సెమీస్‌లో హైదరాబాద్‌ | Hyderabad in the semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో హైదరాబాద్‌

Published Fri, Aug 30 2024 2:43 AM | Last Updated on Fri, Aug 30 2024 2:43 AM

Hyderabad in the semis

చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు ఇని్వటేషన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ మధ్యప్రదేశ్‌ జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు ఇన్నింగ్స్‌ 229 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు జట్లున్న గ్రూప్‌ ‘ఎ’లో హైదరాబాద్‌ జట్టు రెండు విజయాలు సాధించి 13 పాయింట్లతో ‘టాప్‌’లో నిలిచి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 

మ్యాచ్‌ మూడో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 439/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ 129.3 ఓవర్లలో 6 వికెట్లకు 560 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. వరుణ్‌ గౌడ్‌ (63 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), టి.రవితేజ (54 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. 353 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ జట్టు 47 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. 

హైదరాబాద్‌ బౌలర్లలో అనికేత్‌ రెడ్డి 46 పరుగులిచ్చి 5 వికెట్లు, తనయ్‌ త్యాగరాజన్‌ 35 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు రెండో రోజు హైదరాబాద్‌ ఓపెనర్‌ ఎం. అభిరత్‌ రెడ్డి (243 బంతుల్లో 211; 24 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీతో మెరిశాడు. మధ్యప్రదేశ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement