ఏయూక్యాంపస్: నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2025కి విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసుకోవడానికి ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉంది. mybharat.gov.inను సందర్శించి ‘వికసిత్ భారత్ అంటే ఏమిటి’ అనే అంశంపై ఒక నిమిషం వీడియోను అప్లోడ్ చేయాలి. అదే పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకోవాలి. ఈ కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మహేశ్వర రావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.వి.జి రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ పర్యవేక్షిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment