
ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): గుడిమల్లం నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు గాయాలైన ఘటన రేణిగుంటలో చోటుచేసుకుంది. గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ కథనం.. గురువారం మధ్యాహ్నం గుడిమల్లం నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు రేణిగుంట సమీపంలో వస్తుండగా పక్క నుంచి ప్రధాన రహదారి పైకి వస్తున్న టిప్పర్ ఢీకొనంది. ఈ ఘటనలో బస్సు సైడ్ దెబ్బతినగా విజయవాడకు చెందిన దిలీప్కు గాయాలయ్యాయి. మరికొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్
Comments
Please login to add a commentAdd a comment