్లు ఆడిన నైట్రైడర్స్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమిపాలై, టేబుల్ టాపర్ సియాటిల్ ఆర్కాస్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కూడా నైట్రైడర్స్ అతికష్టం మీద నెగ్గింది. రిలీ రొస్సో (38 బంతుల్లో 78 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నైట్రైడర్స్ ఈ మ్యాచ్లో గెలవగలిగింది. 6 జట్లు పాల్గొన్న ఎంఎల్సీ-2023 సీజన్ను ఆఖరి స్థానంతో ముగించింది. కాగా, నైట్రైడర్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజెస్ను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నటి జూహి చావ్లా, వ్యాపారవేత్త జై మెహతా, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే, అయినా..! లీగ్ క్రికెట్లో నైట్రైడర్స్ ఫ్రాంచైజీల ప్రస్తానాన్ని గమనిస్తే, అన్ని జట్లలో ప్రపంచంలోని విధ్వంసకర ఆటగాళ్లు మెజారిటీ శాతం ఉన్నారు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ దగ్గర నుంచి ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ వరకు అన్ని నైట్రైడర్స్ ఫ్రాంచైజీల్లో భారీ హిట్టర్లు ఉన్నారు. సీపీఎల్లో ట్రిన్బాగో నైట్రైడర్స్లో కీరన్ పోలార్డ్, మార్టిన్ గప్తిల్, సునీల్ నరైన్, నికోలస్ పూరన్, డ్వేన్ బ్రేవో, రిలీ రొస్సో, ఆండ్రీ రసెల్ ఉండగా.. ఐపీఎల్లో నితీశ్ రాణా, రింకూ సింగ్, జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, రహ్మానుల్లా గుర్భాజ్, జాన్సన్ చార్లెస్, శార్దూల్ ఠాకూర్ తదితరులు ఉన్నారు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ విషయానికొస్తే.. ఈ జట్టులో సునీల్ నరైన్, కొలిన్ ఇంగ్రామ్, బ్రాండన్ కింగ్, ఆండ్రీ రసెల్ లాంటి హార్డ్ హిట్టర్లు ఉండగా.. మేజర్ లీగ్ క్రికెట్లో జేసన్ రాయ్, రిలీ రొస్సో, మార్టిన్ గప్తిల్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తదితరులు నైట్రైడర్స్ జట్టులో ఉన్నారు. ప్రతి నైట్రైడర్స్ ఫ్రాంచైజీలో ఈ స్థాయిలో మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ ఈ ఫ్రాంచైజీ ఏ లీగ్లోనూ ఛాంపియన్ కాలేకపోతుంది. కనీసం టాప్ జట్లలో ఒకటిగా కూడా నిలువలేకపోతుంది. ఐపీఎల్లో రెండుసార్లు విజేతగా నిలిచిన నైట్రైడర్స్ ఆ తర్వాత ఏ లీగ్లోనూ ఆ స్థాయిలో రాణించలేకపోతుంది. దీంతో నైట్రైడర్స్ ఫ్యాన్స్ తెగ హర్టై పోతున్నారు. మరో పక్క ఇదే ఫ్రాంచైజీ క్రికెట్లో సూపర్ కింగ్స్ జట్లు మాత్రం దూసుకుపోతున్నాయి. ఈ లీగ్లో అయినా ఆ జట్టు మినిమం గ్యారెంటీగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఎంఎల్సీలోనూ ఆ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. -
జవాన్ రిస్క్
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, కెప్టెన్ అమెరికా, వెనోమ్, స్టార్ ట్రెక్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో యాక్షన్ సీన్స్ థ్రిల్కి గురి చేసే విధంగా ఉంటాయి. అలాంటి ఫైట్స్తో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు షారుక్ ఖాన్. ఆ హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్గా చేసిన స్పీరో రజటోస్ ఆధ్వర్యంలో షారుక్ ‘జవాన్’ కోసం రిస్కీ ఫైట్స్ చేశారు. షారుక్ ఖాన్, నయనతార జంటగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మించిన చిత్రం ‘జవాన్’. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని రిస్కీ స్టంట్స్ని హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ స్పీరో రజటోస్ సమకూర్చారని యూనిట్ పేర్కొంది. ‘‘జవాన్’లో షారుక్ చేసిన రిస్కీ ఫైట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. స్పీరో రజటోస్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఓ విజువల్ ట్రీట్లా ఉంటాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
'కింగ్' ఖాన్ చేతిలో వన్డే వరల్డ్కప్ ట్రోఫీ.. ఫ్యాన్స్ రచ్చ
