Telangana: రూ.150 బీరు.. రూ.180కి విక్రయం..! | Beer Prices Hike In Telangana, Know New Price Details Inside | Sakshi
Sakshi News home page

Telangana Beer Prices Hike: రూ.150 బీరు.. రూ.180కి విక్రయం..!

Feb 12 2025 8:32 AM | Updated on Feb 12 2025 11:14 AM

Beer Price Hike In Telangana

    ధరల పెరుగుదలకు ముందే దోపిడీ

భైంసాటౌన్‌: బీర్ల ధరల పెంపునకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ ఎంతమేర పెంచాలన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయినా పట్టణంలో కొందరు వైన్స్‌ నిర్వాహకులు బీర్ల ధరలు పెంచి విక్రయిస్తున్నారు. మంగళవారం పట్టణంలోని బాసర రోడ్డులో గల ఓ వైన్స్‌షాపులో రూ.150 ఎమ్మార్పీ ఉన్న బీరును రూ.180కి విక్రయించినట్లు ఓ మద్యం ప్రియుడు వాపోయాడు. ఈ మేరకు తన ఫోన్‌పే నంబర్‌ ద్వారా డబ్బులు చెల్లించినట్లు రశీదు చూపాడు. 

ధరల పెరుగుదలకు ముందే పెంచి విక్రయించడం ఎంతవరకు సబబని అతడు ప్రశ్నిస్తున్నాడు. బీర్ల ధరల పెంపు విషయమై ఎక్సైజ్‌ సీఐ నజీర్‌హుస్సేన్‌ను ఈ సందర్భంగా వివరణ కోరగా తమకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేవన్నారు. పాత స్టాకును పాత రేట్లకే విక్రయించాల్సి ఉండగా ఎలాంటి ఆదేశాలు లేకుండానే అధిక ధరలకు విక్రయించడంపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement