![ఉత్సాహంగా రగ్బీ జట్ల ఎంపికలు](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/26/25tkl01-280062_mr.jpg.webp?itok=W_gbG2fc)
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. అండర్–18 విభాగంలో బాల బాలికలకు వేర్వేరుగా నిర్వహించిన ఈ ఎంపికల్లో ఒక్కో జట్టుకు 12 మంది చొప్పున 24 మంది ని ఎంపిక చేశారు. ఈ నెల 31 నుంచి విశాఖలో జరగనున్న రాష్ట్ర స్థాయి క్రీడల్లో వీరంతా పాల్గొంటారు. అసోసియేషన్ అధ్యక్షుడు డొంకాన రామకృష్ణ క్రీడాకారులకు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి పి.పార్వతీశం, ఆర్గనైజర్ బి.నారాయణరావు, వ్యాయామ ఉపాధ్యాయు లు కె.కె.రామిరెడ్డి, కె.రఘునాథరావు, శైలజ, అని ల్, సీతయ్య, నర్మద తదితరులు పాల్గొన్నారు.