బాలీవుడ్ బాద్షా.. కింగ్.. షారుక్ ఖాన్ చేతిలో ఐసీసీ వన్డే వరల్డ్కప్ ట్రోఫీ ఉండడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫోటోను ఐసీసీనే స్వయంగా పంచుకుంది. ''కింగ్ కాన్ చేతిలో #CWC2023 ట్రోపీ.. మరింత దగ్గరగా..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం ట్విటర్లో హల్చల్ చేస్తోంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్తో రెచ్చిపోయారు. ఫోటో షేర్ చేసిన అరగంటకే పదివేల లైక్స్ రాగా.. ఇన్స్టాగ్రామ్లోనూ దాదాపు లక్షా 50వేల మంది లైక్స్ కొట్టడం విశేషం. ఇక అక్టోబర్ 5న మొదలవనున్న ఐసీసీ వన్డే వరల్డ్కప్కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. పుష్కరకాలం తర్వాత టీమిండియా గడ్డపై వరల్డ్కప్ జరుగుతుండడంతో క్రికెట్ ఫ్యాన్స్ రోహిత్ సేన ట్రోపీ సాధిస్తుందని గంపెడాశతో ఉన్నారు. ఇప్పటికే ఐసీసీ వన్డే వరల్డ్కప్కు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. 10 వేదికల్లో 48 మ్యాచ్లు జరగనున్నాయి. టీమిండియాతో పాటు అన్ని జట్ల మ్యాచ్ల షెడ్యూల్ను కూడా ప్రకటించారు. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న(ఆదివారం) అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. King Khan 🤝 #CWC23 Trophy It’s nearly here … pic.twitter.com/TK55V3VkfA — ICC (@ICC) July 19, 2023 చదవండి: '500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్ కొట్టాల్సిందే' -
ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఆయనతో కలిసి నటించేవాడిని: విజయ్ సేతుపతి
‘‘షారుక్ ఖాన్ కోసమే ‘జవాన్’ చిత్రంలో నటిస్తున్నాను. నాకు ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వకపోయినా కూడా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అన్నారు నటుడు విజయ్ సేతుపతి. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ‘ముంబైకర్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల (జూన్ 2) విడుదలైంది. ప్రస్తుతం ఆయన షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న హిందీ సినిమా ‘జవాన్’ లో విలన్గా నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ–‘‘షారుక్ అంటే నాకు అభిమానం. ఆయన కోసమే ‘జవాన్’లో విలన్గా చేస్తున్నా. నాకు పారితోషికం ఇవ్వకున్నా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అంటూ షారుక్ ఖాన్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘జవాన్’ సినిమా సెప్టెంబర్ 7న విడుదలకానుంది. కాగా త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ (2019) లో విజయ్ సేతుపతి నటనపై షారుక్ ఖాన్ గతంలో ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. -
కాజోల్ సరదా వ్యాఖ్యలు.. షారుక్ ఫ్యాన్స్ ఫైర్
బాలీవుడ్లో కాజోల్, షారుక్ ఖాన్లది హిట్ పెయిర్. ‘దిల్వాలే దుల్హనియా లేజాయెంగే, బాజీఘర్, దిల్వాలేతో పాటు మరో నాలుగు చిత్రాల్లోనూ విరిద్దరు జంటగా నటించారు. అవన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇక పలు చిత్రాల్లో కలిసి నటించడం కారణంగా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ షారుక్- కాజోల్ స్నేహితులుగానే ఉన్నారు. ఆ చనువు కారణంగానే కాజోల్ సరదాగా చేసిన వ్యాఖ్యులు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. ఆమెపై షారుక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..ఇటీవల కాలోజ్ నటించిన ‘ది ట్రయల్’ మూవీ ఇటీవల డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చిత్రబృందంతో కలిసి మీడియా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా షారుక్ ఖాన్ గురించి అడగ్గా..‘షారుక్, నేను మంచి స్నేహితులం. అతనితో కలిసి నటించే అవకాశం వస్తే ఇప్పటికీ వదులుకోను. మళ్లీ ఆయనతో ఒక రొమాటిక్ సాంగ్ చేయాలని ఉంది’ అని కాజోల్ అన్నారు. ఒకవేళ షారుక్ ఎదురుపడితే ఆయన్ని అడిగే ఒకే ఒక విషయం ఏంటని ప్రశ్నించగా.. ‘పఠాన్’ సినిమా నిజమైన కలెక్షన్స్ ఎంతో చెప్పమంటాను’అని నవ్వుతూ బదులిచ్చింది. ఆమె సరదాగా అన్న వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదం అయ్యాయి. మా హీరో సినిమాకు వచ్చిన రూ.1000 కోట్ల కలెక్షన్స్ నిజమైనవి కావా? అబద్దం చెప్పాల్సిన అవసరం మా హీరోకి ఏముంది? అని షారుక్ ఫ్యాన్స్ కాజోల్ని ట్రోల్ చేస్తుంది. అయితే మరికొంతమంది మాత్రం ఇలా సరదాగా అన్న వ్యాఖ్యలను తప్పుపట్టడం సరికాదని అంటున్నారు.