కుమారుడిని విమానం ఎక్కించి.. తిరిగొస్తూ.. | Sakshi
Sakshi News home page

కుమారుడిని విమానం ఎక్కించి.. తిరిగొస్తూ..

Published Tue, May 7 2024 5:10 AM

కుమార

సంగం: లారీని కారు ఢీకొని ఓ ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన సంగం నాలుగు రోడ్ల సెంటర్‌ సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రమైన ఉదయగిరి చెందిన షేక్‌ గాజుల ఫరూక్‌ అలీ (58) అనే ఉపాధ్యాయుడి కుమారుడు అయాజ్‌కు విదేశాల్లో చదువుకునే అవకాశం వచ్చింది. దీంతో తండ్రీకొడుకులు, బంధువులు చైన్నెకి కారులో వెళ్లారు. అయాజ్‌ను విమానం ఎక్కించారు. తిరుగు ప్రయాణంలో సంగం వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని వారి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఫరూక్‌ అలీ మృతిచెందగా ఆయన సోదరుడు గాజు ల నజీముద్దీన్‌, అతని కుమారుడు సూరజ్‌ తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌ కార్తీక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. పోలీసులు ఫరూక్‌ అలీ మృతదేహానికి ఆత్మకూరు వైద్యశాలలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా ఘటనా స్థలాన్ని సంగం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవినాయక్‌, సంగం ఎస్సై నాగార్జునరెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

ఉపాధ్యాయుడి మృతి

ఇద్దరికి తీవ్ర గాయాలు

కుమారుడిని విమానం ఎక్కించి.. తిరిగొస్తూ..
1/2

కుమారుడిని విమానం ఎక్కించి.. తిరిగొస్తూ..

కుమారుడిని విమానం ఎక్కించి.. తిరిగొస్తూ..
2/2

కుమారుడిని విమానం ఎక్కించి.. తిరిగొస్తూ..

Advertisement
 
Advertisement