
250 మంది విద్యార్థుల ఎంపిక
నెల్లూరు(టౌన్): సైంటిఫిక్ ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులను ఎంపిక చేశామని జిల్లా సైన్స్ అధికారి కరుణాకర్రెడ్డి తెలిపారు. మంగళవారం చెముడుగుంటలోని జిల్లా సైన్స్ కేంద్రంలో విజిట్కు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక, సెకండరీ స్థాయికి సంబంధించి ఎంపిక చేసిన 250 మంది విద్యార్థులు బుధవారం చైన్నెలోని పెరియార్ సైన్స్ సెంటర్, గిండి నేషనల్ పార్క్, మద్రాస్ ఐఐటీ సైన్స్ కేంద్రాలను విజిట్ చేస్తారన్నారు. ఉదయం 5 గంటలకు విద్యార్థులతోపాటు గైడ్ టీచర్లు జిల్లా సైన్స్ కేంద్రానికి చేరుకోవాలన్నారు.